Monday, May 4, 2026
38.2 C
Hyderabad

ఈవీలేవీ? ఈవీలపై క్లారిటీలేవీ?|EV|TELANGANA|CM|GOVERNMENT

మొన్న సీఎం|CM|REVANTH REDDY, నిన్న డిప్యూటీ సీఎం|DEPUTY CM|BHATTI VIKRAMARKA MALLU
ప్రకటనల సారాంశమేంటి?|SUMMARY
ప్రస్తుత వాహనాలనేం చేస్తారు?|OLD VEHICLES
కొత్తవి సరే, పాతవాటి పరిస్థితేంటి?
ఇప్పటికే తుప్పుపట్టిన వాహనాల సంగతేంటి?
ఇం‘ధన’ ఖర్చు తగ్గించడానికి వేల కోట్ల వ్యయమా?
ఉన్న నాలుకకు మందేస్తే కొండనాలుక ఊడినట్లేనా?
రాజకీయ ప్రకటనా? విధాన నిర్ణయమా?|POLITICAL|GOVERNMENT
ప్రకటనలకే పరిమితమా? ప్రణాళికలేమైనా ఉన్నాయా?
ఇది సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణేనా?
ఈ ఆర్థిక భారం యథాలాప వృథా ప్రయాసా?

అధికారులు ఎలక్ట్రిక్ వాహనాలనే వినియోగించాలని, దశల వారీగా అమలు చేస్తామని, మొన్నామధ్య ఒక శాఖ సమీక్షలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిన్న బడ్జెట్ సన్నాహక సమీక్షలో డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్క కూడా ఇదే ప్రకటన చేశారు. ప్రస్తుత పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ఏర్పడిన పెట్రో, డీజిల్ కొరత కారణంగా ఇం‘ధన’ వ్యయాన్ని తగ్గించుకోవడానికి, ఆదా చేయడానికి, పర్యావరణ హితానికి అనుగుణంగా వారీ ప్రకటన చేసి ఉంటారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామమే. అయితే, దశలవారీగా నైనా సరే, కొత్తగా ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలుకు ఖర్చు ఎంతవుతుంది? అన్ని ఈవీలు అందుబాటులో ఉన్నాయా? ఇప్పటికే సర్కారు వారి ఆయా కార్యాలయాల్లో తుప్పుపట్టి పోతున్న వాహనాలకే దిక్కులేదు. మరి, ప్రస్తుతం ఉన్న పాత వాహనాల పరిస్థితేంటి? ఉన్న నాలుకకు మందేస్తే, కొండనాలుక ఊడినట్లేనా? ఇది రాజకీయ ప్రకటనా? విధాన నిర్ణయమా? కేవలం ప్రకటనలకే పరిమితమా? నిజంగానే ప్రభుత్వం దగ్గర ప్రణాళికలేమైనా ఉన్నాయా? ఇదే నిజమైతే, ఈవీల కొనుగోలు సమర్థవంతమైన ఆర్థిక నిర్వహణేనా? ఈ ఆర్థిక భారం యథాలాప వ్రుథా ప్రయాస కానుందా? అసలు ప్రభుత్వ వాహనాలెన్ని? వాటిలోనూ అవుట్ సోర్సింగ్, హైరింగ్ వాహనాలెన్ని? ఆర్టీసీవెన్ని? ఈ మొత్తంలో అసలు ఈవీలపై క్లారిటీలేవీ? అనే అనేకానే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ప్రభుత్వ పెట్రో, డీజిల్ వాహనాలకు బదులు దశల వారీగా ఎలక్ట్రిక్ వాహనాలనే వాడాలని వేర్వేరుగా జరిగిన శాఖల సమీక్షల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ఇం‘ధన’ వ్యయం తగ్గింపు, పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నియంత్రణ అనే కోణంలో ఇది ముందుచూపుతో కూడిన నిర్ణయంగా కనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు కూడా ఇదే దిశగా అడుగులు వేస్తున్నాయి. సరే, ఈవీలతో ప్రభుత్వంపై పడే పెను భారం పెను సమస్యగా పరిణమించనుంది. ఈవీలపై ప్రభుత్వ దగ్గర స్పష్టమైన లెక్కలు, ప్రణాళికలేమైనా ఉన్నాయా? లేక ఇది మరో ఆకర్షణీయమైన అనాలోచిత ప్రభుత్వ నిర్ణయంగా మారుతుందా? ప్రకటనకే పరిమితమవుతుందా? అసలే ఆదాయ, ఆర్థిక లేమి, అప్పులు, అప్పులకు వడ్డీలు, సంక్షేమ పథకాలు, ఉచితాలు, ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీలు, ప్రభుత్వ, అధికారుల నిర్వహణా ఖర్చులు.. వీటన్నింటనీ చూస్తే, ఈ ప్రకటన ప్రభుత్వాన్ని మరింత అప్పుల్లోకి నెట్టే ఆనాలోచిత నిర్ణయంగానే మిగులుతుందన్న అనుమానాలు కలుగుతున్నాయి.

