బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL
తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU
కేరళలో యూడీఎఫ్|KERALAM
అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM
పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY
ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN
పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN
‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY
నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA
ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి అనుకూలంగా వచ్చాయి. అసోం, పుదుచ్చేరిలో అధికారం నిలుపుకున్న బిజెపి, బెంగాల్లోనూ విజయభేరి మోగించింది. కేరళలో కాంగ్రెస్ నేతృత్వంలోని యÖడిఎఫ్ విజయం సాదించింది. తమిళనాట విజయ్ నేతృత్వంలోని టివికె అనూహ్యంగా దూసుకుని వచ్చింది. యావత్ దేశం ఉత్కంఠగా ఎదురుచూస్తున్న పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, తమిళనాడు, పుదుచ్చేరీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు సోమవారం వెలువడ్డాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ తమిళనాడులో నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ హవా కొనసాగింది. డీఎంకే, అన్నాడీఎంకేను దాటి ఆధిక్యంలో కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో తృణమÖల్ కాంగ్రెస్కు గట్టి షాకిస్తూ భాజపా దూసుకెళ్లింది. కేరళలో యÖడీఎఫ్ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలు ఉండగా.. టీవీకే 104 చోట్ల ఆధిక్యంలో ఉంది. డీఎంకే 62, అన్నాడీఎంకే 68 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. పశ్చిమ బెంగాల్లో 293 స్థానాలకు గానూ.. భాజపా దాదాపు 205 చోట్ల ఆధిక్యంలో ఉంది. టీఎంసీ 85 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. కేరళలో 140 స్థానాలుండగా.. యÖడీఎఫ్ 100 సీట్లను గెల్చుకుంది.. ఎల్డీఎఫ్ 32 స్థానాల్లో, ఎన్డీయే 3చోట్ల గెలుపొందింది. అస్సాంలో 126 స్థానాలుండగా.. భాజపా 100కు పైగా సీట్లతో హ్యాట్రిక విజయాన్ని నమోదు చేసింది. స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. కాంగ్రెస్ 26 చోట్ల ముందంజలో ఉంది. పుదుచ్చేరీలో 30 స్థానాలకు గానూ ఎన్నార్ కాంగ్రెస9 చోట్ల గెలిచి 11 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 2 చోట్ల గెలిచి.. 5 స్థానాల్లో ముందంజలో ఉంది. మొత్తంగా బిజెపి తనకున్న రెండు రాష్టాలకు తోడు బెంగాల్లో పాగా వేసింది. కేరళలో పదేళ్ల తరవాత మళ్లీ కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. తమిళనాట ద్రవిడ పార్టీలకు పరాభవం తప్పలేదు.

