Sunday, May 10, 2026
35.2 C
Hyderabad

పలు అంశాల్లో Congress|కాంగ్రెస్, BRS|బీఆర్ఎస్ లు ఒక్కటే

CENTRAL MINISTER|కేంద్ర మంత్రి KISHAN REDDY|కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు

తెలంగాణలో చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం, బనకచర్ల ప్రాజెక్టు, కాళేశ్వరం అవినీతి అంశాలపై కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రాష్ట్ర హైకోర్టుకు బీజేపీ తరఫున ఇప్పటికే పిటిషన్ వేశామని ఆయన తెలిపారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తలపెట్టిన ప్రజావ్యతిరేక చర్యలపై సీబీఐ విచారణ జరపాలంటూ కాంగ్రెస్ పార్టీ కేంద్రానికి ఉత్తరం రాసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ సీబీఐ విచారణపై నిశ్శబ్దంగా ఉండటం ఏమిటని ప్రశ్నించారు. నాటి హైకోర్టుకు ఇచ్చిన నివేదిక ప్రకారం న్యాయవాదులు, వ్యాపారులు, నటులు, రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాప్ చేయబడ్డాయన్నారు. అంతేకాకుండా తన ఫోన్‌తో పాటు బీజేపీ కార్యాలయంలో పనిచేసే సిబ్బంది ఫోన్లు కూడా ట్యాప్ చేయబడినట్లు పేర్కొన్నారు. అందుకే సీబీఐతో సమగ్ర దర్యాప్తు జరిపించి దోషులను శిక్షించాలని కోరుతూ బీజేపీ హైకోర్టును ఆశ్రయించిందని, ఆ దిశగా త్వరలో తీర్పు వస్తుందని ఆశిస్తున్నట్టు వెల్లడించారు.

బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ కేంద్రం పరిశీలనలో ఉందని, ఏపీ ప్రభుత్వం ఇప్పటికే తమ నివేదికను కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖకు, సెంట్రల్ వాటర్ కమిషన్‌కు సమర్పించిందన్నారు. ఈ అంశంపై జల ఒప్పందాలు, నిబంధనలు, గైడ్‌లైన్లు, ఇతర రాష్ట్రాల అభిప్రాయాలన్నింటినీ పరిగణనలోకి తీసుకొని సెంట్రల్ వాటర్ కమిషన్ సమగ్ర పరిశీలన జరిపి తుది నివేదికను కేంద్రానికి అందిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆ నివేదిక ఆధారంగా సరైన నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. ఇంతవరకు ఎవరికీ అన్యాయం జరగలేదని, జరగబోదని చెప్పారు. తెలంగాణ తరఫున రాష్ట్ర ప్రభుత్వం బలమైన వాదనలు వినిపించాలన్న సూచన చేశారు.

ఇటీవల కొన్ని విమర్శల నేపథ్యంలో స్పందిస్తూ… కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారు అనే విమర్శలు తగవని తెలిపారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య నీటి పంపకాలు, వరద జలాల సమస్యలు ఉన్నా, ఇప్పటివరకు సమాచార మార్పిడి జరగలేదని అన్నారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చలు జరపాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసం కేంద్ర జలశక్తి మంత్రికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉత్తరం రాయాలని, అవసరమైతే ఏపీ సీఎం పిలిపించి మాట్లాడే బాధ్యతను కేంద్రం చేపట్టాలని సూచించారు.

కాళేశ్వరం విషయంలో బీజేపీ ధోరణి ఎప్పటిలానే స్పష్టంగా ఉందని చెప్పారు. ఈ ప్రాజెక్టులో దోపిడీ జరిగిందని అప్పుడే నిపుణులు హెచ్చరించారని, ఇప్పుడు మేడిగడ్డకు వచ్చిన పగుళ్లు వారి మాటలు నిజమయ్యాయని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో కూడా సీబీఐ దర్యాప్తు కోరామన్నారు. ఇప్పుడు కూడా అదే డిమాండ్ కొనసాగుతుందని చెప్పారు. గతంలో సీబీఐ దర్యాప్తు కోరిన కాంగ్రెస్ పార్టీ, అధికారంలోకి వచ్చాక వాస్తవాలపై గౌరవం లేకుండా తన దిశను మార్చుకోవడం బాధాకరమన్నారు.

Latest News

తమిళనాడు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం|TAMILNADU|CM|THALAPATAHY VIJAY

కొత్త శకం ఆరంభం తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత, సినీ నటుడు జోసెఫ్ విజయ్ ఆ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. చెన్నైలోని జవహర్లాల్...

