Friday, May 15, 2026
38.2 C
Hyderabad

ఆయా రాం! గయా రాం!!|CONGRESS|BRS

అంతా ఆ తాను ముక్కలే!
అందరూ గురువింద గింజలే!!
అరాచకమైన రాజకీయం|POLITICS
ఉత్సవ విగ్రహాలుగా రాజ్యాంగ పదవులు?
SPEAKERS|స్పీకర్లు నిర్ణయాత్మక శక్తిగా ఉండగలరా?
ఉంటే, వాళ్ళ POSTS|పదవులు భద్రమేనా?
ఇటీవలి ఉప రాష్ట్రపతి ఉదంతం తేల్చిందేంటి?
రాజ్యాంగ పదవులకు SAVAL|సవాల్ గా రాజకీయం!
స్వతంత్ర భారత రాజకీయమంతా ఫిరాయింపుల పర్వమే!
నేతల పార్టీ ఫిరాయింపులపై ‘అడుగు’ ప్రత్యేక కథనం

‘ఎక్కడో అక్కడ.. ఒకరిద్దరు మినహా అంతా ఆ తాను ముక్కలే! అందరూ గురువింద గింజలే!! అప్పుడో ఇప్పుడో ఎప్పుడో జంప్ జిలానీలే! అవసరాలు, సమయానుకూలలను బట్టి తప్ప, మిగతా సందర్భాల్లో ఎవరికి వారే యమునా తీరే! అవసరాన్ని బట్టి ఏమైనా చేస్తారు. ఎంతకైనా దిగజారుతారు. మరెంతకైనా తెగిస్తారు. కొద్ది అటు ఇటుగా రాజకీయ నేతలంతా ఒక్కటే!’ ఇది సగటు మనిషి అభిప్రాయం. కానీ, ఇందుకు భిన్నంగా నేతలు మనకు కనిపిస్తున్నారా? ఇప్పుడు నేతలు ఎదుటపడితే, మీరు ఆ పార్టీలోనే ఉన్నారా? లేక ఏ పార్టీలో ఉన్నారు? అనే ప్రశ్నించే పరిస్థితులు దాపురించాయి. ఎవ్వరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తేలియని అయోమయం నెలకొంది. నేతల పార్టీ ఫిరాయింపుల వ్యవహార శైలి వల్లే ‘గయా రాం..ఆయా రాం’ అనే నానుడి స్థిరపడి వర్ధిల్లుతున్నది. అటుఇటుగా మొదటి 20 ఏళ్ళు మినహా, స్వతంత్ర భారత రాజకీయ చరిత్రంతా చీలికలు, పీలికలు, పేలికలై, ‘ఫిరాయింపుల పర్వం’గానే కనిపిస్తుంది. అలాంటి వారే మన పాలకులు, ఏలికలు కావడమేగాక, మన, మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దే పురోగతికాములు కావడం, గోతులు తవ్వే వాళ్ళే మనకు నీతులు బోధిస్తుండటం విధి వైచిత్రం! ఫిరాయింపుల చరిత్రపై ‘అడుగు’ అందిస్తోన్న ప్రత్యేకం.

హైదరాబాద్, జులై 31 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
భారత రాజకీయ చరిత్రలో 1960వ దశకం నుండి సంకీర్ణ ప్రభుత్వాల హయాం మొదలయ్యాక, ‘ఆయా రాం గయా రాంలదే హవా!’ నడుస్తోంది. 1967లో హర్యానాలోని హసన్‌పూర్ నియోజకవర్గం (ఇప్పుడు హోడల్) నుండి గయా లాల్ స్వతంత్ర శాసనసభ సభ్యుడిగా గెలిచి, భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. ఆ తర్వాత 15 రోజుల్లో మూడుసార్లు పార్టీలు మార్చినప్పుడు ఈ పదం ప్రాధాన్యతను సంతరించుకుంది. జాతీయ నానుడిగా మిగిలిపోయింది. గయా లాల్ మొదట కాంగ్రెస్ నుండి యునైటెడ్ ఫ్రంట్‌కు, తిరిగి కాంగ్రెస్ కి మారాడు. ఆపై చివరిసారిగా యునైటెడ్ ఫ్రంట్‌లోకి ఫిరాయించాడు. యునైటెడ్ ఫ్రంట్‌ను విడిచిపెట్టి కాంగ్రెస్ లో చేరినప్పుడు, గయా లాల్‌ను కాంగ్రెస్ లోకి ఫిరాయించడానికి కారణమైన అప్పటి కాంగ్రెస్ నేత రావు బీరేంద్ర సింగ్, గయా లాల్‌ను చండీగఢ్‌లో విలేకరుల సమావేశానికి తీసుకువచ్చి “గయా రాం! ఇప్పుడు ఆయా రాం!!” అని చమత్కరించారు. దీని ఫలితంగా గణనీయమైన గందరగోళం ఏర్పడింది. చివరికి హర్యానా శాసనసభ రద్దై, రాష్ట్రపతి పాలనకు దారి తీసింది.

