Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

పార్టీల రిజర్వేషన్ల రాజకీయాలు!|EDITORIAL

రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?

బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి.
రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తీవ్ర చర్చకు కేంద్ర బిందువైంది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న రాజ్యాంగ నిబంధనకు లోబడి హైకోర్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తిరస్కరించింది. సుప్రీం కోర్టు సమర్ధించింది. హైకోర్టు సూచన మేరకే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. నిజానికి రిజర్వేషన్ల అమలు బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. సమాజంలో బలహీన వర్గాల పేరుతో బలమైన వర్గాల మెజార్టీ ఓట్లతోనే ఎవరైనా గెలుస్తున్నారు. ఓడుతున్నారు. కానీ, వారిని గెలిపిస్తున్న బలమైన బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం అంగీకరించడం లేదు. రాజకీయ పార్టీల సంకల్పబలం లేకుండా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి మన రాజ్యాంగంలో ఏమాత్రం కనిపించడం లేదు.

ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేష్ల ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నారు. లేకపోతే వారికావకాశాలు దక్కేవి కావు. జనాభాలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే, బలహీన వర్గాలే బలమైన వర్గాలు. ప్రభుత్వాలు చూపిస్తున్న లెక్కలకు తక్కువగా కనీసం 42శాతం రిజర్వేషన్లకు కూడా అంగీకరించకుండా బీసీలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు? ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేష్లను బట్టి, రిజర్వేషన్లు ఉంటే తప్ప అవకాశాలివ్వరని తేలిపోయింది. ఎస్సీ, ఎస్టీ తప్ప రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?
ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, తటస్థులకు టిక్కెట్లు ఇచ్చి, వారిని ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టారు. ఆ ప్రభంజనంలో కల్వకుర్తిలో ఎన్టీఆర్ సహా, ఎన్.జీ రంగా లాంటి మహామహులు కూడా ఓడిపోయారు. అందువల్లే ఆ రోజుల్లో కొత్తతరం రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకుంది. అది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల రాజకీయ ప్రస్థానానికి నాందీ పలికింది.

మండల్‌ కమిషన్ తీర్పు, ఇందిరా సహాని కేసు పరిణామాలు రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చినా, వాస్తవిక రాజకీయాల్లో వాటి అమలు కష్టసాధ్యమే అయింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలుకు అప్పటి సీఎం జయలలిత చేసిన కసరత్తు, రిజర్వేషన్ల పరిమితి, రాజ్యాంగ అనుకూలతల మధ్య పోరాటమే జరిగింది. ఇవన్నీ చట్టపరమైన ప్రయోగాలు. అయితే, అమలుకు సాధ్యం కాని సత్యదూరాలు మాత్రం కాదు. బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమం, తమిళనాట బీసీల ఆధిపత్యమే ప్రబలమైన ఉదాహరణలు.
ఇక సర్పంచ్‌ పదవి అనేది రాజకీయాలకు, రాజ్యాంగ పదవులకు తొలి మెట్టు. గ్రామాల ప్రగతే దేశ ప్రగతి కాబట్టి, దేశం లాగే, గ్రామాభివృద్ధి బాధ్యతను చేపట్టే పదవిగా ఎంతో ప్రాధాన్యతతో కూడింది. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ సమాజంలో సంఖ్యా బలంగా ఉన్న సామాజిక వర్గాలకు, అందునా చదువుకున్న, నిజాయితీగల, సేవాతత్పరత ఉన్న అభ్యర్థులను నిలబెట్టాలి. రిజర్వేషన్ లేని గ్రామాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను ప్రోత్సహించాలి. ఇలా చేస్తేనే ప్రజాస్వామ్యంలో పాతనీరు పోయి కొత్త నీరు వస్తుంది.

తెలంగాణ శాసనసభలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, అదే స్పూర్తితో బీసీ అభ్యర్థులకు అవకాశాలిచ్చి, గెలిపించుకోవాలి. “సర్పంచ్‌లకు పార్టీ గుర్తు ఉండదు” అనే నెపంతో వారిని పక్కన పెట్టడం వల్ల అసెంబ్లీ తీర్మానాలకు కూడా విలువలేకుండా పోతుంది. రాజ్యాంగ స్ఫూర్తిపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇప్పుడు కానిది ఎప్పుడూ కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటి ఎన్నికల్లోనే తగిన నిర్ణయాలు తీసుకుంటే, భవిష్యత్తు రాజకీయ సామాజిక సమానత్వానికి పునాది పడుతుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలి. రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా? ఈ పంచాయతీ ఎన్నికలే తేలుస్తాయి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News