Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

ఈ వరుస ఎన్నికల వరస మారాలి!|EDITORIAL

ఎన్నికలంటే రాజకీయ పార్టీలకే కాదు, ఓటర్లకు కూడా పండగగా మారింది. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత పవిత్రమైనదైనా, అది నేడు డబ్బుతో ముడిపడిపోవడం ఆందోళనకరం. తెలంగాణలో వరుసగా జరుగుతున్న ఎన్నికలు ఖజానాపై భారీ భారం మోపుతుండగా, ఆ భారాన్ని చివరికి ప్రజలే పన్నుల రూపంలో భరిస్తున్నారు.

తెలంగాణలో పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సిపల్ ఎన్నికలు ఒకేసారి నిర్వహించి ఉంటే ప్రభుత్వ ఖర్చు గణనీయంగా తగ్గేది. ఎన్నికల నిర్వహణకు అయ్యే వ్యయం, భద్రత, సిబ్బంది, పరిపాలనా యంత్రాంగం శ్రమ తగ్గేది. కానీ రాజకీయ లెక్కలు వేరేలా ఉన్నాయి. అధికార పార్టీలకు విడతలుగా ఎన్నికలు జరగడం అనుకూలంగా కనిపిస్తోంది.‘జమిలి ఎన్నికలు’ జరిగితే ప్రజల మనోభావాలు ఒక్కసారిగా ప్రతిబింబిస్తాయి. ఫలితాలు అనుకూలంగా రాకపోతే రాజకీయంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయం అధికార పార్టీలకు ఉంటుంది. అందుకే విడతలుగా ఎన్నికలు జరుపుతూ, ఓటర్ల మనోగతాలను తమకనుకూలంగా మలుచుకుంటూ, పరిస్థితులను చక్కబెట్టుకోవడమే మెరుగని భావిస్తున్నారు.

ఇటీవల తెలంగాణలో పంచాయితీ ఎన్నికలు పూర్తయ్యాయి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు, ఆ తర్వాత మార్చిలో జడ్పీ ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇలా విడతలుగా ఎన్నికలు జరగడం వల్ల ఖజానా గుల్లవుతున్నా, రాజకీయ పార్టీలకు ప్రత్యక్ష నష్టం ఏమీ లేదు. ఆ భారమంతా చివరికి ప్రజలపైనే పడుతుంది. ఎన్నికల ఖర్చు ప్రభుత్వ ఖర్చుగానే కనిపించినా, అది ప్రజల పన్నుల నుంచే వస్తుందన్న సత్యాన్ని మనం మరిచిపోతున్నాం.

రాష్ట్రంలో మున్సిపల్ రిజర్వేషన్ల జాబితా ఖరారైంది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ వివరాలను తన అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని 2,996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం ఫిబ్రవరిలో ఈ ఎన్నికల నిర్వహణకు ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తవడంతో ఎన్నికల నిర్వహణకు ఉన్న ప్రధాన అడ్డంకి తొలగిపోయింది. దీంతో ఏ క్షణంలోనైనా రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారిక షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.

రిజర్వేషన్లు ఖరారు కావడంతో పట్టణాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటివరకు ఏ వార్డు ఎవరికీ రిజర్వ్ అవుతుందోనన్న టెన్షన్‌తో ఉన్న ఆశావహులు ఇప్పుడు టికెట్ల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధాన రాజకీయ పార్టీలు ‘గెలుపు గుర్రాల’పై దృష్టి సారించాయి. కాంగ్రెస్, బీజేపీ, బీఆరెస్ పార్టీలు ఇప్పటికే ఎన్నికల వ్యూహాల రూపకల్పనలో నిమగ్నమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అయితే ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోని మున్సిపాలిటీల బాధ్యతను సంబంధిత మంత్రులకు అప్పగించింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ఇన్‌ఛార్జిగా నియమిస్తూ, మున్సిపల్–కార్పొరేషన్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటోంది.

ఈ ఎన్నికలు పార్టీ గుర్తులపైనే జరగనున్నందున అభ్యర్థుల ఎంపిక నుంచి పోలింగ్ ముగిసే వరకూ అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చిన్న పొరపాటు కూడా గెలుపోటములపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే అన్ని పార్టీలు ఎలాంటి లోపాలు లేకుండా గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్నాయి. యువ ఓటర్లను ఆకర్షించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు జరుగుతున్నాయి.

అయితే ఈ రాజకీయ హడావుడిలో ఒక చేదు నిజం మరుగున పడుతోంది. ప్రతి ఎన్నికల్లోనూ పార్టీలు గెలుస్తున్నాయి. కానీ ప్రజలు ఓడిపోతున్నారు. డబ్బులు తీసుకుని ఓట్లు వేయడం ఇప్పుడు సాధారణ విషయంగా మారింది. ఇటీవలి సర్పంచ్ ఎన్నికల్లో కొందరు ఓటర్లు డబ్బులు తీసుకుని ఓట్లు వేయలేదని, కొందరు అభ్యర్థులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఓటర్లను నిలదీసిన సంఘటనలు ఎన్నికల్లో డబ్బు ప్రవాహానికి నిదర్శనం. ఇలాంటి సంస్కృతి కొనసాగితే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? నిజాయితీగల నాయకత్వం ఎలా వస్తుంది?

ఈ వరుస ఎన్నికలు ఖజానాపై భారం మాత్రమే కాదు, ప్రజాస్వామ్య విలువలకు కూడా సవాల్‌గా మారుతున్నాయి. ఎన్నికల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఖర్చు, రాజకీయ స్వార్థం, ఓటర్ల ప్రలోభాలు కూడా పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మారాలంటే ఎన్నికల విధానంలో సంస్కరణలు అవసరం. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం, ఎన్నికల ఖర్చును నియంత్రించడం, ఓటర్లలో చైతన్యం పెంపొందించడం అత్యవసరం. ఎన్నికల పండగలో రాజకీయ పార్టీలు లబ్దిపొందుతూంటే, ప్రజలు మాత్రం ఎప్పటికీ నష్టపోతూనే ఉన్నారు.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News