Saturday, June 13, 2026
32.8 C
Hyderabad

నిత్య నూతన ప్రేరణ మంత్రం వందేమాతరం!|EDITORIAL

బంకిం చంద్ర చటర్జీ రాసిన వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది.
వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్‌కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

1875లో కార్తీక శుక్ల నవమి, జగద్ధాత్రి పూజనాడు పురుడు పోసుకున్న వందేమాతరం గీతం, అదే ఏడాది నవంబర్ 7న, దాన్ని రాసిన బంకించంద్ర చటర్జీ తన ‘బంగ్ల దర్శన్’ అనే సాహిత్య పత్రికలో ప్రచురించారు. 1882 లో ఆయన రాసిన నవల “ఆనంద మఠ్”లో కూడా ఈ గేయాన్ని చేర్చారు. ఈ పాట స్వాతంత్ర్య పోరాటానికి ఒక సంకేతంగా, సందేశంగా మారింది. 1896లో రవీంద్రనాథ్ ఠాగోర్ ఈ పాటను భారత జాతీయ కాంగ్రెస్ కోల్‌కతా సమావేశంలో గాత్రంగా ఆలపించారు. 1905లో బెంగాల్ విభజన ప్రతిపాదనకు వ్యతిరేకంగా జరిగిన స్వదేశీ ఉద్యమంలో ఈ పాట ప్రత్యేక ప్రేరణగా నిలిచింది. బ్రిటిష్ పాలకులు ఈ గీతాన్ని పాఠశాలల్లో పాడటాన్ని నిషేధించారు. అయినా ఈ పాట భారతావనిని ఏకం చేసింది.

దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక, 1950 జనవరి 24న జరిగిన భారత రాజ్యాంగ సమావేశం ‘వందే మాతరం’ గీతాన్ని జాతీయ గీతంగా ఆమోదించింది.

వందేమాతర గీతానికి 150 ఏండ్లు కావస్తున్న సందర్భంగా 2025 నవంబర్ 7నుండి ఏడాది పాటు ‘ఒక మెలోడి ఒక చలనం’ పేరిట దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాలలు, కళాశాలలు, వివిధ చోట్ల విద్యార్థుల సమూహాలతో, జాతీయ చైతన్య ర్యాలీలు, ప్రదర్శనలు జరగనున్నాయి.

‘వందే మాతరం’ అన్నపదాలు మాతృభూమికి సలాం చేస్తూ.. భాష, ప్రాంతం, మతాన్ని దాటే ఒక వసుధైక భావనగా మారాయి. బంకించంద్ర ఛటర్జీ కలం నుంచి జాలువారిన వందేమాతర గీతం…స్వాతంత్య్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచింది.

స్వాతంత్రోద్యమ సమయంలో వందేమాతర గీతం మంత్రంగా పని చేసింది. దేశవ్యాప్తంగా మనం, మన దేశం, మన సార్వభౌమత్వం అనే ఉత్తేజాన్ని నింపింది. బ్రిటిష్‌ వారిని పారదోలేందుకు ఇది ఎంతగానో తోడ్పడింది. ప్రజలను ఏకం చేయడంలో వందేమాతర గీతం ఏక సూత్రంగా పని చేసింది. ఎక్కడిక్కడ వందేమాతరం గీతాలాపనతో ప్రజలు ఉద్యమంలో దుమికారు.

వందేమాతర గీతంలో భారతదేశ పురాతన సాంస్కృతిక మూలాలు ఈ గీతరచనకు ప్రేరణనిచ్చాయి. సర్వ మంగళ మాంగళ్యే శివే… అంటూ సాగే దేవీమాత స్తోత్రం వందేమాతరం గీతానికి ప్రేరణగా భావిస్తారు. అందుకే కొందరు దీనిని పాడడానికి ఇప్పటికీ ఇష్టపడరు. ఇది మనదేశ దౌరభాగ్యంగా చూడాలి. మతం ముసుగులో కొందరు దీనిని తృణీకరించినా అది ప్రజల నరనరాల్లో జీర్ణించుకుపోయిన ఉత్తేజిత గీతంగా నిలిచింది. భారతదేశ చరిత్రలో మహోద్యమాలకు కళలూ పాటలూ అంతరాత్మగా నిలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాటే పరవళ్లు తొక్కింది. జాతి భావోద్వేగాలను వెన్నుతట్టి స్వాతంత్య్ర కాంక్ష అనే సమిష్టి కార్యాచరణకు పురిగొల్పడంలో వందేమాతరం గీతం కీలకభూమిక పోషించింది. అందుకే భారత స్వాతంత్య్ర పోరాటంలో అత్యంత ప్రత్యేకమైనదిగా వందేమాతరం గీతం నిలిచింది.

స్వాతంత్య్ర ఉద్యమానికి జవజీవాలు అందించడమే కాదు, సాంస్కృతిక జాతీయవాదానికి బీజం వేసింది. భారతదేశమంటే మట్టి కాదనీ… కర్తవ్యం, అంకితభావాలతో పునీతమైన పుణ్యతీర్థమనీ ప్రబోధించింది. మహర్షి అరవిందుడు వర్ణించినట్లు బంకించంద్రుడు ఆధునిక భారత రుషి. ఆయన పదాలు జాతి ఆత్మను మళ్లీ మేల్కొలిపాయి. నిదురిస్తున్న జాతి తన ఆత్మబలాన్ని కూడగట్టుకుని, జాగృతం చేయడంలో వందేమాతరం గీతం ప్రముఖ భూమిక పోషించదనడంలో సందేహం లేదు.

