Monday, August 3, 2026
31.5 C
Hyderabad

నిత్య నూతన ప్రేరణ మంత్రం వందేమాతరం!|EDITORIAL

బంకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది.
వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్‌కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

1875లో కార్తీక శుక్ల నవమి, జగద్ధాత్రి పూజనాడు పురుడు పోసుకున్న వందేమాతరం గీతం, అదే ఏడాది నవంబర్ 7న, దాన్ని రాసిన బంకించంద్ర చటర్జీ తన ‘బంగ్ల దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు. 1882 లో ఆయన రాసిన నవల “ఆనంద మఠ్”లో కూడా ఈ గేయాన్ని చేర్చారు. ఈ పాట స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతంగా, సందేశంగా మారింది. 1896లో రవీంద్రనాథ్ ఠాగోర్ ఈ పాటను భారత జాతీయ కాంగ్రెస్ కోల్‌కతా సమావేశంలో గాత్రంగా ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో ఈ పాట ప్రత్యేక ప్రేరణగా నిలిచింది. బ్రిటిష్ పాలకులు ఈ గీతాన్ని పాఠశాలల్లో పాడటాన్ని నిషేధించారు. అయినా ఈ పాట భారతావనిని ఏకం చేసింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, 1950 జనవరి 24న జరిగిన భారత రాజ్యాంగ సమావేశం ‘వందే మాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించింది.

వందేమాతర గీతానికి 150 ఏండ్లు కావస్తున్న సందర్భంగా 2025 నవంబర్ 7నుండి ఏడాది పాటు ‘ఒక మెలోడి ఒక చలనం’ పేరిట దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, వివిధ చోట్ల విద్యార్థుల సమూహాలతో, జాతీయ చైతన్య ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి.

‘వందే మాతరం’ అన్నపదాలు మాతృభూమికి సలాం చేస్తూ.. భాష, ప్రాంతం, మతాన్ని దాటే ఒక వసుధైక భావనగా మారాయి. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి జాలువారిన వందేమాతర గీతం…స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.

స్వాతంత్రోద్యమ సమయంలో వందేమాతర గీతం మంత్రంగా పని చేసింది. దేశవ్యాప్తంగా మనం, మన దేశం, మన సార్వభౌమత్వం అనే ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్‌ వారిని పారదోలేందుకు ఇది ఎంతగానో తోడ్పడింది. ప్రజలను ఏకం చేయడంలో వందేమాతర గీతం ఏక సూత్రంగా పని చేసింది. ఎక్కడిక్కడ వందేమాతరం గీతాలాపనతో ప్రజలు ఉద్యమంలో దుమికారు.

వందేమాతర గీతంలో భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు ఈ గీతరచనకు ప్రేరణనిచ్చాయి. సర్వ మంగళ మాంగళ్యే శివే… అంటూ సాగే దేవీమాత స్తోత్రం వందేమాతరం గీతానికి ప్రేరణగా భావిస్తారు. అందుకే కొందరు దీనిని పాడడానికి ఇప్పటికీ ఇష్టపడరు. ఇది మనదేశ దౌరభాగ్యంగా చూడాలి. మతం ముసుగులో కొందరు దీనిని తృణీకరించినా అది ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఉత్తేజిత గీతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాటే పరవళ్లు తొక్కింది. జాతి భావోద్వేగాలను వెన్నుతట్టి స్వాతంత్య్ర కాంక్ష అనే సమిష్టి కార్యాచరణకు పురిగొల్పడంలో వందేమాతరం గీతం కీలకభూమిక పోషించింది. అందుకే భారత స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రత్యేకమైనదిగా వందేమాతరం గీతం నిలిచింది.

స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది. మహర్షి అరవిందుడు వర్ణించినట్లు బంకించంద్రుడు ఆధునిక భారత రుషి. ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేల్కొలిపాయి. నిదురిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కూడగట్టుకుని, జాగృతం చేయడంలో వందేమాతరం గీతం ప్రముఖ భూమిక పోషించదనడంలో సందేహం లేదు.

