GANDHI BHAVAN| గాంధీభవన్ PCC| పిసిసి సమావేశంలో CM|సీఎం REVANTH REDDY| రేవంత్ రెడ్డి
గాంధీభవన్లో జరిగిన టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో ముఖ్యమంత్రి మరియు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ పిసిసి కమిటీ సభ్యులకు కీలక దిశానిర్దేశం చేశారు. పార్టీ భవిష్యత్తు, నాయకత్వ వికాసం, రాష్ట్ర ప్రగతిపై ఆయన స్పష్టమైన విధానాన్ని వ్యక్తపరిచారు. రాష్ట్రాన్ని దేశంలోనే మోడల్గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానిదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో నూతన పాలనతో ప్రజలకు సంక్షేమ పథకాల ఫలితాలు నేరుగా అందిస్తున్నామని, కేంద్ర ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి కుల గణన చేపట్టేలా చేయడంలోనూ కాంగ్రెస్ పార్టీ విజయవంతమైందని గుర్తు చేశారు. విద్య, ఉద్యోగ, ఉపాధి రంగాల్లో గొప్ప ప్రగతిని సాధించాం. ఇదంతా కాంగ్రెస్ పాలనలోనే సాధ్యమైంది. ప్రజలు నమ్మిన పార్టీగా మళ్లీ ఎన్నికల వేళ తమ ఆశలు మాతో పెట్టుకుంటారు అని సీఎం వ్యాఖ్యానించారు.
పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో 45 లక్షల మందిని క్రియాశీలక సభ్యులుగా నమోదు చేయడమే కాకుండా, YOUTH CONGRESS| యూత్ కాంగ్రెస్, NSUI| ఎన్ఎస్యూఐ, జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారిలో చాలామందికి ప్రభుత్వ పదవులు వచ్చాయని తెలిపారు. ఇది పార్టీ కార్యకర్తలకు విలువనిచ్చే విధానానికి నిదర్శనమన్నారు.
పార్టీ పదవులు సాధించిన ప్రతి ఒక్కరూ అవి క్యాజువల్గా తీసుకోకూడదు. అవి మీకిచ్చే గౌరవానికి ప్రతీకలు. రాజకీయ జీవితంలో ఎదుగుదలకు ఇవే బలం. ఇప్పటి నుంచే గ్రామాలకు వెళ్లి ప్రజల మధ్య ఉండాలి. వారి సమస్యలు తెలుసుకోవాలి. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలని, పార్టీ విజయంలో ఇదే కీలకమవుతుంది. అందరూ సమన్వయంతో పనిచేస్తేనే నాయకత్వం గుర్తింపు ఇస్తుంది అని సూచించారు.
రాబోయే రోజుల్లో అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాల సంఖ్య పెరగబోతున్న నేపథ్యంలో నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్ల విధానం, జమిలి ఎన్నికల ప్రభావం పార్టీ వ్యవస్థపై ఉండే అవకాశాన్ని సీఎం వివరించారు. 2029 ఎన్నికలు నూతన నాయకత్వానికి వేదికగా మారాలనీ, ఇప్పటి నుంచే ప్రతి నాయకుడు ప్రణాళికతో కష్టపడాలనీ పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో వచ్చే పదేళ్లు కాంగ్రెస్దే అధికారం. అందరూ కలిసికట్టుగా పనిచేసి మళ్లీ రెండోసారి అధికారంలోకి రావాలి. మనకు పార్టీగా ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది – ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ సామాజిక న్యాయాన్ని సమర్థించడమే. ఈ దిశగా ప్రతి కార్యకర్త నిబద్ధతతో ముందుకు సాగాలి అని సీఎం స్పష్టం చేశారు.
అలాగే, పార్టీ జాతీయ అధ్యక్షుడు MALLIKHARJUN KHARGE| మల్లికార్జున ఖర్గే సుదీర్ఘకాలం ప్రజా ప్రతినిధిగా సేవలందించిన అరుదైన ఘనత సాధించారనీ, వారిని స్ఫూర్తిగా తీసుకుని కొత్త తరం నాయకులు అభివృద్ధి చెందాలని సీఎం సూచించారు. పార్టీ పదవులతోనే గుర్తింపు లభిస్తుందని, వాటికి తగిన గౌరవం, బాధ్యతతో వ్యవహరించాలని ఆయన పునరుద్ఘాటించారు.