బ్రిటిష్‌ పాలకుల ఇనుప ఉక్కు సంకెళ్ల కింద నలిగిపోతున్న తరుణంలో బంకించంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం జాతికి ప్రభాత గీతమైంది. మన సంస్కృతి, నాగరికతల పట్ల గర్వాభిమానాలను రేకెత్తించే గానమైంది. అణువణువునా మాతృభూమిపై భక్తి, అనురక్తి ఉట్టిపడేలా మేల్కొలిపే రణనినాద గీతమైంది. వందేమాతరం భాషా ప్రాంతీయ భేదాలకు అతీతంగా కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు జాతిని జాగృతం చేసింది. 1946లో తిరుగుబాటు చేసిన రాయల్‌ ఇండియన్‌ నేవీలోని భారతీయ నావికులు వందేమాతరం అని నినదిస్తూ బ్రిటిష్‌ యుద్ధనౌకలపై జాతీయ పతాకను ఆవిష్కరించారు.

ఇన్నేళ్లయినా వన్నె తగ్గకుండా మనజీవితాల్లో అది పెనవేసుకుపోయింది. భారతజాతిని కలసి ఉంచే గీతంగా నిలిచింది. స్వాతంత్య్ర ఉద్యమంలో వెలిగిన ఈ గీతాజ్యోతి ఇంకా జాజ్వలామానంగా వెలుగుతోంది. ఇప్పుడు ఏడాది ఉత్సవాల్లో భాగంగా వందేమాతరం పూర్తి రూపంలో ప్రతిధ్వనిస్తూ యువత మనసుల్లో సాంస్కృతిక జాతీయవాదాన్ని నింపుతుందనడంలో సందేహం లేదు. వందేమాతరం కేవలం గత వైభవ స్మరణం, సంస్మరణం కారాదు. మనజాతిని మేల్కొలిపే ఉజ్జ్వల భవిష్యత్తుకు ప్రేరణగానూ తీసుకోవాలి.
భారత ఆత్మను ఆవహించుకునే గీతం కావాలి. వందేమాతరం పారతంత్ర భారతదేశానికి తొలి మేల్కొలుపు. మొక్కవోని దీక్షను చాటిన స్వేచ్ఛా గీతమది. భారతదేశపు ఆత్మ నుంచి జనించిన ఈ గీతం అజరామజరంగా నిలుస్తుంది. తరతరాలకు ఉత్తేజమిస్తుంది. భారతీయత అనే కోణం నుంచి మన చరిత్ర, సంస్కృతి, విలువలు, సంప్రదాయాలను వీక్షించి… నిరంతరం స్ఫూర్తి పొంది… సదా కార్యాచరణలో నిమగ్నం కావాలని ప్రబోధించే దివ్య గానంగా వందేమాతరం నిరంతర స్మరణ కావాలి. వందేమాతర గీతం వరసను మారుస్తూ, గాడి తప్పిన పాలకులు దీన్ని ప్రేరణగా తీసుకుని భారత పునరుజ్జీవానికి అంకితం కావాలి. కేవలం గీతాలాపనతో సరిపుచ్చక భారత ఉజ్వల భవిష్యత్‌కు ప్రేరణగా తీసుకోవాలి. దేశం ముందు వందనం చేయడంతో పాటు, సంకల్ప సిద్ధి కోసం వందేమాతరం గీతాన్ని ఆలపించాలి. స్వదేశీ స్వయం సమృద్దికి నేటికీ, రేపటికి, ఎప్పటికీ వందేమాతరం ప్రేరణ మంత్రంగా నిలవాలని ఆశిద్దాం.

Latest News

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

జూన్ 11-గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి సాయంత్రం 06.03 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అశ్విని రాత్రి తెల్ల 03.02 వరకు ఉపరి భరణి యోగం శోభ రాత్రి 10.00 వరకు ఉపరి అతిగండ కరణం బవ ఉదయం...

శెట్టు కిందే ఊరు!|ADUGU TRENDS

ఎండా కాలమొస్తే మనమేం శేత్తానం? ప్యాన్లు, ప్రిజ్జీలు, కూలర్లు, ఏసీలను సిద్ధం చేసుకుంటానం. మండే కాలం వత్తాందనంగనే గవాటన్నింటినీ మరమ్మతులు చేసి పెట్టుకుంటానం. ఎండ మండుతనే ఉండె, కరెంటు కాల్తనే ఉండె. ఇగ...

ట్రంప్ కు బోస్టన్ తీర్పు దెబ్బ!|EDITORIAL

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వలస విధానాలపై, హెచ్-1బీ వీసాలపై విధించిన లక్ష డాలర్ల ఫీజును బోస్టన్ ఫెడరల్ కోర్టు చట్టవిరుద్ధమని ప్రకటించింది. ఆ తీర్పు భారతీయ వృత్తి నిపుణులకు తక్షణ ఊరటనిచ్చినా, అంతిమ...

జూన్ 10-బుధవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ దశమి రాత్రి 07.41 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రేవతి రాత్రి తెల్ల 04.00 వరకు ఉపరి అశ్విని యోగం సౌభాగ్య రాత్రి 12.20 వరకు ఉపరి శోభ కరణం వణజి ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News