Monday, July 13, 2026
29.3 C
Hyderabad

ప్రజా సమస్యలను విస్మరించిన పార్లమెంట్|EDITORIAL

భారత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1న ప్రారంభమై, డిసెంబర్ 19న ముగిశాయి. ఈ సెషన్, దేశ చరిత్రలోనే అతి తక్కువ కాలం జరిగినవాటిలో ఒకటిగా నిలిచింది. అతి ముఖ్యమైన అంశాలు చర్చకు రాకుండాపోయి, చర్చలేకుండానే బిల్లులు ఆమోదం పొందిన అరుదైన సెషన్ కూడా ఇదేనేమో! ప్రధాని, ప్రతిపక్ష నేతలు లేకుండానే ముగిసిన సెషన్ కూడా ఇదే!! ఈ స్వల్పకాలిక సెషన్‌లో 13 బిల్లులు ఆమోదం పొందాయి. ముఖ్యంగా అణుశక్తి, ఉన్నత విద్య, ఉపాధి హామీ చట్టం, పన్నులకు సంబంధించిన బిల్లులు చర్చకు వచ్చాయి. ఉపాధి హామీ పేరు మార్చి జీ రాం జీ చట్టం వచ్చింది. అయితే, ఈ చర్చల్లో ఢిల్లీ కాలుష్యం వంటి కీలక అంశాలను విస్మరించడం కూడా విశేషమే.

తొలి రోజు నుంచే గందరగోళం, ఆందోళనలు, వాకౌట్లు, ధర్నాలతోనే సమావేశాలు సాగాయి. ప్రజా సమస్యలను విస్మరించిన ప్రభుత్వం, పాలకపక్షాలతోపాటు, ప్రజల తరఫున ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన విపక్షాలు కూడా ఆ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించలేకపోయాయి. ఒకప్పుడు పార్లమెంటులో విపక్షాలదే పైచేయిగా ఉండేది. ఈసారి విపక్షాల్లో చొరవలేమి, అనుభవ రాహిత్యం స్పష్టంగా కనిపించాయి. ఫలితంగా అధికార ఎన్‌డీఏ కూటమి తనకు అనుకూలమైన అజెండాతోనే సునాయసంగా సమావేశాలను నడిపించి, ముగించింది.

వందేమాతరంపై ఇష్టానుసారంగా చర్చించిన, ప్రభుత్వం, ఎన్నికల సంస్కరణలపై చర్చను తూతూ మంత్రంగా ముగించింది. 9 రాష్టాల్రు, 3 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతున్న రెండవ విడత ఓటర్ల జాబితా సవరణ పై ఎన్నికల సంస్కరణ పేరుతో చర్చించినా విపక్షాలు సఫలం కాలేదు. దేశంలో సర్ కారణంగా 11 కోట్ల మంది ఓటు హక్కు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసినా, ఎవరి ఓటు ఎలా ప్రభావితమవుతుందో అర్థం చేయలేకపోయారు.

సెల్‌ఫోన్ల ద్వారా వ్యక్తుల రహస్యాలను సేకరించేందుకు ఉద్దేశించిన ’సంచార్‌ సాథి’ బిల్లును తీసుకురావడానికి ప్రయత్నించి, ప్రతిఘటనతో వెనక్కు తగ్గారు. 71 పాత చట్టాలను రద్దు లేదా సవరణ చేసే మరో బిల్లును పార్లమెంట్‌ ఆమోదించింది. పార్లమెంట్‌ సమావేశాలకు కొద్ది రోజుల ముందు ఢిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలనకు ప్రభుత్వ చర్యల గురించి పార్లమెంట్‌కు చెప్పాల్సిన బాధ్యతను ప్రభుత్వం, చెప్పించాల్సిన బాధ్యతను విపక్షం విస్మరించింది. ‘వికసిత్ భారత్‌’ రాజధాని ఢిల్లీలో ఒకరోజు నివసిస్తే 15 సిగరెట్లు కాల్చిన దానికి సమాన నష్టమని నిపుణులు చెబుతున్నారు. ఇంతటి కాలుష్య నియంత్రణను కూడా వదిలేశారు. డాలర్‌తో మారకంలో రూపాయి విలువ 91 రూపాయలకు పడిపోవడం వల్ల ముడిచమురు, పెట్రో డీజిల్, నిత్యావసర ధరలు పెరుగుతాయన్న ఆందోళన ఉన్నప్పటికీ, కనీస ప్రస్థావనకు రాలేదు.

