Friday, July 17, 2026
26.4 C
Hyderabad

అప్పుడే మనకు నిజమైన స్వాతంత్ర్యం సిద్ధించినట్లు!|INDIA|INDEPENDENCE DAY

1947 ఆగస్టు 15న భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది. రెండు శతాబ్దాలపాటు బ్రిటిష్ పాలనలో నలిగిపోయిన మన దేశం, ఎన్నో త్యాగాలు, పోరాటాలు, ప్రాణ త్యాగాలతో ఆ బంధనాల నుంచి విముక్తి పొందింది. అప్పట్లో స్వాతంత్ర్య సమరయోధులు స్వేచ్ఛతో పాటు అభివృద్ధి, సమానత్వం, సుఖశాంతులు నిండిన భారతావనిని కలగన్నారు. భవిష్యత్తు తరాలు సమృద్ధి చెందిన దేశంలో జీవించాలని కోరుకున్నారు.

దేశంలో రవాణా, విద్య, సాంకేతికత, వైద్యం వంటి రంగాల్లో పురోగతి కనిపించినా, అది సమగ్రాభివృద్ధిగా చెప్పుకోదగినంత స్థాయికి చేరుకోలేదు. మన తర్వాత చాలా కాలానికి స్వాతంత్ర్యం పొందిన దేశాలు ఆర్థికపరంగా, సామాజికంగా, సాంకేతికంగా మన దేశాన్ని ఎప్పుడో దాటిపోయాయి. ప్రధానంగా అవినీతి, రాజకీయ అస్థిరత, అసమాన వనరుల పంపిణీ, పౌరులలో బాధ్యతాభావం, సమర్థమైన ప్రణాళికల లోపం వంటి అంశాలు మన అభివృద్ధికి అడ్డంకులు అయ్యాయి. మొదటి కొన్ని దశాబ్దాలు దేశ పునర్నిర్మాణం, ఆహార భద్రత, ప్రాథమిక సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టినా, దీర్ఘకాల దృష్టి, సమన్వయం, అమలు సామర్థ్యం లోపించాయి.

ముఖ్యంగా, రాజకీయ నాయకత్వం తమ స్వప్రయోజనా లకన్నా దేశ ప్రయోజనాలను ముందుకు పెట్టడంలో విఫలమైంది. అభివృద్ధి ప్రాజెక్టులు, సంస్కరణలు చాలా చోట్ల కాగితాల మీదే మిగిలిపోయాయి. కొన్ని మంచి విధానాలు అమలులోకి వచ్చినా, వాటి ప్రభావం సర్వసాధారణ ప్రజల జీవన ప్రమాణాల్లో సరిగా కనిపించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో యువత పాత్ర అత్యంత కీలకమైనది. యువత మార్పు కోసం పని చేయాలి. కేవలం సోషల్ మీడియాకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో పనిచేయాలి. విద్య, నైపుణ్యం, కొత్త ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం, సమ సమాజం పట్ల బాధ్యత ఇవన్నీ యూత్ కు బలం. ఈ బలాన్ని దేశ నిర్మాణానికి వినియోగించాలి.

దేశాభివృద్ధి అంటే కేవలం ఆర్థిక వృద్ధి మాత్రమే కాదు. సమాన అవకాశాలు, అవినీతి రహిత పాలన, పర్యావరణ పరిరక్షణ, సామాజిక న్యాయం, ప్రజల ఆరోగ్య భద్రత, విద్యా ప్రమాణాల పెంపు ఇవన్నీ కలిస్తేనే నిజమైన అభివృద్ధి. అందుకు యూత్ ముందుకు రావాలి. రాజకీయ రంగంలో నిజాయితీ గల నాయకత్వం కోసం యువత నడుం బిగించాలి. మార్పు ఒక్కరోజులో రాదు. దానికి సహనం, కృషి, దీక్ష అవసరం. దేశభక్తి అంటే కేవలం జెండా ఎగరేయడం కాదు. జాతీయ గీతం పాడటం కాదు. ప్రతి పనిలోనూ అవి ప్రతిబింబించాలి. ఒక విద్యార్థి చదువులో ప్రతిభను చూపడం, ఒక రైతు కొత్త పంటలు పండించడం, ఒక వ్యాపారి నిజాయితీగా పన్నులు చెల్లించడం, ఒక ప్రభుత్వ ఉద్యోగి నిజాయితీగా విధులు నిర్వర్తించడం లాంటివి కలిసే దేశాభివృద్ధికి తోడ్పడతాయి.

ఇప్పటికైనా మనం మేల్కొనాలి. దేశం నాకేమిచ్చిందని కాకుండా, దేశానికి మనమేమిచ్చామన్నదే ముఖ్యం. స్వాతంత్ర్యం సాధించిన 78 ఏళ్ల తరువాత కూడా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది. గడచిన కాలం పాఠాలు మనకు మార్గదర్శకాలు కావాలి. భవిష్యత్తు మన చేతుల్లోనే ఉంది. మన దేశం నిజమైన అభివృద్ధి దిశగా పయనించాలంటే, యువత కంకణబద్ధులై, నిస్వార్థంగా, దృఢ సంకల్పంతో దేశ సేవలో తలమునకలవ్వాలి. అప్పుడే మన జాతి నేతలు కలలగన్న పురోగామిక భారతం, సమగ్రాభివృద్ధి, సమానత్వం, సుఖశాంతులు నిండిన దేశం వాస్తవ రూపం దాల్చుతుంది. అప్పుడే మనది నిజమైన స్వాతంత్ర్యం అవుతుంది.

-సాయి సందేశ్ మార్గం
ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్,
‘అడుగు’ డిజిటల్ మీడియా

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News