Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

సర్… అనుమానాలెందుకు!?|EDITORIAL

సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్‌పోర్ట్ ఉంటున్నాయి. కానీ ఓటరు నమోదులో మాత్రం ఇంకా పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆధార్, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ఆధునిక విధానాలను సమగ్రంగా అనుసంధానం చేస్తే బోగస్ ఓట్ల సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు. సర్ ప్రక్రియపై అనుమానాలు, ఆరోపణలు సహజమే. ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయగలిగితే భారత ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా మారుతుంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారత ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను సవరించి, ఖచ్చితత్వాన్ని పెంచడానికి నిర్వహించే ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్-సర్). మరణించిన, శాశ్వతంగా మారిపోయిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లను తొలగించడం. అలాగే అర్హులైన కొత్త ఓటర్లను చేర్చడం ఈ ప్రక్రియ ప్రధాన లక్ష్యం. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికి వెళ్లి, 2002 లేదా పాత ఓటరు జాబితాతో ప్రస్తుతం ఉన్న 2025/2026 జాబితాను మ్యాపింగ్ చేస్తారు. ఓటర్లు తమ ఆధార్ మరియు ఇతర వివరాలతో బీఎల్ఓలకు సహకరించి, తమ వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవాలి. ఈ ప్రక్రియ తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా 2025-2026 కాలంలో కొనసాగుతోంది. ఈ ప్రక్రియ ప్రారంభం కాకముందే రాజకీయ పార్టీల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ మినహా, కాంగ్రెస్, బీఆర్ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలు తమ శ్రేణులను బూత్ స్థాయిలో అప్రమత్తం చేశాయి.

ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన రాజ్యాంగ హక్కు. అర్హత కలిగిన ప్రతి పౌరుడు ఓటరుగా నమోదు కావడం ఎంత ముఖ్యమో, ఓటరు జాబితాలు ఖచ్చితంగా ఉండటం కూడా అంతే అవసరం. అందుకే ఎన్నికల సంఘం కాలానుగుణంగా ఓటరు జాబితాలను సవరించే ప్రక్రియ చేపడుతూ వస్తోంది. ఇది కొత్తేమీ కాదు. 1951 నుంచి 2004 వరకు దేశవ్యాప్తంగా ఎనిమిది సార్లు ఇలాంటి ప్రత్యేక సవరణ కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 21 ఏళ్ళ తర్వాత మళ్లీ పెద్ద ఎత్తున ఈ ప్రక్రియను ఎన్నికల సంఘం ప్రారంభించింది. ఇప్పటికే పలు రాష్ట్రల్లో పూర్తి చేసింది. ప్రస్తుతం ఏపీ, తెలంగాణాల వంతు వచ్చింది.

కొన్ని రాష్ట్రాల్లో లక్షలాది పేర్లు ఓటరు జాబితాల నుంచి తొలగించబడుతున్నాయన్న ఆరోపణలు రావడంతో రాజకీయం ఉద్రిక్తమైంది. అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిస్తే అది ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అలాంటి చర్యలను వ్యతిరేకించాలి. అదే సమయంలో బోగస్ ఓట్లు, డబుల్ ఓట్లు, చనిపోయిన వారి పేర్లు జాబితాల్లో కొనసాగడం, ఒకటికి మించి రాష్ట్రాల్లో ఓట్లు కలిగి ఉండటం కూడా ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే అంశాలే. అందువల్ల ఓటరు జాబితాల ప్రక్షాళనను పూర్తిగా, గుడ్డిగా వ్యతిరేకించడం సమంజసం కాదు.
మన దేశంలో ఎన్నికల రాజకీయాలు ఓటర్ల జాబితాల చుట్టూనే తిరుగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం అనర్హులను ఓటర్లుగా చేర్చిన ఘటనలు ఉన్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో అక్రమ వలసదారులు కూడా ఓటర్లయ్యారు. పశ్చిమ బెంగాల్‌లో లక్షల సంఖ్యలో అనుమానాస్పద నమోదులను గుర్తించారు. వారిని తొలగించారు.

