Monday, July 13, 2026
29.3 C
Hyderabad

BC|బీసీలకు DASARA|దసరా బోనాంజా!

42% RISERVATIONS|రిజర్వేషన్లకు జీవో!!
TELANGANA GOVERNMENT|తెలంగాణ ప్రభుత్వం చారిత్రక నిర్ణయం|HISTORICAL DECISION
CONGRESS|కాంగ్రెస్ కామారెడ్డి డిక్లరేషన్ కు మోక్షం!
కమిటీ నివేదికను ఆమోదించిన ప్రభుత్వం|GOVERNMENT
రానున్న LOCAL BODY ELECTIONS|స్థానిక సంస్థల ఎన్నికల్లో అమలు
జీవో నెం.9 జారీ.. త్వరలో నోటిఫికేషన్!?
కుల సర్వే ఆధారంగానే బీసీలకు రిజర్వేషన్లు
PRESIDENT|రాష్ట్రపతి, GOVERNOR|గవర్నర్ల వద్ద పెండింగ్ లో బిల్లులు
అయినా, జీవో జారీ చేసిన రేవంత్ సర్కార్!
42%లో బీసీ మహిళలకు సగం సబ్ కోటా
మొదటి దశలో జెడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ|ZPTC|MPP|MPTC
రెండో దశలో సర్పంచ్ పదవులకు ఎన్నికలు
నేడు సీఎస్, డీజీపీలతో ఎన్నికల సంఘం భేటీ

తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలుపుకుంది. మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా, కామారెడ్డి డిక్లరేషన్ కు అనుగుణంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించింది. కేబినెట్ ఆమోదించినప్పటికీ, శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ, బిల్లులు రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద పెండింగ్ లో ఉన్నప్పటికీ, వాటన్నింటినీ అదిగమించి జీవోను జారీ చేసింది. కుల సర్వే ఆధారంగా, ప్రత్యేక కమిటీ సిఫారసులకనుగుణంగా ప్రభుత్వం ఈ స్థానిక ఎన్నికల్లోనే బీసీలకు 42శాతం రిజర్వేషన్లను అమలు చేయడానికి పూనుకుంది. అందులో సగం బీసీ మహిళలకు కేటాయించాలని నిర్ణయించింది. ఈసీతో సీఎస్, డీజీపీలు సమావేశం కానున్నాయి. త్వరలోనే స్థానిక ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. అయితే, 50శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదన్న సుప్రీం కటాఫ్, కోర్టు కేసులు రిజర్వేషన్లకు కానున్నాయా?అన్న అనుమానాలు మాత్రం తొలిగిపోలేదు.

