Thursday, June 4, 2026
29.5 C
Hyderabad

ప్రజా సమస్యలను విస్మరించిన పార్లమెంట్|EDITORIAL

భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై, డిసెంబర్ 19న ముగిశాయి. ఈ సెషన్, దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలం జరిగినవాటిలో ఒకటిగా నిలిచింది. అతి ముఖ్యమైన అంశాలు చర్చకు రాకుండాపోయి, చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందిన అరుదైన సెషన్ కూడా ఇదేనేమో! ప్రధాని, ప్రతిపక్ష నేతలు లేకుండానే ముగిసిన సెషన్ కూడా ఇదే!! ఈ స్వల్పకాలిక సెషన్‌లో 13 బిల్లులు ఆమోదం పొందాయి. ముఖ్యంగా అణుశక్తి, ఉన్నత విద్య, ఉపాధి హామీ చట్టం, పన్నులకు సంబంధించిన బిల్లులు చర్చకు వచ్చాయి. ఉపాధి హామీ పేరు మార్చి జీ రాం జీ చట్టం వచ్చింది. అయితే, ఈ చర్చల్లో ఢిల్లీ కాలుష్యం వంటి కీలక అంశాలను విస్మరించడం కూడా విశేషమే.

తొలి రోజు నుంచే గందరగోళం, ఆందోళనలు, వాకౌట్లు, ధర్నాలతోనే సమావేశాలు సాగాయి. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వం, పాలకపక్షాలతోపాటు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్షాలు కూడా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాయి. ఒకప్పుడు పార్లమెంటులో విపక్షాలదే పైచేయిగా ఉండేది. ఈసారి విపక్షాల్లో చొరవలేమి, అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించాయి. ఫలితంగా అధికార ఎన్‌డీఏ కూటమి తనకు అనుకూలమైన అజెండాతోనే సునాయసంగా సమావేశాలను నడిపించి, ముగించింది.

వందేమాతరంపై ఇష్టానుసారంగా చర్చించిన, ప్రభుత్వం, ఎన్నికల సంస్కరణలపై చర్చను తూతూ మంత్రంగా ముగించింది. 9 రాష్టాల్రు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న రెండవ విడత ఓటర్ల జాబితా సవరణ పై ఎన్నికల సంస్కరణ పేరుతో చర్చించినా విపక్షాలు సఫలం కాలేదు. దేశంలో సర్ కారణంగా 11 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినా, ఎవరి ఓటు ఎలా ప్రభావితమవుతుందో అర్థం చేయలేకపోయారు.

సెల్‌ఫోన్ల ద్వారా వ్యక్తుల రహస్యాలను సేకరించేందుకు ఉద్దేశించిన ’సంచార్‌ సాథి’ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించి, ప్రతిఘటనతో వెనక్కు తగ్గారు. 71 పాత చట్టాలను రద్దు లేదా సవరణ చేసే మరో బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. పార్లమెంట్‌ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వ చర్యల గురించి పార్లమెంట్‌కు చెప్పాల్సిన బాధ్యతను ప్రభుత్వం, చెప్పించాల్సిన బాధ్యతను విపక్షం విస్మరించింది. ‘వికసిత్ భారత్‌’ రాజధాని ఢిల్లీలో ఒకరోజు నివసిస్తే 15 సిగరెట్లు కాల్చిన దానికి సమాన నష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి కాలుష్య నియంత్రణను కూడా వదిలేశారు. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ 91 రూపాయలకు పడిపోవడం వల్ల ముడిచమురు, పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, కనీస ప్రస్థావనకు రాలేదు.

ఇక కార్మిక చట్టాల సవరణలు, 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించిన బిల్లు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించినా, చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. 1962 నాటి అణుశక్తి, 2010 నాటి పౌర అణు నష్టబాధ్యత చట్టాలను సవరిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించారు. అణుశక్తి, బీమా వంటి వ్యూహాత్మక, కీలక రంగంలోకి తమకిష్టమైన కార్పొరేట్‌ కంపెనీలకు అనుమతులు ఇచ్చి అణురక్షణ, దేశ భద్రతను ప్రమాదంలో వేశారు. అణు ప్రమాదాల సమయంలో పౌరులకు చెల్లించాల్సిన నష్టపరిహార బాధ్యతను కంపెనీల ఇష్టానికి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై కూడా కేంద్రం సమగ్ర వివరణ ఇవ్వలేదు.

కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించి 5 వేల విమాన సర్వీసులను రద్దు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చిన ప్రైవేట్‌ విమాన సర్వీసు ’ఇండిగో’ గురించి, హెచ్‌1 బి వీసా, సుంకాల పెంపు, రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్‌ నిర్ణయాల వల్ల ప్రభావంపై చర్చ జరగనేలేదు. ఇవన్నీ చర్చించి, ప్రజల మనసులు గెలవాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ అనుభవ రాహిత్యం, ఆయన అనుచరుల వ్యూహాత్మక తప్పిదాల కారణంగా అనేక సమస్యలు ఎప్పటిలానే వెనకబడి పోయాయి. ఇందుకు ప్రభుత్వాన్ని నిందించడం కన్నా, విఫలం అయినందుకు విపక్షాన్ని విమర్శించాల్సిందే. దునుమాడాల్సిందే.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ, అనేక కీలక అంశాలు చర్చించాల్సిన సమయంలో, ప్రధాని మోదీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ విదేశీ పర్యటనల్లో ఉండటం విమర్శలకు దారితీసింది. వారు తమ ప్రధాన బాధ్యతను విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తంగా ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, రాజకీయ వ్యూహాలు, అనుభవ రాహిత్యం మధ్య శీతాకాల సమావేశాలు ముగియడం ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ పాత్రపై ఆందోళనను కలిగిస్తున్నాయి.

Latest News

నల్లా దానంతటదే బందైతది!|ADUGU TRENDS

నల్లా పెట్టుడే కాదుల్లా, బంజేసుడు కూడా పెద్ద పనే. నల్లా తిప్పితే నీళ్లొత్తయి. కనీ, నల్లా బంజేయాల్నంటే, గాడ కావలి కాయాలె. లేకపోతే, నా నీల్లన్నీ తొణికి, బయటకి కారిపోతయి. గట్ల కావొద్దని...

‘మమత’ల కోవెలలో వేరుకుంపట్ల కలతలు|EDITORIAL

పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో మూడు దశాబ్దాలకుపైగా కొనసాగిన వామపక్ష పాలనకు ముగింపు పలికి, 2011లో అధికారంలోకి వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ రాష్ట్ర రాజకీయాలను పూర్తిగా మార్చేశారు. గత పదిహేనేళ్లుగా...

04-06-2026, గురువారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి...

ట్రాక్టర్ ట్రాలే స్విమ్మింగ్ పూల్!?|ADUGU TRENDS

ఎన్కటికి శేద బాయిలు, ఈత బాయిలుండేయి. శేద బాయిలు మంచినీల్లకు, ఈత బాయిలు ఎండాకాలం పిల్లలు, పెద్దలు ఈదడాన్కే ఉండేటియి. ఊరు ఊరంతా గా బాయిల్లనే ఉండేది. ఈత మీద మోజు తగ్గనోల్లు,...

ఇంధన రేషనింగ్ విధానమే మేలు!|EDITORIAL

ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సవాల్ కేవలం పెట్రోల్ ధరల పెరుగుదల మాత్రమే కాదు. అది ఇంధన భద్రత, ఆర్థిక స్థిరత్వం, ప్రజల జీవన ప్రమాణాలకు సంబంధించిన అంశం. ధరలను పెంచి భారాన్ని ప్రజలపై...

03-06-2026, బుధవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:44 సంకల్ప తిథి: కృష్ణ-చవితి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-చవితి తిథి : కృష్ణ-చవితి రాత్రి 11:30 వరకు, తదుపరి కృష్ణ-పంచమి నక్షత్రము...

పెండ్లంటే, గిదే పొండ్లి!?|ADUGU TRENDS

ఇగో పెండ్లంటే గిదే.. గిట్లనే.. అబ్బో గట్లనా? అన్నట్లుగా శేసుకుంటాండ్లు. లచ్చలు, కోట్లు కర్సు పెడ్తాండ్లు. పెండ్లి పిల్ల, పిల్లగాండ్ల మీద కోట్లు కుమ్మరిస్తాండ్లు. కట్న కానుకలతోటి పని లేకుండ, పెండ్లి కర్సునే...

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా...

03-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2 సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-తదియ శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-తదియ తిథి : కృష్ణ-తదియ...

ఐపీఎల్ లో 5 అవార్డులు గెలుచుకున్న వైభవ్|IPL|VAIBHAV SURYAVANSHI

అవార్డుల వర్షం కురిపించిన స్టార్ ఆటగాళ్లు! ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ అభిమానులకు ఎన్నో ఉత్కంఠభరిత క్షణాలను అందించింది. యువ ఆటగాళ్ల సత్తా, సీనియర్ క్రికెటర్ల అనుభవం, చివరి బంతి వరకు సాగిన...

ఈ సాలా కప్ నమ్దే రీలోడెడ్|RCB|IPL|CUP|FINAL

గుజరాత్‌ను మట్టి కరిపించిన RCB ఐపీఎల్ 2026 మకుటాన్ని ముద్దాడిన బెంగళూరు! ఐపీఎల్ 2026 ఫైనల్ పోరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మరోసారి చరిత్ర సృష్టించింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్...

01-06-2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:43 సంకల్ప తిథి: కృష్ణ-పాడ్యమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-పాడ్యమి తిథి : కృష్ణ-పాడ్యమి సాయంత్రం 4:39 వరకు, తదుపరి కృష్ణ-విదియ నక్షత్రము...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News