Sunday, June 14, 2026
28.9 C
Hyderabad

బిగ్ బ్రేకింగ్… ఫ్లాష్ ఫ్లాష్…కర్నూలులో ఘోరం

బైకు బస్సు ఢీ, చెలరేగిన మంటలు
20 మంది మృతి, పలువురికి గాయాలు
మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం
విషాదాన్ని మిగిల్చిన చిన్న టేకూరు అగ్నిప్రమాదం
తక్షణ చర్యలకు ఆదేశాలు: ఎపీ సీఎం, డిప్యూటీ సీఎం
దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్, శర్మిల తదితరులు
సహాయక చర్యల్లో పాల్గొనండి
గద్వాల కలెక్టర్ కు తెలంగాణ సీఎం ఆదేశం
కర్నూలు బస్సు ప్రమాదంపై విచారం

కర్నూల్, అక్టోబర్ 24 (అడుగు న్యూస్):
ఆంధ్రప్రదేశ్ లో కర్నూలు జిల్లా, కల్లూరు మండలం చిన్నటేకూరు సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర బస్సు ప్రమాదం రాష్ట్రాన్ని కుదిపేసింది. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు ఒక బైక్‌ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగి క్షణాల్లోనే బస్సు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ దారుణ ఘటనలో 20 మంది వరకు దుర్మరణం పాలవ్వగా, మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తెల్లవారు జామున 3.30 గంటల సమయంలో జరిగింది. బస్సులో ప్రయాణిస్తున్న వారిలో చాలామంది నిద్రలో ఉండగా మంటలు వ్యాపించడంతో బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు ఎమర్జెన్సీ డోర్లు బద్దలు కొట్టి బయటపడ్డారు. అయితే మంటలు మరింత వేగంగా వ్యాపించడంతో చాలామంది బయటకు రాకుండానే మృతిచెందారు.

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. క్షతగాత్రులను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ, ఇది ఒక తీవ్ర విషాదం. మొదట చిన్న ప్రమాదమని భావించిన డ్రైవర్లు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలు ఒక్కసారిగా విస్తరించడంతో ప్రమాదం ఘోరరూపం దాల్చింది. డ్రైవర్లిద్దరినీ అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నామని తెలిపారు.

బస్సులో మొత్తం 42 మంది ప్రయాణికులు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. వీరిలో చాలా మంది హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారున్నారు. అశ్విన్‌రెడ్డి (బీరంగూడ), సుబ్రమణ్యం (బహదూర్‌పల్లి), ప్రశాంత్, గుణసాయి (సూరారం), అర్గ బందోపాధ్యాయ్‌ (మియాపూర్‌), నవీన్‌కుమార్‌ (వనస్థలిపురం), వేణు (చింతల్‌), శ్రీహర్ష‌ (నిజాంపేట్‌), శివ (గచ్చిబౌలి), గ్లోరియా శ్యామ్‌ (గచ్చిబౌలి), యువన్‌ శంకర్‌ రాజ్‌ (ఎల్బీనగర్‌), ధాత్రి, రామారెడ్డి, అమృత్‌కుమార్, మంగా చందన, సూర్య, ఉమాపతి, పంకజ్‌ తదితరుల వివరాలు లభించాయి. వీరిలో పలువురు పరారైనట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.

ప్రమాదం నుంచి బయటపడ్డ జయసూర్య, రామిరెడ్డి, అకీరా, వేణుగోపాల్ రెడ్డి, హారిక, సత్యనారాయణ, శ్రీలక్ష్మీ, నవీన్ కుమార్, అఖిల్, జస్మత, రమేష్, సుబ్రహ్మణ్యం తదితరులు తీవ్ర షాక్‌లో ఉన్నారు. ఆసుపత్రిలో ప్రస్తుతం 20 మంది చికిత్స పొందుతున్నారు. బస్సు పటాన్‌చెరువు నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్తుండగా ఉల్లిందకొండ క్రాస్ వద్ద బైక్‌ను ఢీకొట్టింది. ఆ బైక్ బస్సు కిందకి చేరస్థి మంటలు ఒక్కసారిగా చెలరేగి బస్సు మొత్తాన్ని చుట్టేసినట్లు అధికారులు తెలిపారు.

