Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

‘నీట్’ గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!|EDITORIAL

పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. నీట్ పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలి. ఎన్‌టిఏ పనితీరుపై స్వతంత్ర సమీక్ష జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. రాష్ట్రాలకు మళ్లీ వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో అధికారం ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత. విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

దేశవ్యాప్తంగా వైద్య విద్యలో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష మరోసారి వివాదాల కేంద్రంగా మారింది. ఈ నెల 3న జరిగిన నీట్ (యూజీ)–2026 పరీక్ష ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని బయటపడటంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) పరీక్షను రద్దు చేసింది. సీబీఐ దర్యాప్తునకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ పరిణామం దేశంలోని పరీక్ష రాసిన 22 లక్షల మంది విద్యార్థులను తీవ్ర అనిశ్చితిలోకి నెట్టి వేసింది. కష్టపడి చదివిన విద్యార్థులు మళ్లీ పరీక్ష రాయాల్సిన పరిస్థితి ఏర్పడగా, తల్లిదండ్రులపై ఆర్థిక, మానసిక భారం మరింత పెరిగింది. పరీక్షా వ్యవస్థపై ప్రజల్లో ఉన్న నమ్మకం కూడా తీవ్రంగా దెబ్బతిన్నది.

ఇటీవల నీట్, యూజీసీ నెట్ వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో పేపర్ లీక్‌లు, అవకతవకలు వరుసగా వెలుగులోకి రావడం ఆందోళనకరం. ఈసారి మాత్రమే కాదు, గతంలోనూ నాలుగు సార్లు నీట్ పరీక్షకు సంబంధించి అక్రమాల ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎన్‌టిఏ పనితీరు, పరీక్షల నిర్వహణ సామర్థ్యం, భద్రతా వ్యవస్థలపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేశవ్యాప్తంగా 46కు పైగా పరీక్షలను కేవలం 400 మంది సిబ్బందితో సమన్వయం చేయడం ఎంతవరకు సమర్థవంతమన్న సందేహం కూడా ఉత్పన్నమవుతోంది.

ఎన్‌టిఏ ప్రకారం పరీక్షల భద్రత కోసం జీపీఎస్ ట్రాకింగ్ వాహనాలు, బయోమెట్రిక్ ధృవీకరణ, ఎ.ఐ ఆధారిత సీసీటీవీ పర్యవేక్షణ, 5జీ జామర్లు వంటి ఆధునిక చర్యలు అమలు చేశామని చెబుతున్నారు. అయితే, పేపర్లు ముందుగానే బయటకు రావడం ఈ భద్రతా వ్యవస్థల వైఫల్యానికి నిదర్శనం.రాజస్తాన్ లోని సీకర్ ప్రాంతంలో పరీక్షకు దాదాపు 42 గంటల ముందే వాట్సాప్ ద్వారా “గెస్ పేపర్” పేరిట ప్రశ్నలు చక్కర్లు కొట్టడం తీవ్ర కలకలం రేపింది. ఆ పేపర్‌లోని కెమిస్ట్రీ, బయాలజీ విభాగాల్లో 120 నుంచి 140 ప్రశ్నలు అసలు పరీక్షలో రావడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెట్టింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ప్రశ్నాపత్రాలను రూ.20 వేల నుంచి రూ.2 లక్షల వరకు విక్రయించినట్లు సమాచారం. పలువురు నిందితులను అరెస్టు చేసినప్పటికీ అసలు సూత్రధారులు ఎవరన్నది ఇంకా స్పష్టం కాలేదు.

పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. వైద్య విద్య వంటి అత్యంత పోటీ రంగంలో ఒక్క మార్క్ కూడా కీలకం. అలాంటి పరిస్థితిలో ముందుగానే ప్రశ్నాపత్రాలు పొందిన విద్యార్థులు 720 మార్కుల్లో 600కు పైగా సాధించే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. ఇది నిజాయితీగా పరీక్ష రాసిన లక్షలాది మంది విద్యార్థుల కృషిని అవమానపరచడమే అవుతుంది.

ఈ వివాదంతో మరోసారి నీట్ విధి, విధానాలపైనే ప్రశ్నలు చెలరేగుతున్నాయి. గతంలో ప్రతి రాష్ట్రం తమ అవసరాలకు అనుగుణంగా ఎంసెట్ వంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించుకునేది. అప్పుడు ఇలాంటి జాతీయ స్థాయి సంక్షోభాలు అరుదుగా ఉండేవి. కానీ 2017లో నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రీకరణ విధానంలో భాగంగా నీట్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసింది. దీంతో రాష్ట్రాల పరిధిలో ఉన్న వైద్య విద్య ప్రవేశ వ్యవస్థ పూర్తిగా కేంద్ర నియంత్రణలోకి వెళ్లింది. దీనిని మొదటి నుంచీ తమిళనాడు తీవ్రంగా వ్యతిరేకించింది. కేరళ, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీలు నీట్ విధానాన్ని పునరాలోచించాలని తీర్మానాలు చేశాయి.

నీట్ విధానం పట్టణ ప్రాంతాల ధనిక, ఎగువ మధ్యతరగతి విద్యార్థులకు ఎక్కువ ప్రయోజనం కలిగిస్తోంది. ఖరీదైన కోచింగ్ సెంటర్లు, ప్రైవేట్ శిక్షణా సంస్థలు, కార్పొరేట్ విద్యా వ్యవస్థల సహకారం లేకుండా సామాన్య కుటుంబాల విద్యార్థులు పోటీలో నిలబడటం కష్టమవుతోంది. ఇప్పుడు పేపర్ లీక్‌లు కూడా జతకావడంతో పరిస్థితి మరింత దారుణంగా మారింది.

ఇంకా బాధాకరమైన విషయం ఏమిటంటే, ఇటువంటి ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నుంచి తగిన స్థాయిలో స్పందన కనిపించకపోవడం. పరీక్షల ముందు విద్యార్థులతో “పరీక్షా పే చర్చ” కార్యక్రమాలు నిర్వహించే నాయకత్వం, పేపర్ లీక్‌ల వల్ల విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక వేదనపై స్పష్టమైన ప్రకటన చేయకపోవడం విమర్శలకు దారితీస్తోంది. గతంలో టెన్త్ లేదా ఇంటర్ పరీక్షల్లో చిన్న అవకతవక జరిగినా సంబంధిత మంత్రులు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసేవారు. ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు సంక్షోభంలో పడినా బాధ్యత స్వీకరించే పరిస్థితి కనిపించడం లేదు.

ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలి. ఎన్‌టిఏ పనితీరుపై స్వతంత్ర సమీక్ష జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి. అవసరమైతే రాష్ట్రాలకు మళ్లీ వైద్య ప్రవేశ పరీక్షల నిర్వహణలో అధికారం ఇవ్వడం వంటి ప్రత్యామ్నాయాలపై ఆలోచించాలి. ముఖ్యంగా విద్యార్థుల నమ్మకాన్ని తిరిగి పొందడం ప్రభుత్వాల ప్రధాన బాధ్యత కావాలి. విద్యా వ్యవస్థపై విశ్వాసం కోల్పోతే దేశ భవిష్యత్తే ప్రమాదంలో పడుతుంది.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News