Tuesday, May 5, 2026
35.2 C
Hyderabad

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని స్థిరంగా బలోపేతం చేసుకునే అవకాశంగా ఉపయోగించుకోవాలి. ఆహార ధాన్యాలు, పప్పులు, నూనె గింజల విషయంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, దిగుమతులను తగ్గించుకునే దిశగా ఆలోచన చేయాలి.

ఇటీవలి కాలంలో భారత్ పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించింది. అయినప్పటికీ రైతులకు తగిన మద్దతు లభించడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ ధరకు పంటలను కొనుగోలు చేసే వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను తక్కువ ధరలకు మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో శనగ, మక్కజొన్న పంటలకు డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తుండగా, అప్పులు తీర్చాల్సిన ఒత్తిడితో కొంతమంది రైతులు తక్కువ ధరలకు పంటలను తెగనమ్ముకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ సంస్థల పాత్ర కీలకం. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పండుతున్న కందులు, శనగలు, పెసలు, మక్కజొన్న వంటి 25 రకాల పంటలను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశంలోని 24 వేల స్థానిక మార్కెట్లు, 125 ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో కూడా స్పష్టమైన ప్రణాళిక లేదు. నిజానికి రైతుల నుంచి పంటలను సక్రమంగా సేకరించి, ప్రజలకు ఆహార ధాన్యాల రూపంలో సరఫరా చేసే వ్యవస్థ బలహీనమైంది.

దిగుమతుల విధానం కూడా రైతులకు ప్రతికూలంగానే ఉంది. దేశంలో పప్పులు, నూనె గింజలు పండుతున్నప్పటికీ, భారీగా దిగుమతులు కొనసాగుతుండటం రైతులకు నష్టం కలిగిస్తోంది. దిగుమతులు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పడిపోతాయి. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. దేశీయ ఉత్పత్తి తగిన స్థాయిలో ఉన్నప్పుడు పప్పులు, నూనెల దిగుమతులపై తాత్కాలిక నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది.

వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా తక్కువ. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రూ.60 వేల కోట్ల వరకు ఖర్చే చేయలేదు. ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం కూడా ఆందోళనకరం. ధరల నియంత్రణకు తగిన వ్యవస్థే లేకపోవడం వల్ల రైతులకు తగిన ధరలు అందకపోగా, వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రైతులు కంపెనీల నుంచి కొనుగోలు చేసే విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోయినా, తగిన దిగుబడి ఇవ్వకపోయినా రైతులకు నష్టపరిహారం అందడం లేదు. 2001 విత్తన చట్టం ప్రకారం విత్తనాల నాణ్యత లోపిస్తే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొత్త విధానాల్లో కంపెనీలపై చర్యలు బలహీనంగా ఉండటం వల్ల రైతులే నష్టాన్ని భరించాల్సి వస్తోంది.

పంటల బీమా పథకాల అమలులో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి ఏడాది పంట బీమా కోసం రూ.15 వేల కోట్ల వరకు నిధులు కేటాయించినప్పటికీ రైతులకు అందుతున్న ప్రయోజనం పరిమితంగానే ఉంది. పెద్ద మొత్తంలో నిధులు బీమా కంపెనీలకే లాభంగా మారుతున్నాయయి. వాతావరణ సమాచారం, పంట అంచనాల విషయంలో కూడా ప్రైవేటు కంపెనీల డేటాపైనే ఆధారపడటం మరో సమస్యగా మారింది.

వ్యవసాయంలో వినియోగించే పురుగు మందుల ధరల నియంత్రణలో లేవు. అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ నియంత్రణలో లోపాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది సమగ్ర వ్యవసాయ విధానం. దేశీయంగా పండుతున్న పంటలకు సరైన ధరలు ఇవ్వడం, రైతుల నుంచి పంటలను సమర్థవంతంగా కొనుగోలు చేయడం, ప్రజలకు సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దిగుమతులు, ఎగుమతుల విషయంలో కూడా దేశీయ ఉత్పత్తి ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలు అవలంబించాలి.

దేశం ఆర్థికంగా బలపడాలంటే వ్యవసాయ రంగం బలంగా ఉండాలి. రైతు ఆనందంగా ఉంటేనే ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయి. అందుకే ఇప్పుడే సమగ్ర వ్యవసాయ విధానంపై విస్తృత చర్చ జరిపి, రైతు ప్రయోజనాలను కాపాడే దిశగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest News

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 03 నుండి మే 10 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత...

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News