Tuesday, June 16, 2026
32.5 C
Hyderabad

విలీనమే పరిష్కారమా?!|EDITORIAL

ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? అదే బీజేపీ దూకుడుకు కళ్లెం వేయగలదా? ఒకవేళ బీజేపీలోనే ప్రాంతీయ పార్టీలు విలీనమైతే సరిపోతుందా? ప్రాంతీయ పార్టీల తరహాలోనే జాతీయ పార్టీల్లోనూ అధికారం ఒకటి లేదా కొన్ని కుటుంబాల చేతుల్లోనే మిగిలిపోతోంది. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని వదులుకుని కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో విలీనం అయితే ప్రజలకు అదనంగా ఒరిగేదేమైనా ఉంటుందా?

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

భారత రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్రపై మరోసారి చర్చ మొదలైంది. శివసేన -ఉద్ధవ్ వర్గం నేత, రాజ్యసభ సభ్యుడు సంజయ్ రౌత్ చేసిన వ్యాఖ్యలు ఈ ప్రస్థావనకు కారణమయ్యాయి. కాంగ్రెస్ నుంచి విడిపోయి ఏర్పడిన ప్రాంతీయ పార్టీలు మళ్లీ కాంగ్రెస్‌లో విలీనం కావాలని, అప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం బలోపేతం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రధానంగా తృణమూల్ కాంగ్రెస్, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ వంటి పార్టీలను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

భారతదేశం వంటి విభిన్న సామాజిక, భాషా, సాంస్కృతిక నేపథ్యం కలిగిన దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రాధాన్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. స్వాతంత్ర్యం అనంతరం మూడు దశాబ్దాల పాటు కాంగ్రెస్ ఏకపక్ష ఆధిపత్యాన్ని కొనసాగించింది. ఆ ఆధిపత్యానికి వ్యతిరేకంగా రాష్ట్రాల ప్రత్యేక ప్రయోజనాలను కాపాడేందుకు అనేక ప్రాంతీయ పార్టీలు పుట్టుకొచ్చాయి. తమిళనాడులో ద్రవిడ ఉద్యమం, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగువారి ఆత్మగౌరవ నినాదం, పంజాబ్‌లో ప్రాంతీయ స్వయం ప్రతిపత్తి డిమాండ్లు ఇందుకు ఉదాహరణలు.

1982లో నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీ ప్రాంతీయ రాజకీయాల చరిత్రలో ఒక మైలురాయి. కేవలం తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఆధిపత్యానికి సవాల్ విసిరింది. ఇదే తరహాలో తృణమూల్ కాంగ్రెస్, బిజూ జనతాదళ్, సమాజ్‌వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, తెలంగాణ రాష్ట్ర సమితి వంటి పార్టీలు తమ రాష్ట్రాల్లో బలమైన రాజకీయ శక్తులుగా ఎదిగాయి.

దేశ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల ప్రభావం ఎంత ఉందో గణాంకాలే చెబుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ కలిపి 65 శాతం స్థానాలు గెలుచుకున్నప్పటికీ, మిగిలిన 35 శాతం స్థానాలు ప్రాంతీయ పార్టీల ఖాతాలోకి వెళ్లాయి. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలే ప్రధాన రాజకీయ శక్తులుగా ఉన్నాయి. కేంద్రంలో ఏ కూటమి ప్రభుత్వం ఏర్పడినా ప్రాంతీయ పార్టీల మద్దతు కీలకంగా మారుతోంది.

అయితే, ప్రాంతీయ పార్టీల బలహీనతలకు కూడా కారణాలు ఉన్నాయి. వాటిలో ప్రధానమైనది కుటుంబ రాజకీయాలు. సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే, బీఆర్‌ఎస్, వైఎస్సార్ కాంగ్రెస్ వంటి పార్టీలపై కుటుంబ ఆధిపత్య ఆరోపణలు మామూలే. ప్రజాస్వామ్య వ్యవస్థలో నాయకత్వ మార్పిడి సహజ ప్రక్రియ. కానీ ఒకే కుటుంబం చుట్టూ పార్టీ తిరుగుతుంటే కొత్త నాయకత్వం ఎదగడానికి అవకాశాలు తగ్గిపోతాయి. ఫలితంగా ప్రజల్లో నిరాశ పెరుగుతుంది.