1967, 1971 సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని పార్లమెంటు, అసెంబ్లీలకు ఎన్నికైన 4వేల మంది శాసన సభ్యులలో 50 శాతం మంది పార్టీ ఫిరాయించారు. ఇది దేశంలో రాజకీయ గందరగోళానికి దారితీసింది.

1977–79లలో మొరార్జీ దేశాయ్ నేతృత్వంలోని మొట్టమొదటి జాతీయ కాంగ్రెసేతర ప్రభుత్వం, 76 మంది పార్లమెంటేరియన్ల ఫిరాయింపు కారణంగా అధికారం కోల్పోయింది.

1984లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి టీడీపీ సీఎం ఎన్టీఆర్ ఆగస్టు సంక్షోభాన్ని ఎదుర్కొన్నారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, రాష్ట్ర గవర్నర్ రామ్ లాల్ చర్యల కారణంగా, ఎన్టీఆర్ పదవీచ్యుతుడయ్యారు. అయితే నెల రోజుల్లోనే బల నిరూపణ నెగ్గి తిరిగి సీఎం అయ్యారు.

1984 అక్టోబరు 31న ఇందిరాగాంధీ హత్యానంతరం రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. ఫిరాయింపులను నివారించడానికి 1985లో ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఆమోదించిన రాజీవ్ గాంధీ ప్రభుత్వం, భారత రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్‌గా చేర్చింది.

పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం లేదా భారత రాజ్యాంగం లోని 52వ సవరణ పార్లమెంటులో రాజకీయ నాయకులు పార్టీలు మారే సామర్థ్యాన్ని పరిమితం చేస్తుంది. ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారకుండా నిరోధించడానికే రాజ్యాంగాన్ని సవరించారు.

అయితే రాజీవ్ హత్యానంతరం ప్రధాని అయిన పీవీ నర్సింహారావు ప్రభుత్వం జూలై 1993లో అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కొంది. ఆ సమయంలో తనకు ఓటు వేయడానికి జార్ఖండ్ ముక్తి మోర్చా సభ్యులకు ముడుపులు అందించారని ఆరోపణలు వచ్చాయి. పీవీ తన పదవీ కాలం తర్వాత ప్రత్యేక కోర్టు దోషిగా తేల్చింది. మూడేళ్ళ కఠిన జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించింది. అప్పీల్ చేసుకోగా, 2002లో ఢిల్లీ హైకోర్టు దిగువ కోర్టు నిర్ణయాన్ని రద్దు చేసింది.

ఇక బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు, రాజనీతిజ్ఞుడు వాజ్ పేయి మొదట 1996లో 13 రోజులు, తర్వాత 1998 నుండి 1999 వరకు 13 నెలలు, ఆపై 2004లో పూర్తి పదవీకాలం పాటు ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆయన పూర్తి కాలం పనిచేసిన మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా నిలిచారు. అయితే 1996 సార్వత్రిక ఎన్నికలలో లోక్‌సభలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న బీజేపీ నుంచి వాజపేయి భారత 10వ ప్రధాని అయ్యాడు. కానీ బీజేపీ ఇతర పార్టీల మద్దతును కూడగట్టుకొవటంలో విఫలమై, వాజపేయి తన పదవికి రాజీనామా చేశారు. 1998 ఎన్నికల్లో గెలిచిన బీజేపీ 1999 మధ్యలోనే జయలలిత మద్దతు ఉప సంహరించుకోవడంతో వాజ్ పేయి ప్రభుత్వం కూలిపోయింది.

2003లో పార్లమెంటు భారత రాజ్యాంగానికి 91వ సవరణను ఆమోదించింది. ఇది ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించడానికి, కొంతకాలం పాటు వారిని మంత్రులుగా నియమించకుండా నిషేధించడానికి నిబంధనలను జోడించడం ద్వారా చట్టాన్ని బలోపేతం చేసింది.

అయినప్పటీకీ ఆతర్వాత కూడా అనేక సందర్భాల్లో పార్టీ ఫిరాయింపుల కారణంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పడిపోతూనే ఉన్నాయి.

