Friday, May 29, 2026
33.2 C
Hyderabad

DOCTORS|వైద్యులు ప్రత్యక్ష దైవాలు!|EDITORIAL

ప్రతి సంవత్సరం జూలై 1వ తేదీన మన దేశంలో ‘డాక్టర్స్ డే’ జరుపుకుంటున్నాం. ఇది వృత్తిపరంగా వైద్యుల సేవలను స్మరించుకోవడమే గాకుండా, అత్యున్నత సేవలందించే వైద్యులకు కృతజ్ఞత తెలియజేసే అరుదైన సందర్భం కూడా. ఈ రోజు భారతదేశ ప్రఖ్యాత వైద్యుడు, పూర్వ ముఖ్యమంత్రి డాక్టర్ బిడన్ చంద్ర రాయ్ జన్మదినం, వర్ధంతి సందర్భంగా గుర్తు చేసుకుంటూ జరుపుకుంటారు. డాక్టర్ బిడన్ చంద్ర రాయ్ జీవితం సంపూర్ణంగా ప్రజాసేవకే అంకితమైంది. అలాంటి మహానుభావుడిని స్మరించుకుంటూ, ప్రతి వైద్యుడి సేవను సముచింగా సత్కరించేందుకు ఈ రోజును ప్రత్యేకంగా ఉత్సవంగా నిర్వహించుకుంటున్నాం.

వైద్య వృత్తి అనేది కేవలం ఉద్యోగం కాదు. ఇది ఓ నిబద్ధత, సమాజం పట్ల తపన, సేవా స్ఫూర్తితో నిండిన పిలుపు. రోగికి వైద్యుడంటే దేవుడితో సమానం. వైద్యో నారాయణ హరి అన్నారు. నేటి ఆధునిక సమాజంలో తీవ్ర ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు పెరుగుతున్న వేళ, వైద్యుల పాత్ర మరింత కీలకమవుతోంది. అనేక భౌతిక పరిమితులు, మానసిక వత్తిడుల మధ్య ప్రజలకు అందుబాటులో ఉండే వైద్యుడు నిజంగానే దేవుడికి ప్రతి రూపం.

కలరా, మశూచి, డెంగీ, కరోనా వంటి మహమ్మారిల విపత్తుల సమయంలో వైద్యులు తమ ప్రాణాలను ఫణంగా ప్రజల ప్రాణాలను కాపాడారు. విశేష, విస్త్రుత సేవలందించారు. మన కుటుంబ సభ్యులను మనమే చూసుకోలేని పరిస్థితుల్లోనూ, రోగులకు తల్లిదండ్రుల్లా, కుటుంబ సభ్యల్లా, బంధువుల్లా మద్దతుగా నిలిచారు. వైద్యుల అంకితభావం, సేవానిరతిని, మానవత్వాన్ని ప్రతిబింబించింది. వారిని “కోవిడ్ వారియర్స్” అని, ఫ్రంట్ వారియర్స్ అని పిలవడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

అయితే రంగం ఎదుర్కొంటున్న సమస్యలు కూడా తక్కువేమీ కావు. ప్రభుత్వ రంగంలో వైద్యుల సంఖ్య సరిపోకపోవడం, పల్లెల్లో వైద్యుల కొరత, సమర్ధవంతమైన వైద్యసేవలందించడంలో లోపాలు వంటి సమస్యలు ఇవాళ మనం ఎదుర్కొంటున్నవే. ప్రైవేట్ వైద్యరంగంలో నాణ్యతతో పాటు ఖర్చుల భారం సామాన్యులకు నెత్తిన భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంఖ్యను మరింత పెంచాలి, గ్రామీణ వైద్యుల సంఖ్యను బలోపేతం చేయాలి.

ఇక వైద్య విద్య పట్ల మరింత కృషి అవసరం. మెడికల్ సీట్లు పెంచినప్పటికీ, ప్రైవేట్ కళాశాలల ఫీజులు సామాన్యుల పిల్లలకు వైద్య విద్యను దూరం చేస్తున్నాయి. మెరిట్ ఉన్న పేద విద్యార్థులకు మెడికల్ చదువు కలగా మిగులుతోంది. క్యూబా లాంటి దేశం కేవలం వైద్య విద్యను విద్యార్థులకు అందించడం ద్వారా ప్రపంచానికి అసరమైన అద్భుత వైద్యులను అందించి, అనేక యుద్ధాలు, విపత్తుల సమయంలో ఆ వైద్యుల ద్వారా అందిస్తున్న సేవలను మనం గుర్తు చేసుకోవాలి. అందుకే సేవాభావంతో కూడిన వైద్య విద్యను, ఉచిత వైద్యాన్ని ప్రజలకు అందించే విధంగా, ప్రోత్సహించే విధంగా బోధన, వైద్య రంగ ప్రణాళికలు రూపొందించాలి.

