Thursday, July 30, 2026
23.7 C
Hyderabad

తెలుగు సాహిత్యాధ్యుడు సోమనాథుడే!|PALKURKI SOMANATHA

PALAKURTHI|పాలకుర్తి సాహితీ ప్రస్థానానికి పాదాభివందనం
ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న|GORATI VENKANNA
డాక్టరేట్ ప్రకటించాక తొలిసారి పాలకుర్తికి వచ్చిన వెంకన్న
గోరేటికి ఘనంగా SOMANATHA KALA PITHAM|సోమనాథ కళాపీఠం సత్కారం
LANGUAGE|భాషా, LITERATURE|సాహిత్య కేంద్రంగా పాలకుర్తి
కవి సంగమం వ్యవస్థాపకుడు, కవి యాకూబ్
గోరేటి, యాకూబ్, దినకర్, ఒద్దిరాజులకు సన్మానం

పాలకుర్తి, సెప్టెంబర్ 26 (అడుగు న్యూస్):
తెలుగు సాహిత్య చరిత్రలో పాలకుర్తి నేల అజరామరమైన స్థానం సంపాదించుకుందని, ఈ ప్రాంతానికి చేతులెత్తి వందనం సమర్పిస్తున్నానని ప్రముఖ ప్రజాకవి, వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న అన్నారు. కవి సంగమం వ్యవస్థాపకులు, బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, రాష్ట్ర భాష సాంస్కృతిక శాఖ సలహామండలి సభ్యులు ముచ్చర్ల దినకర్, కవి వద్దిరాజు ప్రవీణ్ కుమార్ తో కలిసి వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్ లో శుక్రవారం జరిగిన అలాయ్ బలాయ్ కార్యక్రమానికి హాజరై, తిరిగి హైదరాబాద్ కు వెళ్తూ, మార్గమధ్యంలో, తొలి తెలుగు కవి, ఆది కవి పాల్కురికి సోమనాథుడి స్వస్థలం పాలకుర్తిలో, ఆయన చిరకాల మిత్రుడు, సోమనాథ కళాపీఠం వ్యవస్థాపక ఉపాధ్యక్షుడు, అడుగు డిజిటల్ మీడియా చీఫ్ ఎడిటర్ డాక్టర్ మార్గం లక్ష్మీ నారాయణను కలిశారు. ఈ సందర్భంగా సోమనాథ కళా పీఠం అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు, కవి పండితుడు, బహుభాషావేత్త, డాక్టర్ రాపోలు సత్యనారాయణ క్లినిక్ లో ఆగి కాసేపు సాహిత్య కలబోతను నిర్వహించారు. డా. మార్గం నాగర్ కర్నూల్ లో చేసిన వార్తల యుద్ధం నుండి కేసుల పర్వం వరకు అప్పటి రోజులను నెమరు వేసుకున్నారు. అడుగు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను చిన్నప్పుడు ఎత్తుకొని తిరిగేది అంటూ మార్గం కుటుంబంతో వారికున్న సాన్నిహిత్యాన్ని అక్కడి వారితో పంచుకున్నారు. ఇదే సమయంలో ఈ నెల 25న డా. బి ఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం గోరేటి వెంకన్న కు డాక్టరేట్ ప్రకటించిన సందర్భంగా సోమనాథ కళాపీఠం, పాలకుర్తి ప్రజల తరపున సన్మానించారు. శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు పాలకుర్తి, చిట్యాల/చాకలి ఐలమ్మ జయంతి కావడంతో చౌరస్తాలోని ఆమె విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు.
అనంతరం గోరేటి వెంకన్న మీడియాతో మాట్లాడుతూ, సాహిత్యాన్ని అంతపురాల నుంచి అనంత ప్రజల్లోకి తీసుకువచ్చిన మహాకవి పాల్కురికి సోమనాథుడు జన్మించిన నేల పాలకుర్తి, ఆయన భాషను జీవ భాషగా నిలబెట్టి, జాను తెలుగులో ద్విపద కావ్యాలను సృష్టించి, పండితారాధ్య చరిత్ర, బసవ పురాణం వంటి అమూల్యమైన కావ్యాలను సమాజానికి అందించారన్నారు. సోమనాథుని రచనలు కేవలం కవిత్వమే కాదు, సమాజ మార్పులకు దిక్సూచి. ఆయన సాహిత్యం సమాజంలోని ప్రతి రంగాన్నీ తాకి, భవిష్యత్తు దశ, దిశలను నిర్దేశించింది. అందుకే నేటికీ పాలకుర్తి, తెలంగాణతో పాటు కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాల్లోనూ ఆయన వారసత్వాన్ని కొనసాగిస్తున్నారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో సాహిత్య వాతావరణాన్ని నింపుతూ డా. రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీనారాయణ వంటి మిత్రులు పనిచేయడం విశేషమన్నారు. నగరాల్లో సాహిత్య వ్యాప్తి సులభం, కానీ పల్లెల్లో అలా చేయడం గొప్ప కృషి అని కొనియాడారు. సోమనాథ కళాపీఠంకు అభినందనలు తెలిపారు.

