Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

భారత్ దౌత్య విజయంగా షాంఘై సదస్సు!|EDITORIAL

షాంఘై సదస్సు ఫలితాల ప్రభావం ఎలా ఉన్నా, అది జరిగిన తీరుతెన్నులు మాత్రం ఇండియా ఆశించినట్లుగానే కనిపిస్తున్నాయి. ప్రధానంగా పాక్‌ ప్రధాని షహబాజ్‌ షరీఫ్‌కు కొంత అవమానకర పరిస్థితి ఉదురైంది. అలాగే ట్రంప్‌కు కళ్ళు కుట్టేలా, దిమ్మతిరిగేలా ప్రధాని మోదీ, జిన్‌పింగ్‌, పుతిన్‌లతో కలివిడిగా కనిపించారు. నిజానికి భారత్‌, చైనాల మధ్య సంబంధాలు పెద్దగా సఖ్యతగా లేవు. ఇదే సమయంలో జరిగిన షాంఘై సదస్సు చైనా భారత్ సంబంధాలు మెరుగు పడేలా, ట్రంప్‌కు చెక్‌ పెట్టేలా, పుతిన్ తో మరింతగా స్నేహం పెరిగేలా జరిగాయి. సుంకాలతో రెచ్చిపోతున్న ట్రంప్‌కు ఇది మింగుడు పడని వ్యవహారమే. ఇదిలావుంటే అమెరికాలో ట్రంప్‌ వ్యతిరేక వర్గం కూడా ఈ సదస్సు తమ దేశానికి తీవ్ర నష్టం కలిగించేదిగా జరిగిందని భావిస్తోంది. ఇదే అదనుగా కొందరు అప్పుడే విమర్శలు గుప్పిస్తున్నారు. ట్రంప్‌ భారీ సుంకాల మోతల దశలో చైనా వేదికగా సాగిన షాంఘై భేటీ అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. అమెరికాకు హెచ్చరికగా నిలిచింది.
పాకిస్థాన్‌ ప్రధాని షహబాజ్‌ సమక్షంలోనే షాంఘై సదస్సు వేదికపై భారత్ కు అత్యంత కీలకమైన దౌత్య విజయం దక్కింది. కశ్మీర్‌లో జరిగిన పహల్గామ్‌ ఉగ్రదాడిని ఖండిస్తూ షాంఘై సహకార శిఖరాగ్ర సదస్సు సంయుక్త తీర్మానంలో స్పందన వెలువడింది. ఇతర అంతర్జాతీయ అంశాలతో పాటు ఈ ఉగ్రదాడిని ప్రస్తావించిన షాంఘై సదస్సు మన దేశానికి పూర్తి సంఫీుభావం, సంపూర్ణ సహకారం ఉంటుందని ప్రకటించింది. రెండు నెలల క్రితం క్వింగ్డావో షాంఘై సదస్సులో తమ పట్టు నెగ్గకపోవడంతో వాకౌట్‌కు దిగిన భారత్‌, ఇప్పుడు తన పంతం నెగ్గించుకుంది.
ఏప్రిల్‌ 22న పహల్గామ్‌ ఉగ్రదాడిని సభ్యదేశాలన్ని ఖండిస్తున్నాయని తీర్మానంలో పేర్కొన్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రదాడులకు ప్రేరకులు, పాత్రధారులు, సూత్రధారులు ఎవరైనా, ఎంతటివారైనా తగిన శిక్షలకు, విచారణకు అర్హులని తేల్చారు. ఉగ్రవాదం వేర్పాటువాదం, తీవ్రవాదం పట్ల ఎటువంటి ఉపేక్ష తగదు. ఏ దేశమైనా ఉగ్రవాద స్థావరాలకు వేదికలు కారాదు. ఎక్కడ ఆ ప్రయత్నాలు తలెత్తినా, అలాంటి చర్యలను ఆయా దేశాల ప్రభుత్వాలు మొగ్గలోనే తుంచాలని ప్రకటించారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న దేశాలను కూడా ఉగ్రవాద దేశాలుగా ప్రకటించాలన్న భారత్‌ వాదనకు షాంఘై సదస్సు మద్దతు పలికింది. ఉగ్రవాదం ఏ రూపంలో, ఏ కోణంలో ఉన్నా, అది గర్హనీయం అవుతుంది. ఉగ్రవాద నిర్మూలనలో ద్వంద్వ ప్రమాణాలు, సాకులు వెతకడం కుదరదు. కేవలం ఈ జటిల సమస్య పరిష్కారమే లక్షంగా అంతర్జాతీయ సమాజం కలిసికట్టుగా సాగాల్సి ఉందని ఈ సదస్సు పిలుపునిచ్చింది. ఇది ఓ రకంగా పాక్‌కు చెంపదెబ్బ. పాక్‌ను సమర్థించిన చైనాకు కూడా ఓ హెచ్చరిక. మొత్తంగా ఈ రెండు విషయాల్లో భారత్‌ ఓ రకంగా దౌత్య విజజయం సాధించిందనే చెప్పాలి.