వైద్యులకు తగిన రక్షణ కూడా అవసరం. ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల రోగుల బంధువుల చేతుల్లో వైద్యులు దాడులకు గురవుతున్న సంఘటనలు కలచివేస్తున్నాయి. ఇది ఆత్మీయ సంబంధాలను, వైద్యుల మనోధైర్యాన్ని కూడా దెబ్బతీస్తోంది. ప్రభుత్వాలు దీనిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలి. వైద్యులు నిర్భయంగా, నిరుపేదలకు సేవలందించాలంటే సురక్షిత వాతావరణం అత్యవసరం. అలాగే దేశంలో ఎప్పటి నుంచో సంప్రదాయ వైద్యం కొనసాగుతోంది. అది కాస్తా అలోపతి వైద్యంగా కొందరు అందిస్తున్నారు. వారినే మనం రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అంటున్నారు. గ్రామీణ వైద్యులను పూర్తిగా విస్మరించి, మన దేశ ప్రజలకు అవసరమైన వైద్యాన్ని అందించగలిగిన వైద్యులను మనం తయారు చేయలేదు. కాబట్టి, గ్రామీణ వైద్యులకు తగిన శిక్షణ ఇచ్చి, సర్టిఫికేట్లు, ప్రభుత్వ గుర్తింపునిచ్చి, వారి ద్వారా కూడా వైద్య సేవలను ప్రజలకు అందించడాన్ని చట్టబద్ధం చేస్తే బాగుంటుందా? అన్నది నిపుణుల ద్వారా అధ్యయనం చేసి, ఒక పరిష్కారాన్ని కనుక్కోవాల్సిన అవసరం ఉంది.

వైద్యం ఇవ్వాళ సేవా భావన నుంచి వ్యాపారానికి మారింది. వ్యాపారం కోసమే వైద్యం చేస్తున్న వైద్యులను మనం చూస్తూనే ఉన్నాం. అలాంటి వారు సేవా భావానని పెంపొందించుకుంటే మంచిది. సమాజం కూడా వైద్యులపై గౌరవాన్ని, నమ్మకాన్ని చూపించాలి. అలాగే వైద్య వృత్తిలో ఉన్నవారు నైతిక విలువలు పాటించాలి. అప్పుడే వైద్య వ్యవస్థ పునాదులు బలపడతాయి. మానవతా దృక్పథంతో వైద్యులు పని చేస్తే ఆరోగ్యంగా, శాంతిగా మన సమాజం ఎదుగుతుంది. ఈ సందర్భంగా ప్రతి వైద్యుడికి మనం “ధన్యవాదాలు” చెబుదాం. వారి సేవలు గుర్తిద్దాం. మన కుటుంబంలో వైద్యుడి ప్రాముఖ్యత ఎంత ఉంటుందో, సమాజం లోనూ అలాగే ఉండాలని గుర్తించాలి. ఈ వైద్య దినోత్సవం ప్రతి ఒక్కరికి సేవా స్పూర్తిని అందించాలి. వైద్య వృత్తిలో ఉన్న మిగతా విభాగావారందరికీ ఇది మరింత జాగ్రత్తగా, బాధ్యతతో పని చేసేలా ప్రేరణ కలిగించాలి.

డాక్టర్స్ డే కేవలం ఒక వేడుక కాదని, ఇది బాధ్యతను గుర్తుచేసే రోజు అని మనం తెలుసుకోవాలి. రోగాన్ని కాదు, రోగిని చికిత్స చేసే ఔషధం మానవత్వం అని గుర్తించినప్పుడే సమాజంలో శాంతి సౌఖ్యాలు నిలుస్తాయి. అందుకే వైద్యులు, వైద్య వృత్తిలో అన్ని విభాగాల, రకాల సిబ్బంది మొత్తానికి చప్పేదొక్కటే, వారి అంచనాలకు మించిన అవసరాలను ఈ సమాజం కోరుకుంటోంది. అందుకు తగ్గ సేవలు వారందించాలి. వారిని గౌరవిద్దాం, ప్రోత్సహిద్దాం, కృతజ్ఞతలు తెలుపుదాం.

Latest News

మనసులతో పాటే కుక్కలు తింటానయి!?|ADUGU TRENDS

కుక్కకు కూడా ఓ రోజొస్తదన్నట్లు.. ఇగిప్పుడు కుక్కల రోజులొచ్చినయి.! కుక్కను గ్రామ సింహం అంటరు. ఇగిప్పుడు ఇంటింటికీ సింహమైందనుకోండ్లి! కుక్కలను గిప్పుడు మనుసుల కంటే మనుసులే మంచిగ సూసుకుంటాండ్లు. పాలు, పెరుగు, పండ్లు,...

ఆసక్తికరంగా తమిళనాడు రాజకీయాలు!|EDITORIAL

తమిళనాడులో సీఎం విజయ్ వ్యూహం విజయవంతమవుతుందా? ఉప ఎన్నికల్లో ప్రజలు అదే స్థాయిలో మద్దతు ఇస్తారా? ఇతర పార్టీల నుంచి వచ్చిన ఎమ్మెల్యేలను ప్రజలు అంగీకరిస్తారా? అన్నాడీఎంకే, డీఎంకేల ఎదురుదాడి ఎలా ఉంటుందన్నది...

