Friday, July 31, 2026
25.7 C
Hyderabad

మరోసారి MLA|ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి|RAJAGOPAL REDDY వివాదాస్పద వ్యాఖ్యలు|SENSATIONAL COMMENTS

MUNUGODU|మునుగోడుకి అన్యాయం చేయొద్దు

నాకు పదవి కన్నా మునుగోడు DEVELOPMEMT|అభివృద్దే ముఖ్యం

-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎక్కువ కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా కోరారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది తనకు జరిగిన అన్యాయంగా భావిస్తానని, తనకు అన్యాయం జరిగినా… పర్వాలేదని కానీ ప్రజల అభివృద్ధిని ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి చెప్పినట్లే ప్రస్తుత ప్రభుత్వానికీ ఇదే అభ్యర్థన చేస్తున్నానని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయాలని, ఆలస్యం చేయకుండా వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాటిచ్చారు కాబట్టి ఇవ్వండి, కానీ అప్పటివరకు మునుగోడు అభివృద్ధి పనుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం సమీకరణాలు కుదరటం లేదనే కారణం చూపించడం తగదని, ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.

తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నదమ్ములు అనే విషయం అందరికీ తెలియదా… అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం తెలియదా… అన్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఇప్పుడు పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.

రాజకీయ సమీకరణల పరంగా ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురు మంత్రులు ఉన్నారని, నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ముగ్గురు మంత్రులు ఉండడంలో తప్పేమీ లేదని అన్నారు. తాను, తన అన్న ఇద్దరూ సమర్థులం, గట్టి నాయకులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ఆలస్యమైనా తాను ఓపికగా వేచి చూస్తానని, కానీ మునుగోడు ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే మునుగోడు వెనుకబడిందని, ఈ పరిస్థితిని మార్చడం తన లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు న్యాయం జరగాలని, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేద ప్రజలపై భారం మోపకూడదని ఆయన సూచించారు. పేదవాళ్లకండగా ఉండటమే నా ధ్యేయం అని చెప్పారు. తనకు పదవి ఏదైనా భగవంతుడు ఇస్తే అది మునుగోడు ప్రజల కోసమే ఉపయోగపడుతుందని, వ్యక్తిగత లాభం కోసం కాదని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య, విద్యా రంగాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమమే తన రాజకీయ జీవనోపాధి మూలం అని, అందుకోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News