Friday, April 10, 2026
26.7 C
Hyderabad

నా వ్యాఖ్యలపై తప్పుడు ప్రచారం సరైంది కాదు|Konda Surekha|

మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో బీఆర్ఎస్ నేతలపై విమర్శలు

|Konda Surekha|Comments|Sensational|Telangana

మంత్రి కొండా సురేఖ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనేక విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో, ఆమె స్పష్టత ఇచ్చారు. “నిన్న వరంగల్‌లో నేను చేసిన వ్యాఖ్యలపై కొంతమంది పనిగట్టుకుని తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్నారు,” అంటూ బీఆర్ఎస్ నేతలపై ఆమె మండిపడ్డారు. “నేను గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పటి మంత్రులు ఏ పని చేయాలన్నా పైసలు తీసుకునేవారని మాత్రమే అన్నాను. ఇది అక్షర సత్యం. నా ఆ వ్యాఖ్యలకు నేను ఇప్పటికీ కట్టుబడి ఉన్నాను,” అని మంత్రి స్పష్టం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

బీఆర్ఎస్ హయాంలో మంత్రుల పనితీరు పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని, ప్రతి ఫైల్‌కు ముడుపులు తీసుకునే అలవాటు ఆ సమయంలో ఉండేదని ఆమె ఆరోపించారు. “ఇది నిజమా కాదా అన్నదీ బీఆర్ఎస్ నేతలకే తెలుసు. కానీ ఇప్పుడు నా వ్యాఖ్యలను వక్రీకరించడం సరైన చర్య కాదని స్పష్టం చేశారు. పెయిడ్ సోషల్ మీడియా వేదికగా నా మాటల్ని ఎడిట్ చేసి, ముందు వెనక భాగాలు తొలగించి, కావాలనే వీడియో క్లిప్‌ను హైలైట్ చేస్తూ, మా మంత్రివర్గ సభ్యుల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు,” అని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

“ఈ కుట్రలు బీఆర్ఎస్ నాయకుల అసహనానికి నిదర్శనాలు మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వం అద్భుతంగా పాలన అందిస్తుండటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇలాంటి దుష్ప్రచారాలకు తెగబడుతున్నారు,” అని సురేఖ మండిపడ్డారు. ఆమె చెప్పినట్లుగా, తన వ్యాఖ్యలు పూర్తిగా గత ప్రభుత్వంలోని అవినీతిపైనే ఉన్నాయని, ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న మంత్రి సహచరులపై ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

“బీఆర్ఎస్ హయాంలో ‘పైసలు ఇస్తేనే ఫైళ్లు కదలుతాయ’న్న అభిప్రాయం ప్రజల్లో బలంగా పడింది. అప్పటి మంత్రుల నిర్వాకం వల్లే ఈ దుస్థితి ఏర్పడింది. దళిత బంధు, మిషన్ కాకతీయ వంటి పథకాల్లో ముట్టడిపోయిన కమిషన్ల బాగోతాలను మీ సీఎం కేసీఆర్ గారే స్వయంగా బయటపెట్టారు. ఒక మంత్రి 30 శాతం వరకు కమిషన్ తీసుకుంటాడని చెప్పిన ఘనత కూడా మీకే చెందుతుంది. ఇదే కారణంగా ప్రజలు మిమ్మల్ని ఓటుతో గుణపాఠం చెప్పారు,” అని మంత్రి తెలిపారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

“ఇప్పటికీ మీ బుద్ధి మారలేదు. ప్రతి అంశాన్ని వక్రీకరించి వక్రబాష్యం చెబుతున్నారు. ఇలా చేస్తూ మీ అసలు స్వరూపాన్ని ప్రజల ముందే బయటపెడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ అవినీతికి, అబద్ధాలకు పుట్టిన విష పురుగు. ప్రజలు దీనికి తగిన గుణపాఠం చెబుతారు. మళ్లీ ఇలాంటి దుష్ప్రచారాలు చేస్తే అస్సలు సహించేది లేదు. తగిన చర్యలు తీసుకుంటాం,” అంటూ మంత్రి కొండా సురేఖ తీవ్ర హెచ్చరికలు చేశారు.|Konda Surekha|Comments|Sensational|Telangana

Latest News

గా మట్టిని సాప్ చేయిండ్లిట్ల!?|ADUGU TRENDS

రాను రాను ఆనలు తక్కువైతానయి. ఎండలెక్కువైతానయి. మోటర్లు ఎక్కువై రోడ్ల మీద గిర్రగిర్ర తిరుగుతానయి. ఇగ దుమ్ము, దుమ్ములేస్తుందనుకోండ్రి. గీ దమ్ముతోటి మస్తు రోగాలొత్తయి. మన దగ్గరున్న వస్తువులు దుమ్ముకొట్టుకపోతయి. ఇగ మనం...

