Friday, September 18, 2026
26.4 C
Hyderabad

ఒకటి ఒకటి ఒకటి! రెండు రెండు రెండు!!|EDITORIAL

దేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పది, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీళ్ళంతా ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం, 2022లోనే దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. రోజుకు సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారనే దారుణ వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఇటీవల పరీక్షల ఫలితాల తరువాత ఒక్క రోజులోనే తెలంగాణలో 7గురు, ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి!*

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్ 

నేటి విద్యా వ్యవస్థలో బట్టీలతో చదువులు సట్టుబండలై ర్యాంకుల గోలే రాజ్యమేలుతోంది. టీవీలు, పత్రికలు, సోషల్ మీడియా ర్యాంకుల ప్రచారంతో నిండిపోతున్నాయి. ఒకటి ఒకటి ఒకటి, రెండు రెండు రెండు, మూడు మూడు మూడు “మా విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించారు” అనే ప్రకటనలు విద్యాసంస్థల ప్రతిష్ఠకు ప్రమాణంగా నిలుస్తున్నాయి. అయితే ఈ మెరుపు ప్రచారం వెనుక విద్యార్థులపై పెరుగుతున్న మానసిక ఒత్తిడి, సృజనాత్మకత నాశనం, ఆర్థిక దోపిడీ వంటి రుగ్మతలను పిల్లల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం, ప్రభుత్వం కూడా గమనించాల్సి ఉంది.

భారతదేశంలో ప్రతి ఏటా కోటిన్నర మంది విద్యార్థులు పదో తరగతి, ఇంటర్ వంటి కీలక పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో అత్యధికులు ర్యాంకుల పోటీలో చిక్కుకుని తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికల ప్రకారం, 2022లోనే దేశవ్యాప్తంగా 13 వేలకు పైగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది రోజుకు సగటున 35 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారనే దారుణ వాస్తవాన్ని తెలియజేస్తోంది. ఇటీవల రాష్ట్రాల వారీగా చూస్తే, పరీక్షల ఫలితాల తరువాత ఒక్క రోజులోనే తెలంగాణలో 7గురు, ఆంధ్రప్రదేశ్‌లో ముగ్గురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.

ఇది కేవలం వ్యక్తిగత వైఫల్యాల ఫలితం కాదు. ఇది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం, కుటుంబం, విద్యా వ్యవస్థలోని లోపాల సమ్మిళిత ప్రతిఫలం. తల్లిదండ్రులు తమ పిల్లలపై అధిక అంచనాలు, అలవిగాని ఆశలు పెట్టడం, ఇతరులతో పోల్చడం, “ర్యాంక్ సాధించాలి” అనే ఒత్తిడి పెంచుతున్నారు. మరోవైపు, కార్పొరేట్ విద్యాసంస్థలు ర్యాంకులను ఒక వ్యాపార సాధనంగా మార్చి, లక్షల్లో ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఒక ఇంటర్ విద్యార్థి చదువుకు ఏడాదికి రూ.1 లక్ష నుండి రూ.3 లక్షల వరకు ఖర్చు అవుతున్న పరిస్థితి ఉంది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు భారంగా మారుతోంది.

ఇంకా, ప్రభుత్వ విద్యా వ్యవస్థ వైఫల్యాలు కూడా ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నాయి. అనేక ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత, మౌలిక సదుపాయాల లోపం, హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం లేకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు కూడా చోటుచేసుకోవడం పరిస్థితి ఎంత దారుణంగా ఉందో తెలియజేస్తోంది. ఫలితంగా, పేదలు కూడా ప్రైవేట్ విద్యాసంస్థల వైపు మళ్లుతున్నారు.

