Monday, August 10, 2026
29.8 C
Hyderabad

కోర్టులు, కేసులు, తీర్పులు న్యాయన్యాయాలు!|EDITORIAL

సుప్రీం కోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన యావత్ దేశానికి దిగ్భ్రాంతిని కలిగించింది. ఆ న్యాయవాది సంయమనం కోల్పోయినా, ప్రధాన న్యాయమూర్తి మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఈ ఘటన అత్యున్నత న్యాయస్థాన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తోంది. సాధారణ పౌరులకు అతీతంగా వ్యవహరించాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తుల వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు, ఒత్తిడి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా జరగాల్సిన విచారణలు, తీర్పులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న అసహనం, కోర్టుల్లో పేరుకుపోతున్న వాయిజ్యాలు, పెరుగుతున్నపని ఒత్తిడి, వృత్తిలో ఉండే విధులు, బాధ్యతలు, సమయ నియంత్రణలు, వివిధ పనుల మధ్య సమన్వయ లోపాలు, అయోమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య అసమతుల్యత మొదలైనవి మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అన్నింటికీ మించి పరిమిత కోర్టులు, అపరిమిత కేసులు, న్యాయమూర్తులు, కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కోర్టులు, కేసులు, తీర్పులు న్యాయన్యాయాలు!
‘డాక్టర్ మార్గం – అడుగు’ ఎడిటోరియల్

సుప్రీం కోర్టులో నిన్న జరిగిన అనూహ్య ఘటన యావత్ దేశానికి దిగ్భ్రాంతిని కలిగించింది. అక్టోబర్ 6న ఓ కేసుపై విచారణ జరుగుతున్న సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ, 71ఏళ్ళున్న రాకేశ్ కిషోర్ అనే న్యాయవాది, సీజేఐ పై బూటు విసిరే ప్రయత్నం చేశాడు. వెంటనే భద్రతా సిబ్భంది దీన్ని అడ్డుకున్నారు. సీజేఐ బీఆర్ గవాయి సనాతన ధర్మానికి అవమానం జరిగేలా వ్యాఖ్యానించారని ఆ న్యాయవాది అభియోగం. అయితే, గవాయి ఈ ఘటనను సీరియస్ గా తీసుకోకుండా, ‘ఇలాంటి చర్యలు నన్ను ప్రభావితం చేయవలేవు’ అంటూ విచారణను కొనసాగించారు. ఆ న్యాయవాది సంయమనం కోల్పోయినా, ప్రధాన న్యాయమూర్తి మాత్రం సమయస్ఫూర్తిని ప్రదర్శించారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఈ ఘటన అత్యున్నత న్యాయస్థాన ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తోంది. సాధారణ పౌరులకు అతీతంగా వ్యవహరించాల్సిన న్యాయవాదులు, న్యాయమూర్తుల వ్యక్తిగత కష్టాలు, నష్టాలు, భావోద్వేగాలు, ఒత్తిడి, వృత్తి నిబద్ధత, సామాజిక బాధ్యతలను ప్రశ్నార్థకంగా మార్చింది. ఓర్పుగా, నేర్పుగా, కూర్పుగా జరగాల్సిన విచారణలు, తీర్పులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. అదే సమయంలో సమాజంలో పెరుగుతున్న అసహనం, కోర్టుల్లో పేరుకుపోతున్న వాయిజ్యాలు, పెరుగుతున్నపని ఒత్తిడి, వృత్తిలో ఉండే విధులు, బాధ్యతలు, సమయ నియంత్రణలు, వివిధ పనుల మధ్య సమన్వయ లోపాలు, అయోమయం, భావోద్వేగాలు, వ్యక్తిగత, వృత్తిగత జీవితాల మధ్య అసమతుల్యత మొదలైనవి మరోసారి తెరమీదకు వస్తున్నాయి. అన్నింటికీ మించి పరిమిత కోర్టులు, అపరిమిత కేసులు, న్యాయమూర్తులు, కొరత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి.

మనదేశ జనాభా, పెరుగుతున్న వాయిజ్యాలకు తగ్గట్లుగా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయమూర్తులు లేరు. కేసుల సంఖ్యపెరిగి, ఒక్కో కేసుకు దశాబ్దాలు పడుతోంది. న్యాయమూర్తులపై ఒత్తిడి పెరుగుతోంది. రోజువారీ కేసులకే సమయం సరిపోవడం లేదు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న మనదేశంలో సుప్రీం కోర్టుకు 34 మంది న్యాయమూర్తులు సరిపోతారా? ఇక హైకోర్టుల్లో 63 లక్షలకు పైగా, దిగువ కోర్టుల్లో ఐదు కోట్ల కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పెండింగ్‌ కేసులు కొండలా పేరుకుపోవడం ఆందోళనకరం. అత్యున్నత న్యాయస్థానం చరిత్రలో ఎన్నడూ లేనంతగా 88,417 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.
న్యాయం ఆలస్యం కావడమంటే అన్యాయం కిందే లెక్క. అండర్‌ ట్రయల్‌ ఖైదీలు కేసులు తెమలక ఏళ్లుగా జైళ్లల్లో మగ్గుతున్నారు. న్యాయం కోసం కోర్టు మెట్లెక్కినా ఏళ్ల తరబడి కేసులు తెమలడం లేదు. రాజకీయ కేసులు తప్ప క్రిమినల్‌ తదితర కేసులు తేలడం లేదు. జాతీయ జ్యుడీషియల్‌ గ్రిడ్‌ ఇచ్చిన తాజా సమాచారం ప్రకారం 69,605 సివిల్‌, 18,887 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు 2020 వేసవి సెలవుల సమయంలో అనేక సంస్కరణలను తీసుకొచ్చారు. ప్రస్తుత సీజేఐ గవాయి వేసవి సెలవుల్లోనూ కోర్టులు పాక్షికంగా పనిచేసే పద్ధతిని తీసుకొచ్చారు. అయినా సరిపోవడం లేదు.