యుద్ధం వాస్తవాలు: చర్చల్లో కీలకాంశాలు!|EDITORIAL

పశ్చిమాసియా యుద్ధ తీవ్రత చర్చల అంకానికి చేరుకుంది. రెండు వారాల కాల్పుల విరమణ ప్రకటన తర్వాత నేటి నుంచే ఇస్లామాబాద్ లో చర్చలు ప్రారంభం కానున్నాయి. యుద్ధం ప్రారంభం కంటే విరమణే విపరీతంగా...

10-04-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ అష్టమి రాత్రి 07.23 వరకు ఉపరి నవమి నక్షత్రం పూర్వాషాఢ ఉదయం 08.12 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం శివ మధ్యాహ్నం 03.34 వరకు ఉపరి సిద్ద కరణం బాలవ ఉదయం 06.38...

నారీ శక్తికి పట్టం కడదాం|WOMEN|NARENDRA MODI|ESSAY

మహిళా సాధికారతను సాధిద్దాం ఏప్రిల్ 16న మనమంతా మహిళలకు అండగా నిలుద్దాం మహిళా రిజర్వేషన్ల బిల్లుపై ప్రధాని నరేంద్ర మోదీ వ్యాసం రానున్న రోజుల్లో దేశంలో పండుగ వాతావరణం పరిఢవిల్లనుంది. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఈ పర్వదినాల...

పసువుల గడ్డికి పక్కా రచ్చణ!?|ADUGU TRENDS

పసువులను మనుసులతోటి సమానంగ సూత్తం. పసువు శేసే పని, మనిసి గూడ సేయడు. గా పసువులు గడ్డి తిని పాలిత్తయి. మరి గీ మనుసులే పాలు తాగి విసం అయితరు. కనీ, గా...

యుద్ధోన్మాదం మిగిల్చిన ప్రపంచ సంక్షోభం!|EDITORIAL

ప్రపంచ ఇటీవలి రాజకీయ పరిణామాలు మానవాళికి మరో చేదు అనుభవాన్ని మిగిల్చాయి. శక్తివంతమైన దేశాల యుద్ధోన్మాదం, ఆధిపత్య పోరాటాలు చివరకు సామాన్య ప్రజల జీవన విధానాన్ని ఎలా దెబ్బతీస్తాయో ప్రస్తుత పరిస్థితులు గుణపాఠాలు...

09-04-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి సాయంత్రం 05.48 వరకు ఉపరి అష్టమి నక్షత్రం మూల ఉదయం 05.53 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం పరిఘ మధ్యాహ్నం 03.19 వరకు ఉపరి శివ కరణం బవ సాయంత్రం 05.46...

ఎరుపెక్కిన కర్రె గుట్టల్లో.. శాంతి గీతం!|POLICE|MAOIST

తెలంగాణలో ముగిసిన మావోల శకం|TELANGANA పలు అభివృద్ధి పనులకు డీజీపీ శ్రీకారం|DEVELOPMENT|DGP తెలంగాణలో మావోయిస్టుల శకం ముగిసిందని డిజిపి శివధర్ రెడ్డి అన్నారు. ఒకప్ప్పుడు తుపాకుల మోతతో, అశాంతితో నిండిన తెలంగాణ అటవీ ప్రాంతాల్లో ఇప్ప్పుడు...

‘మామ’ నుంచి భూమి! |MOON|EARTH

మామకు అత్యంత చేరువగా మన వ్యోమగాములు నాసా ప్రతిష్టాత్మక ఆర్టెమిస్ II మిషన్ వ్యోమగాములు సోమవారం (ఏప్రిల్ 6, 2026) చంద్రుడికి అత్యంత చేరువగా వెళ్లారు. ఓరియన్ క్యాప్సూల్ నుంచి చంద్రుడి ఉపరితలాన్ని చూసిన...

మడ్డి పట్టిన నూనె మంచిగైతది!?|ADUGU TRENDS

ఒకప్పుడు కాపిష్కెడు నూనె పోసి కిల కూర ఒండాల్నంటే గగనమయ్యేది. ఉప్పు, కారం, మసాల, ఇంత నూనె యేసి కలిపి పొయ్యి మీద పెడితే ఒంటయ్యేది. కూర గూడ కమ్మగుండేది. కిల నూనె...

అభివృద్ధి నిరోధకంగా పార్టీలు, నేతలు!|EDITORIAL

ప్రజాస్వామ్యానికి రాజకీయాలు ప్రాణం అయితే, అభివృద్ధి ఆత్మ. ఈ రెండింటి మధ్య సన్నని విభజన రేఖను చెరిపేస్తూ, విస్మరిస్తూ, వాటిని కలగలిపి స్వార్థపూరితంగా ఉపయోగిస్తే రాష్ట్రాల పురోగతే కాదు, ప్రజల భవిష్యత్తు కూడా...

08-04-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి సప్తమి నక్షత్రం మూల పూర్తిగా ఉంది యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.51 వరకు ఉపరి పరిఘ కరణం వణజి మధ్యాహ్నం 03.55 వరకు ఉపరి భద్ర రాహుకాలం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News