Friday, June 5, 2026
27 C
Hyderabad

ఈ వరుస ఎన్నికల వరస మారాలి!|EDITORIAL

ఎన్నికలంటే రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లకు కూడా పండగగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదైనా, అది నేడు డబ్బుతో ముడిపడిపోవడం ఆందోళనకరం. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు ఖజానాపై భారీ భారం మోపుతుండగా, ఆ భారాన్ని చివరికి ప్రజలే పన్నుల రూపంలో భరిస్తున్నారు.

తెలంగాణలో పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి ఉంటే ప్రభుత్వ ఖర్చు గణనీయంగా తగ్గేది. ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం, భద్రత, సిబ్బంది, పరిపాలనా యంత్రాంగం శ్రమ తగ్గేది. కానీ రాజకీయ లెక్కలు వేరేలా ఉన్నాయి. అధికార పార్టీలకు విడతలుగా ఎన్నికలు జరగడం అనుకూలంగా కనిపిస్తోంది.‘జమిలి ఎన్నికలు’ జరిగితే ప్రజల మనోభావాలు ఒక్కసారిగా ప్రతిబింబిస్తాయి. ఫలితాలు అనుకూలంగా రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అధికార పార్టీలకు ఉంటుంది. అందుకే విడతలుగా ఎన్నికలు జరుపుతూ, ఓటర్ల మనోగతాలను తమకనుకూలంగా మలుచుకుంటూ, పరిస్థితులను చక్కబెట్టుకోవడమే మెరుగని భావిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత మార్చిలో జడ్పీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల ఖజానా గుల్లవుతున్నా, రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష నష్టం ఏమీ లేదు. ఆ భారమంతా చివరికి ప్రజలపైనే పడుతుంది. ఎన్నికల ఖర్చు ప్రభుత్వ ఖర్చుగానే కనిపించినా, అది ప్రజల పన్నుల నుంచే వస్తుందన్న సత్యాన్ని మనం మరిచిపోతున్నాం.

రాష్ట్రంలో మున్సిపల్ రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరిలో ఈ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఏ క్షణంలోనైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు ఖరారు కావడంతో పట్టణాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు ఏ వార్డు ఎవరికీ రిజర్వ్ అవుతుందోనన్న టెన్షన్‌తో ఉన్న ఆశావహులు ఇప్పుడు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధాన రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాల’పై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల బాధ్యతను సంబంధిత మంత్రులకు అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిగా నియమిస్తూ, మున్సిపల్–కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరగనున్నందున అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న పొరపాటు కూడా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఎలాంటి లోపాలు లేకుండా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఈ రాజకీయ హడావుడిలో ఒక చేదు నిజం మరుగున పడుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు గెలుస్తున్నాయి. కానీ ప్రజలు ఓడిపోతున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో కొందరు ఓటర్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని, కొందరు అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను నిలదీసిన సంఘటనలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి నిదర్శనం. ఇలాంటి సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? నిజాయితీగల నాయకత్వం ఎలా వస్తుంది?

ఈ వరుస ఎన్నికలు ఖజానాపై భారం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు కూడా సవాల్‌గా మారుతున్నాయి. ఎన్నికల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖర్చు, రాజకీయ స్వార్థం, ఓటర్ల ప్రలోభాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరం. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల ఖర్చును నియంత్రించడం, ఓటర్లలో చైతన్యం పెంపొందించడం అత్యవసరం. ఎన్నికల పండగలో రాజకీయ పార్టీలు లబ్దిపొందుతూంటే, ప్రజలు మాత్రం ఎప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News