Trending News
Friday, March 6, 2026
35.9 C
Hyderabad
Trending News

అవినీతిపై నిజానిజాల నిగ్గు తేల్చాల్సిందే!|EDITORIAL

కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై మరింత లోతుగా దర్యాప్తు చేయడానికి కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణ శాసనసభ తీర్మానించింది. ఇది ప్రభుత్వం తీసుకున్న తెలివైన నిర్ణయంగా కనిపిస్తోంది. అటు రాజకీయ లబ్ధి, ఇటు కాగల కార్యాన్ని ఒడుపుగా జరిపించే నిర్ణయంగా భావించాలి. నేనుగా ప్రభుత్వం చేస్తున్నట్లుగా కాకుండా, దర్యాప్తు సంస్థల ద్వారానే కానించేయడంగా అనిపిస్తోంది. ఆలస్యంగా అయినా అవినీతిపై చర్యలకు సర్కార్‌ పూనుకున్నట్లయింది. నిజానికి కేంద్ర దర్యాప్తు సంస్థలపై కూడా విశ్వాసం సన్నగిల్లుతోన్న ఈ దశలో ఈ నిర్ణయం ఫలితం ఏ విధంగా ఉండనుందనేది ఆకస్తిగా మారింది. ఏపీలో వైఎస్‌ వివేకా హత్య కేసు, ఐదేళ్లుగా దర్యాప్తు దశలోనే ఉంది. జగన్‌ అవినీతి వ్యవహారాల్లో కూడా ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. ఇలా తేలని కేసులు, దర్యాప్తుదశలోనే జైలుకు వెళ్ళిన నిందితులు, రకరకాల స్థాయిల్లో పెండింగులోనే ఉన్నాయి.
నిజానికి రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ, ఏపీ లు ఎందుకు అప్పుల్లో కూరుకు పోయాయో ఇప్పుడు అర్థమవుతున్నది. ప్రభుత్వాలపై ఎప్పటికప్పుడు కాగ్ నివేదికలు వస్తున్నా, వాటిపైగానీ, రాజకీయ అవినీతి ఆరోపణలపై విచారణలు సహజంగానే ఆలస్యంగా కొనసాగుతూ వస్తున్నాయి. పాలకులైతే చాలు, ఏమైనా చేయొచ్చనే దీమాను ప్రశ్నించే స్థాయిలో మన చట్టాలు, దర్యాప్తు సంస్థలు ఉన్నాయా? అన్నది స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ళకు కూడా అనుమానంగానే ఉండటం మన దేశ ప్రజల దౌర్భాగ్యం. కమిషన్లు, సిట్ లు, దర్యాప్తు సంస్థలు ఇలా ఏయే విచారణలైప్పటికీ అవినీతి పాలకులకు ఏదో ఓ దారి దొరుకుతూనే ఉంది. జైల్లో ఉండాల్సిన వాళ్ళు బయట, బయట ఉండాల్సిన వాళ్ళు జైళ్ళల్లో మగ్గుతుండటం నయా ప్రజాస్వామ్య కొత్త రూపంగా తోస్తున్నది.
దర్యాప్తు సంస్థలకు దీటుగా గతంలో లోక్ పాల్, లోకాయుక్త వ్యవస్థలు ఉండేవి. రిటైర్డ్ జడ్జీలు వాటికి చైర్మన్లుగా ఉండేవారు. కేవలం రాజకీయ అవినీతి, పాలకులకు సంబంధించిన కేసులను వీరు విచారించేవారు. రాజకీయావసరాల కోసమే కొందరు నేతలు వాటిని నిర్వీర్యం చేశారు. వాటిని మరోసారి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది.
దేశంలో రాజకీయ అవినీతి బాగా వేళ్లూను కుంది. రాజకీయ నాయకులు పాలనను పక్కన పెట్టి అవినీతిలో మునిగి తేలుతున్నారు. ఒక్కసారి అధికారం వస్తే చాలు, తరతరాలకు తరగని ఆస్తులను మూటగట్టుకుంటున్నారు. పార్టీ ఏదైనా రాజకీయ నేతల పనంతా ఇదే అన్నట్లుగా ప్రస్తుత రాజకీయ, పరిపాలనా పద్ధతులు కొనసాగుతున్నాయి. ఇందుకోసం స్వతంత్ర దర్యాప్తు సంస్థ ఉండాల్సిందే. మోడీ ప్రభుత్వం ఈ విషయంలో నిబద్ధతను చాటుకుని సర్వ స్వతంత్ర న్యాయ వ్యవస్థకు శ్రీకారం చుట్టాలి. కేవలం రాజకీయ అవినీతిని విచారించేందుకు దీని అవసరం చాలావుంది.
కాళేశ్వరం నిర్మాణమే పెద్ద డొల్లని, అది కేవలం కమీషన్ల కోసం, కేసీఆర్‌ తన ఎర్రవల్లి ఎస్టేటు పొలాలను పారించుకునేందుకు నీటిని మళ్ళించిన కట్టడంగా తప్ప, ప్రజలకు ఉపయోగపడే కట్టడం కాదని మరోసారి తేలింది. నిపుణుల సూచనలు బేఖాతర్‌ చేస్తూ, అవినీతి కట్టడంగా, నియమనిబంధనలు పాటించకుండా, డీపీఆర్ ను కేంద్రానికి ఇవ్వకుండా, కేంద్రం నిధులే రాకుండా, ఏక పక్షంగా కనీసం కేబినెట్ ఆమోదం కూడా లేకుండానే ఓ కుటుంబం కమీషన్ కాసులకు కక్కుర్తిపడి కట్టిన కట్టడండా ఆ ప్రాజెక్టుపై సీఎం విమర్శలు చేశారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సరైంది