Saturday, August 15, 2026
24.7 C
Hyderabad

AMITH SHAH|అమిత్ జీ… అంతొద్దు!

షా మాటలు DEMOCRACY| ప్రజాస్వామ్యంపై తూటాలు
TELANGANA|  తెలంగాణలో GUN DOWN| కాల్పుల విరమణ ప్రకటించాలి
PEACE| శాంతి చర్చలకు GOVERNMENT| ప్రభుత్వాలు సిద్ధం కావాలి
RELEASE| విడుదల చేసిన LETTER| లేఖలో MAOIST CENTRAL COMMITTEE| మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్

హైదరాబాద్, జులై 3 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనలను భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ తీవ్రంగా ఖండించారు. పాకిస్తాన్‌తోనైనా చర్చలు జరుపుతామని చెప్పే ప్రభుత్వం, దేశీయ ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతున్న మావోయిస్టులతో మాత్రం చర్చలకు సిద్ధంగా లేదనడం అన్యాయమన్నారు. అలాగే తెలంగాణలో కాల్పుల విరమణను అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. జూన్ 29న నిజామాబాద్‌లో జరిగిన కిసాన్ సమ్మేళనంలో అమిత్ షా చేసిన మావోయిస్టులు లొంగిపోవడం తప్ప మరో మార్గం లేదన్నది, 2026 మార్చి 31 కల్లా నక్సలిజాన్ని తుదముట్టిస్తామని చెప్పడం ప్రజాస్వామ్యంపై దాడిగా అభయ్ పేర్కొన్నారు. మావోయిస్టులు నాలుగు దశాబ్దాలుగా ప్రజల కోసం త్యాగాలు చేస్తూ వస్తున్నారని, వారికి, బలగాలతో కలసి చర్చలు జరిపేందుకు మానవీయమైన దృష్టితో చూడాలని చెప్పారు.

మావోయిస్టు పార్టీ ఇప్పటికే చర్చలకు సిద్ధంగా ఉన్నదని, మార్చి 28న తెలంగాణలో భద్రతా బలగాలను క్యాంపులకు పరిమితం చేయాలని, కొత్త క్యాంపుల నిర్మాణం నిలిపివేయాలని కోరుతూ కాల్పుల విరమణ ప్రకటించామని గుర్తు చేశారు. అయినప్పటికీ, కేంద్ర బలగాలు దాడులు ఆపడం లేదన్నారు. కాల్పుల విరమణ చేసినప్పటికీ ఛత్తీస్‌గఢ్‌లో 85 మందికి పైగా మావోయిస్టులను ఎన్కౌంటర్(హత్య) చేశారని, అందులో కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి బసవరాజు సహా పలువురు నేతలు కూడా ఉన్నారని పేర్కొన్నారు. ఇది కేవలం మావోయిస్టులను మట్టుబెట్టే ప్రయత్నం మాత్రమే కాదని, వేలాది ఆదివాసీల భూములను లాక్కొనే కుట్ర కూడా అని అభయ్ ఆరోపించారు. గడ్చిరోలీలో లక్షకు పైగా చెట్లు నరికి కార్పొరేట్ లాభాల కోసం అడవులను ధ్వంసం చేస్తున్న కేంద్ర ప్రభుత్వ నిజస్వరూపం బయటపడిందన్నారు.

ఇకపోతే దేశవ్యాప్తంగా మేధావులు, హక్కుల కార్యకర్తలు, శాంతి ప్రేమికులు చర్చలకు మద్దతుగా ఉద్యమాలు చేస్తున్నారన్నారు. తెలంగాణ శాంతి చర్చల కమిటీ నేతలు జస్టిస్ చంద్రకుమార్, ప్రొ. హరగోపాల్ ముఖ్యమంత్రిని కలసి చర్చల మార్గాన్ని సూచించినప్పటికీ ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా కాల్పుల విరమణ ప్రకటించలేదన్నారు. కేంద్రాన్ని డిమాండ్ చేయాలంటే రాష్ట్రమే ముందుగా ఆ వాతావరణం సృష్టించాలి అని సూచించారు. అమిత్ షా ప్రకటనలను ఖండించిన కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలను అభయ్ స్వాగతించారు. మావోయిస్టులు కూడా భారత పౌరులేనని, వారితో చర్చల కోసం ముందుకు రావాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. బీజేపీ మినహా అన్ని పార్టీలు శాంతి చర్చలకు మద్దతు తెలుపుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా వెంటనే కాల్పుల విరమణను ప్రకటించాలని కోరారు.

ఆదివాసీల హక్కులు, వారి భూములు, అడవులను కాపాడేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్చల మార్గాన్ని ఎంచుకోవాలని, వామపక్షాలు, ప్రజాసంఘాలు, మానవ హక్కుల సంస్థలు కలసి ఉద్యమాన్ని కొనసాగించాలని అభయ్ పిలుపునిచ్చారు.

Latest News

గిట్ల కూడా బోనం!?|ADUGU TRENDS

జివ్వ కో రుసి, పుర్రె కో బుద్ధి అన్నరు. ఒక్కొక్క లు ఒక్కో తీరన్న మాట! మొన్నీ మద్దెల ఓ పొల్ల, కాల్లకు గిర్రలు కట్టుకొని, గుడికిపోయింది. గది గూడ బోనమెత్తింది. ఇగో గీ...

