Friday, July 17, 2026
26.4 C
Hyderabad

పార్టీల రిజర్వేషన్ల రాజకీయాలు!|EDITORIAL

రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?

బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి.
రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా?

మార్గం-అడుగు, డా. మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వేళ, బీసీ రిజర్వేషన్ల అంశం రాష్ట్ర రాజకీయాల్లో మళ్ళీ తీవ్ర చర్చకు కేంద్ర బిందువైంది. రిజర్వేషన్లు 50శాతానికి మించరాదన్న రాజ్యాంగ నిబంధనకు లోబడి హైకోర్టు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను తిరస్కరించింది. సుప్రీం కోర్టు సమర్ధించింది. హైకోర్టు సూచన మేరకే ప్రభుత్వం పాత రిజర్వేషన్ల ప్రకారమే ఎన్నికలు నిర్వహించక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని కొన్ని పార్టీలు తమ రాజకీయ స్వలాభం కోసం ఉపయోగించుకోవాలని చూస్తున్నాయి. నిజానికి రిజర్వేషన్ల అమలు బాధ్యత రాజకీయ పార్టీలపైనే ఆధారపడి ఉంది. సమాజంలో బలహీన వర్గాల పేరుతో బలమైన వర్గాల మెజార్టీ ఓట్లతోనే ఎవరైనా గెలుస్తున్నారు. ఓడుతున్నారు. కానీ, వారిని గెలిపిస్తున్న బలమైన బలహీన వర్గాలకి రిజర్వేషన్లు కల్పించడానికి మాత్రం అంగీకరించడం లేదు. రాజకీయ పార్టీల సంకల్పబలం లేకుండా రిజర్వేషన్లు అమలయ్యే పరిస్థితి మన రాజ్యాంగంలో ఏమాత్రం కనిపించడం లేదు.

ఇప్పుడు రాజ్యాంగం కల్పించిన రిజర్వేష్ల ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు అవకాశాలు కల్పిస్తున్నారు. లేకపోతే వారికావకాశాలు దక్కేవి కావు. జనాభాలో సామాజిక వర్గాలను పరిశీలిస్తే, బలహీన వర్గాలే బలమైన వర్గాలు. ప్రభుత్వాలు చూపిస్తున్న లెక్కలకు తక్కువగా కనీసం 42శాతం రిజర్వేషన్లకు కూడా అంగీకరించకుండా బీసీలను ఏవిధంగా అభివృద్ధి చేస్తారు? ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కల్పిస్తున్న రిజర్వేష్లను బట్టి, రిజర్వేషన్లు ఉంటే తప్ప అవకాశాలివ్వరని తేలిపోయింది. ఎస్సీ, ఎస్టీ తప్ప రిజర్వేషన్లు లేని అన్ని స్థానాలను ఓసీలే ఎగరేసుకుపోతూ ఉంటే, సమాజంలో సమానత్వం, సమాన అవకాశాలు, స్వేచ్ఛ, స్వాతంత్ర్యాలు వెరసి ప్రజాస్వామ్యం ఉన్నట్లా? లేనట్లా? 10శాతం లేని ఓసీలు ఈబీసీలకు విద్యా, ఉద్యోగాల్లో 10శాతం రిజర్వేషన్లను వారం రోజుల్లోనే దక్కించుకున్నప్పుడు లేని రాజ్యాంగ సవరణకు వ్యతిరేకత, ఇప్పుడెందుకు? అప్పుడు సాధ్యమైన రాజ్యాంగ సవరణ ఇప్పుడెందుకు కాదు? ఒకవేల రాజ్యాంగ సవరణ ఆలస్యమైతే, ప్రస్తుత, రాబోయే ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు లేని చోట్ల కూడా వారికి ఎక్కువ సంఖ్యలో ప్రాధాన్యం ఇచ్చి, రాజకీయ అవకాశాలు కల్పించడం ద్వారా సమానత్వం సాధించవచ్చు కదా?
ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీ స్థాపించిన కొత్తలో అనేకమంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు, మైనార్టీలు, తటస్థులకు టిక్కెట్లు ఇచ్చి, వారిని ప్రజా ప్రతినిధులుగా నిలబెట్టారు. ఆ ప్రభంజనంలో కల్వకుర్తిలో ఎన్టీఆర్ సహా, ఎన్.జీ రంగా లాంటి మహామహులు కూడా ఓడిపోయారు. అందువల్లే ఆ రోజుల్లో కొత్తతరం రాజకీయాల్లోకి వచ్చి నిలదొక్కుకుంది. అది అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బడుగు, బలహీన వర్గాల రాజకీయ ప్రస్థానానికి నాందీ పలికింది.

