Friday, July 17, 2026
26.4 C
Hyderabad

మనం-వనమే జీవావరణం!|EDITORIAL

ఇటీవల తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో వన్యప్రాణులు గ్రామాలు, పట్టణాలలో సంచరించడం ఆందోళనకరంగా మారింది. పెద్దపులులు, చిరుతలు, ఎలుగుబంట్లు, అడవిపందులు, ఏనుగులు, కోతుల దాడులు కూడా పెరిగిపోతున్నాయి. వన్యప్రాణులు జనావాసాల్లోకి రావడానికి ప్రధాన కారణం అడవులు అంతరించిపోతుండటం. దశాబ్దాలుగా అభివృద్ధి పేరుతో అడవులను నరికివేయడం, ఖనిజాల తవ్వకం, భారీ ప్రాజెక్టుల నిర్మాణం, రోడ్లు, రైలు మార్గాల విస్తరణ, రియల్ ఎస్టేట్ విస్తరణ వంటి చర్యలు సహజ జీవావరణాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. ఒకప్పుడు విస్తారంగా ఉన్న అడవులు ఇప్పుడు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి జంతువుల సంచార మార్గాలను మూసేశాయి. ఫలితంగా ఆహారం, నీరు దొరకక వన్యప్రాణులు గ్రామాల వైపు మళ్లుతున్నాయి.

ఇది మనిషి–వన్యప్రాణి సంఘర్షణ. ఒకవైపు గ్రామీణులు భయంతో జీవిస్తుండగా, మరోవైపు నిరపరాధ వన్యప్రాణులు కూడా హింసకు గురవుతున్నాయి. జీవవైవిధ్యాన్ని కాపాడాల్సిన సమాజం, దానిని నిర్వీర్యం చేస్తుండటం అత్యంత బాధాకరం.

ప్రకృతి సమతౌల్యంలో అడవులు కీలకం. అడవులు వర్షపాతం నియంత్రణకు, భూగర్భజలాల పరిరక్షణకు, వాతావరణ సమతుల్యతకు, అనేక జీవజాతుల సంరక్షణకు ఆధారం. అడవులు తగ్గితే వాతావరణ మార్పులు తీవ్రతరం అవుతాయి. వరదలు, కరువులు, ఉష్ణోగ్రతల పెరుగుదల వంటి సమస్యలు పెరుగుతాయి. గ్రామాల్లో వన్యప్రాణుల సంచారం కూడా అదే గొలుసు కట్టులోని ఒక దుష్పరిణామం.

వన్యప్రాణులను శత్రువులుగా కాకుండా జీవవ్యవస్థలో భాగస్వాములుగా చూడాలి. గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, జంతువులను హింసించకుండా అటవీశాఖకు సమాచారం అందించే విధానం అలవాటు చేయాలి. సోలార్ ఫెన్సింగ్, బయో ఫెన్సింగ్ వంటి సాంకేతిక చర్యలు విస్తృతంగా అమలు చేయాలి. పంట నష్టానికి త్వరితగతిన పరిహారం చెల్లించే పారదర్శక వ్యవస్థ అవసరం.

అటవీ సంరక్షణలో ప్రభుత్వ పాత్ర కీలకం. కేవలం సంఘటనల తర్వాత స్పందించడం కాకుండా, దీర్ఘకాలిక ప్రణాళికతో అడవుల పునరుద్ధరణకు పాటుపడాలి. ఖాళీ భూముల్లో భారీ స్థాయిలో మొక్కలు నాటడం, సహజ అడవులను పునర్నిర్మించడం, వన్యప్రాణుల కోసం సంచార మార్గాలు-వైల్డ్‌లైఫ్ కారిడార్లను పరిరక్షించడం అత్యవసరం. అభివృద్ధి ప్రాజెక్టులకు అనుమతులు ఇస్తున్నప్పుడు పర్యావరణ ప్రభావాన్ని కఠినంగా అంచనా వేయాలి. ఆతర్వాతే అనుమతులివ్వాలి.

“ఒక చెట్టు నరికితే పది చెట్లు నాటాలి” అనే భావన ఆచరణలోకి రావాలి. ప్రకృతి వనరులను దోచుకోవడం కాకుండా, బాధ్యతతో వినియోగించడం నేర్చుకోవాలి. పర్యావరణ పరిరక్షణను పాఠ్యాంశాలలో భాగం చేసి చిన్నప్పటి నుంచే అవగాహన పెంపొందించాలి.

ఇటీవల కొన్ని ప్రాంతాల్లో పెద్దపులుల సంచారం ప్రజలను కంటిమీద కనుకు లేకుండా చేశాయి. అటవీశాఖ సిబ్బంది మత్తు ఇంజెక్షన్లతో వాటిని పట్టుకుని అడవుల్లో విడిచిపెట్టాల్సి వచ్చింది. ఇవి తాత్కాలిక పరిష్కారాలు మాత్రమే. అడవుల పునరుద్ధరణ జరగనంత వరకు ఇలాంటి ఘటనలు పునరావృతమవుతూనే ఉంటాయి.

ఈ ‘భూమి నాది’ అనే భావన మానవ అహంకారానికి ప్రతీక. నిజానికి మనం భూమికి అతిథులమే. ప్రకృతి మనకు ఇచ్చిన వరం అడవి. దాన్ని కాపాడుకోవడం ద్వారా మనల్ని మనం రక్షించుకోవాలి. ప్రకృతిపై మనిషికి అధికారం లేదు. బాధ్యత మాత్రమే ఉంది అనే సత్యాన్ని గుర్తించాలి.

అభివృద్ధి తప్పనిసరి. కానీ అది ప్రకృతి విధ్వంసానికి దారితీయకూడదు. అడవులను కాపాడితే వన్యప్రాణులు సురక్షితంగా ఉంటాయి. వన్యప్రాణులు సురక్షితంగా ఉంటేనే మన జీవవ్యవస్థ సమతౌల్యంగా ఉంటుంది. జీవవ్యవస్థ సమతౌల్యంగా ఉంటేనే మనిషి భద్రంగా జీవించగలడు. వన్యప్రాణులను కాపాడటమంటే, మన భవిష్యత్తును కాపాడుకోవడమే.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News