అలాగే తాను రాసిన ప్రతి కవిత, పాటలో పాల్కురికి సోమనాథుడి ప్రస్తావన తప్పనిసరి అని, అంటే తనపై పాల్కురికి సోమనాథుడి ప్రభావం ఎంతో ఉందన్నారు. బమ్మెర పోతన, పాల్కురికి సోమనలు తెలుగు సాహిత్యానికే మార్గదర్శకులు అన్నారు. అలాగే తెలుగు సాహిత్యం ఆశు సంప్రదాయంగా ఆరంభమై, తరువాత లిఖిత సంప్రదాయంగా రూపుదిద్దుకుందన్నారు. యతి, ప్రాసలకు జన్మనిచ్చిన ఈ పవిత్ర నేల పాలకుర్తి అని, ఈ ప్రాంతానికి రావడం తన అదృష్టం అన్నారు. తనకు డాక్టరేట్ ప్రకటించిన తర్వాత పాలకుర్తికి రావడం తనకు ఆనందంగా ఉందన్నారు. ఇదే సందర్భంలో తన మిత్రుడు డా. మార్గం గురించి మాట్లాడుతూ, ఏదైనా విషయంలో తనకు అనుమానం వస్తే దాన్ని చీల్చి చెండాడే దాకా వదలడని, నాగర్ కర్నూల్ ను తాను ఉన్నన్ని రోజులు గడగడలాడించాడని చెప్పారు. ఆ రోజుల్లో నాగర్ కర్నూల్ లో మార్గం ఉన్నాడో లేడో తెలుసుకొని అప్పటి ప్రజా ప్రతినిధులు వచ్చేవారని, ఉన్నాడంటే అక్కడికి రావడానికే భయపడే వారని చెప్పారు. 35 ఏళ్ల జర్నలిజం ప్రస్థానం వున్న వ్యక్తి నేటి తరానికి తగ్గట్లుగా, అడుగు డిజిటల్ మీడియా పెట్టడం, తక్కువ కాలంలోనే మంచి పేరు తెచ్చుకోవడం అభినందనీయమని అన్నారు. అలాగే అడుగు డిజిటల్ మీడియాను టెక్నికల్ గా, క్రియేటివ్ గా మార్చుతున్న ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మార్గం సాయి సందేశ్ తేజను కూడా అభినందించి, ఆశీస్సులు అందించారు.

అంతకముందు కవి సంగమం వ్యవస్థాపకులు, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్ మాట్లాడుతూ, పాలకుర్తి ఎంతో చరిత్ర కలిగిన ప్రాంతమని, ఈ ప్రాంతాన్ని సాహిత్య కేంద్రంగా మార్చాల్సిన అవసరం ఉందన్నారు. ఇక్కడి చరిత్రను మిత్రులు డా. రాపోలు సత్యనారాయణ, డా. మార్గం లక్ష్మీ నారాయణలు వివరిస్తుంటే తాను ఆశ్చర్యానికి లోనయ్యానన్నారు. ఈ ప్రాంతానికి కవులు, రచయితలను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ప్రాంతానికి సాహిత్య యాత్రకు రావాలన్నారు. ఇక నుండి సోమనాథ కళా పీఠం సాహిత్య కార్యక్రమాలకు తాము వస్తామన్నారు. మేము వస్తుంటే ప్రతి ఊరికి ఒక చరిత్ర ఉందని, ఇలాంటి ప్రశస్తమైన ప్రాంతం ప్రపంచంలో ఎక్కడా లేదని, ఈ ప్రాంతానికి రావడం తమ అదృష్టంగా భావిస్తున్నాం అన్నారు.

చాకలి ఐలమ్మ కు నివాళి
తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా వారి విగ్రహం వద్ద ఎమ్మెల్సీ గోరేటి వెంకన్న ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమాల్లో మారం రవికుమార్, రేపాల అశోక్, రాపాక ఉదయ్, రాపోలు రాంబాబు, అబ్బోజు యాకస్వామి, రాపోలు సోంసాయి, మచ్చ సునీల్, కమ్మగాని నరేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtu.be/gzKUDyvzxcM?feature=shared

Latest News

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

ద్రవరూప రంగుల విల్లు|ADUGU|SPECIAL STORY|CANO CRYSTALS

కొలంబియాలోని ‘లిక్విడ్ రెయిన్‌బో’ కానో క్రిస్టేల్స్ అద్భుత గాథ! ప్రకృతి ఒడిలో దాగున్న వింతలు, విశేషాలు ఎప్పుడూ మానవాళిని మంత్రముగ్ధులను చేస్తూనే ఉంటాయి. మన భూగోళంపై నీలిరంగులో నిర్మలంగా పారే నదులు, అద్దంలా మెరిసే...

అగ్గి పెట్టెతోటే హాజరీ!?|ADUGU TRENDS

పాఠం సెప్పుడంటే పుస్తకం సూసి సదువుడు కాదు. గండ్లున్నదాన్నే వళ్లె యేసుడు కాదు. బెత్తెం పట్టుకుని, బట్టీ పట్టిచ్చుడు అసలే కాదు. గా పిల్లల మెదల్లకు మేతేసుడు. పదను పెట్టుడు. కొత్తగ ఆచరించుడు,...

పార్టీలకు, ప్రభుత్వాలకు ‘నీట్’ గా ఓ హెచ్చరిక!|EDITORIAL

సామాన్య పౌరులు ప్రారంభించిన చిన్న ఉద్యమాలకు దేశవ్యాప్త ఆదరణ లభించడం రాజకీయ పార్టీలకు ఒక గట్టి హెచ్చరిక. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం సంప్రదాయ నాయకత్వంపై మాత్రమే ఆధారపడటం లేదు. కొత్త...

జూలై 28, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చతుర్దశి సాయంత్రం 05.30 వరకు ఉపరి పౌర్ణమి నక్షత్రం పూర్వాషాఢ మధ్యాహ్నం 01.31 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం విష్కంబ రాత్రి 12.49 వరకు ఉపరి ప్రీతి కరణం వణజి సాయంత్రం 05.30 వరకు ఉపరి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News