ఇక కార్మిక చట్టాల సవరణలు, 29 చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించిన బిల్లు, కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు వ్యతిరేకించినా, చర్చ లేకుండానే ఆమోదం పొందాయి. 1962 నాటి అణుశక్తి, 2010 నాటి పౌర అణు నష్టబాధ్యత చట్టాలను సవరిస్తూ పార్లమెంట్‌లో బిల్లు ఆమోదించారు. అణుశక్తి, బీమా వంటి వ్యూహాత్మక, కీలక రంగంలోకి తమకిష్టమైన కార్పొరేట్‌ కంపెనీలకు అనుమతులు ఇచ్చి అణురక్షణ, దేశ భద్రతను ప్రమాదంలో వేశారు. అణు ప్రమాదాల సమయంలో పౌరులకు చెల్లించాల్సిన నష్టపరిహార బాధ్యతను కంపెనీల ఇష్టానికి వదిలేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఢిల్లీలో జరిగిన పేలుళ్లు, రక్షణ వైఫల్యాలు, ఉగ్రవాద నిర్మూలన చర్యలపై కూడా కేంద్రం సమగ్ర వివరణ ఇవ్వలేదు.

కేంద్రం నిర్ణయాన్ని ధిక్కరించి 5 వేల విమాన సర్వీసులను రద్దు చేసి దేశ ప్రతిష్టను దిగజార్చిన ప్రైవేట్‌ విమాన సర్వీసు ’ఇండిగో’ గురించి, హెచ్‌1 బి వీసా, సుంకాల పెంపు, రష్యా చమురు దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్న ట్రంప్‌ నిర్ణయాల వల్ల ప్రభావంపై చర్చ జరగనేలేదు. ఇవన్నీ చర్చించి, ప్రజల మనసులు గెలవాల్సిన ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ అనుభవ రాహిత్యం, ఆయన అనుచరుల వ్యూహాత్మక తప్పిదాల కారణంగా అనేక సమస్యలు ఎప్పటిలానే వెనకబడి పోయాయి. ఇందుకు ప్రభుత్వాన్ని నిందించడం కన్నా, విఫలం అయినందుకు విపక్షాన్ని విమర్శించాల్సిందే. దునుమాడాల్సిందే.

పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న వేళ, అనేక కీలక అంశాలు చర్చించాల్సిన సమయంలో, ప్రధాని మోదీ, ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ విదేశీ పర్యటనల్లో ఉండటం విమర్శలకు దారితీసింది. వారు తమ ప్రధాన బాధ్యతను విస్మరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మొత్తంగా ప్రజల సమస్యలను గాలికి వదిలేసి, రాజకీయ వ్యూహాలు, అనుభవ రాహిత్యం మధ్య శీతాకాల సమావేశాలు ముగియడం ప్రజాస్వామ్యంలో పార్లమెంట్ పాత్రపై ఆందోళనను కలిగిస్తున్నాయి.

Latest News

శ్రీ బీరన్న స్వామి బోనాల ఆహ్వానం..|INVITATION|BEERANNA SWAMY

మంత్రి కొండా సురేఖను కలిసిన కమిటీ సభ్యులు|MINISTER|KONDA SUREKHA వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన కరీమాబాద్ శ్రీ బీరన్న స్వామి దేవస్థానం కమిటీ సభ్యులు రాష్ట్ర మంత్రి కొండా సురేఖను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ...