కాదని రిపోర్టులున్నాయని, తర్వాత కమిషన్ విచారణలోనే ఇదే తేలిందని సీఎం నిండు అసెంబ్లీ సభలో స్పష్టం చేశారు. అసెంబ్లీ కూడా అవినీతి జరిగిందని, సీబీఐ దర్యాపు జరపాలని తీర్మానించింది. పీసీ ఘోష్ కమిషన్ తేల్చేసింది తప్పైతే, కేసీఆర్‌ నిజాయితీ పరుడైతే కాళ్వేరం కమిషన్‌ను వ్యతిరేకించరు. హైకోర్టుకు వెళ్లి కమిషన్‌ను రద్దు చేయమని కోరరు. ఒకవేళ విచారణ జరిపినా దాన్ని సభలో పెట్టొద్దని, పెట్టినా చర్యలు తీసుకోవద్దని అభ్యర్థించరు. ఆందోళనలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునివవ్వరు. ఇదీ అందరికీ అర్థమవుతున్న వాస్తవమే.
దాదాపు పదేళ్లు పాలించిన కేసీఆర్‌ కుటుంబం తెలంగాణను అప్పులకుప్పగా చేసినది కూడా నిజమేనని సీఎం పదే పదే అసెంబ్లీలోనే చెబుతున్నారు. శాసనసభలో జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి సీబీఐకి అప్పగిస్తూ నిర్ణయించడం ఒక విధంగా మంచిదే. ప్రభుత్వం, సీఎం ఏకపక్షంగా, కక్షపూరితంగా వ్యవహించే అవకాశం లేకుండా చేశారనుకోవచ్చు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అంతర్రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలైన ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ భాగస్వామ్యమై ఉన్నాయని.. అందుకే కేసును సీబీఐకి అప్పగించడం సముచితమని శాసనసభ భావిస్తోందని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఊరు, పేరు, అంచనాలు మార్చి దోచుకున్నవారిని శిక్షించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ప్రాజెక్టులో అక్రమాలపై ఇప్పటివరకు నివేదికలు ఇచ్చిన ఎన్‌డీఎస్‌ఏ, విజిలెన్స్‌, కాగ్‌, జస్టిస్‌ ఘోష్‌ కమిషన్‌… గత ప్రభుత్వాన్ని, నాటి ప్రభుత్వ పెద్దల్ని తప్పుపట్టాయి. తమ పరిధిలో ఉన్న ఏ సంస్థ దర్యాప్తు చేసినా తమ చిత్తశుద్ధిని శంకిస్తారని, అందుకే శషభిషలకు తావు లేకుండా కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.
నిజానికి ఏఐబీపీ కింద ఏదైనా ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం గుర్తిస్తే 75 శాతం నిధులిచ్చే నిబంధన ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 25 ప్రాజెక్టులను ఈ పథకం కింద కేంద్రం గుర్తించింది. ఆ జాబితాలో ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు కూడా ఉంది. ఆ ప్రాజెక్టును రీడిజైన్‌ పేరుతో మేడిగడ్డకు మార్చడం తోనే అవినీతికి తెరలేపారు. కాళేశ్వరం ప్రాజెక్టును రాష్టాన్రికి గుదిబండగా మార్చిన కేసీఆర్‌, హరీశ్‌రావులే కాదు, ఇందులో భాగస్వామ్యం ఉన్న ఈటల, తుమ్మల, ఐఎఎస్ లు, అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, కేబినెట్ లో మంత్రులుగా ఉన్నవాళ్ళంతా శిక్షార్హులే.
రాజకీయ నాయకులు తమ ఇష్టాను సారం డబ్బులు వెనకేసుకోవడం అలవాటుగా చేసుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యం గురించి ఎన్‌డీఎస్‌ఏ ఎప్పుడో తేల్చిచెప్పింది. ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ఎన్‌డీయే రిపోర్టని బీఆర్‌ఎస్‌ ఆనాడు ఎదురుదాడికి దిగింది. అలాగే పీసీ ఘోష్ కమిషన్ ను పీసీసీ కమిషన్ గా దాడి చేసింది. ఇప్పుడు ఎదురవుతున్న ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతోంది.
మొత్తంగా గోదావరిలో సభలో సీఎం చెప్పినట్లు రూ.లక్షన్నర కోట్లు కొట్టుకుపోయాయి. అప్పు, దానికి వడ్డీ మిగిలింది. దాన్ని కట్టే బాధ్యత ప్రజలపై పడింది. విచారణను అడ్డుకుంటున్న తీరు, బీఆర్‌ఎస్‌ అవినీతిని తేటతెల్లం చేస్తోంది. ఇందుకు బాధ్యులైన నేతలను, అందుకు సహకరించిన అధికారలును జైళ్లల్లో వేయాలి. ఈ కేసులను త్వరగా తేల్చి సమాజానికి ఓ మంచి సందేశం ఇవ్వాలి.