పార్లమెంటుపై ప్రశ్నలకు బదులేవి!?|EDITORIAL

జెన్‌జీతో పాటు ప్రతి ఓటరు ఇప్పుడు తన ఎంపీ పనితీరును ప్రశ్నించాల్సిన సమయం వచ్చింది. ఎన్ని ప్రశ్నలు అడిగారు? ఎన్ని చర్చల్లో పాల్గొన్నారు? ప్రజా సమస్యలను ఎన్నిసార్లు లేవనెత్తారు? సభ స్తంభించినప్పుడు వారి...

ఆగస్టు 14, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం తిధి శు.విదియ రాత్రి 08.20 వరకు ఉపరి తదియ నక్షత్రం మఖ ఉదయం 06.50 వరకు ఉపరి పుబ్బ యోగం పరిఘ మధ్యాహ్నం 12.36 వరకు ఉపరి శివ కరణం బాలవ ఉదయం...

బౌద్ధ మతం|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

క్రీ.పూ.ఆరవ శతాబ్దంలో గంగా మైదాన ప్రాంతంలో అనేక మాత శాఖలు వెలిశాయి. అలాంటివి మనకు సుమారు అరవై వరకు తెలుసు. మతాల పుట్టుకకు కారణాలు వేద కాలం తర్వాత సమాజంలో ప్రజలు నాలుగు వర్ణాలుగా (బ్రాహ్మణులు,...

నెత్తింటికెలా? నేతెంటికేలా!?|ADUGU TRENDS

కురులంటే నెత్తింటికలు. కేశాలు. ఎంట్రుకలను ఎన్కటికి కవులు కారుమబ్బులతోటి పోల్చిండ్రు. కావ్యాల్ల కలువల సమూహంతోటి పోల్చిండ్రు. ఎంట్రుకలకు పూల సుగంధాలు అద్దడం పరిపాటే. కల్పవృక్షాల పరిమళాలు దేవతల తలవెంట్రుకల నుండి వెలువడుతున్నట్లు వర్ణించడం...

డిలిమిటేషన్ – ఎవరికి లాభం? ఎవరికి నష్టం?|EDITORIAL

2026 ఏప్రిల్‌ 16న లోక్‌సభలో డీలిమిటేషన్‌ బిల్లు ప్రవేశపెట్టబడింది. అధికారిక పార్లమెంటరీ రికార్డు ప్రకారం అది పెండింగ్‌లో ఉంది. ఇంత ప్రాధాన్యమైన రాజ్యాంగ సవరణను తగిన చర్చ లేకుండా ఆమోదించడమూ తప్పే. రాజకీయ...

ఆగస్టు 13, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్ష ఋతువు శ్రావణ మాసం --శుక్లపక్షం శ్రావణ మాసారంభం తిధి శు.పాడ్యమి రాత్రి 09.43 వరకు ఉపరి విదియ నక్షత్రం ఆశ్లేష ఉదయం 07.42 వరకు ఉపరి మఖ యోగం వరీయాన్ మధ్యాహ్నం 02.53 వరకు పరిఘ కరణం కింస్తుఘ్నం ఉదయం...

గీ అవ్వ.. భలే బాద్దరిది!?|ADUGU TRENDS

గీ అవ్వ అందరసొంటి మామూలు అవ్వ కాదు. భలే బాద్దరిది. పేరుకే ముసలిది కనీ, వయసొళ్ళు కూడా సేయలేని పనులు శేసి సూపిత్తా0ది. ఏకంగా వింగ్ వాక్ శేసి అందరి మనసులను గెలిసి0ది....

పార్లమెంటులో చివరకు మిగిలేదేంటి?!|EDITORIAL

ఇప్పుడు పార్లమెంటులో జరుగుతున్నది నిజంగా ప్రజల కోసమే అయితే, వారికి ప్రయోజనం కలగాలి. విద్యార్థుల కోసమే అయితే వారి సమస్యకు పరిష్కారం రావాలి. ప్రజాస్వామ్యం కోసమే అయితే పార్లమెంట్‌ సరిగా పనిచేయాలి. ప్రజల...

ఆగస్టు 12, బుధవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అమావాస్య రాత్రి 11.30 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం పుష్యమి ఉదయం 08.53 వరకు ఉపరి ఆశ్లేష యోగం వ్యతీపాత సాయంత్రం 05.28 వరకు ఉపరి వరీయాన్ కరణం చతుస్పాద మధ్యాహ్నం 12.31 వరకు ఉపరి...

జెరం గోలీలు బట్టలకేత్తండ్లు!?|ADUGU TRENDS

బట్టలు సర్ఫు, సబ్బుతోటి ఉతుకుతం. గా బట్టలుతికే మిషినిలైతే లిక్విడ్ పొత్తం. జెరం వత్తే, ఓ పారాసిటమాల్ గోలేత్తం. గీ జెరానికేసే గోలి గా బట్టలకెత్తే!? గా జెరం పోయినట్లే గా మురికి...

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు?|EDITORIAL

నిన్న నీట్‌! నేడు జార్ఖండ్‌!! మరి రేపు? మరెక్కడైనా ఇదే పరిస్థితి పునరావృతం కాకూడదు. పరీక్ష ప్రశ్నపత్రాన్ని అమ్ముకునే వ్యక్తి కేవలం విద్యార్థులను మోసం చేయడం లేదు. మెరిట్‌, కష్టం, ప్రతిభపై ఉన్న...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News