Friday, April 10, 2026
26.7 C
Hyderabad

PARTY|పార్టీ POST|పదవికి RESPECT|గౌరవం, బాధ్యతా భావంతో కృషి చేయాలి

GANDHI BHAVAN| గాంధీభవన్ PCC| పిసిసి సమావేశంలో CM|సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి

గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ పిసిసి కమిటీ సభ్యులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ వికాసం, రాష్ట్ర ప్రగతిపై ఆయన స్పష్టమైన విధానాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రాన్ని దేశంలోనే మోడల్‌గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

రాష్ట్రంలో నూతన పాలనతో ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి కుల గణన చేపట్టేలా చేయడంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించాం. ఇదంతా కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది. ప్రజలు నమ్మిన పార్టీగా మళ్లీ ఎన్నికల వేళ తమ ఆశలు మాతో పెట్టుకుంటారు అని సీఎం వ్యాఖ్యానించారు.

పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయడమే కాకుండా, YOUTH CONGRESS| యూత్ కాంగ్రెస్, NSUI| ఎన్ఎస్యూఐ, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిలో చాలామందికి ప్రభుత్వ పదవులు వచ్చాయని తెలిపారు. ఇది పార్టీ కార్యకర్తలకు విలువనిచ్చే విధానానికి నిదర్శనమన్నారు.

పార్టీ పదవులు సాధించిన ప్రతి ఒక్కరూ అవి క్యాజువల్‌గా తీసుకోకూడదు. అవి మీకిచ్చే గౌరవానికి ప్రతీకలు. రాజకీయ జీవితంలో ఎదుగుదలకు ఇవే బలం. ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ విజయంలో ఇదే కీలకమవుతుంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే నాయకత్వం గుర్తింపు ఇస్తుంది అని సూచించారు.

రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరగబోతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల విధానం, జమిలి ఎన్నికల ప్రభావం పార్టీ వ్యవస్థపై ఉండే అవకాశాన్ని సీఎం వివరించారు. 2029 ఎన్నికలు నూతన నాయకత్వానికి వేదికగా మారాలనీ, ఇప్పటి నుంచే ప్రతి నాయకుడు ప్రణాళికతో కష్టపడాలనీ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్‌దే అధికారం. అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ రెండోసారి అధికారంలోకి రావాలి. మనకు పార్టీగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ సామాజిక న్యాయాన్ని సమర్థించడమే. ఈ దిశగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ముందుకు సాగాలి అని సీఎం స్పష్టం చేశారు.

అలాగే, పార్టీ జాతీయ అధ్యక్షుడు MALLIKHARJUN KHARGE| మల్లికార్జున ఖర్గే సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన అరుదైన ఘనత సాధించారనీ, వారిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త తరం నాయకులు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. పార్టీ పదవులతోనే గుర్తింపు లభిస్తుందని, వాటికి తగిన గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పునరుద్ఘాటించారు.

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News