Latest News

పురుగుల బెడదకు.. బెల్లం పానకం శిట్కా!?|ADUGU TRENDS

పంటలకు పట్టే పురుగులు రైతులకు శాపంగ మారుతానయి. ఇగ గవాటిని సంపడానికి పురుగుల మందులు కొట్టాలె. కర్సు బాగైతది. మల్ల గా మందులతోటి పురుగులు సత్తలేవు. పంటల దిగుబడొత్తలేదు. ఎరువులు, పురుగుల మందులెక్కువై...

మూసీ ప్రక్షాళనపై ముసురుకుంటున్న వివాదాలు!|EDITORIAL

అభివృద్ధి పథకాలు ప్రజావసరాలు తీర్చడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడుతున్నాయా? అసలా పథకాలు ప్రజల కోసమే అమలవుతున్నాయా? పేదలు, అట్టడుగు వర్గాలు నివసించే ప్రాంతాల్లో చేపట్టే ప్రాజెక్టులు తరచూ నిర్వాసిత సమస్యలకు...

06-03-2026, శుక్రవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి తదియ సాయంత్రం 05.20 వరకు ఉపరి చవితి నక్షత్రం హస్త ఉదయం 09.15 వరకు ఉపరి చిత్త యోగం గండ ఉదయం 07.05 వరకు ఉపరి వృద్ధి కరణం భద్ర సాయంత్రం 05.22...

