Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

POK|పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలి

RSS|ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ MOHAN BHAGAVAT|మోహన్‌ భగవత్‌ పిలుపు

మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని సత్నాలో జరిగిన సింధీ క్యాంప్‌ గురుద్వారా ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్‌ఎస్‌ఎస్‌) సర్సంఘ్‌చాలక్‌ మోహన్‌ భగవత్‌ ఆదివారం కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో జరుగుతున్న ప్రజా తిరుగుబాట్లు, ఉద్రిక్తతల నేపథ్యంలో భగవత్‌ మాట్లాడుతూ, పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. భారతదేశాన్ని ఒక ఇల్లుతో పోల్చిన ఆయన, ఆ ఇంటిలోని ఒక గది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌గా ఉందని, దానిని ఎవరో ఆక్రమిస్తే నిశ్శబ్దంగా ఉండకూడదని వ్యాఖ్యానించారు. ఇంటి గదిని తిరిగి స్వాధీనం చేసుకోవడం మన కర్తవ్యమని, భారతదేశం అవిభక్త భారతదేశం కావాలని గుర్తుచేశారు.

భగవత్‌ మాట్లాడుతూ, భారతదేశం అనే ఇల్లు మొత్తం ఒకటే. మన ఇంట్లోని ఒక గది పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రూపంలో ఆక్రమించబడింది. దాన్ని మనం తిరిగి పొందాలి. ఇది రాజకీయ విషయం కాదు, మన ఆత్మగౌరవం, జాతి ఏకత్వం అంశం. అవిభక్త భారతదేశాన్ని తిరిగి నిర్మించాలనే దిశగా అందరం కృషి చేయాలి అని అన్నారు. సభలో ఆయన వ్యాఖ్యలకు హర్షధ్వానాలు వ్యక్తమయ్యాయి.

ఇక భగవత్‌ మరో కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ, మనమంతా ఒకటే. మతం, భాష, ప్రాంతం వేరు అయినా మన మూలం ఒకటే. మనమంతా హిందువులమే. సింధీ సోదరులను చూసి ఆనందంగా ఉంది. వారు పాకిస్తాన్‌కు వెళ్లలేదు, అవిభక్త భారతదేశంలోని ఒక ప్రాంతానికి వెళ్లారు. పరిస్థితులు వారిని వేరుచేశాయి కానీ ఆ ఇల్లూ, ఈ ఇల్లూ వేరు కావు” అని అన్నారు. ఇంటి ఒక గదిని ఎవరో బలవంతంగా ఆక్రమించుకున్నారు. కానీ అది మనదే కాబట్టి, మనం దానిని తిరిగి తీసుకోవాల్సిందే అని ఆయన పిలుపునిచ్చారు.

ఇక పీఓకేలో ఇటీవల హింసాత్మక నిరసనలు చెలరేగాయి. పాక్‌ ప్రభుత్వం, సైన్యం చేస్తున్న అణచివేత చర్యలపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 12 మంది మరణించగా, అనేకమంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో భగవత్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

పాకిస్తాన్‌ పాలనలో ఉన్న పీఓకే ప్రాంత ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. జమ్మూ కశ్మీర్‌ జాయింట్‌ అవామీ యాక్షన్‌ కమిటీ ఈ ఉద్యమానికి నేతృత్వం వహిస్తోంది. నిరసనలను అణచివేయడానికి ప్రయత్నించిన పాక్‌ ప్రభుత్వం చివరకు ఆ కమిటీతో చర్చలు జరిపి 25 అంశాలపై ఒప్పందం కుదుర్చుకుంది. హింసలో మరణించిన వారికి పరిహారం ఇవ్వడంతో పాటు, ముజఫరాబాద్‌, పూంచ్‌ డివిజన్లలో అదనంగా రెండు ఇంటర్మీడియట్‌, సెకండరీ విద్యా బోర్డులు ఏర్పాటు చేయనున్నట్లు పాకిస్తాన్‌ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి తారిక్‌ ఫజల్‌ చౌదరి వెల్లడించారు.

పీఓకేలో పెరుగుతున్న అసంతృప్తి, ప్రజల్లో ఆగ్రహం నేపథ్యంలో మోహన్‌ భగవత్‌ చేసిన వ్యాఖ్యలు జాతీయస్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. ఆయన పీఓకేను తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునివ్వడం, భారతీయ ఏకత్వం పట్ల ఆర్‌ఎస్‌ఎస్‌ వైఖరిని మరోసారి స్పష్టంచేసింది. దేశ సార్వభౌమ్యానికి భగవత్‌ వ్యాఖ్యలు నూతన ఉత్సాహాన్ని నింపాయని, భారత జాతి ఐక్యతకు ఇది ప్రేరణగా నిలుస్తుందని ఆర్‌ఎస్‌ఎస్‌ వర్గాలు పేర్కొన్నాయి.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News