Monday, March 16, 2026
29.3 C
Hyderabad

మరోసారి MLA|ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి|RAJAGOPAL REDDY వివాదాస్పద వ్యాఖ్యలు|SENSATIONAL COMMENTS

MUNUGODU|మునుగోడుకి అన్యాయం చేయొద్దు

నాకు పదవి కన్నా మునుగోడు DEVELOPMEMT|అభివృద్దే ముఖ్యం

-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎక్కువ కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా కోరారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది తనకు జరిగిన అన్యాయంగా భావిస్తానని, తనకు అన్యాయం జరిగినా… పర్వాలేదని కానీ ప్రజల అభివృద్ధిని ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి చెప్పినట్లే ప్రస్తుత ప్రభుత్వానికీ ఇదే అభ్యర్థన చేస్తున్నానని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయాలని, ఆలస్యం చేయకుండా వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాటిచ్చారు కాబట్టి ఇవ్వండి, కానీ అప్పటివరకు మునుగోడు అభివృద్ధి పనుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం సమీకరణాలు కుదరటం లేదనే కారణం చూపించడం తగదని, ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.

తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నదమ్ములు అనే విషయం అందరికీ తెలియదా… అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం తెలియదా… అన్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఇప్పుడు పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.

రాజకీయ సమీకరణల పరంగా ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురు మంత్రులు ఉన్నారని, నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ముగ్గురు మంత్రులు ఉండడంలో తప్పేమీ లేదని అన్నారు. తాను, తన అన్న ఇద్దరూ సమర్థులం, గట్టి నాయకులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ఆలస్యమైనా తాను ఓపికగా వేచి చూస్తానని, కానీ మునుగోడు ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే మునుగోడు వెనుకబడిందని, ఈ పరిస్థితిని మార్చడం తన లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు న్యాయం జరగాలని, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేద ప్రజలపై భారం మోపకూడదని ఆయన సూచించారు. పేదవాళ్లకండగా ఉండటమే నా ధ్యేయం అని చెప్పారు. తనకు పదవి ఏదైనా భగవంతుడు ఇస్తే అది మునుగోడు ప్రజల కోసమే ఉపయోగపడుతుందని, వ్యక్తిగత లాభం కోసం కాదని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య, విద్యా రంగాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమమే తన రాజకీయ జీవనోపాధి మూలం అని, అందుకోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

Latest News

16-03-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 07.43 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ధనిష్ఠ రాత్రి తెల్ల 05.09 వరకు ఉపరి శతభిషం యోగం శివ ఉదయం 08.15 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం...

ఇంట, వంట, పంట, పయానం అన్నీ గా ట్రాక్టరే!?|ADUGU TRENDS

ఉపాయం లేనోన్ని ఊల్లెనే ఉండనీయొద్దట! గందుకే ఉపాయమున్న గీయినె, ఊల్లు తిరుగుతాండు!! ఊల్లు తిరుగుడంటే, ఊల్లు పట్టుకుని తిరుగుతాండని కాదుల్లా... ఇట్టమైన ఊల్లని ఏ కట్టం లేకుండా తిరుగుతాండు. గదెట్లంటరా? ఇగో మీరే...

బడ్జెట్ : ప్రజాకాంక్షలను ప్రతిబింబించేనా!?|EDITORIAL

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు రాష్ట్ర రాజకీయ వర్గాలనేగాక, సాధారణ ప్రజల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. రాష్ట్రంలోని రైతులు, ఉద్యోగులు,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మార్చి 15 నుండి మార్చి 21 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి పనుల్లో కొంత ఒత్తిడి ఉన్నా చివరికి మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో మీ...

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి? ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి? ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా? ఉన్న...

ఎలుకలు రాకుండ అదిరే శిట్కా!?|ADUGU TRENDS

ఎలుక సొర్రిందని ఇల్లు తగుల బెట్టుకుంటమా? ఏంది? యెట్లన్న శేసి గా ఎలుకను బయిటికి తోలుతం. ఇల్లును మాత్రం మంచిగ కాపాడుకుంటం. మరైతే ఇంట్లకు ఎలుకలు రాకుండ ఏం శేయాల్నో, ఎట్లెట్ల శేయాల్నో...

రాహుల్ పరిపక్వ విపక్ష నేతేనా!?|EDITORIAL

భారత రాజకీయాల్లో విపక్ష నాయకత్వం ఎప్పుడూ ప్రజాస్వామ్య పరిరక్షణకు అత్యంత కీలకం. ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, విధానాలను సమీక్షించడం, ప్రత్యామ్నాయ మార్గాలను చూపడం, అవసరమైన సూచనలు చేయడం, తద్వారా ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడం విపక్షం...

14-03-2026, శనివారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి ఏకాదశి పూర్తిగ రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 02.53 వరకు ఉపరి శ్రవణ యోగం వరీయాన్ ఉదయం 09.01 వరకు ఉపరి పరిఘ కరణం బవ సాయంత్రం 06.24 వరకు ఉపరి బాలవ రాహుకాలం...

ముగిసిన యువకుడి అంత్యక్రియలు|PALAKURTHI

పుత్రశోకంలో కన్నతల్లి కన్నీటి వీడ్కోలు ఘన నివాళులు అర్పించిన పాలకుర్తి విధి ఆడిన వింత నాటకంలో ఒక కన్నతల్లికి అంతకన్నా దౌర్భాగ్య స్థితి మరొకటి ఉండదు. కొడుకే లోకమని, తనే తన సర్వస్వమని బతికిన ఆ...

గాలి మోటర్ల.. గా అత్తగారింటికి!?|ADUGU TRENDS

అత్తగారింటికి దారేది? అంటే గాల్లో తేలినట్లు ఏకంగా గాలి మోటర్లనే తీసుకపోయి, సూసెటోల్ల గుండె పేలినట్టు శేసిండో పెండ్లి కొడుకు. గీ మద్దెల పండ్లిల్లకు ఇరగమరగ కర్సు సేత్తాండ్లు. ఎంత ఎక్కువ కర్సు శేస్తే,...

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని...

13-03-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి దశమి రాత్రి తెల్ల 05.47 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 01.02 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం వ్యతీపాత ఉదయం 08.53 వరకు ఉపరి వరీయాన్ కరణం వణజి సాయంత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News