Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

రూపాయి పతనం – ఆర్థిక సంక్షోభం!?|EDITORIAL

ఇటీవల కాలంలో భారత రూపాయి విలువ పతనం ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకూ రూపాయి బలహీనపడటం సామాన్య ప్రజల నుంచి ఆర్థిక నిపుణుల వరకూ చర్చనీయాంశంగా మారింది. దిగుమతులు అధికమవడం, ఎగుమతులు తగ్గిపోవడం, వాణిజ్య లోటు పెరగడం వంటి అంతర్గత కారణాలతో పాటు, అంతర్జాతీయ రాజకీయ, ఆర్థిక పరిణామాలు కూడా రూపాయి పతనానికి దోహదమవుతున్నాయి.

గత పదేళ్ళల్లో రూపాయి విలువ దాదాపు వంద శాతం తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఒకప్పుడు డాలర్‌కు రూ.45 నుంచి రూ.50ల మధ్య ఉన్న మారకం రేటు ఇప్పుడు రూ.91లకు చేరడం ఆర్థిక పరంగా ఆందోళనకరమే. అయినప్పటికీ ప్రభుత్వం, అధికార, ఆర్థిక వర్గాల మౌనం అనుమానాలకు తావిస్తోంది. రూపాయి పతనాన్ని మనం తేలిగ్గా తీసుకోవాలా? లేక ఇది రాబోయే ఆర్థిక సంక్షోభం వంటి సమస్యలకు సంకేతమా?

ఇటీవల ఫారెక్స్ మార్కెట్లో రూపాయి ఆల్‌టైమ్ కనిష్ఠాలను నమోదు చేసింది. కేవలం పది ట్రేడింగ్ సెషన్లలోనే డాలర్ మారకంలో రూపాయి విలువ 90 నుంచి 91కి పడిపోవడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఐదు సెషన్లలోనే ఒక శాతం మేరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా డాలర్ బలహీనత లేదా క్రూడాయిల్ ధరల తగ్గుదల రూపాయికి కొంత ఊరటనిచ్చే అంశాలే. కానీ ఈసారి బ్రెంట్ క్రూడాయిల్ ధరలు తగ్గినా, రూపాయి పతనం ఆగకపోవడం ఆర్థిక నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
అమెరికాతో వాణిజ్య ఒప్పందం విషయంలో నెలకొన్న అనిశ్చితి కూడా రూపాయి పతనానికి ఒక ప్రధాన కారణంగా మారింది. భారత్ ప్రతిపాదనలను అమెరికా అంగీకరించలేదన్న వార్తలు మార్కెట్ సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. ఒప్పందాలు నిలిచిపోయే అవకాశాలు ఉన్నాయన్న భయాలు విదేశీ పెట్టుబడిదారుల్లో ఆందోళనను పెంచాయి. ఇదే సమయంలో రూపాయి పతనాన్ని అడ్డుకునేందుకు ఆర్‌బీఐ ప్రత్యక్ష జోక్యం లేకపోవడంతో విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్లు తమ నిధులను ఉపసంహరించుకోవడం పరిస్థితిని మరింత దారుణంగా, కఠినంగా మార్చింది.

అయితే, ఈ పరిస్థితిపై భిన్నాభిప్రాయాలు కూడా ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్ చీఫ్ ఎకనామిస్ట్ నీలకంఠ్ మిశ్రా వంటి ఆర్థికవేత్తలు రూపాయి మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నప్పటికీ భయపడాల్సిన అవసరం లేదంటున్నారు. భారత్ వద్ద 68 వేల 500 కోట్ల నుంచి 69వేల కోట్ల డాలర్ల మేర భారీ విదేశీ మారకపు నిల్వలు ఉండటం దేశ ఆర్థిక బలం అని వారు పేర్కొంటున్నారు. ఈ నిల్వలు ఉండటం వల్ల తాత్కాలిక ఒడిదుడుకులను తట్టుకునే సామర్థ్యం భారత్‌కు ఉందన్నది వారి వాదన.
భారత ప్రభుత్వం కూడా రూపాయి పతనానికి ప్రధాన కారణంగా వాణిజ్య లోటునే చూపుతోంది. రాజ్యసభలో ఈ అంశంపై ప్రశ్నలు లేవనెత్తగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదురి, ‘రూపాయి విలువను మార్కెట్ నిర్ణయిస్తుందని, ప్రభుత్వం ఎలాంటి లక్ష్యాన్ని నిర్దేశించలేదని’ స్పష్టం చేశారు. రూపాయి బలహీనత వల్ల ఎగుమతులు మరింత పోటీగా పెరుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. అదే సమయంలో దిగుమతుల వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం సామాన్యులను ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉందన్న వాస్తవాన్ని కూడా విస్మరించలేం.

ఇదిలా ఉండగా, ప్రపంచ వ్యాప్తంగా డాలర్ ఆధిపత్యంపై చర్చ తీవ్రమవుతోంది. అమెరికా తనకు అనుకూలంగా లేని దేశాలపై డాలర్‌ను ఆయుధంగా ఉపయోగిస్తూ ఆర్థిక ఆంక్షలు విధిస్తోంది. రష్యా, ఇరాన్, వెనెజువెలా వంటి దేశాలపై విధించిన ఆంక్షలు దీనికి ఉదాహరణ. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇతర దేశాలు డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకునే మార్గాలను అన్వేషిస్తున్నాయి. రష్యా ఇప్పటికే చైనా, భారత్ తదితర దేశాలతో స్థానిక కరెన్సీల్లో వాణిజ్యం చేస్తోంది.

భారత్ కూడా ఈ దిశగా ఇప్పటికే 30 దేశాలతో రూపాయిలో లావాదేవీల కోసం ప్రత్యేక ఖాతాలు తెరిచింది. సింగపూర్, యుఏఈ, నేపాల్, భూటాన్ వంటి దేశాల్లో యూపీఐ చెల్లింపులు విస్తరిస్తున్నాయి. అయితే రష్యాతో వాణిజ్యంలో దిగుమతులే అధికంగా ఉండటంతో రూపాయలు అక్కడి బ్యాంకుల్లో నిలిచిపోతున్నాయి. వాటిని భారత్‌లో పెట్టుబడులుగా మలిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
అయితే ఒక్కసారిగా డాలర్‌కు దూరమైతే, చమురు వంటి కీలక దిగుమతుల ధరలతోపాటు ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉంది. అందుకే డాలర్ ఆధిపత్యాన్ని క్రమంగా తగ్గించుకోవడమే వాస్తవిక మార్గం. ప్రస్తుతం ప్రపంచ లావాదేవీల్లో సుమారు 47శాతం డాలర్ ద్వారానే జరుగుతున్నాయి. కాబట్టి మరికొంతకాలం డాలర్ ఆధిపత్యం కొనసాగడం అనివార్యం.

ఈ పరిస్థితుల్లో భారత్ బలమైన ఎగుమతి వ్యూహం, వాణిజ్య లోటు నియంత్రణ, దేశీయ ఉత్పత్తి పెంపు వంటి అంశాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. రూపాయిని ముందుగానే బలోపేతం చేసుకుంటేనే, భవిష్యత్ ఆర్థిక సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలం.

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News