Wednesday, August 19, 2026
26.1 C
Hyderabad

సాగు బాగుకు ఇదే సరైన సమయం!|EDITORIAL

ప్రపంచ రాజకీయ పరిణామాలు, పశ్చిమాసియాలో యుద్ధాలు, అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థను ప్రగాఢంగా ప్రభావితం చేస్తున్నాయి. ఎగుమతులు, దిగుమతులు తీవ్ర అంతరాయానికి గురవుతున్నాయి. ఈ సమయాన్ని భారత్ తన ఆహార భద్రత, వ్యవసాయ రంగాన్ని స్థిరంగా బలోపేతం చేసుకునే అవకాశంగా ఉపయోగించుకోవాలి. ఆహార ధాన్యాలు, పప్పులు, నూనె గింజల విషయంలో దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహిస్తూ, దిగుమతులను తగ్గించుకునే దిశగా ఆలోచన చేయాలి.

ఇటీవలి కాలంలో భారత్ పప్పు ధాన్యాలు, నూనె గింజల ఉత్పత్తిలో గణనీయమైన పురోగతి సాధించింది. అయినప్పటికీ రైతులకు తగిన మద్దతు లభించడం లేదు. కనీస మద్దతు ధర ప్రకటించినప్పటికీ ఆ ధరకు పంటలను కొనుగోలు చేసే వ్యవస్థ సరిగా లేదు. ఫలితంగా రైతులు తమ పంటలను తక్కువ ధరలకు మధ్యవర్తులకు అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తెలంగాణ వంటి రాష్ట్రాల్లో శనగ, మక్కజొన్న పంటలకు డిమాండ్ తగ్గింది. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో ఆలస్యం చేస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. శనగ పంటను నిల్వ ఉంచుకున్న రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కోసం ఎదురుచూస్తుండగా, అప్పులు తీర్చాల్సిన ఒత్తిడితో కొంతమంది రైతులు తక్కువ ధరలకు పంటలను తెగనమ్ముకుంటున్నారు.

దేశవ్యాప్తంగా ఆహార ధాన్యాల కొనుగోలులో కేంద్ర ప్రభుత్వ సంస్థల పాత్ర కీలకం. ఇటీవల వివిధ రాష్ట్రాల్లో పండుతున్న కందులు, శనగలు, పెసలు, మక్కజొన్న వంటి 25 రకాల పంటలను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. దేశంలోని 24 వేల స్థానిక మార్కెట్లు, 125 ప్రత్యేక వ్యవసాయ మార్కెట్ల నిర్వహణలో కూడా స్పష్టమైన ప్రణాళిక లేదు. నిజానికి రైతుల నుంచి పంటలను సక్రమంగా సేకరించి, ప్రజలకు ఆహార ధాన్యాల రూపంలో సరఫరా చేసే వ్యవస్థ బలహీనమైంది.

దిగుమతుల విధానం కూడా రైతులకు ప్రతికూలంగానే ఉంది. దేశంలో పప్పులు, నూనె గింజలు పండుతున్నప్పటికీ, భారీగా దిగుమతులు కొనసాగుతుండటం రైతులకు నష్టం కలిగిస్తోంది. దిగుమతులు పెరగడం వల్ల దేశీయ మార్కెట్లో ధరలు పడిపోతాయి. దీంతో రైతులకు పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితి ఏర్పడుతుంది. దేశీయ ఉత్పత్తి తగిన స్థాయిలో ఉన్నప్పుడు పప్పులు, నూనెల దిగుమతులపై తాత్కాలిక నియంత్రణ విధించాల్సిన అవసరం ఉంది.

వ్యవసాయ రంగానికి బడ్జెట్ కేటాయింపులు కూడా చాలా తక్కువ. కేంద్ర బడ్జెట్‌లో వ్యవసాయం, గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధుల్లో రూ.60 వేల కోట్ల వరకు ఖర్చే చేయలేదు. ధరల స్థిరీకరణ కోసం బడ్జెట్‌లో ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం కూడా ఆందోళనకరం. ధరల నియంత్రణకు తగిన వ్యవస్థే లేకపోవడం వల్ల రైతులకు తగిన ధరలు అందకపోగా, వినియోగదారులు అధిక ధరలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

రైతులు కంపెనీల నుంచి కొనుగోలు చేసే విత్తనాలు సరిగ్గా మొలకెత్తకపోయినా, తగిన దిగుబడి ఇవ్వకపోయినా రైతులకు నష్టపరిహారం అందడం లేదు. 2001 విత్తన చట్టం ప్రకారం విత్తనాల నాణ్యత లోపిస్తే కంపెనీలు రైతులకు నష్టపరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కానీ కొత్త విధానాల్లో కంపెనీలపై చర్యలు బలహీనంగా ఉండటం వల్ల రైతులే నష్టాన్ని భరించాల్సి వస్తోంది.