ఇంకా ఒక కీలక సమస్య డబుల్ ఓట్లు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు, తరువాత కూడా కొంతమంది రెండు రాష్ట్రాల్లో ఓటర్లుగా కొనసాగుతున్నారు. రెండు విడతల్లో ఎన్నికలు జరిగిన సందర్భాల్లో ఒకే వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసిన ఆరోపణలు కూడా వచ్చాయి. “ఒక వ్యక్తికి ఒకే ఓటు” అనే ప్రజాస్వామ్య సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయాలంటే ఇలాంటి నమోదులను తప్పనిసరిగా తొలగించాల్సిందే.
అయితే ఈ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్‌పోర్ట్ ఉంటున్నాయి. కానీ ఓటరు నమోదులో మాత్రం ఇంకా పాత పద్ధతులే కొనసాగుతున్నాయి. ఆధార్, మొబైల్ నంబర్, బయోమెట్రిక్ ధృవీకరణ వంటి ఆధునిక విధానాలను సమగ్రంగా అనుసంధానం చేస్తే బోగస్ ఓట్ల సమస్యను గణనీయంగా తగ్గించవచ్చు.

ఎన్నికల సంఘం ఓటర్లకు మరింత సౌకర్యవంతమైన వ్యవస్థను తీసుకురావాల్సిన అవసరం ఉంది. చిరునామా మారినప్పుడు ఆన్‌లైన్‌లో సులభంగా వివరాలు సవరించుకునే అవకాశం కల్పించాలి. ఓటరు జీవించి ఉన్నాడని డిజిటల్ ధృవీకరణ చేసే విధానం రావాలి. బ్యాంకు ఖాతాలు, పాన్ కార్డులు ఆధార్‌తో అనుసంధానం చేసినట్లే, ఓటరు కార్డును కూడా ఆధార్‌తో అనుసంధానం చేయడం ద్వారా డూప్లికేట్ నమోదులను అరికట్టవచ్చు.

భవిష్యత్తులో బయోమెట్రిక్ ఆధారిత ఓటింగ్ విధానం అమల్లోకి వస్తే ఎన్నికల పారదర్శకత మరింత బలోపేతం అవుతుంది. వేలిముద్ర లేదా ముఖ గుర్తింపు ద్వారా ఓటు నమోదు జరిగితే నకిలీ ఓట్లకు పూర్తిగా అడ్డుకట్ట పడే అవకాశం ఉంది. అప్పుడు తరచూ భారీ ఎత్తున ఓటరు జాబితా ప్రక్షాళన చేపట్టాల్సిన అవసరం కూడా తగ్గుతుంది.

ప్రస్తుతం రాజకీయ పార్టీల ప్రధాన బాధ్యత ప్రజల్లో అపోహలు సృష్టించడం కాదు, నివారించడం. అర్హులైన ఓటర్ల హక్కులను కాపాడుతూ, అనర్హులను తొలగించడంలో ఎన్నికల సంఘానికి సహకరించాలి. రాజకీయ పార్టీలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఓటరు జాబితాల సవరణ ఎన్నికల విశ్వసనీయతకు పునాది అనే విషయాన్ని గుర్తించాలి.

సర్ ప్రక్రియపై అనుమానాలు, ఆరోపణలు సహజమే. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం దానిని పూర్తిగా వ్యతిరేకించడం కంటే, పారదర్శకతను డిమాండ్ చేస్తూ నిర్మాణాత్మక సూచనలు ఇవ్వడం అవసరం. ఆధునిక సాంకేతికత, ఖచ్చితమైన నమోదు విధానం, ఒక వ్యక్తికి ఒకే ఓటు అనే సూత్రాన్ని కచ్చితంగా అమలు చేయగలిగితే భారత ప్రజాస్వామ్యం మరింత పటిష్టంగా మారుతుంది.

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News