Monday, July 13, 2026
29.3 C
Hyderabad

మరోసారి MLA|ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి|RAJAGOPAL REDDY వివాదాస్పద వ్యాఖ్యలు|SENSATIONAL COMMENTS

MUNUGODU|మునుగోడుకి అన్యాయం చేయొద్దు

నాకు పదవి కన్నా మునుగోడు DEVELOPMEMT|అభివృద్దే ముఖ్యం

-ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

మునుగోడు నియోజకవర్గం ప్రజల అభివృద్ధి కోసం తన వ్యక్తిగత ప్రయోజనాల కంటే ఎక్కువ కృషి చేస్తున్నానని, ఈ ప్రాంతానికి ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాలని మాజీ ఎంపీ, ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి బహిరంగంగా కోరారు. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే, అది తనకు జరిగిన అన్యాయంగా భావిస్తానని, తనకు అన్యాయం జరిగినా… పర్వాలేదని కానీ ప్రజల అభివృద్ధిని ఆపకూడదని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వానికి చెప్పినట్లే ప్రస్తుత ప్రభుత్వానికీ ఇదే అభ్యర్థన చేస్తున్నానని అన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను సమయానికి అమలు చేయాలని, ఆలస్యం చేయకుండా వాగ్దానాలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. మాటిచ్చారు కాబట్టి ఇవ్వండి, కానీ అప్పటివరకు మునుగోడు అభివృద్ధి పనుల్లో ఒక్క రూపాయి కూడా ఆపొద్దని రాజ్ గోపాల్ రెడ్డి హెచ్చరించారు. ప్రస్తుతం సమీకరణాలు కుదరటం లేదనే కారణం చూపించడం తగదని, ఎవరు అడ్డుకుంటున్నారు, ఎందుకు అడ్డుకుంటున్నారు అని ప్రశ్నించారు.

తనను పార్టీలోకి తీసుకున్నప్పుడు తాను, అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నదమ్ములు అనే విషయం అందరికీ తెలియదా… అని ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండోసారి మంత్రి పదవిపై హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ విషయం తెలియదా… అన్నారు. ఒడ్డు దాటే వరకు ఓడ మల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్నట్లు ఇప్పుడు పరిస్థితి మారిందని వ్యాఖ్యానించారు.

రాజకీయ సమీకరణల పరంగా ఖమ్మం జిల్లాలో 9 మంది ఎమ్మెల్యేలు ఉండగా ముగ్గురు మంత్రులు ఉన్నారని, నల్గొండ జిల్లాలో 11 మంది ఎమ్మెల్యేలు ఉండి కూడా ముగ్గురు మంత్రులు ఉండడంలో తప్పేమీ లేదని అన్నారు. తాను, తన అన్న ఇద్దరూ సమర్థులం, గట్టి నాయకులమని, ఇద్దరికీ మంత్రి పదవులు ఇస్తే ఎలాంటి నష్టం ఉండదని చెప్పారు. ఆలస్యమైనా తాను ఓపికగా వేచి చూస్తానని, కానీ మునుగోడు ప్రాంతానికి అన్యాయం జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు.

మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాను నిరంతరం కృషి చేస్తున్నానని, భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీగా పని చేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ ప్రాంత అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని అన్నారు. నల్గొండ జిల్లాలోని ఇతర నియోజకవర్గాలతో పోల్చితే మునుగోడు వెనుకబడిందని, ఈ పరిస్థితిని మార్చడం తన లక్ష్యమని చెప్పారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలకు న్యాయం జరగాలని, ప్రైవేటు ఆసుపత్రులు, ప్రైవేటు పాఠశాలలు పేద ప్రజలపై భారం మోపకూడదని ఆయన సూచించారు. పేదవాళ్లకండగా ఉండటమే నా ధ్యేయం అని చెప్పారు. తనకు పదవి ఏదైనా భగవంతుడు ఇస్తే అది మునుగోడు ప్రజల కోసమే ఉపయోగపడుతుందని, వ్యక్తిగత లాభం కోసం కాదని రాజ్ గోపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

అభివృద్ధి కార్యక్రమాలు, వైద్య, విద్యా రంగాల మెరుగుదల, మౌలిక సదుపాయాల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మునుగోడు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో ఎలాంటి ఆలస్యం చేయకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమమే తన రాజకీయ జీవనోపాధి మూలం అని, అందుకోసం ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఎదుర్కొని ముందుకు సాగుతానని రాజ్ గోపాల్ రెడ్డి అన్నారు.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News