-వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షిత డ్రైవింగ్ చేయాలని వరంగల్ నగర పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ పిలుపునిచ్చారు. హనుమకొండ ఆర్టీసీ డిపోలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ముగింపు కార్యక్రమాన్ని శుక్రవారం వరంగల్ రీజినల్ మేనేజర్ డి విజయభాను అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ తో పాటు స్థానిక ప్రయాణ కండిషన్స్ కూడా గమనిస్తూ డ్రైవింగ్ చేయాలని పిలుపునిచ్చారు. గత సంవత్సరంతో పోల్చితే ప్రమాదాల శాతం తగ్గిందని ఇందులో ముఖ్యంగా ఆర్టీసీ వారి పాత్ర గణనీయంగా ఉందన్నారు. సుమారు 40-50 మంది ప్రాణాలు డ్రైవర్ చేతిలో ఉంటాయన్న విషయాన్ని గమనిస్తూ డ్రైవింగ్ చేయాలన్నారు. ట్రాఫిక్ కూడళ్లలో మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా వరంగల్ ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి విజయ భాను మాట్లాడుతూ ప్రతి డ్రైవర్ ఒత్తిడి లేకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలు నివారించి కార్పొరేషన్ మరింత సురక్షితమని తెలియజేయాలన్నారు. ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణమని,ఆ పేరును ఎల్లప్పుడూ కాపాడే బాధ్యత ప్రతి డ్రైవర్ పై ఉందన్నారు. తమ సర్వీస్ లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా సుదీర్ఘంగా డ్రైవింగ్ చేసిన రీజియన్ లోని ఉత్తమ డ్రైవర్లను అభినందించి, సన్మానించారు. వీరిని ప్రతి డ్రైవర్ ఆదర్శంగా తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ట్రైనీ ఐపీఎస్ మన్నన్ భట్, డిప్యూటీ రీజినల్ మేనేజర్లు ఉదయభాను ,మాధవరావు, హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్, వరంగల్-1 డిపో మేనేజర్ వీ మోహన్ రావు, వరంగల్-2 డిపో మేనేజర్ వీ జ్యోత్స్న, పరకాల డిపో మేనేజర్ రవిచంద్ర, నర్సంపేట డిపో మేనేజర్ ప్రసన్నలక్ష్మి, తొర్రూరు డిపో మేనేజర్ వి పద్మావతి, భూపాలపల్లి డిపో మేనేజర్ ఇందు, మహబూబాబాద్ డిపో మేనేజర్ శివ, జనగామ డిపో మేనేజర్ స్వాతి, పీఓ పి అర్పిత,వివిధ డిపోల అసిస్టెంట్ మేనేజర్స్, ట్రాఫిక్ సూపర్వైజర్స్, మెకానికల్ సూపర్వైజర్స్, సేఫ్టీ వార్డెన్స్,డీఐ లు, డ్రైవర్లు, మెకానిక్ లు,ఆర్టీసీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలపై నిర్వహించిన వ్యాసరచన పోటీలలో అత్యంత ప్రతిభ కనబరిచిన ఆర్టీసీ ఉద్యోగులకు బహుమతులను అందజేశారు.

