Saturday, May 9, 2026
24.7 C
Hyderabad

బెంగాల్ లో బ్లేమ్ గేమ్!?

చట్టం ఎవరికీ చుట్టం కాదు. చట్టం ముందు అందరూ సమానమే. ఇది చెప్పడానికి బాగుంటుంది. కానీ, ఆచరించడమే కష్టంగా ఉంటుంది. అందరికంటే ఎక్కువగా చట్టాలను అతిక్రమిస్తున్నది కూడా ఆ చట్టాలు చేస్తున్న స్థానాల్లో ఉన్నవారే. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సవరించిన వక్ఫ్ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ తమ రాష్ట్రంలో అమలు చేయబోమని ఒక ముఖ్యమంత్రి కరాఖండిగా చెప్పడం దేనికి సంకేతం? నచ్చినా, నచ్చకపోయినా ఒక చట్టాన్ని అడ్డుకోలేకపోవడం వేరు. ఆ చట్టాన్ని అమలు చేయనే చేయమని చెప్పడం వేరు. ఈ ప్రకటన శాంతిభద్రతలకు ఎంతటి ఉప్రదవాలను తెచ్చిపెట్టినా సరే, రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమనుకునే ముఖ్యమంత్రులను ఏమనుకోవాలి? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అలాగే ప్రజాభిప్రాయాలకంటే పార్టీ సిద్ధాంతాలే ప్రాథామ్యాలనుకునే బీజేపీ లాంటి పార్టీలనేమనాలి? దేశంలో ఇప్పుడు పార్టీలకు, నాయకులకు ప్రజా ప్రయోజనాలకంటే కూడా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైపోయాయి.

పశ్చిమ బెంగాల్‌లో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయి. రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, స్వామి వివేకానంద లాంటి వారు జన్మించిన నేల ఇప్పుడు రక్తసిక్తంగా మారుతోంది. అనేక సమస్యలు బెంగాల్‌ను ఆవరించాయి. ప్రధానంగా శాంతిభద్రతలు అదుపు తప్పాయి. అత్యాచార ఘటనలు పెరిగాయి. బంగ్లా నుంచి చొరబాట్లు పెరిగాయి. అక్రమ వసలదారులు అక్కడ తిష్టవేసి, ఆధార్‌ సహా అన్నీ పొందుతున్నారు. వారిని తన్ని తరిమేమకుండా వారికి సౌకర్యాలు కల్పించి, ఓటు బ్యాంక్‌గా మార్చుకున్న తీరు క్షమించరానిది. బంగ్లాదేశ్‌ నుంచి వేలాది మంది ఏటా వస్తూనే ఉన్నారు. దీంతో స్థానికంగా అల్లర్లకు వారు కూడా కారణం అవుతున్నారు. మైనార్టీలను బుజ్జగించే క్రమంలో అక్రమ వలసదారులను చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఒకదాని వెంట ఒకటిగా చోటుచేసుకుంటున్న ఘటనలు ఆ రాష్ట్రంలో శాంతి భద్రతలకు సవాల్ గా పరిణమించాయి.

గతేడాది పార్లమెంటు ఎన్నికలకు ముందు జరిగిన సందేశ్‌ ఖలీ మానభంగాలు, కోల్‌కతాలో జరిగిన ట్రైనీ డాక్టర్‌ హత్యాచారం ఘటనలు పెను దుమారం రేపాయి. దేశ వ్యాప్త ఆందోళనలకు దారి తీశాయి. ఈ మధ్య 26 వేల మంది స్కూలు టీచర్ల నియామకాలను సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టడం దీదీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేసింది. తాజాగా వక్ఫ్‌ చట్టానికి వ్యతిరేకంగా అల్లర్లు మొదలయ్యాయి. అల్లర్లను అదుపు చేయడానికో లేక ముస్లీం ఓటు బ్యాంకును కాపాడుకోవడానికో గానీ, వక్ఫ్‌ చట్టం బెంగాల్లో అమలు కాదని దీదీ ప్రకటించేశారు. నిజానికి ఈ ప్రకటన అల్లర్లను ఆపలేకపోయినా, అదుపు చేయాలి. కానీ అలా జరగలేదు. సరికదా, అల్లర్లు పెచ్చరిల్లాయి. ఈ పరిణామాలే దీదీ వ్యవహారాలపై అనుమానాలను పెంచుతున్నాయి. వచ్చే యేడాది ఎన్నికల్లో మళ్లీ గెలవడమే లక్ష్యంగా మమతా బెనర్జీ ఎత్తుగడలు వేస్తున్నారు. దీదీని నిలువరించి, అధికారాన్ని ఎలాగైనా చేజిక్కుంచుకోవాలని బీజేపీ కాచుక్కూచుంది. అందుకే ఈ రెండు పార్టీలు పరస్పరం నిందారోపణలు చేసుకుంటున్నాయి. పార్టీలు, నేతల మాటలే ప్రశాంతతకు విఘాతం కలిగించడమే ఇక్కడ విడ్డూరం.

