Friday, July 17, 2026
24.5 C
Hyderabad

కాంగ్రెస్‌ కు పూర్వ వైభవం సాధ్యమేనా?!|EDITORIAL

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు సఫలం కాలేకపోతోంది? ప్రజల నాడీ పట్టుకోవడంలో విఫలమవుతోందా? ప్రజా సమస్యలను గుర్తించలేకపోతోందా? గుర్తించినా వాటిని సరైన రీతిలో డీల్ చేయలేకపోతోందా? అధికార బీజేపీని ఎదుర్కోలేకపోతోందా? మోదీ, అమిత్ షా ఎత్తుల ముందు చిత్తవుతోందా? నాయకత్వ లోపమా? సమన్వయ శాపమా? మేధోమథనం లేకపోవడమా? అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ కు ఏమైంది? ఇవి ఆ పార్టీ నాయకత్వంపై ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. ఆ పార్టీ శ్రేణులే సంధిస్తున్న ప్రశ్నలు. అంతర్మథనాలు.

కాంగ్రెస్ వరుస వైఫల్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రజా సమస్యలను ఎజెండా చేయడంలో, వాటిపై పోరాటడంలో, అధికార పార్టీని, ప్రభుత్వాన్ని నిలదీయడంలో ఆ పార్టీ బాగా వెనుకబడిపోతోంది. కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా రాహుల్‌ గాంధీ చేపట్టిన బాధ్యతల్లో ఈ స్పష్టమైన ఫలితాలు కనిపించలేదు. దేశం ఎదుర్కొంటున్న అసలు సమస్యలపై, ప్రభుత్వాల వైఫల్యాలపై, అధికారాన్ని సాక్షాత్కారం చేసే సమస్యలపై ఆయనకు లోతైన అవగాహన లేదన్న విమర్శలు నిరంతరాయంగా వినిపిస్తునే ఉన్నాయి. మోదీ లాంటి ఉద్ధండ నేతను, ఆయన నాయకత్వంలోని ప్రభుత్వాన్ని నిలదీయాలంటే స్పష్టమైన ఎజెండా అవసరం. కానీ రాహుల్‌ చేతిలో అలాంటి దిశా నిర్దేశం కనుచూపు మేరలో కనిపించడం లేదు. పార్లమెంట్‌లో గడువు లేకుండా రచ్చ చేయడం, నినాదాలతో రాజకీయాలు నడపడం, వంశపారంపర్య నాయకత్వంపై ఆధారపడటం వంటి చర్యలు కాంగ్రెస్‌ను మరింత బలహీన స్థితికి నెడుతున్నాయి.
గత పుష్కరకాల యూపీఏ పాలనలో జరిగిన పొరబాట్లను ప్రజలు ఇంకా మరచిపోలేదు. ఈ నేపథ్యంలో రాహుల్‌ గాంధీ పాదయాత్రలు చేసినా, రాజ్యాంగ ప్రతిని ఎత్తిచూపినా, ‘సర్’ని ఎత్తుకున్నా, మహా గఠ్ బంధన్ కూటములు కట్టినా పార్టీకి పెద్దగా కలిసిరాలేదు. మేలు జరగలేదు. ప్రధానంగా పార్టీకి కేంద్ర స్థాయిలో నాయకత్వ సంక్షోభం, నిర్ణయాత్మక, స్పష్టమైన రాజకీయ దిశానిర్దేశం లేకపోవడం వల్ల ప్రజల్లో పార్టీపై నమ్మకం తగ్గింది. తీవ్రమైన అంతర్గత విభేదాలు, స్థానిక నేతల మధ్య సమన్వయం లోపించడం, ఎన్నికల వ్యూహాల్లో వైఫల్యాలు వంటివన్నీ పార్టీ ప్రభావాన్ని నీరుగారుస్తున్నాయి. ప్రధానంగా 2014, 2019, 2024 సాధారణ ఎన్నికలలో పార్టీ సాధించిన బలహీన ఫలితాలు, ఆ పార్టీని జాతీయ స్థాయిలో ప్రత్యామ్నాయ శక్తిగా నిలబెట్టలేకపోయాయి. అదనంగా, యువ ఓటర్లను ఆకర్షించడంలో విఫలమవడం ఆ పార్టీని మరింత దిగజారుస్తున్నాయి.

కర్నాటకలో సీఎం పదవి విషయంలో సిద్దరామయ్య–డీకే శివకుమార్‌ మధ్య నెలకొన్న విభేదాలను పరిష్కరించడంలో కూడా హైకమాండ్‌ బలహీనంగా మారింది. ఖర్గే అధ్యక్షుడైనా, రాహుల్‌ మార్గనిర్దేశం ఉన్నా స్పష్టమైన నిర్ణయాలను సమర్థంగా తీసుకునే వేగం, ధైర్యం కనిపించడం లేదు. గతంలో రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, తాజాగా బీహార్‌ ఎన్నికల్లోనూ అంతర్గత కలహాలే కాంగ్రెస్‌, కాంగ్రెస్ కూటముల ఓటములకు కారణమయ్యాయి.

పార్టీ కార్యకలాపాలను నాయకత్వం స్వయంగా పర్యవేక్షించడం తగ్గిపోయింది. నిర్ణయాలు విధేయుల చేతుల్లోకి వెళ్లాయి. కేసీ వేణుగోపాల్‌ వంటి నేతల సూచనలతో ముఖ్యమైన పరిణామాలు జరుగుతుండటం, పెద్ద నేతల మధ్య సమస్యలను పరిష్కరించలేకపోవడం పార్టీ నాయకత్వ బలహీనతను బహిర్గతం చేస్తున్నాయి. ఈ పరిస్థితిలో రాహుల్‌ నిజమైన నాయకుడిగా ఎదగాలనుకుంటే ప్రజా సమస్యలపై దీర్ఘకాల పోరాటం చేయాలి. నినాదాలకంటే విధానాలు, పదవుల కేటాయింపులకంటే నైతిక నిర్ణయాలు ముఖ్యం.
కాంగ్రెస్‌కు మరో అవకాశం దక్కాలంటే ముందుగా పార్టీ అంతర్గత వ్యవస్థను బలపరచాలి. కేంద్రంలో, రాష్ట్రాల్లో పార్టీలోని అంతర్గత విభేదాలను సమర్థంగా సమసేట్లు చేయాలి. ప్రజలతో, ప్రజా సమస్యలతో, ప్రజల భాగస్వామ్యంతో నడిచే రాజకీయాలు చేయాలి. అధికారంలో లేకపోయినా పటిష్టమైన వ్యూహాలతో ముందుకు సాగగలిగితేనే కాంగ్రెస్‌ తిరిగి ప్రజల్లో నమ్మకం పొందగలదు.

కానీ, ఇప్పుడు ఆ పార్టీకి కావాల్సింది, దృఢమైన నాయకత్వం, సమర్థవంతమైన వ్యూహం, ప్రజలతో సన్నిహిత సంబంధాల పరురుద్ధరణ. ప్రస్తుతం కనిపిస్తున్న నాయకత్వ బలహీనతలతో మాత్రం కాంగ్రెస్ పార్టీకి పునరుద్ధరణ, పూర్వవైభవం దూరమైన స్వప్నంగానే మిగిలిపోతుంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News