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 26 (అడుగు న్యూస్):
బీసీలు ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న 42శాతం రిజర్వేషన్లకు జీవో 9 జారీ అయింది. కాంగ్రెస్ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కు మోక్షం లభించింది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం బీసీలకు దసరా బోనాంజను ప్రకటించింది. రాష్ట్రపతి, గవర్నర్ల వద్ద బిల్లులు పెండింగులో ఉన్నప్పటికీ వాటికతీతంగా జీవోనిచ్చింది. చారిత్రాత్మకం నిర్ణయం తీసుకుంది. ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లను ముమ్మరం చేస్తోంది. ఈసీతో సీఎస్, డీజీపీలు సమావేశం కానున్నారు. త్వరలోనే నోటిఫికేషన్ విడుదలకు సర్కార్, సర్వం సన్నద్ధం చేసింది. ఇక షెడ్యూల్ విడుదలే తరువాయిగా మిగిలింది.
తెలంగాణలో పల్లె, పట్టణ, స్థానిక సంస్థల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జి.ఓ నెం.9ను శుక్రవారం విడుదల చేసింది. ఈ రిజర్వేషన్ల ఆధారంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. శనివారం ఉదయం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, ఉన్నతాధికారులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్‌, భద్రతా ఏర్పాట్లపై చర్చించనున్నారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో బుసాని వెంకటేశ్వరరావు కమిటీ సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సమగ్ర సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ సర్వే ఆధారంగా 42% రిజర్వేషన్లు నిర్ణయించబడ్డాయి. ఆర్టికల్స్‌ 40, 243%ణ, 243ు%తో పాటు డైరెక్టివ్‌ ప్రిన్సిపిల్స్‌ ప్రకారం ఈ రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో స్పష్టం చేసింది. ఇప్పటికే కేబినెట్ లో, అసెంబ్లీలో ఈ బిల్లు ఏక్రగీవ ఆమోదం పొందింది. చట్టం ప్రకారం అమలులోకి రాబోయే ఈ రిజర్వేషన్లతో తెలంగాణ దేశంలోనే తొలిసారి బీసీలకు పల్లె, పట్టణ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్‌ కల్పించిన రాష్ట్రంగా నిలిచింది. ఈ నిర్ణయంతో బీసీల రాజకీయ ప్రాతినిధ్యం గణనీయంగా పెరగనుంది. రాబోయే ఎన్నికల్లో స్థానిక సంస్థల్లో బీసీ వర్గాల ప్రాధాన్యం మరింత బలపడనుంది. అధికారంలోకి వస్తే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఈ మేరకు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ను ప్రకటించింది. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, మార్చి 18, 2025న %దీజ% కోటాను 42%కు పెంచే బిల్లులు ఆమోదించారు. ఆగస్టు 31న మరో రెండు బిల్లులు ఆమోదించి, %ూజ, ూు, దీజ%లకు 50% మించి రిజర్వేషన్లు అమలు చేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ బిల్లులు గవర్నర్‌, రాష్ట్రపతి ఆమోదానికి పంపారు. కానీ అవి పెండింగ్‌ లోనే ఉన్నాయి. డెడికేటెడ్‌ %దీజ% కమిషన్‌ నివేదిక, కుల సర్వే ఆధారంగా 42% %దీజ% కోటా నిర్ణయించారు. ఈ కోటాలో మహిళలకు 50% సబ్‌-కోటా కూడా ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం జిల్లా కలెక్టర్లు రిజర్వేషన్‌ మ్యాట్రిక్స్‌ను సీల్డ్‌ కవర్లలో పంచాయతీ రాజ్‌ శాఖకు సమర్పించారు. ఈ మ్యాట్రిక్స్‌ ప్రకారం, గ్రామ పంచాయతీలు, మండల ప్రజా పరిషత్తులు , జిల్లా పరిషత్తులలో కోటాలు నిర్ణయిస్తారు.
కాగా, జీవో విడుదలైనందున వెంటనే రాష్ట్ర ఎన్నికల కమిషన్ పంచాయతీ రాజ్‌ విభాగం కు సిఫార్సు చేస్తుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటిస్తుంది. ఎన్నికలు దశలవారీగా జరుగుతాయి. మొదటి దశలో 31 జిల్లా పరిషత్తులు చైర్మన్‌లు, 566 జెడ్పీటీసీలు లు, 566 ఎంపీపీ ప్రెసిడెంట్లు, 5,773 ఎంపిటీసీల స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. రెండో దశలో 13వేల గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి.

అయితే ఈ జీవో చెల్లుబాటుపై సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. సెప్టెంబర్‌ 24న తెలంగాణ హైకోర్టు, 42% బీసీ కోటాపై పిటిషన్‌ను తిరస్కరించింది. ‘‘జీవో జారీ కాలేదు, తొందరపడి పిటిషన్‌ వేశారు’’ అని న్యాయస్థానం వ్యాఖ్యానించింది. ఇప్పుడు జీవో జారీ అయినందుకు సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని కోర్టులో పిటిషన్లు దాఖలయ్యే అవకాశం ఉంది.

ఎన్నికల నిర్వహణకు ఎదురయ్యే ఆటంకాలను ప్రభుత్వం ఎలా అదిగమిస్తుంది? కోర్టుల్లో వేసే దావాలకు ఏ విధంగా స్పందిస్తుంది? ఏ రకమైన వ్యూహాలున్నాయి? లేక మేమైతే జీవో ఇచ్చాం? అడ్డకున్నది మాత్రం మేం కాదన్న రీతిలో వ్యవహరిస్తుందా? అలాగైతే ఫైనల్ గా రిజర్వేషన్లు అమలవుతాయా? అన్న అనుమానాలు బీసీల్లో వెల్లువెత్తుతున్నాయి. వీటికి సమాధానం మరికొద్ది రోజుల్లోనే రావచ్చు.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News