Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

బనకచర్ల మరో కాళేశ్వరం కాకూడదు!|EDITORIAL

 

BANAKACHARLA| బనకచర్ల బనికి వచ్చే PROJECT| ప్రాజెక్టా? లేక బనికిరాని ప్రాజెక్టా? లేక కాళేశ్వరం తరహాలోనే సర్కారు ఖజానా ఖాళీ చేసి, నేతలు, కాంట్రాక్టర్ల జేబులు నింపే కుంపటా? కూలేశ్వరం కాదు కదా? పెండింగ్ ప్రాజెక్టులుండగా కొత్తగా. POLAVARAM| పోలవరం ఇంకా పూర్తి కాకుండానే, మరో ప్రాజెక్టును చేపట్టడం అవసరమా? అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి బనకచర్ల పెను భారం కాదా? అంతకంటే ముందు కేంద్రంతో పేచీ, పక్క రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో లొల్లి. ఇదంతా అవసరమా? పోనీ, ఈ ప్రాజెక్టుతో మొత్తం ఏపీకి ఒరిగేదేంటి? పారే నీరెంత? పండే ఎకరాలెన్ని? అయ్యే ఖర్చు ఎంత? ఓట్లేసి, గెలిపించి, జనరంజకంగా పరిపాలించండిరా బాబూ! అంటే ఈ పంచాయితీలేంటి? ఈ బీరాలు దేనికి? బేరాలు దేనికి?

ఆంధ్రకు వరం పోలవరం అంటూ హంగామా చేసిన నేతలే నేడు బనకచర్ల గురించి హడావుడి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కూడా కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల జేబులు నింపేది కాకూడదన్నదే సకలజనుల అభిప్రాయం. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించి తద్వారా రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇవ్వడం లక్ష్యమని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నుండి ప్రతి ఏటా వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిలో పదో వంతు కనీసం 200 టీఎంసీల నీటిని మళ్లిస్తే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెరుగుతుందంటూ నేతలు ఊదరగొడుతున్నారు. ఇందుకోసం రూ.80,112 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి, జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి 48 వేల ఎకరాల భూమిని సేకరించడం, 27 కిలో మీటర్ల సొరంగం తవ్వడం, రూ.80 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు. కింది నుండి పైకి నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. ఇందుకు ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు చేయాలి. నిపుణుల అంచనా ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రూ.50 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చును ఎవరు భరించాలి? కాళేశ్వరంలో ఇదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేస్తే, విద్యుత్‌ వినియోగం తడిసి మోపెడు అవుతుంది. కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని విస్మరించి బాబు బనకచర్ల అనగానే కేంద్రం తలూపడం సరికాదు.

కాళేశ్వరం గత తప్పిదాలను పక్కన పెట్టి బనకచర్లపై ఏదో కొంపలు అంటుకున్నట్లుగా బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. ఒక్కసారిగా ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నా యని, వాటికి ప్రమాదం పొంచివుందని నానా యాగీ చేస్తున్నారు. పదేళ్లలో లేని ప్రమాదం ఏడాదిన్నరలో ఎలా వచ్చిందో ఆ నేతలే చెప్పాలి. అదే పనిగా చెబితే అబద్దాలు నిజాలై పోవు. కాళేశ్వంరపై ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఈ హంగామా చేస్తోంది. తెలంగాణ ఆగమై పోయిందన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌ నేతలు చేసే ఆరోపణలు నిజమైతే అందుకు ముందుగా వారే బాధ్యత వహించాలి.

చంద్రబాబు కూడా పోలవరం పూర్తి కాకుండానే ఇప్పుడు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు లోటు బడ్జెట్‌లో దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ తోపాటు ఇతర హావిూలు అమలు చేయడానికి ఖజానా ఖాళీ అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్ల భారీ ఖర్చుతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాననడం అనుమానాలకు తావిస్తోంది. అఖిలపక్ష సమావేశం వేసి, నీటిపారుదలరంగ నిపుణుల అభిప్రాయాలను, సూచనలను తీసుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఆ తరవాతే దీనిపై ముందుకు సాగాలి. ముందు పోలవరం సజావుగా పూర్తి కావాలి. పోలవరం బాధితులు ఇప్పటికే రోడ్డున పడ్డారు. వారిని ఆదుకునే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. భూములు, ఇళ్లు కోల్పోయిన గిగిరిజనులు గౌరవంగా బతికేలా చేయాలి. అమరావతికి భూమలు ఇచ్చిన రైతులు కూడా దర్జాగా బతకగలగాలి. ఈ ప్రాజెక్టు గేమ్‌ చేంజర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు, హైబ్రిడ్‌ యాన్యూటీ (హమ్‌) స్కీమ్‌ అని చెబుతున్నారు. ప్రాజెక్టులు కట్టి, నీటిపారుదల అభివృద్ధి చేస్తే ఎవరికి అభ్యంతరం వుండదు. కానీ గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాలో అలా జరగలేదు. ఉమ్మడి ఎపిలో కూడా చంద్రబాబు అమరావతి, పోలవరం సహా పలు ప్రాజెక్టులు చేపట్టినా పూర్తిచేయలేక పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అనేక సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. అవేవీ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడలేదు. కానీ కాంట్రాక్టర్లకు, అధికార పార్టీల నాయకులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. అందుకు పోలవరమే సాక్ష్యం.

అయితే, కేంద్ర అధికారులు ఆదిలోనే అడ్డువేసినట్లు వార్తలు వస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్రమంత్రి పాటిల్‌ ప్రకటించారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలు మోడీ మన్ననలు పొందుతాయేమోకానీ ప్రజల వ్యతిరేకతను పెంచడం కూడా ఖాయం. సత్వరం పోలవరం పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకోవాలి. అలా చేయకుండా బనకచర్ల జపం చేయడం సరికాదు. కేంద్రం తనకు అనుకూలంగా ఉందని చంద్రబాబు అతి విశ్వాసానికి పోతే ప్రజల నుంచి భంగపాటు తప్పదు.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News