Monday, July 13, 2026
34 C
Hyderabad

బనకచర్ల మరో కాళేశ్వరం కాకూడదు!|EDITORIAL

 

BANAKACHARLA| బనకచర్ల బనికి వచ్చే PROJECT| ప్రాజెక్టా? లేక బనికిరాని ప్రాజెక్టా? లేక కాళేశ్వరం తరహాలోనే సర్కారు ఖజానా ఖాళీ చేసి, నేతలు, కాంట్రాక్టర్ల జేబులు నింపే కుంపటా? కూలేశ్వరం కాదు కదా? పెండింగ్ ప్రాజెక్టులుండగా కొత్తగా. POLAVARAM| పోలవరం ఇంకా పూర్తి కాకుండానే, మరో ప్రాజెక్టును చేపట్టడం అవసరమా? అసలే అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి బనకచర్ల పెను భారం కాదా? అంతకంటే ముందు కేంద్రంతో పేచీ, పక్క రాష్ట్రంగా ఉన్న తెలంగాణతో లొల్లి. ఇదంతా అవసరమా? పోనీ, ఈ ప్రాజెక్టుతో మొత్తం ఏపీకి ఒరిగేదేంటి? పారే నీరెంత? పండే ఎకరాలెన్ని? అయ్యే ఖర్చు ఎంత? ఓట్లేసి, గెలిపించి, జనరంజకంగా పరిపాలించండిరా బాబూ! అంటే ఈ పంచాయితీలేంటి? ఈ బీరాలు దేనికి? బేరాలు దేనికి?

ఆంధ్రకు వరం పోలవరం అంటూ హంగామా చేసిన నేతలే నేడు బనకచర్ల గురించి హడావుడి చేస్తున్నారు. ఈ ప్రాజెక్టు కూడా కాంట్రాక్టర్ల, రాజకీయ నాయకుల జేబులు నింపేది కాకూడదన్నదే సకలజనుల అభిప్రాయం. గోదావరి వరద నీటిని రాయలసీమలోని పెన్నా బేసిన్‌కు మళ్లించి తద్వారా రాయలసీమ, ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు ఇవ్వడం లక్ష్యమని టీడీపీ కూటమి ప్రభుత్వం చెబుతోంది. గోదావరి నుండి ప్రతి ఏటా వృథాగా సముద్రంలో కలిసిపోయే నీటిలో పదో వంతు కనీసం 200 టీఎంసీల నీటిని మళ్లిస్తే రాష్ట్ర అభివృద్ధి పరుగులు పెరుగుతుందంటూ నేతలు ఊదరగొడుతున్నారు. ఇందుకోసం రూ.80,112 కోట్లు ఖర్చు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేసి, జలహారతి కార్పొరేషన్‌ ఏర్పాటుకు రాష్ట్ర కేబినెట్‌ అంగీకరించింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం చేయాలని ప్రధానమంత్రిని, కేంద్ర ఆర్థికమంత్రిని ముఖ్యమంత్రి కోరారు. రాష్ట్ర ఉన్నతస్థాయి అధికారులు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఆర్థిక శాఖ, జలశక్తి శాఖ అధికారులకు పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరు ఇవ్వడానికి 48 వేల ఎకరాల భూమిని సేకరించడం, 27 కిలో మీటర్ల సొరంగం తవ్వడం, రూ.80 వేల కోట్లు పైగా ఖర్చు పెట్టడం సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

బనకచర్ల ప్రాజెక్టు ఎత్తిపోతల ప్రాజెక్టు. కింది నుండి పైకి నీటిని ఎత్తిపోయడానికి 4,125 మెగావాట్ల విద్యుత్‌ అవసరం అవుతుంది. ఇందుకు ప్రతి సంవత్సరం భారీగా ఖర్చు చేయాలి. నిపుణుల అంచనా ప్రకారం కొత్తగా సాగులోకి వచ్చే మూడు లక్షల ఎకరాల ఆయకట్టుకు ప్రతి సంవత్సరం ఒక ఎకరానికి రూ.50 వేలు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చును ఎవరు భరించాలి? కాళేశ్వరంలో ఇదే జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు పని చేస్తే, విద్యుత్‌ వినియోగం తడిసి మోపెడు అవుతుంది. కళ్లముందు కనిపిస్తున్న సత్యాన్ని విస్మరించి బాబు బనకచర్ల అనగానే కేంద్రం తలూపడం సరికాదు.