అసలే కోతి.. ఆపై సవురం!?|ADUGU TRENDS

పని లేని ఒకాయినె పిలిసి పిల్లి తల కొరిగిండని సామెత. గది సరే గనీ, మరి గీ కోతి మాత్రం.. ఏకంగా గా మంగళాయనె దగ్గరికి పోయి, సవురం శేయించుకుంది. గీ యింతేందో...

తమిళనాట కొత్త కథా చిత్రం!|EDITORIAL

తమిళనాడు రాజకీయాల్లో ఉత్కంఠ వీడింది. గత కొన్ని రోజులుగా నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది. ప్రజా తీర్పు తర్వాత కొనసాగిన అనిశ్చితి, పెద్ద పార్టీల కుట్రలు, చిన్న పార్టీల బేరసారాలు, మద్దతు లేఖల హైడ్రామా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|RASHI PHALALU|WEEKLY|TODAY

మే 10 నుండి మే 16 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం కనిపిస్తుంది. పనుల్లో ఆలస్యాలు తగ్గి ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. ఉద్యోగంలో...

గింత బట్ట తున్కతోటి గంత పట్టీలా!?|ADUGU TRENDS

పని ఎంత పెద్దదైనా, శిన్న శిన్న శిట్కాలతోటి సిడెంల శేయొచ్చు. గా ఆటల పోటీలకు, ఎవలన్న ముక్యమైనోల్లు వచ్చినప్పుడు పట్టీలు, ముగ్గులు ఏత్తరు కదా? గయి ఏయాల్నంటే బొచ్చెడు పని మనుసులు, శానా...

తమిళనాడు హంగ్-గవర్నర్-టీవీకే కింకర్తవ్యం?|EDITORIAL

హంగ్ సమయంలో ఎవరిని ముందుగా పిలవాలి? అతిపెద్ద పార్టీనా? లేక మెజారిటీ మద్దతు ఉన్న కూటమినా? అన్న విషయంలో రాజ్యాంగం స్పష్టమైన విధానం నిర్దేశించలేదు. ఇక్కడే గవర్నర్ విచక్షణాధికారం ప్రాధాన్యం సంతరించుకుంది. మన...

09-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ సప్తమి ఉదయం 09.15 వరకు ఉపరి అష్టమి నక్షత్రం శ్రవణ రాత్రి 07.05 వరకు ఉపరి ధనిష్ఠ యోగం శుక్ల రాత్రి 10.43 వరకు ఉపరి బ్రహ్మ కరణం బవ ఉదయం...

ట్యూబ్ కు పొక్క.. తెల్సుకోండ్రి గిట్ల!?|ADUGU TRENDS

గా చైనాల గిప్పటికీ సైకోల్లే తొక్కుతాండ్లట. గిప్పుడైతే గయి మన దేశంల మోటైపోయినయి గనీ, ఎన్కటికి సైకోల్లు ఎక్కువ తొక్కేది. గదే పెద్ద రెండు గిర్రల బండి. ఇగ ఇంట్లనే గాలి కొట్టేది....

ధాన్యం కొనుగోల్ మాల్!|EDITORIAL

దేశంలో వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది కుటుంబాల జీవనాధారం. కానీ రైతు పండించిన పంటను ప్రభుత్వాలు కొనుగోలు చేసే విధానం ప్రతి ఏడాది గందరగోళానికీ, వివాదానికీ కారణమవుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్షల టన్నుల...

08-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి ఉదయం 08.05 వరకు ఉపరి సప్తమి నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 05.26 వరకు ఉపరి శ్రవణ యోగం శుభ రాత్రి 11.02 వరకు ఉపరి శుక్ల కరణం వణజి ఉదయం...

తాలు, తేమను తీసే మిషిని!?|ADUGU TRENDS

రోజులు మార్తానయి. గట్లనే గా యెవుసం శేసే పద్ధతులు గూడ మార్తానయి. అన్నిట్ల లెక్కనే గిండ్ల గూడ మిషిన్లొత్తానయి. అయితే కొత్త ఆలోశెనలు, సరికొత్త ఉపాయాలను తెత్తానయి. గసొంటిదే గిది మీరే సూడుండ్రి. యెద్దు,...

విపరీత రాజకీయ ధోరణులు!|EDITORIAL

ప్రపంచంలోనే అతిపెద్దదైన భారత ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక.. ప్రజల తీర్పు, పాలనపై సమీక్ష, భవిష్యత్ దిశను నిర్ణయించే కీలక ఘట్టం. ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల వైఖరులు,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News