జిల్లా కలెక్టర్ సిరి స్వయంగా ప్రమాదస్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ, ఇది చాలా దారుణమైన ఘటన. బైక్ బస్సు కింద చిక్కుకోవడంతో మంటలు చెలరేగాయి. డోర్ ఓపెన్ కేబుల్ తెగిపోవడంతో ప్రయాణికులు బయటపడలేకపోయారు. ఇప్పటి వరకు 11 మృతదేహాలను వెలికితీశాం. 20 మంది సురక్షితంగా బయటపడ్డారని వివరించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దుబాయ్ పర్యటనలో ఉన్నప్పటికీ ప్రమాదం వివరాలను తెలుసుకున్న వెంటనే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి ప్రగాఢ సానుభూతి ప్రకటించి, క్షతగాత్రులకు మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఆయన మాట్లాడుతూ, మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదిక సమర్పించాలని సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ చేశాం. సహాయక చర్యలు వేగంగా కొనసాగాలి అని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఘటనపై దిగ్బ్రాంతి వ్యక్తంచేసి అధికారులకు తక్షణ సహాయక చర్యలు ప్రారంభించాలని ఆదేశించారు.

వైయస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నటేకూరు వద్ద జరిగిన ఈ బస్సు ప్రమాదం మనసు పగలగొట్టింది. చాలామంది ప్రయాణికులు సజీవదహనం కావడం అత్యంత దురదృష్టకరం. మృతుల కుటుంబాలకు తీవ్ర సానుభూతి తెలియజేస్తున్నాను. క్షతగాత్రులకు అత్యుత్తమ వైద్యం అందించాలనే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. ప్రమాదానికి గల కారణాలపై ఉన్నత స్థాయి విచారణ జరిపి బాధ్యులపై తగిన చర్యలు తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు.

అలాగే ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలు వైయస్ షర్మిలా కూడా తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదం రాష్ట్ర ప్రజలను విషాదంలో ముంచేసింది. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా అండగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను. భద్రతా ప్రమాణాలను మరోసారి తనిఖీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

పలువురు మంత్రులు, కర్నూలు జిల్లా ప్రజలు, నాయకులు, సామాజిక కార్యకర్తలు ఈ ప్రమాదాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ప్రమాదానికి కారణమైన నిర్లక్ష్యం ఏదైనా ఉంటే దానిపై నిష్పక్షపాత విచారణ జరపాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

కర్నూలు బస్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర విచారం

కర్నూలు జిల్లా బస్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతులైన వారిపై ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, వారి కుటుంబాలకు ధైర్యం నింపాలని ప్రార్థించారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న వెంటనే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారులతో మాట్లాడి అవసరమైన సహాయ చర్యలు తక్షణమే చేపట్టాలని తెలంగాణ అధికారులకు సీఎం ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించిన ఆయన, ప్రమాద బాధితులకు సహాయం అందించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే గద్వాల్ జిల్లా కలెక్టర్, ఎస్పీ సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు పర్యవేక్షించాలని ఆదేశించారు. బాధితుల చికిత్స, రక్షణ చర్యల్లో ఎలాంటి లోపం ఉండకూడదని ముఖ్యమంత్రి స్పష్టంగా తెలిపారు.

https://youtu.be/eXdMFlQ62zY?si=b4vjKQ_eBbOf-0Ik

Latest News

అత్యధిక బ్లడ్ డోనర్ మోటివేటర్ డా. రాజేశ్వర్ రావు|INTERNATIONAL|BLOOD|DONORS

రక్తదాన సేవలకు గుర్తింపుగా గవర్నర్ సత్కారం|BLOOD DONATION|GOVERNOR హైదరాబాద్, జూన్ 14 (అడుగు న్యూస్): రక్తదానం పట్ల సమాజంలో విస్తృత ప్రచారం, చైతన్యం కలిగిస్తూ, స్వచ్ఛంద రక్త దానాన్ని విశేషంగా ప్రోత్సహిస్తూ, విశిష్ట సేవలందిస్తున్న ...

బరంతి ఇకమతు భలేగుందే!|ADUGU TRENDS

ఇల్లు కట్టుడంటే అట్లిట్ల కాదు. నెలలు, సంవత్సరాలు పడతయి. ఒక్కో కట్టడం దగ్గర ఒక్కో జాగర్త తీసుకోవాలె. లేకపోతే ఇల్లు గుల్లైతది. గట్ల ఇంటికి బరంతి నింపుతం కద. గదాంట్ల మనమైతే ఏం...