ప్రపంచం సహా, తెలంగాణలో వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ప్రతి రోజు వేల సంఖ్యలో కొత్త వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. ఫలితంగా పట్టణాల్లో వాయు కాలుష్యం పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రిక్ వాహనాలకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయింపులు ఇచ్చి వాటిని ప్రోత్సాహిస్తోంది.

రాష్ట్రంలో వాహనాలు
2025, ఆగస్టు నాటికి తెలంగాణలో మొత్తం వాహనాల సంఖ్య 1.77 కోట్లు. 15 ఏళ్ల పైన వయస్సు ఉన్న పాత వాహనాలు 41.86 లక్షలు.

రాష్ట్రంలో ప్రభుత్వ వాహనాలు ఎన్ని?
ప్రభుత్వం వాహనాలు, అవుట్సోర్సింగ్, హైర్ పద్ధతిలో ఉపయోగించే వాహనాలు. పోలీస్, రెవెన్యూ, ఆరోగ్య శాఖ, అటవీ, మున్సిపల్, విద్యుత్ వంటి శాఖలు, వాటి అనుబంధ విభాగాలు పెద్ద సంఖ్యలో వాహనాలను వినియోగిస్తున్నాయి. కానీ ప్రభుత్వం దగ్గర ఈ సమగ్ర లెక్కలు ఇప్పటికీ లేవు. అయితే అందుబాటులో ఉన్న సమాచారం మేరకు పోలీస్ శాఖలోనే పట్రోలింగ్, జీపులు, బైక్‌లు 10వేలకు పైగా ఉన్నాయి. ఆర్టీసీలో 9,400లకు పైగా బస్సులు ఉన్నాయి.3 వేల నుండి 4వేల వరకు హైర్ బస్సులు ఉన్నాయి. 300ల ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తుండగా, కొత్తగా వెయ్యికి పైగా ఈవీ బస్సులను ప్రవేశపెట్టే ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ శాఖ 6వేలకు పైగా వాహనాలను వినియోగిస్తోంది. రెవిన్యూ, ఆరోగ్య, పంచాయతీరాజ్, టూరిజం.. ఇలా అన్నిశాఖలు కలిపి అదనంగా మరో 40వేల నుంచి 50 వేల వాహనాలను వాడుతున్నాయి. సీఎం కాన్వాయ్, సిబ్బంది వగైరాలు వందకు పైగా వాహనాలను వినియోగిస్తున్నారు. మంత్రులు ఒక్కొక్కరు 5 నుంచి 10 వాహనాలు, వారి సిబ్బందీ ఎఎస్డీలు, పీఎస్ లు, కలిపి ఒక్కోశాఖలో మరో 10 వాహనాలు వాడుతున్నారు. ఇవీ గాక, సెక్రటేరియట్ అధికారులు 600 నుంచి వెయ్యి వాహనాలను వినియోగిస్తున్నారు. ఐఎఎస్ లు, వారి సిబ్బంది, కార్యదర్శులు, ఇతర అధికారులు కలిపి మరో వెయ్యి వాహనాలను వినియోగిస్తున్నారు. ఇక మంత్రులు, ఉన్నతాధికారుల మౌఖికంగా ఇచ్చే ఆదేశాలతో నడిచే వాహనాలతో ఇలా లెక్కలు వేస్తూ పోతే, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం వాహనాల్లో ఐదు పదివేలు తక్కువ సగం వాహనాలు ప్రత్యక్షంగానో లేక పరోక్షంగానో ప్రభుత్వానివే ఉన్నట్లుగా లెక్కలు తేలుస్తున్నాయి. ఇంత భారీ మొత్తంలో వాహనాలు వినియోగిస్తున్న ప్రభుత్వం అన్ని వాహనాలను దశల వారీగా ఏ మేరకు ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చగలదు?