నిజానికి ముస్లిం జనాభా ఎక్కువగా గల యూపీలోనూ బెంగాల్ మాదిరి అల్లర్లు జరగలేదు. బెంగాల్ లోని ముర్షీదాబాద్‌, మాల్డా, దక్షిణ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాలు నిరసనలతో అట్టుడికాయి. ఈ అల్లర్లకు ముగ్గురు బలికాగా, భారీ స్థాయిలో ఆస్తులు ధ్వంసమయ్యాయి. నిరసనకారులు ప్రధాన రహదారుల్ని, రైల్వే ట్రాకుల్నీ దిగ్బంధం చేస్తూ ప్రజా జీవనానికి విఘాతం కలిగించారు. అయితే, వక్ఫ్‌ చట్టాన్ని అమలు చేయబోమని మమత హావిూ ఇచ్చినా అల్లర్లు ఆగకపోవడం అనుమానాలకు తావిస్తోంది. బెంగాల్లో విపక్ష బీజేపీ, అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ లు జరిగిన సంఘటనలకు బాధ్యత విూదంటే విూదేనంటూ దుమ్మెత్తి పోసుకుంటున్నాయి. టీచర్ల వ్యవహారంలో బదనాం అయిన ప్రభుత్వ ప్రతిష్టను పెంచుకోవడం, దాన్నుంచి ప్రజల దృష్టి మళ్ళించడం, ప్రజల్లో నెగెటివిటీని తగ్గించుకోవడానికే వక్ఫ్ సవరణ చట్టాన్ని వాడుకుంటోందని దీదీపై బీజేపీ, ఆ చట్టాన్ని తెచ్చిన బీజేపీదే బాధ్యత అని దీదీ విమర్శలు చేసుకుంటున్నారు.

అల్లర్లకు కేంద్ర బిందువైన ముర్షీదాబాద్‌ జిల్లాలో ముస్లిం జనాభాదే ఆధిపత్యం. ఈ జిల్లాలోని మూడు పార్లమెంటు సీట్లనూ తృణమూల్‌ కాంగ్రెసే గెలుచుకుంది. 22 అసెంబ్లీ స్థానాల్లో 20 సీట్లకు తృణమూల్‌ సభ్యులే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ ఆ పార్టీదే పైచేయి. అలాంటప్పుడు, అల్లర్లు ఎలా చెలరేగాయన్న ప్రశ్నకు అధికార పార్టీ నుంచి జవాబు లేకపోవడం గమనార్హం. ఈ కారణంగానే బీజేపీ తృణమూల్‌ కాంగ్రెస్ ను విమర్శిస్తోంది. తృణమూల్‌ కాంగ్రెస్ అల్లర్లకు నెపాన్ని బీజేపీపై నెడుతోంది.

గతంలో పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడూ ముర్షీదాబాద్‌ భగ్గుమంది. వక్ఫ్‌ చట్టంలో లొసుగులున్నాయని ఎవరైనా భావిస్తే, వాటిని న్యాయస్థానాలలో సవాల్‌ చేసే హక్కు, అవకాశం ఉంది. అంతే తప్ప, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుని అల్లర్లకు దిగడం సమంజసం కాదు. అయితే అక్కడి రాష్ట్ర ప్రభుత్వ ప్రేక్షక పాత్రపై సర్వత్రా అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యతాయుతమైన సిఎం పదవిలో ఉన్న దీదీ పార్లమెంటు ఆమోదించిన వక్ఫ్‌ చట్టాన్ని అమలు చేయబోమని ఎలా చెబుతారనేది ప్రజలకు వివరణ ఇవ్వాలి. అల్లర్లను ప్రభుత్వ పరంగా అదుపు చేయాలి. అలాగే బీజేపీ సైతం వక్ఫ్ చట్టంపై ముస్లీంలలో నెలకొన్న అనుమానాలను తొలగించాలి. రాజకీయ అధికారం కోసం కాకుండా, ప్రజల శ్రేయోభిలాషిగా ప్రవర్తించాలి. మరో ఏడాదిలో శాసనసభ ఎన్నికలు జరగనున్న బెంగాల్‌లో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు కేవలం రాజకీయం కోసమే అన్నది సుస్పష్టం.

Latest News

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

07-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి పంచమి ఉదయం 06.31 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం సాధ్య రాత్రి 10.59 వరకు ఉపరి శుభ కరణం తైతుల ఉదయం 06.31...

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News