కాళేశ్వరం గత తప్పిదాలను పక్కన పెట్టి బనకచర్లపై ఏదో కొంపలు అంటుకున్నట్లుగా బీఆర్ఎస్ గగ్గోలు పెడుతోంది. ఒక్కసారిగా ప్రాజెక్టులన్నీ దెబ్బతిన్నా యని, వాటికి ప్రమాదం పొంచివుందని నానా యాగీ చేస్తున్నారు. పదేళ్లలో లేని ప్రమాదం ఏడాదిన్నరలో ఎలా వచ్చిందో ఆ నేతలే చెప్పాలి. అదే పనిగా చెబితే అబద్దాలు నిజాలై పోవు. కాళేశ్వంరపై ప్రజల దృష్టిని మళ్లించే ఎత్తుగడలో భాగంగా బీఆర్‌ఎస్‌ ఈ హంగామా చేస్తోంది. తెలంగాణ ఆగమై పోయిందన్న రీతిలో మాట్లాడుతున్నారు. ఒకవేళ బీఆర్‌ఎస్‌ నేతలు చేసే ఆరోపణలు నిజమైతే అందుకు ముందుగా వారే బాధ్యత వహించాలి.

చంద్రబాబు కూడా పోలవరం పూర్తి కాకుండానే ఇప్పుడు బనకచర్ల గురించి మాట్లాడుతున్నారు. అసలు లోటు బడ్జెట్‌లో దీనికి డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారో చెప్పడం లేదు. ఎన్నికల్లో ఇచ్చిన సూపర్‌ సిక్స్‌ తోపాటు ఇతర హావిూలు అమలు చేయడానికి ఖజానా ఖాళీ అని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం రూ.80 వేల కోట్ల భారీ ఖర్చుతో బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేస్తాననడం అనుమానాలకు తావిస్తోంది. అఖిలపక్ష సమావేశం వేసి, నీటిపారుదలరంగ నిపుణుల అభిప్రాయాలను, సూచనలను తీసుకోవడం ప్రభుత్వ కనీస బాధ్యత. ఆ తరవాతే దీనిపై ముందుకు సాగాలి. ముందు పోలవరం సజావుగా పూర్తి కావాలి. పోలవరం బాధితులు ఇప్పటికే రోడ్డున పడ్డారు. వారిని ఆదుకునే ప్రయత్నాలు ముందుకు సాగడం లేదు. భూములు, ఇళ్లు కోల్పోయిన గిగిరిజనులు గౌరవంగా బతికేలా చేయాలి. అమరావతికి భూమలు ఇచ్చిన రైతులు కూడా దర్జాగా బతకగలగాలి. ఈ ప్రాజెక్టు గేమ్‌ చేంజర్‌, సెల్ఫ్‌ ఫైనాన్స్‌ ప్రాజెక్టు, హైబ్రిడ్‌ యాన్యూటీ (హమ్‌) స్కీమ్‌ అని చెబుతున్నారు. ప్రాజెక్టులు కట్టి, నీటిపారుదల అభివృద్ధి చేస్తే ఎవరికి అభ్యంతరం వుండదు. కానీ గత ఐదేళ్ల చంద్రబాబు ప్రభుత్వ హయాలో అలా జరగలేదు. ఉమ్మడి ఎపిలో కూడా చంద్రబాబు అమరావతి, పోలవరం సహా పలు ప్రాజెక్టులు చేపట్టినా పూర్తిచేయలేక పోయారు. ఆంధ్రప్రదేశ్‌లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన అనేక సాగునీటి ప్రాజెక్టులు కూడా పూర్తి కాలేదు. అవేవీ వ్యవసాయాభివృద్ధికి తోడ్పడలేదు. కానీ కాంట్రాక్టర్లకు, అధికార పార్టీల నాయకులకు ప్రధాన ఆదాయ వనరులుగా మారాయి. అందుకు పోలవరమే సాక్ష్యం.

అయితే, కేంద్ర అధికారులు ఆదిలోనే అడ్డువేసినట్లు వార్తలు వస్తున్నాయి. బనకచర్ల ప్రాజెక్టుకు తెలంగాణ అభ్యంతరాల నేపథ్యంలో ఇరు రాష్ట్రాలతో సమావేశం ఏర్పాటు చేస్తానని కేంద్రమంత్రి పాటిల్‌ ప్రకటించారు. కార్పొరేట్‌ అనుకూల విధానాలు మోడీ మన్ననలు పొందుతాయేమోకానీ ప్రజల వ్యతిరేకతను పెంచడం కూడా ఖాయం. సత్వరం పోలవరం పూర్తి చేసి నిర్వాసితులను ఆదుకోవాలి. అలా చేయకుండా బనకచర్ల జపం చేయడం సరికాదు. కేంద్రం తనకు అనుకూలంగా ఉందని చంద్రబాబు అతి విశ్వాసానికి పోతే ప్రజల నుంచి భంగపాటు తప్పదు.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News