జూలై 13, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 06.23 వరకు ఉపరి అమావాస్య నక్షత్రం ఆరుద్ర రాత్రి తెల్ల 03.40 వరకు ఉపరి పునర్వసు యోగం ధ్రువ సాయంత్రం 04.58 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 07.40...

మర మనుసులతోటి ఆపరేషన్లు!?|ADUGU TRENDS

ఆపరేషన్లు ఎవలు శేత్తరు? ఏ తియ్ గిది తెల్వదా? డాక్టర్లే శేత్తరు. మరి గా యంత్రాలే శేత్తే? గిది అంతుశిక్కని ఆలోశనే కదా? గీ మద్దెల మర మనుసులు గదేనుల్లా మనుసుల్లెక్కనే ఉండే...

ఇదేంటి ‘సర్’!?|EDITORIAL

‘సర్’ ప్రధాన ఉద్దేశం మరణించిన వారి పేర్లు తొలగించడం, చిరునామా మార్పులు నమోదు చేయడం, నకిలీ నమోదులను తొలగించడం, ఓటరు జాబితాను మరింత విశ్వసనీయంగా రూపొందించడం. పీఎం., సీఎం నుంచి సాధారణ పౌరుడి...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 12 నుండి జూలై 18 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో...

పుట్టిన రోజుకు కోళ్లను పంచిండు!?|ADUGU TRENDS

ఎవ్వలైనా పుట్టిన రోజుకు బవుమతులు తీసుకుంటరు. ఇయ్యరు. గీ మద్దెలనే ఇచ్చే పద్ధతి కూడా వచ్చిందనుకోండ్రి. ఒకేల ఇచ్చినా, ఏ కేకులనో, ఏ మిఠాయి డబ్బలనో, ఏదన్న వస్తువులనో పంచుతరు. కనీ, గీయినేం...

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు...

జూలై 11, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి రాత్రి 11.20 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం కృత్తిక ఉదయం 08.35 వరకు ఉపరి భరణి యోగం గండ రాత్రి 11.01 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 12.30 వరకు ఉపరి...

నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది!?|ADUGU TRENDS

అవుమల్ల.. మీరు సదివింది నిజమేనుల్లా! నిజంగా నెట్ వర్క్ లేకున్నా, గీ పోను పని శేత్తది? ఎటువంటి పతికూల పరిస్థితుల్ల గూడ గిది ఆగిపోదు. గిదీన్ని అంతరిక్ష పోను గదే, శాటిలైట్ పోను...

వ్యవ‘సాయ’మేది!?|EDITORIAL

ప్రకృతి వైపరీత్యాలు ఇప్పుడు కొత్త రూపం దాల్చాయి. ఒక ఏడాది కరువు, మరో ఏడాది అకాల వర్షాలు, వరదలు, తుఫాన్లు, వడగండ్లు, వాతావరణ మార్పులు వ్యవసాయాన్ని పూర్తిగా అయోమయంలోకి నెట్టాయి. రైతు శ్రమించినా...

జూలై 10, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు జ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం ఏకాదశి తిధి ఏకాదశి రాత్రి 01.41 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం భరణి ఉదయం 10.01 వరకు ఉపరి కృత్తిక యోగం శూల రాత్రి 02.00 వరకు ఉపరి గండ కరణం బవ మధ్యాహ్నం 02.46 వరకు ఉపరి...

చారిత్రక పూర్వయుగ సంస్కృతులు|HISTORY|ADUGU SPECIAL|COMPITITVE|EXAMS

(ఆది నుండి క్రీ.పూ.2500 వరకు) లిపి ఆధారంగా ప్రాచీన కాలాన్ని మూడు యుగాలుగా మన చరిత్రకారులు విభజించారు. 1) చారిత్రక పూర్వయుగం (Pre-historic Age). 2) చారిత్రక సంధియుగం (Proto-historic Age) 3) చారిత్రక యుగం (Historic Age) 1)...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News