Saturday, July 25, 2026
22.7 C
Hyderabad

చమురు సంక్షోభమే సంస్కరణలకు సానుకూలం!|EDITORIAL

భారత్‌ ఆర్థిక వ్యవస్థకు మూలస్తంభంగా ఉన్న ఇంధన భద్రత ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభాన్ని, సవాళ్లను ఎదుర్కొంటోంది. మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం, ఉద్రిక్తతలు, ప్రపంచ చమురు మార్కెట్‌ను అస్థిర పరుస్తున్నాయి. ఈ పరిణామాలు దిగుమతులపై అధికంగా ఆధారపడే భారత్ వంటి దేశాలను ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో దేశం అప్రమత్తంగా ఉండడం మాత్రమే కాక, దీర్ఘకాలిక వ్యూహాలతో ముందుకు సాగడం అత్యవసరం.

భారత్ తన చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతుల ద్వారానే తీర్చుకుంటోంది. రోజుకు సగటున 5 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు వినియోగించే దేశంగా భారత్, ప్రపంచంలో మూడవ అతిపెద్ద వినియోగదారుగా ఉంది. ఈ నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో ఏ చిన్న ఉద్రిక్తత, కల్లోలం కలిగినా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగి, దేశీయ ఆర్థిక వ్యవస్థపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ద్వారా రవాణా ఖర్చులు అధికమవుతాయి. దాని ప్రభావం అన్ని వస్తువుల ధరలపై పడుతూ ద్రవ్యోల్బణాన్ని వేగవంతం చేస్తోంది.

మొత్తం చమురు వినియోగంలో రవాణా రంగం 40 శాతం వాటాను కలిగి ఉంది. ఈ రంగంలో ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం ఇంకా ఆశించిన స్థాయికి చేరలేదు. విద్యుదీకరణ పెరిగినా, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మొత్తం వాహనాల్లో 2–3 శాతం వరకు మాత్రమే. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో 30 శాతం పంపుసెట్లు ఇంకా డీజిల్‌పై ఆధారపడి ఉన్నాయి. ఇవి చమురు వినియోగాన్ని తగ్గించడంలో పెద్ద అడ్డంకిగా నిలుస్తున్నాయి.

విద్యుత్ ఉత్పత్తిలో కూడా పరిస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు. దేశంలో మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో 70 శాతం బొగ్గు ద్వారానే జరుగుతోంది. సహజ వాయువు వినియోగం పెరుగుతున్నా, అందులో 50 శాతం వరకు దిగుమతుల ద్వారానే లభిస్తోంది. పునరుత్పాదక ఇంధనాల్లో భారత్ పురోగతి సాధించినా, మొత్తం విద్యుత్ అవసరాల్లో సోలార్, పవన విద్యుత్ లు కలిపి 25 శాతం మాత్రమే అందిస్తున్నాయి. అంటే స్వాతంత్ర్యం సిద్ధించి ఇన్నేళ్లైనా, సంపూర్ణ ఇంధన స్వయం సమృద్ధి దిశగా ప్రయాణిస్తున్నామని చెప్పుకోవడమే తప్ప, సాధించిందేమీ లేదు.

వ్యవసాయ రంగంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి పదార్థాలు, రసాయనాలు కూడా పెద్ద మొత్తంలో విదేశాల నుంచే దిగుమతి అవుతున్నాయి. ఇది ఆహార భద్రతపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. చమురు ధరలు పెరిగితే ఎరువుల ధరలు పెరుగుతాయి. దాని ప్రభావం రైతులపై పడుతుంది. ఉత్పత్తి ఖర్చులు పెరిగి, చివరికి వినియోగదారులపై భారం పడుతుంది.

ప్రస్తుతం ప్రపంచ రాజకీయ పరిణామాలు కూడా ఈ సంక్షోభాన్ని మరింత క్లిష్టంగా మారుస్తున్నాయి. మధ్యప్రాచ్య దేశాల మధ్య ఉద్రిక్తతలు, శక్తివంతమైన దేశాల జోక్యం వల్ల పరిస్థితులు మరింత అస్థిరంగా మారుతున్నాయి. గతంలో కూడా ఇలాంటి పరిస్థితుల్లో చమురు ధరలు ఒక్కసారిగా పెరిగి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేశాయి. ఈసారి కూడా అదే పరిస్థితి పునరావృతం కావచ్చనే ఆందోళన ఉంది.

