Monday, May 4, 2026
38.2 C
Hyderabad

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలలో ఒకటైన హార్మూజ్ జలసంధి సందిగ్ధంలో పడింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ప్రధాన పాత్ర పోషించే ఈ మార్గం అడ్డంకులకు గురికావడంతో భారతదేశంలో వంట గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు, భారీ ఎత్తున ఎల్ఎన్జీ గ్యాస్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేరుతుంది. అందువల్ల ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా అది గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా నౌకాయాన రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని రోజులపాటు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

భారతదేశం ఇంధన అవసరాలలో పెద్ద భాగాన్ని దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. దేశం వినియోగించే చమురులో 85% విదేశాల నుంచే వస్తుంది. అందులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టం. భారతదేశం ఉపయోగించే ఎల్పీజీలో 60% దిగుమతి, అందులో 90% వరకు హార్మూజ్ మార్గం ద్వారానే వస్తుంది.

ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నేరుగా వంట గ్యాస్ సరఫరాపై పడుతోంది. ఇటీవలే భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 17.3 శాతానికి పడిపోయింది. గత నెలతో పోలిస్తే 26.3% తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం హార్మూజ్ ప్రాంతంలో నౌకాయానంలో ఏర్పడిన యుద్ధం.

భారతదేశానికి వచ్చే కొన్ని గ్యాస్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం 22 నౌకలు, అంటే వాటిలో ఎల్పీజీ, ఎలెన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయిన కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ప్రకృతి వాయువు రంగంలో కూడా ప్రభావం కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశానికి వచ్చే ప్రకృతివాయువు దిగుమతుల్లో 25% ప్రభావితమయ్యాయి. దేశం రోజుకు సుమారు 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుండగా, అందులో కొంత భాగం సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది.

అయితే, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ కొరత ఎక్కువగా గృహ వినియోగంపై కాకుండా పరిశ్రమలపై పడేలా ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, గృహ వినియోగం వంటి కీలక రంగాలకు ముందుగా సరఫరా చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తోంది. హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వచ్చే దిగుమతులను 55% నుంచి 70%నికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయినా గ్యాస్ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని చెప్పడం కష్టం. విశ్లేషకుల అంచనాల ప్రకారం, హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే దక్షిణాసియాలో ఎలన్జీ సరఫరా త్రైమాసికానికి 2–3 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉంది.

ఇది జరిగితే.. పరిశ్రమల ఉత్పత్తి తగ్గడం, ఎరువుల ధరలు పెరగడం, చివరకు ఆహార ధరలు కూడా పెరగడం వంటి ప్రభావాల పరంపర ప్రమాదం ఉంది. ఇంధన వ్యయాలు పెరగడం వల్ల జీవన వ్యయం పెరుగుతుంది.

అయితే, ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశం వద్ద కొన్ని వారాలపాటు సరిపడే వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అవసరమైతే ఇండియన్ నేవీ సహాయంతో నౌకలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయినా, ప్రస్తుతం కనిపిస్తున్న వంట గ్యాస్ కష్టాలు పూర్తిగా తాత్కాలికమేనని చెప్పలేం. అలాగని, దీర్ఘకాల సంక్షోభంగా మారే అవకాశమూ తక్కువే. యుద్ధ పరిస్థితులు తగ్గితే సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావచ్చు. కానీ ఉద్రిక్తతలు కొనసాగితే మరికొన్ని నెలలు గ్యాస్ సరఫరాలో ఒత్తిడి ఉండకతప్పదు.

హార్మూజ్ జలసంధి సంక్షోభం ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఇంధన భద్రత కోసం దేశం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సమస్య తాత్కాలికంగా కనిపిస్తున్నా, ఆ సమస్య పరిష్కారం మాత్రం చాలా దీర్ఘకాలికం.

Latest News

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

మే 03 నుండి మే 10 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మీకు మిశ్రమ ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు వస్తాయి కానీ నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా కొంత...

శెదలు పట్టకుండ శేసే శిట్కా!?|ADUGU TRENDS

కొత్తగ ఇల్లు కడతం. ఏడాది తిరక్కముందే గా ఇంటికి శెదలు పడతది. బూజులొత్తయి. బండల కింద పొక్కలు పడతయి. శీమెలు, ఎల్కలు సొత్తయి. ఇగ ఇల్లంత ఆగమాగం. ఇగ ఆయింత రెండు మూడు...

రాజకీయాలకతీతంగా ఆర్థిక క్రమశిక్షణ!|EDITORIAL

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి రోజురోజుకూ సంక్లిష్టంగా, సంక్షోభంగా మారుతోంది. అప్పులు ఎలా తీర్చాలి? అన్న ఆలోచన, ప్రభుత్వాలకు పాలకులకు ఉన్నట్లు కనిపించడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా విధానాల్లో పెద్ద మార్పు కనిపించడం లేదు....

02-05-2026 శనివారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 10.45 వరకు ఉపరి విదియ నక్షత్రం విశాఖ రాత్రి తెల్ల 05.23 వరకు ఉపరి అనూరాధ యోగం వ్యతీపాత రాత్రి 08.24 వరకు ఉపరి వరీయాన్ కరణం బాలవ...

పందేరం సందేశమేనా?|TELANGANA|V.HANUMANTHA RAO|BC

వీహెచ్ కు సలహా పదవి..|V.HANUMANTHA RAO|ADVISOR బీసీలకు సానుకూల సంకేతమా?|BC సీనియర్ల అనుభవానికి గుర్తింపా?|SENIOR LEADERS పార్టీకి, ప్రభుత్వానికి మేలు చేసేనా?|PARTY|GOVERNMENT సీఎం పదవి మరింత పదిలమయ్యేనా?|CM కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావుకు సలహాదారుగా పదవివ్వడం పార్టీలో సీనియార్టీని గౌరవించడమా?...

ఇటికెలకు నీల్లు కొడితే, గోడలు గట్టిగుంటయ్!?|ADUGU TRENDS

ఇల్లు కడితే ఏం శేత్తం? గోడలు కట్టినంక నీల్లు బాగా పడ్తం. కనీ, ఇటికెలకు నీల్లు పట్టినంకనే గోడలు కట్టాల్నట! గట్ల కడితే గా ఇటికెలు గట్టిపడి గోడలు నెర్రెలు బాయయట. గంతే...

శ్రమైక జీవన సౌందర్యం-మే డే!|EDITORIAL

“శ్రమైక జీవన సౌందర్యానికి ఖరీదు కట్టే శరాబు లేడోయ్” అన్నాడు మహాకవి శ్రీశ్రీ. కష్టజీవులకు, కర్మవీరులకు నిత్యమంగళం నిర్దేశిస్తూ, స్వస్తివాక్యములు సంధానిస్తూ, స్వర్ణవాద్యములు సంరావిస్తూ, వ్యథార్త జీవిత యథార్థ దృశ్యం పునాదిగా ఇక...

01-05-2026 శుక్రవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--శుక్లపక్షం వైశాఖ పూర్ణిమ మేడే  తిధి శు పౌర్ణమి రాత్రి 09.15 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం స్వాతి రాత్రి 03.10 వరకు ఉపరి విశాఖ యోగం సిద్ది రాత్రి 08.13 వరకు ఉపరి వ్యతీపాత కరణం భద్ర...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News