ప్రస్తుతం విద్యా వ్యవస్థలో “మార్కులు = ప్రతిభ” అనే తప్పుడు సమీకరణ ఏర్పడింది. కానీ ఇది వాస్తవ దూరం. ప్రతి విద్యార్థికి వేర్వేరు ప్రతిభ, ఆసక్తులు ఉంటాయి. కళలు, క్రీడలు, సాంకేతిక నైపుణ్యాలు వంటి అనేక రంగాల్లో ప్రతిభ కనబరచే అవకాశం ఉంది. కానీ ర్యాంకుల వేటలో ఇవన్నీ పక్కన పడిపోతున్నాయి. తరగతి గదిలో వెనుకబడిన విద్యార్థులు జీవితంలో గొప్ప విజయాలు సాధించిన ఉదాహరణలు చరిత్రలో అనేకం ఉన్నాయి.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం ప్రస్తుతం అత్యంత ముఖ్యమైన అంశంగా మారింది. పరీక్షల సమయంలో కలిగే ఆందోళన, భయం, నిరాశ వంటి భావాలు తీవ్ర మానసిక సమస్యలకు దారి తీస్తున్నాయి. కౌన్సెలింగ్ వ్యవస్థలు చాలా చోట్ల లేవు లేదా సరైన విధంగా పనిచేయడం లేదు. ఒక విద్యార్థి ఫెయిలైతే జీవితం ముగిసినట్లే అన్న భావన పెరుగుతోంది. ఇది అత్యంత ప్రమాదకర దృక్పథం.

ఈ పరిస్థితిని మార్చేందుకు తక్షణ చర్యలు అవసరం. తల్లిదండ్రుల దృక్పథంలో మార్పు రావాలి. పిల్లలను ఇతరులతో పోల్చడం ఆపాలి. వారి ఆసక్తులను గుర్తించి ప్రోత్సహించాలి. మార్కులు మాత్రమే విజయానికి ప్రమాణం కాదని వారికి అర్థమయ్యేలా చేయాలి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు చేపట్టాలి. ర్యాంక్ ఆధారిత పోటీని తగ్గించి, నైపుణ్యాల ఆధారిత విద్యను ప్రోత్సహించాలి. ఒకే విధమైన, సమాన విద్య అందరికీ అందేలా చూడాలి. ఫిన్‌లాండ్ వంటి దేశాల్లో పరీక్షల ఒత్తిడి తక్కువగా ఉండి, విద్యార్థుల సృజనాత్మకతకు ప్రాధాన్యత ఇస్తారు. అలాంటి నమూనాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి. ఉపాధ్యాయ నియామకాలు పెంచాలి, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. ఇలా చేస్తే ప్రైవేట్ విద్యాసంస్థలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది. ప్రైవేట్ విద్యాసంస్థల ఫీజులపై నియంత్రణ అవసరం. అధిక ఫీజుల వసూళ్లను అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలు చేయాలి.

విద్యార్థులకు మానసిక బలం కల్పించడం అత్యంత అవసరం. స్కూల్స్, కాలేజీల్లో కౌన్సెలింగ్ తప్పనిసరి చేయాలి. ఫెయిల్యూర్ అనేది అంతం కాదని, జీవితంలో అనేక అవకాశాలు ఉన్నాయని వారికి తెలియజేయాలి.

విద్య పరమార్థం మార్కులు, ర్యాంకులు సాధించడమే కాదు. అది వ్యక్తిత్వ వికాసానికి, సమాజానికి ఉపయోగపడే నైపుణ్యాల అభివృద్ధికి దోహదపడాలి. ఈ నిజాన్ని గుర్తించినప్పుడే విద్యా వ్యవస్థలో నిజమైన మార్పు సాధ్యమవుతుంది.

Latest News

గాడ సదివిత్తేనే బువ్వ!|ADUGU TRENDS

ఔ మల్ల! గాడ చదివిపిత్తే తప్ప బువ్వ పెట్టారు. కనీసం టోకెన్ కూడా ఇయ్యరు. నువ్వు పెండ్లికి పో, పుట్టిన రోజుకు పో. ఇంకేదైనా ప్రబోజనానికి పో..ఏ ఫంక్షన్ కైనా పో! గాడ...

యుద్ధానికి భారీ మూల్యం.. అమెరికాపై ఆర్థిక భారం!|EDITORIAL

యుద్ధం అంటే కేవలం బాంబులు, క్షిపణుల మోత మాత్రమే కాదు.. ఖజానాపైనా భారీ దెబ్బే! ఇరాన్‌తో అమెరికా ఘర్షణ నేపథ్యంలో అగ్రరాజ్యంపై పెరుగుతున్న బిలియన్ల డాలర్ల భారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయుధాల...

సెప్టెంబర్ 18, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు సప్తమి ఉదయం 11.40 వరకు ఉపరి అష్టమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 10.37 వరకు ఉపరి మూల యోగం ప్రీతీ పగలు 02.47 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం వణజి ఉదయం 11.40...