రాజ్యాంగం, చట్టాలు ఎంత కఠినంగా ఉన్నప్పటికీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలనే సున్నితమైన తేడాతోనే రాజకీయ నాయకులు దర్జాగా పార్టీలు మారుతున్నారు. అంతెందుకు తనదాకా వస్తేగానీ, అన్న విధంగా ఇవ్వాళ పార్టీల ఫిరాయింపులపై కోర్టుకు వెళ్ళిన బీఆర్ఎస్, గడచిన పదేళ్ళ ప్రభుత్వ కాలంలో చేసిందేంటి? టీడీపీ ఎల్పీనే విలీనం చేసుకున్నది నిజం కాదా? బహుషా ఆ సమయంలో రేవంత్ రెడ్డి టీడీపీలోనే ఉండి ఉంటారు. అలాగే కాంగ్రెస్ ఎల్పీని నిర్వీర్యం చేసింది బహుషా ఆ పార్టీకి గుర్తుండే ఉంటుంది. ఉన్న ఒక్క సీపీఎం ఎమ్మెల్యే కాదంటే, సీపీఐ ఎమ్మెల్యేను కూడా పార్టీలో కలుపుకోలేదా? అప్పట్లో ఎంత మంది ఎన్ని విధాలుగా చెప్పినా వినకుండా మొదటి విడత తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావడానికి మిగతా పార్టీల వారు తమ పార్టీలో కలుస్తున్నారన్నది కల్వకుంట్ల కుటుంబమే కాదా? రెండో విడత పురోగతికి ఆకర్షితులయ్యారని చెప్పిందీ అబద్ధం కాదు కదా? ఆనాడు కేసీఆర్ విసిరిన ఫిరాయింపుల వలకు విలవిలలాడిన పార్టీలు టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ వంటివి లేవా?

అంతకుముందు వైఎస్ హయాంలోనూ అప్పటి టీఆర్ఎస్ కు చెందిన 11 మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో కలుపుకోలేదా? ఆనాడు విలవిలలాడిని టీఆర్ఎస్ కు ఉద్యమకారులు అండగా నిలబడ్డారు. పార్టీల మారిన వారిని ఎక్కడికక్కడ నిలదీశారు.

అయితే మోదీ ప్రధాని అయిన తర్వాత బీజేపీ వలకు చిక్కని రాజకీయ నాయకుడెవ్వరున్నారు? రాజకీయ పార్టీలెక్కడ ఉన్నాయి? ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు కూలిపోయి, ఆయా చోట్ల కమలం వికసించలేదు? ఇదంతా అందరికీ తెలిసిన చరిత్రే. అయితే విచిత్రంగా ఈ గురువింద పార్టీలే, గురువింద గింజ నేతలే తిరిగి పార్టీ ఫిరాయింపుల మీద మాట్లాడటం సగటు మనిషికి వెగటు పుట్టిస్తున్నాయి. ఒకరిద్దరు నేతలు, పొరపాటుల మిగిలి ఉంటే ఒకటి రెండు పార్టీలు మినహా, సో కాల్డ్ అన్ని పార్టీలు, ఆయా పార్టీల్లోని చాలా మంది నేతలూ జంప్ జలానీలే! అలాంటి వాళ్ళే ఇవ్వాళ పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం విడ్డూరంగానే ఉంటుంది.

రాజకీయ పార్టీల్లో, నేతల్లో సచ్చీలతను, నీతి నిజాయితీలను, నైతిక విలువలను వెతుక్కోవడమంటే గొంగట్లో కూర్చుని బొచ్చేరుకోడమే!

నిజానికి స్పీకర్ నిర్ణయాత్మక శక్తిగా ఉంటున్నారా? ఉత్సవ విగ్రహంగా మిగిలిపోతున్నారా? అత్యున్నత రాజ్యంగ స్థానాలను కూడా రాజకీయ పార్టీ నేతలే, పార్టీల లెజిస్లేచర్ నాయకులే నిరంకుశంగా నిర్దేశిస్తున్నారు. తమ చెప్పుచేతల్లో ఉండేవాళ్ళనే కీలక స్థానాల్లో కూర్చోబెడుతున్నారు. అంతా తమ కనుసన్నల్లోనే జరిగే విధంగా చూసుకుంటున్నారు. అంతకు మించి ప్రవర్తిస్తే ఏమవుతుందో మనం నిన్ననే రాజ్యసభలో చూశాం. భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు జగదీప్ ధన్ ఖడ్ కాస్త స్వతంత్రంగా వ్యవహరించబోయి, ఉన్న పదవిని స్వయంగా ఊడగొట్టుకున్నారు. పాపం! ప్రభుత్వ కోపానికి బలైపోయారని మీడియా కోడై కూసింది. ఆయన పదవి మాత్రం తిరిగి రాలే.

