Sunday, April 12, 2026
25.7 C
Hyderabad

భూ భారతితో అన్ని సమస్యలు తీరుతాయి

ధరణితో రైతులు మోసపోయారు.

రైతుల భూ కష్టాలు తీర్చడం కోసమే ఈ భూ భారతి

పాలకుర్తి, రాయపర్తి భూ భారతి అవగాహన సదస్సుల్లో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టంతో రైతుల అన్ని భూ సమస్యలు తీరుతాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి అన్నారు. గత పాలకులు చేసిన ధరణి చట్టంతో రైతులు మోసపోయారని దుయ్యబట్టారు. పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో గల జనగామ జిల్లా, పాలకుర్తి మండల కేంద్రంలో, వరంగల్ జిల్లా, రాయపర్తి మండల కేంద్రంలో గల రైతు వేదికల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ హక్కుల రికార్డ్ పథకం (భూ భారతి చట్టం – Record of Rights: ROR) పై అవగాహన సదస్సు నిర్వహించగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, జిల్లా కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, సత్య శారదలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ…. భూ భారతి చట్టం ద్వారా భూముల రికార్డులు పారదర్శకంగా నిర్వహించి, భవిష్యత్ తరాలకు భూ హక్కుల విషయంలో స్పష్టత కల్పించడమే మన ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చెప్పారు. భూ కబ్జాలు, అక్రమాలు, వివాదాలు తొలగించి రైతులకు భద్రత కల్పించేందుకు ఈ చట్టం కీలకంగా పనిచేస్తుందని చెప్పారు. రైతులు తమ భూములకు సంబంధించి పూర్తి సమాచారం అందించడంతో పాటు, అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూ రికార్డులను నూతనంగా నమోదు చేస్తారని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి గారి మానస పుత్రికగా భూ భారతి నిలుస్తుందన్నారు. రైతులు ఎలాంటి అనుమానాలు లేకుండా భూమి వివరాలను అధికారులు చేపడుతున్న సర్వేల్లో సరిగ్గా నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ చట్టం అమలుతో భవిష్యత్తులో భూ సంబంధిత సమస్యలకు స్థానం ఉండదన్నారు. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ చట్టం రైతుల భవిష్యత్తు కోసమేనని అన్నారు.

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ మాట్లాడుతూ, భూ భారతి చట్టం అమలుతో భూములపై ఉన్న అస్పష్టత తొలగి, ఆస్తి హక్కుల బలోపేతం జరుగుతుందని పేర్కొన్నారు. డిజిటల్ రికార్డుల ఆధారంగా భూ వివరాలు అందుబాటులోకి రావడం వల్ల భూ వివాదాలు తగ్గుతాయి అన్నారు. వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ, ఈ చట్టం ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో భూముల పునర్వినియోగం సమర్థంగా జరగనుందని తెలిపారు. మహిళలకు, సామాజికంగా వెనుకబడిన వర్గాలకు భూ హక్కుల పరిరక్షణ ఈ చట్టం ద్వారా మరింత బలపడనుందని చెప్పారు. ఈ చట్టం లక్ష్యం భూముల పునర్వినియోగం, పేదలకు భూముల హక్కులు కల్పించడం, భూ పరిపాలనలో పారదర్శకత సాధించడమేనని చెప్పారు.

ఈ సదస్సులకు రైతులు అధిక సంఖ్యలో హాజరై, వారి సందేహాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అధికారులు గ్రామస్థాయిలో సర్వేలు ఎలా జరుగుతాయో, భూ నక్షా పునర్నిర్మాణ ప్రక్రియ ఎలా ఉంటుందో వివరించారు.

ఈ అవగాహన సదస్సులో వివిధ శాఖల అధికారులు, మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ మంజుల, స్థానిక నాయకులు, పెద్ద ఎత్తున రైతులు తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/CRSq1b5BCvs?feature=shared

Latest News

స్వర మాంత్రికురాలు ఆశా భోంస్లే|ASHA BHOSLE|TRIBUTE|ADUGU DIGITRAL MEDIA

మూగబోయిన ఎనిమిది దశాబ్దాల అప్రతిహత గాన ప్రయాణం పరిచయం: భారతీయ సంగీతపు ఇంద్రధనుస్సు భారతీయ చలనచిత్ర సంగీత చరిత్రలో 'ఆశా భోంస్లే' అనేది కేవలం ఒక పేరు కాదు, అదొక సంచలనం. ఏడు దశాబ్దాలకు పైగా...

చౌక ధరకే ‘డీజిల్ స్టవ్’|DIESEL|STOVE

కరీంనగర్ వెల్డర్ అద్భుత ఆవిష్కరణ కరీంనగర్ జిల్లాకు చెందిన వెల్డర్ రుక్మాంగధర్ రావు తన వినూత్న ఆలోచనతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నారు. నిత్యం పెరుగుతున్న గ్యాస్ సిలిండర్ ధరల భారాన్ని తగ్గించేందుకు ఆయన కేవలం రెండు...