వేల కోట్ల ప్రాజెక్టుగా..
సాధారణంగా ప్రభుత్వ విభాగాలు ఉపయోగించే ఒక ఎస్ యూవీ లేదా యుటిలిటీ వాహనం ధర రూ.10 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు ఉంటుంది. తమ జేబులోంచి పెట్టే డబ్బు కాకపోవడంతో అధికారులు సాధారణంగా హై ఎండ్ వాహనాలనే కొంటారు. సగటు ధరను ₹12 లక్షలుగా తీసుకుంటే, రాష్ట్రంలో కనీసం 50వేల ప్రభుత్వ వాహనాలు ఉన్నాయని అనుకుంటే వాటి మొత్తం విలువ సుమారు రూ. 6వేల కోట్లు అవుతుంది.

ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న ఒక మంచి ఎలక్ట్రిక్ కార్ ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. సగటు ధరను రూ.18 లక్షలుగా తీసుకుంటే, 50,000 వాహనాలకు రూ.9 వేలకోట్లు అవుతుంది.

నిర్వహణా ఖర్చులు అదనం
ఇది కేవలం వాహనాల కొనుగోలు ఖర్చు మాత్రమే. దీనికి తోడు చార్జింగ్ మౌలిక సదుపాయాలు, నిర్వహణ వ్యవస్థలు, బ్యాటరీ మార్పిడి ఖర్చులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రాలు, పోలీస్ స్టేషన్లు వంటి అనేక చోట్ల చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఈ ఖర్చులను కలిపితే మొత్తం ప్రాజెక్ట్ రూ.10వేల కోట్లయినా ఆశ్చర్యం లేదు.

పాత వాహనాల పరిస్థితేంటి?
ప్రస్తుతం ఉపయోగంలో ఉన్న పాత ప్రభుత్వ వాహనాల పరిస్థితి ఏమిటి? సాధారణంగా ప్రభుత్వ వాహనాల జీవితకాలం 10 నుంచి 15 సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత వాటిని ప్రభుత్వ వేలం ద్వారా విక్రయించడం లేదా స్క్రాప్ చేయడం జరుగుతుంది. కానీ వాస్తవ పరిస్థితుల్లో అనేక ప్రభుత్వ కార్యాలయాల్లో పాత వాహనాలు సంవత్సరాల తరబడి ఉపయోగించకుండా గ్యారేజీలలో నిల్వ ఉండటం కూడా సాధారణమే. తుప్పు పట్టిన అలాంటి వాహనాల స్క్రాప్ విలువ చలా తక్కువేననే సంగతి తెలిసిందే.

అధికారులు వాడే వాహనాలపై ఆడిట్ ఉందా?
ఈ నేపథ్యంలో ప్రభుత్వ వాహనాల ఎలక్ట్రిఫికేషన్ వంటి పెద్ద నిర్ణయాన్ని అమలు చేయాలంటే ముందుగా కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రజల ముందుంచాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో మొత్తం ప్రభుత్వ వాహనాలు ఎన్ని? శాఖల వారీగా ఎన్ని? వాటిలో ఎన్ని పాతవి? ఎన్ని కొత్తవి? వాటి వేలం ద్వారా వచ్చే ఆదాయం ఎంత? ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు దశల ప్రణాళిక ఏమిటి? ఇవన్నింటిలోనూ స్పష్టత అవసరం.

అంచనా, ప్రణాళిక ముఖ్యం
ప్రభుత్వం నిజంగా పర్యావరణ హిత విధానాన్ని అమలు చేయాలనుకుంటే పాత వాహనాల స్క్రాపింగ్ పాలసీ, కొత్త వాహనాల కొనుగోలు దశల ప్రణాళిక, మొత్తం ఖర్చు వివరాలను అంచనా వేయాలి. అలాగే ప్రభుత్వ వాహనాలు, అధికారులు వాడుతున్నవి, నియమనిబంధనలు, వాడే వారి అర్హతలు, వాటి వినియోగం ఆధారంగా సమీక్షించి, మదింపు చేయాలి. అలా చేస్తేనే ప్రభుత్వ నిర్ణయంపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుంది.

భవిష్యత్తులో ఎలక్ట్రిక్ వాహనాలే వినియోగించాలనే విషయంలో సందేహం లేదు. కానీ ప్రజల డబ్బుతో అమలు చేసే ప్రభుత్వ కార్యక్రమాలు ప్రకటనలతో కాకుండా లెక్కలు, పారదర్శకత, స్పష్టమైన ప్రణాళిక ఆధారంగా జరగాలి. లేకపోతే అది మరో ఖరీదైన ప్రభుత్వ ప్రయోగంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది.

Latest News

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 03 నుండి మే 10 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత...

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

02-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 10.45 వరకు ఉపరి విదియ నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి అనూరాధ యోగం వ్యతీపాత రాత్రి 08.24 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ...

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News