Friday, July 17, 2026
26.4 C
Hyderabad

సత్వర న్యాయానికి – తక్షణ సంస్కరణలు!|EDITORIAL

వంద మంది దోషులు తప్పించుకున్నా సరే, ఒక్క నిర్దోషికి కూడా శిక్షపడవద్దన్నది న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం. కానీ, న్యాయస్థానాలకు వెళ్లాల్సి వచ్చిన వాళ్ళంతా దాన్నో శిక్షగానే భావిస్తున్నారు!? ఎస్. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ఆలస్యపు న్యాయం కూడా అన్యాయం కిందే లెక్క. అనేక మంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి న్యాయాన్ని చూడకుండానే జీవితం ముగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య న్యాయ మూల సూత్రాలకే విరుద్ధం.

2025 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మన దేశంలో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 70 వేలకు పైగా, హైకోర్టులలో 60 లక్షలకు పైగా, లోయర్ కోర్టులలో నాలుగున్నర కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు క్రిమినల్ లేదా సివిల్ కేసులు మాత్రమే కాకుండా, అత్యంత కీలకమైన రాజ్యాంగ పరమైన, రాజకీయ, సామాజిక కేసులు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం నిరీక్షిస్తున్నాయి.

మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే నడవాలా? న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో కూడా సంస్కరణలు రావాలి కదా!? కోర్టులు కూడా తమకుతాము కాల పరిమితి విధించుకోల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కేసైనా నిర్ణీత గడువులో విచారణ పూర్తి కావాలి. ఇందుకు ఏం చేయాలి? ఏ విధమైన సంస్కరణలు చేపట్టాలి?

స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాపాలు సాగాలి. స్థానిక భాషల్లోనే చర్చించేలా, తీర్పులు వెలువడేలా చట్టం చేసుకోవాలి. అనేక సంస్కరణలకు పూనుకుంటున్న ప్రధాని మోదీ, న్యాయ వ్యవస్థ సంస్కరణపై పున: సమీక్షించగలరా? పూనుకోగలరా?

‘అడుగు’ చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్ ‘సత్వర న్యాయానికి–తక్షణ సంస్కరణలు!’

సత్వర న్యాయానికి – తక్షణ సంస్కరణలు!

భారత ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగంలాగే న్యాయవ్యవస్థ కూడా ప్రపంచంలోనే అతిపెద్దది. సుప్రీం కోర్టు, హైకోర్టులు, జిల్లా, ఉపకోర్టులుగా విస్తరించి ఉంది. ఇంత పెద్ద ఈ వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు సత్వర న్యాయం. ‘జస్టిస్ డిలేయ్డ్ ఈజ్ జస్టిస్ డినైడ్’ అంటే ఆలస్యపు న్యాయం అన్యాయం కిందే లెక్క. అనేక మంది సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతూ, చివరికి న్యాయాన్ని చూడకుండానే జీవితం ముగించుకుంటున్నారు. ఇది ప్రజాస్వామ్య న్యాయ మూల సూత్రాలకే విరుద్ధం.

2025 నాటికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం, మన దేశంలో మొత్తం 5 కోట్లకు పైగా కేసులు వివిధ కోర్టులలో పెండింగ్‌లో ఉన్నాయి. సుప్రీం కోర్టులో 70 వేలకు పైగా, హైకోర్టులలో 60 లక్షలకు పైగా, లోయర్ కోర్టులలో 4.5 కోట్లకు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. మామూలు క్రిమినల్ లేదా సివిల్ కేసులు మాత్రమే కాకుండా, అత్యంత కీలకమైన రాజ్యాంగ పరమైన, రాజకీయ, సామాజిక కేసులు కూడా ఉన్నాయి. వీటిలో చాలా కేసులు 10 ఏళ్లకు పైగా విచారణ కోసం నిరీక్షిస్తున్నాయి. అయితే ఈ కేసులు ఆలస్యం అవడానికి ప్రధాన కారణాలు: న్యాయమూర్తుల కొరత, అధిక కేసుల భారం, పాత చట్టాలు, జఠిలమైన న్యాయ ప్రక్రియలు, ప్రాసిక్యూషన్ వ్యవస్థ బలహీనత, తరచూ వాయిదాలు. ఇక ఈ పిండింగ్ కేసుల వల్ల కోర్టుల పట్ల పౌరుల నమ్మకాలు సన్నగిల్లుతున్నాయి. ఏళ్ళ తరబడి కేసులు నడవడం వల్ల కక్షిదారులకు కాలాతీతం, ఆర్థిక భారం సంభవిస్తున్నాయి. కొందరు న్యాయాన్ని చూడకముందే మరణిస్తున్నారు.

