ఆర్.కె.బీచ్ వద్ద ఈ రోజు, రేపు, జనవరి 2 తేదీల్లో నౌకాదళ సన్నాహక విన్యాసాలు నిర్వహించనున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. జనవరి 4న నిర్వహించదలిచిన నౌకాదళ పూర్తి విన్యాసాలకు ముందు మూడు రోజుల పాటు రిహార్సల్స్ ఉంటాయి. ఈ విన్యాసాలు సాహసిక ప్రదర్శనలతో సాగరతీరాన్ని యుద్ధ సంగ్రామంగా మార్చనుండగా, యుద్ధ నౌకలు, సబ్మెరెన్లు, యుద్ధ విమానాలు, హెలికాప్టర్లు, నావికాదళ బ్యాండ్, మార్కోస్ కమాండోల ప్రదర్శనలు జరగనున్నాయి.
ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు వచ్చే ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని పోలీసులు కోరారు. అలాగే, జనవరి 4 వరకు విన్యాసాలు జరుగుతున్న ప్రాంతాల్లో డ్రోన్లు, గాలిపటాలు వంటివి ఎగురవేయవద్దని ప్రజలను హెచ్చరించారు. నేవీ విన్యాసాలను విజయవంతంగా నిర్వహించేందుకు నౌకాదళం, జీవీఎంసీ అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి, ఇతర అధికారుల కోసం ప్రధాన వేదికతో పాటు ఇతర వేదికల నిర్మాణాలు దాదాపుగా పూర్తయ్యాయి. ఫూట్ పాత్ ను ఆనుకుని బారికేడ్ల నిర్మాణం కూడా శరవేగంగా సాగుతోంది.