ఓలి రంగుల్లెక్క మెరపకాయెల రాసులు!?|ADUGU TRENDS

మెరపకాయెను కూడ కూరగాయల్లెక్కనే పండిత్తరు. మనం తినే బువ్వకు కారం, రుసిని ఇత్తది. గిదీన్ని మన తెలంగాణ, ఏపీల్నే గదేనుల్ల.. గుంటూరు, వరంగల్ ల ఇరగమరగ పండిత్తరు. గీ మెరపకాయెల ఉండే 'క్యాప్సైసిన్'...

స్వయం సమృద్ధే ఈ సంక్షోభానికి విరుగుడు!|EDITORIAL

వరుస యుద్ధాలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తున్నాయి. కరోనా మొత్తం భూమినే అతలాకుతలం చేస్తే, ఇప్పుడు మధ్యప్రాచ్యంలో యుద్ధాలు, ఉద్రిక్తతల వల్ల మరోసారి చమురు సంక్షోభం ముంచుకొచ్చింది. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంలో అమెరికా జోక్యం...

05-03-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి విదియ సాయంత్రం 04.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఉత్తర ఉదయం 08.11 వరకు ఉపరి హస్త యోగం శుల ఉదయం 07.49 వరకు ఉపరి గండ కరణం గరజి సాయంత్రం 04.39...

బర్నర్ల మురికిని తీసే ఇకమతు!?|ADUGU TRENDS

మన ఆడోల్లు ఎంత ఇకమతులు పడ్డా అరవై పది దినాలకు గా గ్యాస్ స్టౌ బర్నర్లు మురికి పడతనే ఉంటయి. గ వాటిని కడగాల్నంటే మస్తు తిప్పలైతది. అల్కగ గా బర్నర్ల మురికిని...

హార్ముజ్ జలసంధి ఆర్థిక సంక్షోభంలో ప్రపంచం!|EDITORIAL

ఇరాన్–అమెరికా–ఇజ్రాయిల్ మధ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను అనిశ్చితి అంచులపై నిలిపింది. ఇది కేవలం యుద్ధ దేశాలకే పరిమితం కాదు. ప్రపంచ ఇంధన భద్రతకు కీలక నాడి హార్ముజ్ జలసంధి చుట్టూ ముప్పు...

04-03-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం-శిశిర ఋతువు ఫాల్గుణ మాసం--కృష్ణపక్షం తిధి బ.పాడ్యమి సాయంత్రం 04.29 వరకు ఉపరి విదియ నక్షత్రం పుబ్బ ఉదయం 07.30 వరకు ఉపరి ఉత్తర యోగం ధృతి ఉదయం 08.58 వరకు ఉపరి శుల కరణం కౌలవ సాయంత్రం 04.29...

వచన సాహిత్యం ప్రజల సాహిత్యం!|ESSAY

ಓಂ శ్రీ గురు బసవ లింగాయ నమః! శరణు శరణార్థి! బీదర్ పట్టణం బసవగిరిలోని బసవ సేవా ప్రతిష్ఠాన వారి ఆధ్వర్యంలో 2026 జనవరి 30, 31 మరియు ఫిబ్రవరి 1 తేదీలలో...

దుర్గంథాన్ని పోగొట్టే సుగంథం!?|ADUGU TRENDS

ఎన్కటేమో గనీ, ఇగిప్పుడైతే నీల్లకు ప్లాటిక్, స్టీలు, రాగి సీసాలే వాడుతాండ్రు. ప్రిజ్జులనే కాదుల్లా, యేడికిపోయినా, గవాటినే తీస్కపొతాండ్రు, లేకపోతే కొనుక్కుని తాగుతాండ్రు. గనీ గవి వాడంగ, వాడంగ... దుర్వాసన వేస్తయి. దుర్గంథం...

విపత్కర ఇరాన్ కు వివేకంతోనే విజయం!|EDITORIAL

అమెరికా–ఇరాన్ విభేదాలు, ఇజ్రాయెల్ భద్రతా ఆందోళనలు, ప్రాంతీయ అభద్రతా భావ రాజకీయాలు ప్రపంచాన్ని అప్రమత్తం చేస్తున్నాయి. యుద్ధ వాతావరణం సృష్టించడం సులువు కానీ, దాని ఫలితాలను భరించడం మాత్రం దేశాలకు, ప్రజలకు మాత్రం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News