Friday, July 31, 2026
25.7 C
Hyderabad

నిన్న హరీశ్ రావు, నేడు కేటీఆర్… మరి రేపు!?|KCR|HARISHRAO|KTR|BRS|PHONE TAPPING

తెలంగాణ రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను మరిపిస్తున్నది. రోజుకో మలుపుతో రోజురోజుకు మరింత ఉత్కంఠను రేపుతోంది. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో అక్రమంగా ఫోన్లు ట్యాప్ చేశారనే ఆరోపణలతో మొదలైన ఈ కేసు, ఇప్పుడు ఆ పార్టీ అగ్ర నేతల వరకూ చేరింది. ఇప్పటికే ఈ కేసుతో సంబంధమున్న పోలీసు అధికారులను, బాధితులను విచారించిన ప్రత్యేక దర్యాప్తు బృందం… నిన్న మాజీ మంత్రి హరీశ్ రావును, నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు పిలిచింది. మరి ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న రాజకీయ వర్గాల్లో, ప్రజల్లో ఉత్పన్నమవుతోంది. సర్వత్రా ఉత్కంఠతోపాటు ఆసక్తి రేపుతోంది.

హైదరాబాద్, జనవరి 22 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణలో గత ప్రభుత్వ కాలంలో పోలీస్ విభాగాన్ని ఉపయోగించి రాజకీయ ప్రత్యర్థులు, పార్టీ నేతలు, వ్యాపారవేత్తలు, మీడియా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసి, నిఘా పెట్టినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇది జాతీయ, రాష్ట్ర భద్రత, శాంతి భద్రతల పేరుతో జరిగిందా? లేక పూర్తిగా రాజకీయ ప్రయోజనాల కోసమేనా? అనే అంశాలే దర్యాప్తులో కీలకంగా మారాయి. ఇప్పటివరకు వెలుగులోకి వచ్చిన సమాచారం ప్రకారం, నిఘా వ్యవస్థను దుర్వినియోగం చేశారన్న అనుమానాలు బలపడుతున్నాయి.

ఈ కేసుతో సంబంధముందన్న ఆరోపణలతో ఇప్పటికే పలువురు పోలీసు అధికారులను, పలువురు నేతలను, బాధితులను ‘సిట్’ విచారించింది. హరీష్ రావు నిన్నటి విచారణ ఈ కేసులో కీలక మలుపు. అప్పట్లో ఆయన కీలక మంత్రిగా ఉండటంతో, సిట్ అడిగిన ప్రశ్నలు రాజకీయ ఆదేశాల వరకు వెళ్లినట్లు తెలుస్తోంది. ‘ఆ పెద్దాయన ఎవరం’టూ ప్రశ్నించినట్లు గుప్పుమంది. హరీష్ రావు తనపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తూ, ఇది పూర్తిగా రాజకీయ కక్షతో కూడిన కేసని, కాంగ్రెస్ ప్రభుత్వం తమపై ప్రతీకారం తీర్చుకుంటోందని వ్యాఖ్యానించారు. అయితే, దర్యాప్తు సంస్థలు మాత్రం సాంకేతిక ఆధారాలు, అధికారుల వాంగ్మూలాల ఆధారంగా విచారిస్తున్నామని చెబుతున్నాయి.

ఇక నేడు కేటీఆర్ ను విచారిస్తుండటం ఈ కేసును ఆసక్తికరంగా మార్చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐటీ, మున్సిపల్ పరిపాలన వంటి కీలక శాఖలను నిర్వహించిన కేటీఆర్, ప్రభుత్వంలో రెండో అధికార కేంద్రంగా వ్యవహరించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి సున్నితమైన అంశం ఆయనకు తెలియకుండా జరిగిందా? లేదా వ్యవస్థాగతంగా తీసుకున్న నిర్ణయాలా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కేటీఆర్ కూడా ఈ కేసును రాజకీయ కుట్రగా అభివర్ణిస్తూ, తాము న్యాయపరంగా ఎదుర్కొంటామని ప్రకటించారు.
ఈ పరిణామాల నేపథ్యంలో ‘రేపు ఎవరు?’ అనే ప్రశ్న సహజంగానే ఉత్పన్నమవుతోంది. ‘పెద్దాయన’ చెప్పాడనే వాంగ్మూలాలు రావడాన్ని బట్టి చూస్తే, అప్పటికీ, ఇప్పటికీ బీఆర్ఎస్ లో, అప్పటి ప్రభుత్వంలోనూ కేసీఆర్ నే ‘పెద్ద సారు’, ‘పెద్దాయన’ అని సంబోధించేవారు. ఆయితే ఆ పెద్దాయన కేసీఆరేనా? అన్న చర్చ జరుగుతోంది. ప్రతిపక్షాల నేతలు, ప్రముఖులు, సొంతపార్టీలోని పెద్దలు వగైరా దాదాపు ఆరు వేల మంది ఫోన్లు ట్యాప్ అయినట్లుగా వెల్లడవడాన్ని బట్టి, అంతటి స్థాయిలో నిఘా వ్యవస్థ పనిచేయాలంటే అత్యున్నత రాజకీయ అనుమతి అవసరమన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఆ అత్యున్నత అధికారం ఆనాడు కేసీఆరే నిర్వర్తించారు. అయితే, కేసీఆర్‌ను నేరుగా ఈ కేసుతో అనుసంధానించేలా ఇప్పటివరకు అధికారిక ప్రకటనలేవీ లేవు. అయినప్పటికీ, దర్యాప్తు ముందుకు సాగేకొద్దీ ఎవరెవరి పాత్ర బయటపడుతుందన్న ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది.

రాజకీయంగా ఈ కేసు కాంగ్రెస్‌కు ఒక ఆయుధంగా మారినట్టు కనిపిస్తోంది. బీఆర్‌ఎస్ పాలనలో ప్రజాస్వామ్య విలువలు దెబ్బతిన్నాయని, వ్యక్తిగత గోప్యత హక్కును ఉల్లంఘించారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు, బీఆర్‌ఎస్ మాత్రం ఇది పూర్తిగా రాజకీయ ప్రతీకార చర్య అని, ఎన్నికల్లో ఓడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం తమను టార్గెట్ చేస్తోందని విమర్శిస్తోంది. ఈ పరస్పర ఆరోపణల మధ్య, ప్రజలు మాత్రం అసలు నిజం ఏమిటన్నదానిపై స్పష్టత వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు.
న్యాయపరంగా చూస్తే, ఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత సున్నితమైన విషయం. చట్టబద్ధమైన అనుమతులు, స్పష్టమైన కారణాలు లేకుండా ఫోన్లు ట్యాప్ చేయడం రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనగా పరిగణించబడుతుంది. సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో వ్యక్తిగత గోప్యత హక్కును మౌలిక హక్కుగా గుర్తించింది. అలాంటి పరిస్థితిలో, ఈ కేసులో ఆరోపణలు నిజమైతే, ఇది కేవలం రాజకీయ కేసు కాకుండా, ఒక పెద్ద రాజ్యాంగ సంక్షోభంగా కూడా మారే అవకాశం ఉంది.

ఫోన్ ట్యాపింగ్ కేసు తెలంగాణ రాజకీయాల్లో దీర్ఘకాల ప్రభావం చూపే అంశంగా మారింది. ఇది బీఆర్‌ఎస్ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారుతుందా? లేక కాంగ్రెస్ ప్రభుత్వానికి రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుందా? అన్నది మరికొద్ది రోజుల్లోనైనా తేలుతుందా? చూడాలి మరి.

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News