మండల్‌ కమిషన్ తీర్పు, ఇందిరా సహాని కేసు పరిణామాలు రిజర్వేషన్లపై స్పష్టతనిచ్చినా, వాస్తవిక రాజకీయాల్లో వాటి అమలు కష్టసాధ్యమే అయింది. తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్ల అమలుకు అప్పటి సీఎం జయలలిత చేసిన కసరత్తు, రిజర్వేషన్ల పరిమితి, రాజ్యాంగ అనుకూలతల మధ్య పోరాటమే జరిగింది. ఇవన్నీ చట్టపరమైన ప్రయోగాలు. అయితే, అమలుకు సాధ్యం కాని సత్యదూరాలు మాత్రం కాదు. బీసీలను లేదా ఒక వర్గాన్ని రాజకీయాలకు, రాజకీయ పదవులకు దూరం చేయడం రాజకీయ పార్టీలకే మంచిది కాదు. ఆ వర్గాలే రేపు ఆయా రాజకీయ పార్టీల పునాదులను పెకిలించ గలవని గ్రహించాలి. ఇందుకు తెలంగాణ ఉద్యమం, తమిళనాట బీసీల ఆధిపత్యమే ప్రబలమైన ఉదాహరణలు.
ఇక సర్పంచ్‌ పదవి అనేది రాజకీయాలకు, రాజ్యాంగ పదవులకు తొలి మెట్టు. గ్రామాల ప్రగతే దేశ ప్రగతి కాబట్టి, దేశం లాగే, గ్రామాభివృద్ధి బాధ్యతను చేపట్టే పదవిగా ఎంతో ప్రాధాన్యతతో కూడింది. అందువల్ల రాజకీయ పార్టీలన్నీ సమాజంలో సంఖ్యా బలంగా ఉన్న సామాజిక వర్గాలకు, అందునా చదువుకున్న, నిజాయితీగల, సేవాతత్పరత ఉన్న అభ్యర్థులను నిలబెట్టాలి. రిజర్వేషన్ లేని గ్రామాల్లోనూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల అభ్యర్థులను ప్రోత్సహించాలి. ఇలా చేస్తేనే ప్రజాస్వామ్యంలో పాతనీరు పోయి కొత్త నీరు వస్తుంది.

తెలంగాణ శాసనసభలో 42 శాతం బీసీ రిజర్వేషన్లకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపిన అన్ని పార్టీలు, అదే స్పూర్తితో బీసీ అభ్యర్థులకు అవకాశాలిచ్చి, గెలిపించుకోవాలి. “సర్పంచ్‌లకు పార్టీ గుర్తు ఉండదు” అనే నెపంతో వారిని పక్కన పెట్టడం వల్ల అసెంబ్లీ తీర్మానాలకు కూడా విలువలేకుండా పోతుంది. రాజ్యాంగ స్ఫూర్తిపై నమ్మకం సన్నగిల్లుతుంది. ఇప్పుడు కానిది ఎప్పుడూ కాదు కాబట్టి రాజకీయ పార్టీలు ఇప్పటి ఎన్నికల్లోనే తగిన నిర్ణయాలు తీసుకుంటే, భవిష్యత్తు రాజకీయ సామాజిక సమానత్వానికి పునాది పడుతుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థ బలపడాలంటే సామాజిక, ఆర్థిక అసమానతలు తొలగాలి. రాజకీయాల్లో, పార్టీల్లో, పదవులు ఇప్పటికీ ఒకటి రెండు పై వర్గాల చేతుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. దీనిని మార్చకుండా, రాజకీయాల్లో సమానత, సమాన అవకాశాలు లేకుండా, మన రాజ్యాంగంలో మనమే రాసుకున్నట్లు దేశంలో, సమాజంలో సమానత్వం ఎలా సాధ్యం? మన ప్రజాస్వామిక, రాజ్యాంగ స్ఫూర్తికి రాజకీయ సమాన అవకాశాలే అసలైన మార్గం. ఈ మార్గంలో మన రాజకీయ పార్టీలు పయనిస్తాయా? లేక పలాయనం చిత్తగిస్తాయా? ఈ పంచాయతీ ఎన్నికలే తేలుస్తాయి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News