ఇంటర్ తర్వాత ఏం చేయాలి?|INTERMEDIATE|FEATURE|STUDIES

మీ కెరీర్‌ను మలుపు తిప్పే 113 అద్భుతమైన కోర్సులు ఇవే! ఇంటర్మీడియట్ పూర్తి కాగానే చాలామందికి కేవలం ఇంజనీరింగ్ లేదా మెడిసిన్ మాత్రమే గుర్తొస్తాయి. కానీ, నేటి ఆధునిక ప్రపంచంలో విద్యార్థుల ఆసక్తికి తగ్గట్టుగా...

13-04-2026, సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు చైత్రమాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి రాత్రి 09.25 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ధనిష్ఠ మధ్యాహ్నం 12.38 వరకు ఉపరి శతభిషం యోగం శుభ మధ్యాహ్నం 02.15 వరకు ఉపరి శుక్ల కరణం బవ ఉదయం 09.20...

అక్షర యశస్వి – మలయశ్రీ|ESSAY|TRIBUTE

తెలంగాణ తేనె మాగాణంలో వివిధ ప్రక్రియలలో వైవిధ్యమైన శతాధిక రచనలు చేసిన సాహితీ మూర్తి డాక్టర్ మలయశ్రీ. ప్రాథమిక స్థాయి విద్యార్థుల నుంచి పరిశోధక స్థాయి విద్యార్థుల దాకా ప్రతిభావంతమైన రచనలు చేశాడు....

సిసి కెమెరాలంటే గిట్లుండాలె పో!?|ADUGU TRENDS

సీసీ కెమెరాలంటే ఏంటియి? ఎరికేనా? గివీట్నే క్లోస్డ్ సర్క్యూట్ టెలివిజన్ అంటరు. నిఘా, భద్రత కోసం పెట్టే గీ కెమెరాలు యీడియోలు తీత్తయి. గవాటితోటి ఎసొంటి దొంగల్నైనా సిటికెల పట్టుకోవచ్చన్నట్లు! దొంగతనం జరిగినంక...

ఆత్మ స్తుతి, పరనింద ఇంకెంత కాలం!?|EDITORIAL

అధికార కాంగ్రెస్‌ ఆత్మరక్షణలో పడిందా? అధికారంలోకి రావడానికి ముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్రమైన అవినీతి ఆరోపణలు చేసిన కాంగ్రెస్, ఇప్పుడు వాటిని నిరూపించడంలో విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం...

ఈరోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఏప్రిల్ 12 నుండి ఏప్రిల్ 18 వరకు వార రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశి వారికి కొత్త అవకాశాలు ఎదురవుతాయి. ఉద్యోగ రంగంలో మీరు చేసిన కృషికి మంచి ఫలితం...

‘అన్న’లు లేని తెలంగాణ! మిగిలింది ఐదుగురే!!|MAOIST|TELANGANA

గణపతి అడవిలో లేరు!!!|GANAPATHI|FOREST ఎన్ఐఏ కేసులతో మాకేం సంబంధం?|NIA డీజీపీ ఎదుట లొంగిపోయిన పీఎల్జీఏ కేశాలు|PLGA|DGP ఆయుధాలతో 42 మంది మావోయిస్టుల లొంగుబాటు|42|MAOISTS భారీగా బంగారం, ఆయుధాలు అప్పగింత|GOLD లొంగినవారికి రూ.1.93కోట్ల రివార్డు, హెల్త్ కార్డులు వారికి పునరావాసం కల్పిస్తామన్న శివధర్...

చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్-2|HISTORY|ARTEMIS-2

సురక్షితంగా భూమికి చేరిన వ్యోమగాములు చంద్రుడి చుట్టూ చారిత్రాత్మక పది రోజుల యాత్రను ముగించుకుని నాసాకు చెందిన 'ఆర్టెమిస్-2' వ్యోమగాములు శనివారం తెల్లవారుజామున సురక్షితంగా భూమికి చేరుకున్నారు. కాలిఫోర్నియాలోని శాన్టియాగో తీర సమీపంలో పసిఫిక్...

గిది అగ్గిపెట్టేనుల్లా!?|ADUGU TRENDS

గిది నిజ్జంగా అగ్గి పెట్టే! గా ఎండకు ఎండదు. ఆనకు తడవదు. సలికి మండకుండా ఉండదు. జేబుల పెట్టుకుంటే మోటుగుండదు. అరె! మరైతే గిదేం అగ్గిపెట్టే? అని గద అనిపిస్తుంది. కనీ, గిది...

దేశంలో సామాజిక సమస్యలకు పరిష్కారాలేవి!?|EDITORIAL

భారతదేశం స్వాతంత్య్రాన్ని సాధించి 80 ఏళ్ళు పూర్తిచేసుకుంటున్న ఈ సందర్భంలో, సాధించిన విజయాలకన్నా ఎదుర్కొంటున్న సవాళ్ళే ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థ ఉన్నప్పటికీ, సామాజిక రంగంలో ఇంకా...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News