ఇటీవలి ఎన్నికల ఫలితాలు కూడా ఇదే విషయాన్ని సూచిస్తున్నాయి. ఒడిశాలో 24 సంవత్సరాల పాటు అధికారంలో ఉన్న బిజూ జనతాదళ్ పరాజయం పాలైంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయింది. ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తీవ్ర పరాజయాన్ని చవిచూసింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించకపోతే ఎంత బలమైన పార్టీ అయినా వెనుకబడుతుందనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి.

అయితే, ఈ పరిస్థితులను చూసి ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌లో విలీనం కావాలనడం సరైన పరిష్కారమేనా? కాంగ్రెస్ కూడా ప్రస్తుతం కుటుంబ ఆధారిత రాజకీయాలను నెరపుతోందనే విమర్శలను ఎదుర్కొంటున్నది. అక్కడ నిర్ణయాధికారం కొద్దిమంది నాయకుల చేతుల్లోనే కేంద్రీకృతమైందనే విమర్శలు ఉన్నాయి. అలాంటి పరిస్థితుల్లో ప్రాంతీయ పార్టీలు తమ అస్తిత్వాన్ని వదులుకుని కాంగ్రెస్‌లోనో, బీజేపీలోనో విలీనం అయితే ప్రజలకు అదనంగా ఒరిగేదేమీ ఉండదు.

నిజానికి ప్రాంతీయ పార్టీలకు ఇప్పుడున్న సవాల్ బీజేపీ లేదా కాంగ్రెస్‌తో పోటీ కాదు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే. రాష్ట్రాల అభివృద్ధి, ఉపాధి కల్పన, విద్య, వైద్యం, మౌలిక సదుపాయాలు, సామాజిక న్యాయం వంటి అంశాలపై స్పష్టమైన కార్యాచరణతో ఆ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళాలి. కుల, మత, ఓటు బ్యాంకు రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి రాజకీయాలను ప్రోత్సహించాలి.

ప్రాంతీయ పార్టీలకు జాతీయ దృక్పథం కూడా అవసరం. తమ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే దేశ అభివృద్ధిపై స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తం చేయాలి. కేంద్ర-రాష్ట్ర సంబంధాలు, ఆర్థిక వికేంద్రీకరణ, సమాఖ్య వ్యవస్థ బలోపేతం వంటి అంశాల్లో నిర్మాణాత్మక పాత్ర పోషించాలి. అప్పుడే అవి నిజమైన ప్రత్యామ్నాయ రాజకీయ శక్తులుగా ఎదగగలవు.

ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఎంత అవసరమో, బలమైన ప్రాంతీయ రాజకీయ శక్తులు కూడా అంతే అవసరం. కాంగ్రెస్, బీజేపీ వంటి జాతీయ పార్టీలకు చెక్ పెట్టగల సామర్థ్యం ప్రాంతీయ పార్టీలకే ఉంది. అయితే అందుకు అవి తమ అంతర్గత బలహీనతలను అధిగమించి ప్రజల విశ్వాసాన్ని సంపాదించాలి. రాష్ట్రాల అభివృద్ధిని కేంద్రబిందువుగా చేసుకుని ముందుకు సాగాలి. అప్పుడు మాత్రమే ప్రాంతీయ పార్టీలు దేశ రాజకీయాల్లో తమ ప్రాధాన్యాన్ని నిలబెట్టుకోగలవు. లేకపోతే ప్రజలే వాటిని రాజకీయ చరిత్రలో కలిపేస్తారు.

Latest News

48 ఏండ్ల తర్వాత?!|ADUGU TRENDS

ఏడడుగులు, మూడు ముల్లతోటి పెండ్లైతది. ఇగ గీ ఏడు రోజులు, మూడు నెలల్లోనే యిడుపుకాయితం అయితున్న జంటలెన్నో? కనీ గీ జంట గివీటికి అతీతం.! అదెట్లనో మీరే సూడుండ్రి. బీహార్ రాస్ట్రంల పాట్నా జిల్లాకు...

జూన్ 16, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--శుక్లపక్షం తిధి శు పాడ్యమి ఉదయం 06.37 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆరుద్ర రాత్రి 07.23 వరకు ఉపరి పునర్వసు యోగం గండ ఉదయం 07.29 వరకు ఉపరి వృద్ధి కరణం బవ ఉదయం 06.37...

జూన్ 15, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ అమావాస్య ఉదయం 09.06 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం మృగశిర రాత్రి 09.00 వరకు యోగం శూల ఉదయం 10.30 వరకు ఉపరి గండ కరణం నాగవ ఉదయం 09.06 వరకు ఉపరి...

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News