Thursday, August 6, 2026
28.2 C
Hyderabad

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలలో ఒకటైన హార్మూజ్ జలసంధి సందిగ్ధంలో పడింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ప్రధాన పాత్ర పోషించే ఈ మార్గం అడ్డంకులకు గురికావడంతో భారతదేశంలో వంట గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు, భారీ ఎత్తున ఎల్ఎన్జీ గ్యాస్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేరుతుంది. అందువల్ల ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా అది గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా నౌకాయాన రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని రోజులపాటు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

భారతదేశం ఇంధన అవసరాలలో పెద్ద భాగాన్ని దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. దేశం వినియోగించే చమురులో 85% విదేశాల నుంచే వస్తుంది. అందులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టం. భారతదేశం ఉపయోగించే ఎల్పీజీలో 60% దిగుమతి, అందులో 90% వరకు హార్మూజ్ మార్గం ద్వారానే వస్తుంది.

ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నేరుగా వంట గ్యాస్ సరఫరాపై పడుతోంది. ఇటీవలే భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 17.3 శాతానికి పడిపోయింది. గత నెలతో పోలిస్తే 26.3% తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం హార్మూజ్ ప్రాంతంలో నౌకాయానంలో ఏర్పడిన యుద్ధం.

భారతదేశానికి వచ్చే కొన్ని గ్యాస్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం 22 నౌకలు, అంటే వాటిలో ఎల్పీజీ, ఎలెన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయిన కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ప్రకృతి వాయువు రంగంలో కూడా ప్రభావం కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశానికి వచ్చే ప్రకృతివాయువు దిగుమతుల్లో 25% ప్రభావితమయ్యాయి. దేశం రోజుకు సుమారు 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుండగా, అందులో కొంత భాగం సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది.

అయితే, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ కొరత ఎక్కువగా గృహ వినియోగంపై కాకుండా పరిశ్రమలపై పడేలా ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, గృహ వినియోగం వంటి కీలక రంగాలకు ముందుగా సరఫరా చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తోంది. హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వచ్చే దిగుమతులను 55% నుంచి 70%నికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయినా గ్యాస్ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని చెప్పడం కష్టం. విశ్లేషకుల అంచనాల ప్రకారం, హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే దక్షిణాసియాలో ఎలన్జీ సరఫరా త్రైమాసికానికి 2–3 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉంది.

ఇది జరిగితే.. పరిశ్రమల ఉత్పత్తి తగ్గడం, ఎరువుల ధరలు పెరగడం, చివరకు ఆహార ధరలు కూడా పెరగడం వంటి ప్రభావాల పరంపర ప్రమాదం ఉంది. ఇంధన వ్యయాలు పెరగడం వల్ల జీవన వ్యయం పెరుగుతుంది.

అయితే, ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశం వద్ద కొన్ని వారాలపాటు సరిపడే వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అవసరమైతే ఇండియన్ నేవీ సహాయంతో నౌకలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయినా, ప్రస్తుతం కనిపిస్తున్న వంట గ్యాస్ కష్టాలు పూర్తిగా తాత్కాలికమేనని చెప్పలేం. అలాగని, దీర్ఘకాల సంక్షోభంగా మారే అవకాశమూ తక్కువే. యుద్ధ పరిస్థితులు తగ్గితే సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావచ్చు. కానీ ఉద్రిక్తతలు కొనసాగితే మరికొన్ని నెలలు గ్యాస్ సరఫరాలో ఒత్తిడి ఉండకతప్పదు.

హార్మూజ్ జలసంధి సంక్షోభం ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఇంధన భద్రత కోసం దేశం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సమస్య తాత్కాలికంగా కనిపిస్తున్నా, ఆ సమస్య పరిష్కారం మాత్రం చాలా దీర్ఘకాలికం.

Latest News

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News