మన న్యాయవ్యవస్థ ఇంకా బ్రిటిష్‌ కాలంనాటి పరిస్థితులకు అనుగుణంగానే సాగుతోంది. న్యాయ వ్యవస్థతో పాటు చట్టాలు, శిక్షల్లో కూడా సంస్కరణలు రావాల్సివుంది. కోర్టులు కూడా తమకుతాము కాల పరిమితి విధించుకోల్సిన సమయం ఆసన్నమైంది. ఏ కేసైనా నిర్ణీత గడువులో విచారణ పూర్తి కావాలి. సీబీఐ, ఈడీ దాడుల కేసుల్లో కూడా సత్వర విచారణ జరగడం లేదు. ఏపీలో వివేకా హత్య కేసు ఏళ్ళుగా ఎటూ తేలకుండా మిగిలిపోయింది. దోషులూ తేలలేదు, శిక్షలూ పడలేదు. ఈ లోగా ఇలాంటి కేసుల్లో నిందితులుగా ఉన్న వాళ్ళు పదవులు నిర్వర్తిస్తున్నారు. అనేక ఆరోపణలున్న జగన్‌ ఐదేళ్లు బెయిల్‌ మీదే పాలన చేశారు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల కేసులో పరస్పర విరుద్థ తీర్పులు ఇవ్వడమే గాకుండా 17 ఏళ్లుగా కోర్టులో నానింది. చివరకు జర్నలిస్టులు మరణిస్తున్నారే తప్ప ఇంచు జాగా, ఇండ్లు సంపాదించింది లేదు. రాజకీయ నాయకుల కేసుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. వీటి సాగదీత వల్ల ప్రజల్లో భయం లేకుండా పోతున్నది.

ఇదే సందర్భంగా పెండింగ్‌ కేసులు సమస్యగా మారాయి. ఏళ్ళ తరబడి పెండింగులోని కేసులు అలాగే ఉండగా, కొత్త కేసులో ఆ జాబితాలో చేరుతున్నాయి. అవి గుట్టల్లా పేరుకుపోతున్నాయి. దీంతో భారత న్యాయ వ్యవస్థ సాధారణ ప్రజలకు దూరమవుతోంది. తమకు న్యాయం జరగదని భావిస్తున్న వారూ కోర్టులకు వెళ్లడం లేదు. కోర్టులకు వెళ్ళిన వారిలో చాలా మంది తమ జీవిత కాలంలో ఆ న్యాయాన్ని చూడలేకపోతున్నారు. తీర్పులు వచ్చినా అవి అమలుకు నోచుకోవడం లేదు.

నేటికీ ఎందరో చేయని నేరాలకు జైళ్లలో మగ్గుతున్నారు. ఇలాంటి వారిని ఎలా బయటకు తీసకుని వస్తారన్నది కూడా ముఖ్యం. పార్టీ ఫిరాయింపుల కేసులో మూడు నెలల్లో తేల్చాలని సుప్రీం ఆదేశించింది. పెద్దగా ప్రగతి లేదు. చివరకు ఎన్నికల ముందు తీర్పులు వ్యతిరేకంగా వచ్చినా చేయగలిగేది ఏమీ లేదు. చెన్నమనేని రమేశ్ కేసు ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పుకోవచ్చు.

స్థానిక భాషల్లో కోర్టు కార్యకలాపాలు సాగాలి. స్థానిక భాషల్లో చర్చించేలా, తీర్పులు వెలువడేలా చట్టం చేసుకోవాలి. గతంలో ఇదే అభిప్రాయాన్ని వ్యక్తిం చేసిన ప్రధాని మోదీ ఇప్పుడు దీని గురించి ఆలోచించాలి. పార్లమెంట్‌ వేదికగా దీనికి శాశ్వత పరిష్కారం చూపాలి.

నిజానికి కోర్టులు, రాజ్యాంగం పట్ల ప్రజలకు సరైన అవగాహన లేదు. ప్రజలను కోర్టులకు చేరువ చేయడం రాజ్యాంగ విధి కావాలి. న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించి, విశ్వాసం పెంచేందుకు చర్యలు తీసుకోవాలి. ఇందుకు ఈ-కోర్టుల వ్యవస్థను బలోపేతం చేయాలి. అత్యవసర న్యాయ సదస్సులు నిర్వహించాలి. జడ్జీలు, సిబ్బంది నియామకాలు పూర్తి చేయాలి.

చిన్నపాటి వివాదాలు కోర్టుల దాకా రాకుండా, గ్రామ స్థాయిలోనే పరిష్కరించే విధానాలను ప్రోత్సహించాలి. అవసరం లేని చట్టాలను తొలగించి , చట్టాలను సరళీకరించాలి. ప్రాసిక్యూషన్ వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాలి. పోలీసులు, ప్రభుత్వ న్యాయవాదులు మరింత సమర్థంగా పని చేయడానికి శిక్షణ, వనరుల కల్పన అవసరం. ఇలా పలు అంశాలపై అవసరమై అధ్యయనాలు జరిపి, ప్రజలు న్యాయ వ్యవస్థను చేరువ చేయాలి. సత్వరమే న్యాయం అందేలా చట్టాలు రూపొందించి, న్యాయవ్యవస్థను బలోపేతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News