ఈ నేపథ్యంలో భారత్ ముందుచూపుతో వ్యవహరించాలి. తక్షణ చర్యలతో పాటు దీర్ఘకాలిక వ్యూహాలు రూపొందించాలి. మొదటగా చమురు వినియోగాన్ని తగ్గించే చర్యలు తీసుకోవాలి. రవాణా రంగంలో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని వేగంగా పెంచాలి. 2030 నాటికి కనీసం 30 శాతం వాహనాలు ఎలక్ట్రిక్‌గా మార్చే లక్ష్యాన్ని కచ్చితంగా అమలు చేయాలి.

పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు పెంచాలి. ప్రస్తుతం ఉన్న 180 గిగావాట్ల పునరుత్పాదక సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు పెంచే లక్ష్యాన్ని వేగవంతం చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో సోలార్ పంపుసెట్లను విస్తృతంగా ప్రవేశపెట్టాలి. దీని ద్వారా వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగాన్ని గణనీయంగా తగ్గించవచ్చు.

వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకోవాలి. ప్రస్తుతం భారత్ వద్ద 5–6 మిలియన్ టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నాయి, ఇవి 9–10 రోజుల అవసరాలకు సరిపోతాయి. కనీసం 30 రోజుల అవసరాలను తీర్చగల స్థాయికి నిల్వలను పెంచడం అవసరం. దేశీయ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలి.

దిగుమతులపై ఆధారపడకుండా స్వదేశీ పరిశ్రమలను ప్రోత్సహించాలి. “ఆత్మనిర్భర్ భారత్” లక్ష్యాన్ని వాస్తవ రూపంలో అమలు చేయాలి. అంతిమంగా ప్రజల్లో అవగాహన పెంపొందించడం కూడా అంతే ముఖ్యం. అవసరం లేని ఇంధన వినియోగాన్ని తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ వినియోగాన్ని పెంచడం వంటి అలవాట్లు పెంపొందించాలి.

ప్రస్తుత ఆయిల్ సంక్షోభం భారత్‌కు ఒక హెచ్చరిక. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే కాదు, భవిష్యత్తులో మరిన్ని, మరింత పెద్ద సవాళ్లకు సంకేతం. ఈ సంక్షోభమే సావకాశంగా ఇంధన స్వయం సమృద్ధి దేశంగా దృఢంగా సాగడానికి, ఎదగడానికి సానుకూల సమయం ఇది.

Latest News

ఒక్క ఏసీ మిషినీ, రొండు అర్రలకు సల్లదనం!?|ADUGU TRENDS

‘ఒక్క దెబ్బకు రెండు పిట్టలు!’. ‘ఒకే కాన్పుల ఇద్దరు పిల్లలు!! లెక్కనే’ గీ ‘ఒక్క ఏసీతో రెండు గదుల్ల సల్లదనమన్నట్లు!?’ అరె గదెట్ల? అనుకుంటాండ్రా? కావాల్నంటే ఇగో సూడుండ్రి. ఇగో గీ ఉపాయం ఏడ...

‘బొద్దింకే’ కదాని నిర్లక్ష్యం చేస్తే..!?|EDITORIAL

‘బొద్దింక’లే కదాని చులకనగా చూడొద్దు. వాటిని చంపినా మళ్ళీ అవి పుట్టుకు వస్తూనే ఉంటాయి. వ్యక్తులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఉద్యమాలను అణచివేయవచ్చు. కానీ, సమస్యలను పరిష్కరించకపోతే కొత్త రూపాల్లో అసంతృప్తి మళ్లీ...

జూలై 25, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తొలి ఏకాదశి తిధి ఏకాదశి ఉదయం 11.38 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం అనురాధ ఉదయం 05.49 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం బ్రహ్మ రాత్రి 11.00 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 11.38...