షాంఘై వేదిక పై ప్రసంగించిన ప్రధాని మోదీ, ఉగ్రవాదం అణచివేతలో శషభిషలు వద్దు, దాటివేతలు, ద్వంద్వ ప్రమాణాలు పనికి రావని తేల్చిచెప్పారు. పాక్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ పేలవ హాజరీ మధ్య, చైనా అధినేత జిన్‌పింగ్‌, రష్యా అధినేత పుతిన్‌ ఇతర దేశాల అధినేతలతో జరిగిన వార్షిక సదస్సులో భారత ప్రధాని మాట్లాడుతూ, ఉగ్రవాదంపై పోరు, కలిసికట్టుగా మానవీయ కోణంలో జరిపే విద్యుక్త ధర్మంగా గుర్తు చేశారు. పాకిస్థాన్‌కు, ఉగ్రవాదానికి మద్దతు ఇస్తోన్న ఇతరులకు ప్రధాని మోదీ ఈ వేదిక నుంచి నిర్థిష్ట హెచ్చరికలు గట్టిగానే చేశారు.
ఉగ్రవాదాన్ని భారత్‌ తిప్పికొడుతోంది. ఈ క్రమంలోనే భారత్‌ మే 10వ తేదీన ఆపరేషన్‌ సిందూర్‌ను నిర్వహించింది. ఇందుకు కారణమైన పక్క దేశం పాక్ లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిందని గుర్తు చేశారు. మిత్రదేశాల కలయికతో సాగే ఎస్‌సిఒ అంటే సెక్యూరిటీ, కనెక్టివిటి ఆపర్చూనిటీ అని భద్రతా అనుసంధాన సమాన అవకాశాల వేదిక ఇది కావాలని పిలుపు ఇచ్చారు. ఎస్‌సిఒ మరింత కీలక శక్తి కావల్సి ఉంది. ఇక్కడ నుంచి ప్రాంతీయ సహకారానికి, ప్రపంచ శాంతి సుస్థిరత భద్రతలకు సరైన పిలుపు వెలువడాల్సి ఉందన్నారు. ఎస్‌సిఒ నుంచి నాగరికతల పరిరక్షణ వేదిక కూడా ఏర్పాటు కావల్సి ఉందని చెప్పారు.
మరోవైపు చైనాలోనే జరిగిన ఈ వేదిక ద్వారా ప్రధాని మోదీ, చైనా ప్రతిపాదిత బెల్ట్‌ రోడ్‌ ఇన్షియేటివ్‌ పట్ల నిరసన వ్యక్తం చేశారు. ఇతర దేశాల సార్వభౌమాధికారం, సమగ్రత, ప్రాదేశికతకు సవాలు చేసే, అంశాలు, పరస్పరం విశ్వాసం కోల్పోయే స్థితిక తీసుకువస్తాయని హెచ్చరించారు. ఈ దశలో ఆయన పాక్‌, చైనాలను కలిపి విమర్శించారు. ప్రధాని మోదీ తమ ప్రసంగంలో భారతదేశ ప్రగతి ప్రస్థానం వివరించారు. రిఫార్మ్‌, పర్‌ఫాం, ట్రాన్స్ ఫామ్‌, ఆర్‌పీటీతో కదులుతున్నామని, దీనిని ఈ వేదిక ద్వారా ప్రపంచానికి తెలియచేస్తానని వివరించారు.
మొత్తంగా షాంఘై సదస్సు ద్వారా భారత్‌ ప్రపంచానికి గట్టి సమాధానమే ఇచ్చింది. ఇది మన దౌత్య విజయం కూడా. అలాగే మన వ్యవహారాలు ఎలా ఉన్నా, కలసి నాడవాలని చైనాకు కూడా సూచించారు. రష్యాతో తమ బంధం విడదీయరానిదని తేల్చి చెప్పారు. ట్రంప్‌ విధిస్తున్న సుంకాలను కలసికట్టుగా ఎదుర్కొనే అవకాశాలను పరోక్షంగా షాంఘై సదస్సు ప్రపంచానిక తెలిపింది. మిగతా దేశాలు కలిసి నడిస్తే నీ పెత్తనం సాగదన్న హెచ్చరికను తెలివిడారు.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News