టెడ్డీ బేర్‌ కు గా పేరు ఎట్లొచ్చిందో తెలుసా!?|ADUGU TRENDS

సిన్న సిన్న సన్న పోరగాండ్లు, లవ్వు, గివ్వు అని తిరిగేటోల్లు, పెద్దోళ్ళు కూడా ఎందుకో గానీ గా ఎలుగుబంటి లెక్కుండే టెడ్డీ బేర్‌ బొమ్మను మస్త్ ఇష్టపడుతుంటరు. పొల్లగాండ్లకు కూడా గా బొమ్మల్ని...

యుద్ధాల్లో ప్రపంచం.. శాంతికి చొరవే మార్గం!|EDITORIAL

యుద్ధం ఎక్కడ జరిగినా దాని ప్రభావం ప్రపంచమంతటా కనిపిస్తుంది. ప్రాణనష్టం, ఆస్తి విధ్వంసంతో పాటు ఆర్థిక సంక్షోభం, ధరల పెరుగుదల, ఆకలి, నిరాశ్రయత వంటి సమస్యలు తీవ్రమవుతాయి. శాంతియుత ప్రపంచమే మానవాళి అభివృద్ధికి...

సెప్టెంబర్ 17, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు షష్ఠి ఉదయం 09.53 వరకు ఉపరి సప్తమి నక్షత్రం అనురాధ రాత్రి 08.11 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం విష్కంబ పగలు 02.23 వరకు ఉపరి ప్రీతి కరణం తైతుల ఉదయం 09.53...

గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు!?|ADUGU TRENDS

అవుమల్ల.. నిజమేనుల్లా... గీ బిచ్చగాడు.. అపర కుబేరుడు? కాకపోతే ముంబై రోడ్ల మీద బిచ్చమెత్తుకుంట కనిపించిండు. గా ఈడియోలు యిగిప్పుడు తెగ వైరలైనయి. అసలు సంగతేందో కనుక్కుందాం పదండ్రి. గీయిన పేరు పరాగ్ షా....

మోదీ 25ఏళ్ళ ప్రస్థానం బీజేపీ ప్రచార వ్యూహం!?|EDITORIAL

మోదీ 25 ఏళ్ల ప్రజా ప్రస్థానాన్ని పురస్కరించుకుని బీజేపీ రూపొందించిన కార్యాచరణలో ప్రజల వద్దకు వెళ్లడం మాత్రమేనా? లేక ప్రజల మాట వినడం కూడా జరుగుతుందా? రాబోయే ఎన్నికల రాజకీయాల్లో ఈ తేడానే...

సెప్టెంబర్ 16, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు పంచమి ఉదయం 08.28 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం విశాఖ రాత్రి 06.02 వరకు ఉపరి అనురాధ యోగం వైధృతి పగలు 02.11 వరకు ఉపరి విస్కమ్బ కరణం బాలవ ఉదయం 08.28...

సెప్టెంబర్ 15, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం తిధి శు చవితి ఉదయం 06.59 వరకు ఉపరి పంచమి నక్షత్రం స్వాతి సాయంత్రం 04.18 వరకు ఉపరి విశాఖ యోగం ఐంద్ర పగలు 02.21 వరకు ఉపరి వైధృతి కరణం భద్ర ఉదయం 06.59...

సెప్టెంబర్ 14, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు భాద్రపద మాసం శుక్లపక్షం వినాయక చవితి https://www.instagram.com/reel/DdPKUAqysmC/?stkn=Nmxzdnc3NDB4ejNn తిధి శు తదియ ఉదయం 07.00 వరకు ఉపరి చవితి నక్షత్రం చిత్త పగలు 03.05 వరకు ఉపరి స్వాతి యోగం బ్రహ్మ పగలు 02.54 వరకు ఉపరి ఐంద్ర కరణం గరజి ఉదయం...

మట్టి గణపతే మహా గణపతి..|ADUGU DIGITAL MEDIA|CLAY GANESHA|DEVOTIONAL

ప్రకృతి పరిరక్షణే అసలైన భక్తి! రెండు రాష్ట్రాల్లో పర్యావరణ పరిరక్షణే మన బాధ్యత అంటూ... అడుగు డిజిటల్ మీడియా ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ గణేశ్ నవరాత్రి వేడుకల్లో పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలకు పిలుపునిస్తూ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News