భూమి పునరుద్ధరణకే ఎల్ నినో హెచ్చరిక!|EDITORIAL

ఎల్‌నినోను కేవలం ప్రకృతి వైపరీత్యంగా మాత్రమే చూడడం సరైంది కాదు. వాతావరణ మార్పులు, అటవీ నిర్మూలనం, భూమి క్షీణత, ప్లాస్టిక్ కాలుష్యం, జలవనరుల నాశనం వంటి మానవ చర్యలు కూడా ఈ సంక్షోభాలను...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 14 నుండి జూన్ 21 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీలో కొత్త ఉత్సాహం పెరుగుతుంది. పనుల విషయంలో ముందడుగు వేయడానికి మంచి అవకాశాలు కనిపిస్తాయి. కుటుంబ సభ్యులతో సాన్నిహిత్యం...

మియా జాకీ మాయ!|ADUGU TRENDS

పండంటే మామిడి పండే! పండ్లండ్ల మధురమైన పండ్లంటే కూడా మామిడి పండ్లే!! గందుకే గా పండ్లకు గంత గిరాకీ. గీ పండ్లల్ల మస్తు గిరాకీ ఉన్న పండ్లు మియా జాకీ రకమట. గీ...

బడే భవిష్యత్తుకు పునాది?!|EDITORIAL

దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపుదిద్దుకుంటుంది. ఒక మంచి పాఠశాల కేవలం విద్యార్థిని మాత్రమే కాదు, కుటుంబాలని, గ్రామాలని, సమాజాన్ని మార్చగలదు. అందుకే విద్యను వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూడాలి. నీతి ఆయోగ్...

జూన్ 13, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి శని త్రయోదశి తిధి బ త్రయోదశి మధ్యాహ్నం 01.55 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం కృత్తిక రాత్రి 12.17 వరకు ఉపరి రోహిణి యోగం సుకర్మ సాయంత్రం 04.30 వరకు ఉపరి ధృతి కరణం వణజి...

నచ్చత్రాల ఇల్లు!|ADUGU TRENDS

ఆకాసంల నచ్ఛత్రాలన్నీ మన ఇంటిమీదకే వత్తే ఎట్లుంటది!? గట్లనే ఓ ఇల్లు కట్టుకుంటే ఇంకెట్లుంటది!? మబ్బుల్ల తేలాడినట్లే ఉంటది కదా? ఇది కలేం కాదుల్లా? దాన్ని నిజం చేసేటట్లు ఇప్పుడు ఇండ్లు కడతుండ్రు.!...

టీఎంసీ భవితవ్యమేంటి?!|EDITORIAL

టీఎంసీలో గందరగోళానికి బీజేపీ కారణమా? బెంగాల్ లో కాంగ్రెస్‌కు పునరుజ్జీవం లభిస్తుందా? కాంగ్రెస్ లో టీఎంసీ విలీనంపై వస్తున్న ఊహాగానాలు నిజమేనా? రాజకీయాల్లో ఏ పార్టీకైనా ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకున్నంత కాలమే మనుగడ....

జూన్ 12, శుక్రవారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు అధికజ్యేష్ఠ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి సాయంత్రం 04.06 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం భరణి రాత్రి 01.46 వరకు ఉపరి కృత్తిక యోగం అతిగండ రాత్రి 07.20 వరకు ఉపరి సుకర్మ కరణం తైతుల సాయంత్రం 04.06...

గీ కోతి మనుసులకే ఆదర్శం!|ADUGU TRENDS

నిజం కాకపోయినా, కోతి నుండే మనిసి వచ్చాడంటరు. కోతులకు మనుసులకు గంత పోలికన్నట్లు. గా కోతుల బుద్ధులు, శేట్టలు మనుసులకు కూడా ఉంటయి. కొందరిల బయట పడ్తయి. మరికొందరిల బయట పడయి గంతే....

నిరంతరాయ ప్రధానిగా మోదీ రికార్డు!|EDITORIAL

మోదీ, నెహ్రూ రికార్డును అధిగమించడం కేవలం ఒక గణాంక ఘట్టం మాత్రమే కాదు. ఇది భారత ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా వరుసగా మూడు సార్లు అధికారంలోకి వచ్చిన నాయకుడి రాజకీయ ప్రయాణానికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News