బ్రిటిష్‌ పాలకుల ఇనుప ఉక్కు సంకెళ్ల కింద నలిగిపోతున్న తరుణంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం జాతికి ప్రభాత గీతమైంది. మన సంస్కృతి, నాగరికతల పట్ల గర్వాభిమానాలను రేకెత్తించే గానమైంది. అణువణువునా మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడేలా మేల్కొలిపే రణనినాద గీతమైంది. వందేమాతరం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతిని జాగృతం చేసింది. 1946లో తిరుగుబాటు చేసిన రాయల్‌ ఇండియన్‌ నేవీలోని భారతీయ నావికులు వందేమాతరం అని నినదిస్తూ బ్రిటిష్‌ యుద్ధనౌకలపై జాతీయ పతాకను ఆవిష్కరించారు.

ఇన్నేళ్లయినా వన్నె తగ్గకుండా మనజీవితాల్లో అది పెనవేసుకుపోయింది. భారతజాతిని కలసి ఉంచే గీతంగా నిలిచింది. స్వాతంత్య్ర ఉద్యమంలో వెలిగిన ఈ గీతాజ్యోతి ఇంకా జాజ్వలామానంగా వెలుగుతోంది. ఇప్పుడు ఏడాది ఉత్సవాల్లో భాగంగా వందేమాతరం పూర్తి రూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. వందేమాతరం కేవలం గత వైభవ స్మరణం, సంస్మరణం కారాదు. మనజాతిని మేల్కొలిపే ఉజ్జ్వల భవిష్యత్తుకు ప్రేరణగానూ తీసుకోవాలి.
భారత ఆత్మను ఆవహించుకునే గీతం కావాలి. వందేమాతరం పారతంత్ర భారతదేశానికి తొలి మేల్కొలుపు. మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమది. భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామజరంగా నిలుస్తుంది. తరతరాలకు ఉత్తేజమిస్తుంది. భారతీయత అనే కోణం నుంచి మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను వీక్షించి… నిరంతరం స్ఫూర్తి పొంది… సదా కార్యాచరణలో నిమగ్నం కావాలని ప్రబోధించే దివ్య గానంగా వందేమాతరం నిరంతర స్మరణ కావాలి. వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్‌కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

Latest News

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ గా భోగాపురం!?|EDITORIAL

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్రకు ఒక కొత్త అవకాశాన్ని తెరిచింది. ఈ అవకాశాన్ని స్థిరమైన అభివృద్ధిగా మలచడం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలు, స్థానిక ప్రజల సమిష్టి కృషిపైనే ఆధారపడి ఉంటుంది. మౌలిక వసతుల...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 02 నుండి ఆగస్టు 08 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీరు చేపట్టే పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో...

యిధి యిసిత్రమైందంటే గిదే మరి!?|ADUGU TRENDS

యిధి శాల యిసిత్రమైంది. ఒకపాలి కలిసున్నోల్లను సిడెంల యిడదీత్తది. యిడిపోయినోల్లని శిటికెల కలిపేత్తది. గసొంటిదే గీ ముచ్చట. గదేందో సూద్దాం పాండ్రి. తమిళనాడు రాస్ట్రం విరుదు నగర్ జిల్లా తిరుచూలి పూమాలై పట్టీకి శెందిన...

పోలీసింగ్ పై పార్లమెంటులో సమీక్షేది!?|EDITORIAL

పార్లమెంట్ వరుసగా వాయిదాలు పడుతూ స్తంభిస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య తీవ్ర ప్రతిష్ఠంభనల వల్ల ఉభయ సభల్లో కీలక అంశాలపై అసలు చర్చే జరగడం లేదు. పోలీసు వ్యవస్థలో సంస్కరణలు కూడా అత్యవసరం....

ఆగస్టు 01, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 09.20 వరకు ఉపరి చవితి నక్షత్రం శతభిషం రాత్రి 08.09 వరకు ఉపరి పూర్వాభాద్ర యోగం శోభ రాత్రి 11.43 వరకు ఉపరి అతిగండ కరణం వణజి ఉదయం 09.10...

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News