Friday, May 15, 2026
38.2 C
Hyderabad

AMITH SHAH|అమిత్ జీ… అంతొద్దు!

షా మాటలు DEMOCRACY| ప్రజాస్వామ్యంపై తూటాలు
TELANGANA|  తెలంగాణలో GUN DOWN| కాల్పుల విరమణ ప్రకటించాలి
PEACE| శాంతి చర్చలకు GOVERNMENT| ప్రభుత్వాలు సిద్ధం కావాలి
RELEASE| విడుదల చేసిన LETTER| లేఖలో MAOIST CENTRAL COMMITTEE| మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్‌తోనైనా చర్చలు జరుపుతామని చెప్పే ప్రభుత్వం, దేశీయ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో మాత్రం చర్చలకు సిద్ధంగా లేదనడం అన్యాయమన్నారు. అలాగే తెలంగాణలో కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూన్ 29న నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా చేసిన మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నది, 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభయ్ పేర్కొన్నారు. మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వస్తున్నారని, వారికి, బలగాలతో కలసి చర్చలు జరిపేందుకు మానవీయమైన దృష్టితో చూడాలని చెప్పారు.

మావోయిస్టు పార్టీ ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నదని, మార్చి 28న తెలంగాణలో భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కాల్పుల విరమణ ప్రకటించామని గుర్తు చేశారు. అయినప్పటికీ, కేంద్ర బలగాలు దాడులు ఆపడం లేదన్నారు. కాల్పుల విరమణ చేసినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో 85 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్(హత్య) చేశారని, అందులో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు నేతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇది కేవలం మావోయిస్టులను మట్టుబెట్టే ప్రయత్నం మాత్రమే కాదని, వేలాది ఆదివాసీల భూములను లాక్కొనే కుట్ర కూడా అని అభయ్ ఆరోపించారు. గడ్చిరోలీలో లక్షకు పైగా చెట్లు నరికి కార్పొరేట్ లాభాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందన్నారు.

ఇకపోతే దేశవ్యాప్తంగా మేధావులు, హక్కుల కార్యకర్తలు, శాంతి ప్రేమికులు చర్చలకు మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ శాంతి చర్చల కమిటీ నేతలు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ ముఖ్యమంత్రిని కలసి చర్చల మార్గాన్ని సూచించినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించలేదన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటే రాష్ట్రమే ముందుగా ఆ వాతావరణం సృష్టించాలి అని సూచించారు. అమిత్ షా ప్రకటనలను ఖండించిన కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను అభయ్ స్వాగతించారు. మావోయిస్టులు కూడా భారత పౌరులేనని, వారితో చర్చల కోసం ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు.

ఆదివాసీల హక్కులు, వారి భూములు, అడవులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని, వామపక్షాలు, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు కలసి ఉద్యమాన్ని కొనసాగించాలని అభయ్ పిలుపునిచ్చారు.

Latest News

కిటికీలకు స్లైడింగ్ తెరలు!?|ADUGU TRENDS

ఇల్లంటే సల్లంగుండాలె. ఎటు గాలి గటే పోవాలె. గట్లని కోతులు, పిట్టలు, పశుపచ్చాదులతోటి పరేషాన్లుండొద్దు. ఇగ గిట్ల నిమ్మలంగుండాలంటే, ఇల్లెట్ల కట్టుకోవాలె? ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలె! గసొంటిదే గీ కిటికీలకు స్లైడింగ్ తెరలు....

కాన్వాయ్‌లు కాదు, రాజకీయ దుబారాలు!|EDITORIAL

ప్రజల జీవితాలను కష్టాల్లోకి నెట్టడం పొదుపు కాదు. ప్రభుత్వ వ్యవస్థల్లో ఉన్న వ్యర్థ వ్యయాలను తగ్గించడం. ప్రజలు త్యాగాలు చేయాలని కోరే నాయకులు ముందుగా తమ ఉచిత సదుపాయాలు, అలవెన్సులు, విలాసాలను తగ్గించుకోవాలి....

15-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం మాస శివరాత్రి తిధి బ త్రయోదశి ఉదయం 06.00 వరకు ఉపరి చతుర్దశి నక్షత్రం అశ్విని సాయంత్రం 06.51 వరకు ఉపరి భరణి యోగం ఆయుష్మాన్ మధ్యాహ్నం 12.58 వరకు ఉపరి సౌభాగ్య కరణం వణజి...

కరెంటు తీగల మద్దెలనే ఇల్లు!?|ADUGU TRENDS

కాని కట్టాలు రానీ, కరెంటు తీగలుంటే, గవాటి కింద మనం ఇల్లే కట్టం. గా ఆలోశెన కూడా శేయం. కనీ, గీ అన్న కరెంటు తీగల మద్దెలనే ఇల్లు కట్టిండు! గీ అన్న...

‘నీట్’ గా విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం!|EDITORIAL

పరీక్షల నిర్వహణలో ఇలాంటి వైఫల్యాలు చోటుచేసుకోవడం కేవలం పరిపాలనా నిర్లక్ష్యం కాదు. ఇది విద్యార్థుల భవిష్యత్తుతో ప్రమాదకరమైన ఆటాడుకోవడమే. నీట్ పేపర్ లీక్ మాఫియాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చట్టాలు తేవాలి. ఎన్‌టిఏ...

14-05-2026 గురువారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ద్వాదశి ఉదయం 07.39 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం రేవతి రాత్రి 07.55 వరకు ఉపరి అశ్విని యోగం ప్రీతి మధ్యాహ్నం 03.25 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం తైతుల ఉదయం...

ఒక శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు!?|ADUGU TRENDS

గిదేం ఇచ్చెంత్రం అని ఆశీరపోతుండ్రా!? నిజంగా ఇది నిజమేనుల్లా! గీ శెట్టుకు 234 రకాల మామిడి పండ్లు కాసినయి. గా శెట్టు దగ్గర నిల్సోని సాక్షాత్తు కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహానే...

పొదుపు ఎక్కడి నుండి పొడవాలి?|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల...

13-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ ఏకాదశి ఉదయం 08.53 వరకు ఉపరి ద్వాదశి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.38 వరకు ఉపరి రేవతి యోగం విస్కమ్బ సాయంత్రం 05.39 వరకు ఉపరి ప్రీతి కరణం బాలవ ఉదయం...

ఏటీఎం లోపల సవురం!?|ADUGU TRENDS

ఇగ ఏటీఎంల ఏముంటది? ఓ మిషిని ఉంటది. గదాంట్ల ఏముంటయి? రుపాలుంటయి. మరిగ గిదీంట్ల ఏమున్నది ముచ్చట? ఉందుంది.. గదేందో మీరే సూడుండ్రి. సదువుండ్రి. గా ఏటీఎంల ఓ మనిసికి ఇంకో మనిసి సవురం...

సర్… అనుమానాలెందుకు!?|EDITORIAL

సర్ ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందా? ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థంగా వినియోగిస్తున్నదా? ఇప్పటి డిజిటల్ యుగంలో ఒక వ్యక్తికి ఒకే ఆధార్ నంబర్, ఒకే పాన్ కార్డు, ఒకే పాస్‌పోర్ట్ ఉంటున్నాయి....

12-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం హనుమజ్జయంతి తిధి బ దశమి ఉదయం 09.43 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం పూర్వాభాద్ర రాత్రి 08.48 వరకు ఉపరి ఉత్తరాభాద్ర యోగం వైధృతి రాత్రి 07.28 వరకు ఉపరి విష్కమ్బ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News