అంటూ Twitter|ట్విట్టర్ (X|ఎక్స్) లో కేటీఆర్|KTR
Today|నేడు ACB|ఏసీబీ విచారణకు KTR|కేటీఆర్
BRS PARTY| బీఆర్ఎస్ పార్టీ WORKING PRESIDENT| వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) గారిపై TELANGANA GOVERNMENT| తెలంగాణ CONGRESS| కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన FORMULA – E| ఫార్ములా-ఈ కేసు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని విమర్శలతో పాటు, ఈ కేసును పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్యగా అభివర్ణిస్తున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. తాజాగా, ఈ కేసులో విచారణ నిమిత్తం కేటీఆర్ ఈ రోజు ఉదయం 9 గంటలకు తెలంగాణ భవన్కు చేరుకోనున్నారు. అనంతరం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్లోని ఎమ్మెల్యే కాలనీలో ఉన్న అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) కార్యాలయంలో విచారణకు హాజరుకానున్నారు.
ఈ నేపథ్యంలో కేటీఆర్ ట్విట్టర్ వేదికగా మీ విచారణలు, కమిషన్లు, రాజకీయ కక్షలు నన్ను భయపెట్టలేవు. మేము బీఆర్ఎస్ పార్టీగా ప్రజలను మోసం చేసే #420 హామీలను, మోసపూరిత ప్రకటనలను, ఎప్పటికీ నమ్మలేని ఆరు హామీలను బట్టబయలు చేయడం కొనసాగిస్తాం అంటూ తాను వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అలాగే, బ్రింగ్ ఇట్ ఆన్ రేవంత్ అంటూ సీఎంపై ఎదురుదాడికి దిగారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ కేసును పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం దురుద్దేశంతో ముందుకు తీసుకెళ్తోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక బీఆర్ఎస్ నేతలపై తప్పుడు కేసులు పెట్టడం ద్వారా ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నమే ఇది అని వారు పేర్కొంటున్నారు. ఇటువంటి చర్యలు ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉండటంతో పాటు, ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని కోల్పోయేలా చేస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరుకావడం ద్వారా తనపై ఉన్న ఆరోపణల్ని నిజమో లేదో తేల్చాలంటూ సంకేతాలు ఇచ్చారు.
ఇక బీఆర్ఎస్ వర్గాలు కేటీఆర్కు మద్దతుగా నిలుస్తూ రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ భవన్ వద్దకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున రానున్నట్లు సమాచారం. ఈ విచారణపై రాష్ట్రవ్యాప్తంగా రాజకీయంగా తీవ్ర చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని ఎంతదాకా తీసుకెళ్తుందో, కేటీఆర్ పోరాటం ఎటువైపు దారి తీస్తుందో అనే అంశాలపై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.