కొల్‌కతా, మహారాష్ట్ర హైకోర్టుల్లో కేసుల పెండింగ్‌ అత్యధికంగా ఉంది. జనాభాతో న్యాయమూర్తుల నిష్పత్తి మనదేశంలోనే అత్యల్పంగా ఉండటం కేసుల పెండింగ్‌కు కారణమనే వాదన ఉంది. అమెరికాలాంటి దేశాల్లో ప్రతి 10 లక్షల జనాభాకు 150 మంది వరకూ న్యాయమూర్తులుండగా, మన దేశంలో 21 మంది న్యాయమూర్తులు మాత్రమే ఉన్నారు. కోర్టుల్లో కేసులు భారీగా పెరిగిపోవడానికి అనేక కారణాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కేసులతో న్యాయస్థానాలపై ఒత్తిడి పెరుగుతోంది. దేశంలో కార్పొరేట్‌, అవినీతి, నేర రాజకీయాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. చట్టసభల సభ్యుల్లో 45 % మందిపై క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రాధాన్యతా క్రమంలో చట్ట సభల సభ్యులు, అధికారులపై కేసులను పరిష్కరించడం కూడా అత్యవసరం.

ఇక న్యాయవాదులు తరచూ వాయిదాలు కోరడం, స్థానికంగా పరిష్కరించదగినవి కూడా కోర్టుల దాకా వెళ్ళడం, వల్ల అసంఖ్యాకంగా కేసులు పెరిగిపోతున్నాయి. అయితే, రిటైర్డ్‌ న్యాయమూర్తుల సేవలు సివిల్‌ కేసుల విషయంలో వినియోగించుకుని, దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న కేసులను తేల్చాలనే సూచన ఉంది. ఏదేమయినా ఈ విషయంలో కేంద్రం ఇక ఎంతమాత్రం ఉపేక్షించకుండా హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో న్యాయమూర్తుల సంఖ్యను పెంచి , కేసుల సత్వర పరిష్కారం కోసం ప్రయత్నం చేయాల్సి ఉంది.

కోర్టుల్లో తగినంతమంది న్యాయమూర్తులను, సిబ్బందిని నియమించాలి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, మౌలిక సదుపాయాలు కల్పించాల్సి ఉంది. లోక్‌ అదాలత్‌లు లాంటివి నిర్వహించి ఇరుపక్షాలు అంగీకరించిన కేసులను పరిష్కరిస్తే కోర్టులపై ఒత్తిడి తగ్గుతుంది. తీర్పులకు సమయం నిర్దేశించాలనే వాదన కూడా వుంది. న్యాయస్థానాలకు పూర్తిస్థాయిలో సహకరించాల్సిన కేంద్రం అనేక సందర్భాల్లో అడ్డుపడటం, అడ్డగోలుగా విమర్శలు చేయడం పరిపాటిగా వుంది. న్యాయమూర్తుల నియామకానికి ప్రత్యేకంగా ఒక జ్యుడీషియల్‌ కమిషన్‌ ఉండాలన్న చర్చ చాలాకాలంగా వుంది. అయితే నేడు కొలీజియం వ్యవస్థ ఆ బాధ్యత నిర్వహిస్తోంది. కాని కేంద ప్రభుత్వం తన రాజకీయ ప్రయోజనాల కోసం నియామకాలను తీవ్రంగా జాప్యం చేస్తోంది. ఏవో సాకులు చూపి తిరస్కరిస్తోంది. ఇంకొన్ని సందర్భాల్లో కొలీజియం, కేంద్ర న్యాయశాఖ మధ్య సమన్వయం కుదరడంలేదు. పాలన, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య భారత రాజ్యాంగం స్పష్టమైన లక్ష్మణరేఖలను నిర్దేశించింది. పాలకులు వాటిని ఉల్లంఘించిన సందర్భాల్లోనే ఇటువంటి పరిస్థితి ఏర్పడుతోంది.

నాగరిక సమాజంలో సత్వర న్యాయం అందించడం న్యాయవ్యవస్థ కనీస బాధ్యత. అందుకోసం సుప్రీంకోర్టు తీసుకుంటున్న చొరవకు కేంద్రం వీలైనంత తోడ్పాటు నందించాలి. అప్పుడే పెండింగ్‌కు అడ్డుకట్టపడటంతోపాటు సత్వర న్యాయం అందేందుకు అవకాశముంటుంది.

 

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News