Tuesday, May 5, 2026
35.2 C
Hyderabad

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక జనించబోయే భావివేదముల జీవనాదములు జగత్తుకంతా చవులిస్తాయోయ్‌! అన్నాడు. అంతేగాక, “కార్మికలోకపు కళ్యాణానికి,. శ్రామిక లోకపు సౌభాగ్యానికి. సమర్పణంగా.. సమర్చనంగా.. త్రిలోకాలలో త్రికాలాలలో,. శ్రమైక జీవన సౌందర్యానికి. సమానమైనది లేనేలేదని ” శ్రీశ్రీ కీర్తించారు. కమ్మరి కొలిమీ, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సాలెల మగ్గం, శరీరకష్టం స్ఫురింపజేసే గొడ్డలి, రంపం, కొడవలి, నాగలి.. ఇవన్నీ శ్రమకు, శ్రామిక లోకానికి చిహ్నాలుగా, ఆ శ్రమయే సౌందర్యంగా ఆయన అభివర్ణించారు. శ్రమే సమాజ పురోగతికి మూలం కాగా, అదే శ్రమ దోపిడీకి గురవుతుండటం ఆందోళనకరం.

1886లో చికాగోలో జరిగిన హే మార్కెట్ సంఘటన ఒక కీలక మలుపు. రోజుకు 8 గంటల పనిదినం కోసం కార్మికులు చేసిన ఆందోళన రక్తపాతం దారితీసినా, అది ప్రపంచవ్యాప్తంగా కార్మిక హక్కుల పోరాటానికి పునాది వేసింది. తరువాత 1889లో మే 1ను కార్మిక దినోత్సవంగా గుర్తించారు. భారతదేశంలో 1923లో మద్రాసులో మొదటిసారిగా మే డే జరుపుకోవడం కార్మిక చైతన్యానికి శ్రీకారం చుట్టింది.

భారతదేశంలో కార్మిక వర్గం విస్తృతమైంది. కేవలం కర్మాగార కార్మికులే కాదు, నిర్మాణ రంగం, వ్యవసాయం, రవాణా, సేవా రంగం, ఐటి రంగం ఇలా అన్ని రంగాల్లో పనిచేసేవారంతా కార్మికులే. దేశంలో 90% మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. అయితే, ఈ విభాగానికి సరైన చట్టపరమైన రక్షణ లేకపోవడం ప్రధాన సమస్య.

గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ, లిబరలైజేషన్ విధానాల తర్వాత కార్మిక హక్కులు క్రమంగా బలహీనపడ్డాయి. 8 గంటల పనిదినం అనే ప్రాథమిక హక్కు ఉన్నప్పటికీ, అనేక రంగాల్లో కార్మికులు రోజుకు 10–12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. ముఖ్యంగా ఐటి రంగంలో ఈ పరిస్థితి తీవ్రమైంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఒత్తిడి, అనిశ్చితి యువతను మానసికంగా కూడా ప్రభావితం చేస్తున్నాయి.

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ విధానాల విస్తరణతో శాశ్వత ఉద్యోగాలు తగ్గిపోయాయి. అనేక సంస్థల్లో 50% కంటే ఎక్కువ మంది కాంట్రాక్ట్ ఉద్యోగులే. వీరికి పింఛన్, ఆరోగ్య భద్రత, ఇతర సంక్షేమ పథకాలు అందడం లేదు. ప్రభుత్వ రంగంలో కూడా ఉద్యోగాల సంఖ్య క్రమంగా తగ్గిపోతున్నది.

మహిళా కార్మికుల పరిస్థితి మరింత ఆందోళనకరం. రాత్రి పూట పనిచేసే మహిళలకు సరైన భద్రత లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. పని గంటలు పెరగడం, ప్రయాణ భద్రత లేకపోవడం వంటి సమస్యలు వారిపై అదనపు భారం మోపుతున్నాయి.

విద్యా, వైద్య రంగాల్లో కూడా శ్రమదోపిడీ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రైవేట్ పాఠశాలల్లో ఉపాధ్యాయులు రోజుకు 10–12 గంటలు పనిచేయాల్సి వస్తోంది. అయినప్పటికీ, వారికి తగిన వేతనం లేదా భద్రత ఉండడం లేదు. పిల్లలపై కూడా అధిక ఒత్తిడి పెరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా 80కి పైగా దేశాల్లో మే 1ను కార్మిక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. ఈ రోజు కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, కార్మిక హక్కుల కోసం పోరాటానికి ప్రతీకగా నిలవాలి. 1916లో 8 గంటల పనిదినం అమలులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో హక్కులు సాధించబడ్డాయి. అయితే, అవే హక్కులు మళ్లీ ప్రమాదంలో పడుతున్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో పాలకులు కార్మిక సంక్షేమంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ఆరోగ్య భద్రత, పింఛన్, కనీస వేతనం, పని గంటల నియంత్రణ, ప్రతి కార్మికుడికి హక్కులుగా అమలు కావాలి. అసంఘటిత రంగానికి ప్రత్యేక చట్టాలు, అమలు వ్యవస్థలు అవసరం.

సమాజ పురోగతిని నిర్ణయించేది శ్రామిక వర్గమే. ఆ వర్గం బలహీనపడితే దేశ అభివృద్ధి అసాధ్యం. కాబట్టి, కార్మిక వర్గం సంఘటితమై తమ హక్కుల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. మే డే స్ఫూర్తి ఇదే శ్రమకు గౌరవం, కార్మికుడికి న్యాయం.

ఇప్పటికైనా పాలకులు, సంస్థలు, సమాజం కలసి శ్రమదోపిడీని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి. లేనిపక్షంలో, కష్టించి పనిచేసే చేతులు పిడికిళ్లుగా మారి ఉద్యమాల రూపంలో విస్ఫోటనం చెందడం అనివార్యం.

Latest News

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 03 నుండి మే 10 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత...

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News