పంటల బీమా పథకాల అమలులో కూడా అనేక లోపాలు ఉన్నాయి. ప్రతి ఏడాది పంట బీమా కోసం రూ.15 వేల కోట్ల వరకు నిధులు కేటాయించినప్పటికీ రైతులకు అందుతున్న ప్రయోజనం పరిమితంగానే ఉంది. పెద్ద మొత్తంలో నిధులు బీమా కంపెనీలకే లాభంగా మారుతున్నాయయి. వాతావరణ సమాచారం, పంట అంచనాల విషయంలో కూడా ప్రైవేటు కంపెనీల డేటాపైనే ఆధారపడటం మరో సమస్యగా మారింది.

వ్యవసాయంలో వినియోగించే పురుగు మందుల ధరల నియంత్రణలో లేవు. అధిక ధరలకు అమ్ముతున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్ నియంత్రణలో లోపాలు ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

ఈ పరిస్థితుల్లో దేశానికి అవసరమైంది సమగ్ర వ్యవసాయ విధానం. దేశీయంగా పండుతున్న పంటలకు సరైన ధరలు ఇవ్వడం, రైతుల నుంచి పంటలను సమర్థవంతంగా కొనుగోలు చేయడం, ప్రజలకు సరసమైన ధరలకు ఆహార ధాన్యాలను అందించడం వంటి అంశాలపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. దిగుమతులు, ఎగుమతుల విషయంలో కూడా దేశీయ ఉత్పత్తి ప్రయోజనాలను కాపాడే విధంగా విధానాలు అవలంబించాలి.

దేశం ఆర్థికంగా బలపడాలంటే వ్యవసాయ రంగం బలంగా ఉండాలి. రైతు ఆనందంగా ఉంటేనే ఆహార భద్రత, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతాయి. అందుకే ఇప్పుడే సమగ్ర వ్యవసాయ విధానంపై విస్తృత చర్చ జరిపి, రైతు ప్రయోజనాలను కాపాడే దిశగా స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.

Latest News

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

ఆగస్టు19, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.సప్తమి రాత్రి 08.09 వరకు ఉపరి అష్టమి నక్షత్రం స్వాతి ఉదయం 08.58 వరకు ఉపరి విశాఖ యోగం శుక్ల ఉదయం 06.37 వరకు ఉపరి బ్రహ్మ కరణం గరజి ఉదయం 07.43 వరకు ఉపరి వణజి రాహుకాలం...

హవ్వ…ఆవు పెండ మట్టితోటి శివలింగం!?|ADUGU TRENDS

సావును తప్పించుకోవడానికి భక్త మార్కండేయుడు శివలింగాన్ని బిర్రుగ కావలిచ్చుని తపస్సు శేసిండు. యముడి పాశం శివలింగానికి తాకడంతోటి శివుడికి కోపమొచ్చిందిట. యముడిని తరిమికొట్టి మార్కండేయునికి చిరంజీవిగా వరం ఇచ్చిండట. గట్లనే తిన్నడు గదేనుల్ల భక్త...

మరి, ‘సౌరశక్తి మంథన్’ మాటేమిటి!?|EDITORIAL

చమురు, గ్యాస్‌ అన్వేషణ దేశానికి తక్షణ, వ్యూహాత్మక ప్రయోజనాలను అందించవచ్చు. కానీ అవి పరిమిత వనరులు. సూర్యుడు మాత్రం నిరంతర ఇంధన వనరు. అందుకే ‘సముద్ర మంథన్‌’తో పాటు ‘సౌర శక్తి మంథన్‌’...

ఆగస్టు 18, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం మంగళగౌరి వ్రతం తిధి శు.షష్ఠి రాత్రి 07.11 వరకు ఉపరి సప్తమి నక్షత్రం చిత్త ఉదయం 07.34 వరకు ఉపరి స్వాతి యోగం శుభ ఉదయం 07.00 వరకు ఉపరి శుక్ల కరణం కౌలవ ఉదయం 06.58 వరకు ఉపరి...

ఆగస్టు 17, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం నాగ పంచమి గరుడ పంచమి తిధి శు.పంచమి సాయంత్రం 06.43 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం హస్త ఉదయం 06.40 వరకు ఉపరి చిత్త యోగం సాధ్య ఉదయం 07.51 వరకు ఉపరి శుభ కరణం బవ ఉదయం...

గా ఊల్లె తాగొద్దు..!?|ADUGU TRENDS

ఎనకటికి 'మందు తాగనోడు దున్నపోతై పుట్టున్ ' అన్నరు. కానీ గా ఊరోల్లు మాత్రం మందు తాగితే జరిమానా ఏత్తం అంటున్నరు. పెండ్లి కానోళ్లు తాగొద్దట! పెండ్లి అయినోళ్ళు తాగొచ్చట? కానీ, కొట్లాడుకోవద్దట! తమిళనాడు...

రాహుల్ గాంధీ ముందున్న సవాల్ ఇదే!?|EDITORIAL

రాహుల్ గాంధీకి ఇప్పుడు ఎదురున్న అసలు సవాల్ మోదీని వ్యక్తిగతంగా విమర్శించడం కాదు. తన రాజకీయ శైలిని పునర్నిర్మించుకోవడం. సభలో హుందాతనం, వాస్తవాలపై పట్టు, విదేశాంగంపై బాధ్యతాయుతమైన భాష, పార్టీ పునర్వ్యవస్థీకరణ, యువ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News