ఈ నేపథ్యంలో నిజంగానే స్పీకర్ రాజ్యాంగానికి లోబడి, చట్టాలకు కట్టుబడి నిర్ణయం తీసుకోగలరా? ఆ వాతావరణం మన భారత రాజకీయాల్లో ఉందా? తీసుకుంటే ఏం జరుగుతుందో? కళ్ళ ముందే కనిపిస్తున్నది. చట్టసభల్లో సుప్రీం జోక్యం అత్యంత పరిమితం. అందుకే సీజే ధర్మాసనం తెలంగాణ ఫిరాయింపుల విషయంలో స్పీకర్ 3 నెలల్లో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామని, శాసించలేమని, పార్లమెంటు నిర్ణయించాలని కూడా తీర్పు చెప్పింది. అయితే, అధికారంలో ఉండే పార్టీలకు, నేతలకు ఫిరాయింపుల చట్టంలోలా అక్కడక్కడా లోపాలు లేదా అస్పష్టత అవసరం. వాటి మనుగడకు ఆ లొసుగులే శ్రీరామ రక్ష. అందుకే పార్టీలేవైనా వాదిస్తాయే తప్ప, దేన్నీ సాధించాలనుకోవు. సవాళ్ళు మాత్రం విసురుకుంటాయి. అవి ప్రజలకు కూడా సవాల్ గానే మిగిలిపోతున్నాయి.

Latest News

కిటికీలకు స్లైడింగ్ తెరలు!?|ADUGU TRENDS

ఇల్లంటే సల్లంగుండాలె. ఎటు గాలి గటే పోవాలె. గట్లని కోతులు, పిట్టలు, పశుపచ్చాదులతోటి పరేషాన్లుండొద్దు. ఇగ గిట్ల నిమ్మలంగుండాలంటే, ఇల్లెట్ల కట్టుకోవాలె? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలె! గసొంటిదే గీ కిటికీలకు స్లైడింగ్ తెరలు....

కాన్వాయ్‌లు కాదు, రాజకీయ దుబారాలు!|EDITORIAL

ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి....

15-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ త్రయోదశి ఉదయం 06.00 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అశ్విని సాయంత్రం 06.51 వరకు ఉపరి భరణి యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 12.58 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి...

కరెంటు తీగల మద్దెలనే ఇల్లు!?|ADUGU TRENDS

కాని కట్టాలు రానీ, కరెంటు తీగలుంటే, గవాటి కింద మనం ఇల్లే కట్టం. గా ఆలోశెన కూడా శేయం. కనీ, గీ అన్న కరెంటు తీగల మద్దెలనే ఇల్లు కట్టిండు! గీ అన్న...

‘నీట్’ గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!|EDITORIAL

పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. నీట్ పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలి. ఎన్‌టిఏ...

14-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి ఉదయం 07.39 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి 07.55 వరకు ఉపరి అశ్విని యోగం ప్రీతి మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం తైతుల ఉదయం...

ఒక శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు!?|ADUGU TRENDS

గిదేం ఇచ్చెంత్రం అని ఆశీరపోతుండ్రా!? నిజంగా ఇది నిజమేనుల్లా! గీ శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు కాసినయి. గా శెట్టు దగ్గర నిల్సోని సాక్షాత్తు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే...

పొదుపు ఎక్కడి నుండి పొడవాలి?|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల...

13-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి ఉదయం 08.53 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.38 వరకు ఉపరి రేవతి యోగం విస్కమ్బ సాయంత్రం 05.39 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ ఉదయం...

ఏటీఎం లోపల సవురం!?|ADUGU TRENDS

ఇగ ఏటీఎంల ఏముంటది? ఓ మిషిని ఉంటది. గదాంట్ల ఏముంటయి? రుపాలుంటయి. మరిగ గిదీంట్ల ఏమున్నది ముచ్చట? ఉందుంది.. గదేందో మీరే సూడుండ్రి. సదువుండ్రి. గా ఏటీఎంల ఓ మనిసికి ఇంకో మనిసి సవురం...

సర్… అనుమానాలెందుకు!?|EDITORIAL

సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్‌పోర్ట్ ఉంటున్నాయి....

12-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం హనుమజ్జయంతి తిధి బ దశమి ఉదయం 09.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 08.48 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం వైధృతి రాత్రి 07.28 వరకు ఉపరి విష్కమ్బ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News