గీ అక్కాశెల్లెండ్లు ముగ్గురికి ఒక్కడే పెనిమిటి!?|ADUGU TRENDS

మన సంప్రదాయం పకారం ఒక్కొక్కరు ఒక్కల్నే మనువాడాలె. కనీ, గాడ గా పొల్లగాడ్ని, ముగ్గురు అక్కాశెల్లెండ్లు ఒక్కపాలే పెండ్లి శేసుకున్నరు? గదేందో సూద్దాం పదండ్రి. గిదేంది? అనకుంటాండ్రా? నిజమేనుల్లా... గీ ముచ్చట గా ఉత్తర...

నీట్-అణచివేతే పరిష్కారం కాదు!|EDITORIAL

దేశ జనాభాలో 65%నికి పైగా 35ఏళ్ళ లోపు వాళ్ళే. ప్రపంచంలో అత్యధిక యువ జనాభా కలిగిన దేశంగా భారత్‌కు గొప్ప అవకాశం. అయితే ఇదే యువత ఉద్యోగాలు, పారదర్శక నియామకాలు, నాణ్యమైన విద్య,...

జూలై 24, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి దశమి ఉదయం 09.51 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం అనురాధ పూర్తిగా రోజంతా యోగం శుక్ల రాత్రి 10.25 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 09.53 వరకు ఉపరి వణజి రాహుకాలం ఉదయం...

సింధు నాగరికత కాలం నాటి ముఖ్య నగరాలు|HISTORY|COMPITITIVE EXAMS|ADUGU SPECIAL

సింధు నాగరికతలో సుమారు రెండువందల పట్టణాలకు పైగా పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అందులో ముఖ్యమైనవి హరప్పా, మోహెంజోదారో, లోథాల్, కాళీబంగన్, ఛాన్సుధారో, బాన్వాలీ, ధోలవీర మొదలగునవి. హరప్పా ఇది 1921 లో సింధు నాగరికతలో బయల్పడిన...

యియర్ పోన్లతోటి శెవులకు శిల్లే!?|ADUGU TRENDS

కొత్త టెక్నాలజీ వచ్చిందంటే సాలు..ఇగ దానెంటే పడ్తం. గదాన్నే అనుసరిత్తం. ఏమైతాందో సూసుకోం. గసొంటిదే గీ యియర్ పోన్ల వాడకం. గదేందో సూద్దా పదండ్రి. అదే పనిగా యియర్ పోన్లను వాడేటోల్లకు గా కర్ణభేరి...

నీట్ లీకేజీ.. అంత లోకువా!?|EDITORIAL

పరీక్షల విశ్వసనీయత దెబ్బతింటే విద్యా వ్యవస్థపై నమ్మకం పోతుంది. అందువల్ల నీట్ పేపర్ లీక్ వ్యవహారాన్ని కేవలం రాజకీయ ఆరోపణలు–ప్రత్యారోపణలకే పరిమితం చేయకుండా, పార్లమెంట్‌లో సమగ్రంగా చర్చించి, అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి...

జూలై 23, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి నవమి ఉదయం 08.27 వరకు ఉపరి దశమి నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 03.30 వరకు ఉపరి అనురాధ యోగం శుభ రాత్రి 10.06 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 08.28...

అడుగు ఎక్స్ క్లూజివ్: సీజేపీ ఆందోళన వెనక కుట్ర కోణం?|CJP|NATIONAL|ADUGU EXCLUSIVE

ప్రాణాలకు తెగించి రావాలని సందేశాలు ప్రాణత్యాగాలు చేసిన వారిని గుర్తుంచుకుంటాం సీక్రెట్ యాప్‌తో పరస్పరం సందేశాలు చేరవేత సంసద్ యాత్రపై కూపీ లాగుతున్న పోలీసులు|SAMSAD న్యూఢిల్లీ, జూలై 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం చేపట్టిన...

గాడ వజ్రాల వాన!?|ADUGU TRENDS

మన కాడ.. ఏ తియ్ మనకాడేంది? ఏడైనా.. శినుకంటే నీటి సుక్కే. జల్లంటే నీల్లే. అని అనుకుంటం కానీ, గాడ మాత్రం శినుకంటే వజ్రం. వానంటే వజ్రాలే!? కానీ, గా వజ్రాలను మనం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News