29-05-2026, శుక్రవారం| RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:45 సూర్యాస్తమయం సాయంత్రం 6:42 శుక్ల-త్రయోదశి శ్రాద్ధ తిథి: జ్యేష్ఠ శుక్ల-చతుర్దశి తిథి : శుక్ల-త్రయోదశి ఉదయం 9:52 వరకు, తదుపరి శుక్ల-చతుర్దశి నక్షత్రము స్వాతి ఈ...

సీకులకు సిమిటి!?|ADUGU TRENDS

శిన్న శిన్న ఉపాయాలే పెద్ద పెద్ద ఉపశమనాలిత్తయి. గవాటినే మనం నిర్లచ్చం శేత్తం. మర్సిపోతం. ఇగ గవాటితోటి మస్తు కట్ట పడ్తం. గయి గుర్తు పెట్టుకుంటిమా? ఇగ ఎట్లుంటదో సూడుండ్రి. మనం పక్కా ఇండ్లు...

అక్రమ వలసలపై ఉక్కుపాదం!|EDITORIAL

భారత్ దేశంలో అక్రమ వలసల సమస్య ఇప్పుడు కేవలం సరిహద్దు భద్రత అంశంగా మాత్రమే కాకుండా.. ఆర్థిక, సామాజిక, రాజకీయ, జాతీయ భద్రతకు సంబంధించిన కీలక సవాలుగా మారింది. మన పొరుగున సరిహద్దుల్లో...

28-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు.ద్వాదశి ఉదయం 08.17 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం చిత్త ఉదయం 08.50 వరకు ఉపరి స్వాతి యోగం వరీయాన్ రాత్రి తెల్ల 04.20 వరకు ఉపరి పరిఘ కరణం బాలవ ఉదయం 08.17...

గాలి మేడలు!?|ADUGU TRENDS

ఏ.. ఇగ సాలు తియ్, గాలి మేడలు. గాల్లో మేడలు కట్టకు. గయి గాలికే కూలిపోతయి!. అంటే ఏమో అనుకున్నం. కనీ, నిజంగనే గాలి మేడలు వత్తయని ఎవరనుకున్నరు!? కల గన్నమా ఏంది?...

‘ఎబోలా’ మళ్ళీ ముప్పేనా!? ఎలా?|EDITORIAL

కరోనా ప్రపంచానికి ఒక పెద్ద పాఠం నేర్పింది. వైరస్‌లను చిన్నచూపు చూడరాదు. ప్రారంభ దశలోనే కట్టడి చర్యలు తీసుకోకపోతే పరిస్థితి అదుపు తప్పుతుంది. ఎబోలా ప్రస్తుతం ఆఫ్రికా ప్రాంతానికే పరిమితమైనప్పటికీ ప్రపంచీకరణ యుగంలో...

27-05-2026, బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం-శుక్లపక్షం తిధి శు ఏకాదశి ఉదయం 07.43 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం హస్త ఉదయం 07.33 వరకు ఉపరి చిత్త యోగం వ్యతీపాత రాత్రి తెల్ల 04.33 వరకు ఉపరి వరీయాన్ కరణం భద్ర ఉదయం...

‘సింగిల్ రాజు’ గ్లింప్స్ విడుదల!|SINGLE RAJU|MOVIE|ADUGU CINIMA

టాలీవుడ్‌లో మరో అందమైన గ్రామీణ ప్రేమకథగా తెరకెక్కుతున్న చిత్రం ‘సింగిల్ రాజు’. విశ్వస్, మౌనిక, దివ్య ప్రధాన పాత్రల్లో ఎస్.ఎస్. వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టైటిల్ పోస్టర్ మరియు గ్లింప్స్...

గీ శిట్కాతోటి పేండ్లు పేల్తయి!?|ADUGU TRENDS

నెత్తిల పేండ్లు పోవాలన్నా, తీయాల్నెన్నా మామూలు ముచ్చట కాదు. గయి మన నెత్తిల్నే ఉంటయి. ఇగ గయి కర్తాంటే, గోకా, పీకా.. మస్తు చికాకుగుంటది. ఇగ గవాటికి తోడుగ ఈడ్తులు మొదలైతయి. సూసి...

‘కాక్రోచ్ పార్టీ’ కారాదు రాజకీయ ప్రయోగం!|EDITORIAL

డిజిటల్ యుగంలో రాజకీయాలను విశ్లేషించే తీరు పూర్తిగా మారిపోయింది. గతంలో సిద్ధాంతాలు, ఉద్యమాలు, బంద్ లు, ధర్నాలు, రాస్తారోకోలు, ఆందోళనలు, పోరాటాలు ప్రధానమైతే, ఇప్పుడు వైరల్ వీడియోలు, ట్రెండింగ్ హ్యాష్‌ట్యాగ్‌లు, మీమ్స్ రాజకీయ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News