Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

పలు అంశాల్లో Congress|కాంగ్రెస్, BRS|బీఆర్ఎస్ లు ఒక్కటే

CENTRAL MINISTER|కేంద్ర మంత్రి KISHAN REDDY|కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం అవినీతి అంశాలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టుకు బీజేపీ తరఫున ఇప్పటికే పిటిషన్ వేశామని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఉత్తరం రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీబీఐ విచారణపై నిశ్శబ్దంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. నాటి హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయవాదులు, వ్యాపారులు, నటులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్నారు. అంతేకాకుండా తన ఫోన్‌తో పాటు బీజేపీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు పేర్కొన్నారు. అందుకే సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని, ఆ దిశగా త్వరలో తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కేంద్రం పరిశీలనలో ఉందని, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించిందన్నారు. ఈ అంశంపై జల ఒప్పందాలు, నిబంధనలు, గైడ్‌లైన్లు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్ర పరిశీలన జరిపి తుది నివేదికను కేంద్రానికి అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇంతవరకు ఎవరికీ అన్యాయం జరగలేదని, జరగబోదని చెప్పారు. తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలన్న సూచన చేశారు.

ఇటీవల కొన్ని విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ… కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు అనే విమర్శలు తగవని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వరద జలాల సమస్యలు ఉన్నా, ఇప్పటివరకు సమాచార మార్పిడి జరగలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్ర జలశక్తి మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలని, అవసరమైతే ఏపీ సీఎం పిలిపించి మాట్లాడే బాధ్యతను కేంద్రం చేపట్టాలని సూచించారు.

కాళేశ్వరం విషయంలో బీజేపీ ధోరణి ఎప్పటిలానే స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని అప్పుడే నిపుణులు హెచ్చరించారని, ఇప్పుడు మేడిగడ్డకు వచ్చిన పగుళ్లు వారి మాటలు నిజమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాస్తవాలపై గౌరవం లేకుండా తన దిశను మార్చుకోవడం బాధాకరమన్నారు.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News