Wednesday, May 6, 2026
33.2 C
Hyderabad

వంట గ్యాస్ సమస్య తాత్కాలికమా? దీర్ఘకాలికమా?|EDITORIAL

అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ ల మధ్య యుద్ధ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సహా, సాధారణ కుటుంబాల వంటింటినీ ప్రభావితం చేస్తున్నాయి. ఇరాన్‌–అమెరికా, ఇజ్రాయెల్ మధ్య పెరిగిన ఘర్షణల కారణంగా ప్రపంచంలోని అత్యంత కీలక సముద్ర మార్గాలలో ఒకటైన హార్మూజ్ జలసంధి సందిగ్ధంలో పడింది. ప్రపంచ చమురు, గ్యాస్ రవాణాలో ప్రధాన పాత్ర పోషించే ఈ మార్గం అడ్డంకులకు గురికావడంతో భారతదేశంలో వంట గ్యాస్ సరఫరా, ధరలపై ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది.

ప్రపంచ చమురు రవాణాలో 20% ఈ జలసంధి ద్వారానే సాగుతుంది. రోజుకు 20 మిలియన్ బ్యారెళ్ల చమురు, భారీ ఎత్తున ఎల్ఎన్జీ గ్యాస్ ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు చేరుతుంది. అందువల్ల ఇక్కడ ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా అది గ్లోబల్ మార్కెట్లను కుదిపేస్తుంది. ప్రస్తుతం యుద్ధం కారణంగా నౌకాయాన రాకపోకలు ఆగిపోయాయి. కొన్ని రోజులపాటు నౌకల రాకపోకలు దాదాపు నిలిచిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

భారతదేశం ఇంధన అవసరాలలో పెద్ద భాగాన్ని దిగుమతులపై ఆధారపడి ఉంటుంది. దేశం వినియోగించే చమురులో 85% విదేశాల నుంచే వస్తుంది. అందులో పెద్ద భాగం గల్ఫ్ ప్రాంతం నుంచి వస్తుంది. ముఖ్యంగా వంట గ్యాస్ విషయంలో పరిస్థితి మరింత క్లిష్టం. భారతదేశం ఉపయోగించే ఎల్పీజీలో 60% దిగుమతి, అందులో 90% వరకు హార్మూజ్ మార్గం ద్వారానే వస్తుంది.

ఈ నేపథ్యంలో యుద్ధ ప్రభావం నేరుగా వంట గ్యాస్ సరఫరాపై పడుతోంది. ఇటీవలే భారతదేశంలో ఎల్పీజీ వినియోగం 17.3 శాతానికి పడిపోయింది. గత నెలతో పోలిస్తే 26.3% తగ్గుదల నమోదైంది. దీనికి ప్రధాన కారణం హార్మూజ్ ప్రాంతంలో నౌకాయానంలో ఏర్పడిన యుద్ధం.

భారతదేశానికి వచ్చే కొన్ని గ్యాస్ ట్యాంకర్లు అక్కడే నిలిచిపోయాయి. ప్రస్తుతం 22 నౌకలు, అంటే వాటిలో ఎల్పీజీ, ఎలెన్జీ, క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు నిలిచిపోయిన కారణంగా గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది.

ప్రకృతి వాయువు రంగంలో కూడా ప్రభావం కనిపిస్తోంది. పశ్చిమాసియా సంక్షోభం వల్ల భారతదేశానికి వచ్చే ప్రకృతివాయువు దిగుమతుల్లో 25% ప్రభావితమయ్యాయి. దేశం రోజుకు సుమారు 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల గ్యాస్ వినియోగిస్తుండగా, అందులో కొంత భాగం సరఫరా సమస్యలు ఎదుర్కొంటోంది.

అయితే, పరిస్థితి నియంత్రణలోనే ఉందని ప్రభుత్వం చెబుతోంది. గ్యాస్ కొరత ఎక్కువగా గృహ వినియోగంపై కాకుండా పరిశ్రమలపై పడేలా ప్రాధాన్యత క్రమాన్ని అమలు చేస్తున్నారు. హాస్పిటల్స్, విద్యాసంస్థలు, గృహ వినియోగం వంటి కీలక రంగాలకు ముందుగా సరఫరా చేస్తున్నారు.

ప్రస్తుతం భారతదేశం 40 దేశాల నుంచి చమురు దిగుమతి చేస్తోంది. హార్మూజ్ మీద ఆధారాన్ని తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వచ్చే దిగుమతులను 55% నుంచి 70%నికి పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది.

అయినా గ్యాస్ సంక్షోభం త్వరలోనే సమసిపోతుందని చెప్పడం కష్టం. విశ్లేషకుల అంచనాల ప్రకారం, హార్మూజ్ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగితే దక్షిణాసియాలో ఎలన్జీ సరఫరా త్రైమాసికానికి 2–3 మిలియన్ టన్నులు తగ్గే అవకాశం ఉంది.

ఇది జరిగితే.. పరిశ్రమల ఉత్పత్తి తగ్గడం, ఎరువుల ధరలు పెరగడం, చివరకు ఆహార ధరలు కూడా పెరగడం వంటి ప్రభావాల పరంపర ప్రమాదం ఉంది. ఇంధన వ్యయాలు పెరగడం వల్ల జీవన వ్యయం పెరుగుతుంది.

అయితే, ఆశాజనక అంశాలు కూడా ఉన్నాయి. భారతదేశం వద్ద కొన్ని వారాలపాటు సరిపడే వ్యూహాత్మక నిల్వలు ఉన్నాయి. అవసరమైతే ఇండియన్ నేవీ సహాయంతో నౌకలకు రక్షణ కల్పించే ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నారు. అయినా, ప్రస్తుతం కనిపిస్తున్న వంట గ్యాస్ కష్టాలు పూర్తిగా తాత్కాలికమేనని చెప్పలేం. అలాగని, దీర్ఘకాల సంక్షోభంగా మారే అవకాశమూ తక్కువే. యుద్ధ పరిస్థితులు తగ్గితే సరఫరా త్వరగా సాధారణ స్థితికి రావచ్చు. కానీ ఉద్రిక్తతలు కొనసాగితే మరికొన్ని నెలలు గ్యాస్ సరఫరాలో ఒత్తిడి ఉండకతప్పదు.

హార్మూజ్ జలసంధి సంక్షోభం ఒక పెద్ద పాఠం చెబుతోంది. ఇంధన భద్రత కోసం దేశం దిగుమతులపై ఆధారాన్ని తగ్గించుకుని, ప్రత్యామ్నాయ వనరులను పెంచుకోవాల్సిన అవసరం ఉంది. వంట గ్యాస్ సమస్య తాత్కాలికంగా కనిపిస్తున్నా, ఆ సమస్య పరిష్కారం మాత్రం చాలా దీర్ఘకాలికం.

Latest News

ప్లాస్టిక్ టబ్బే వాష్ బేసిన్!?|ADUGU TRENDS

తెలివుండాలె. ఇగ గదే ఉంటే ఎన్ని ఉపాయాలైనా శేయొచ్చు. గట్లనే గీ తమ్ముడు మంచి పాయమే శేసిండు. ప్లాస్టిక్ టబ్బును వాష్ బేసిన్ శేసిండు. కర్సు తక్కువల గదెట్ల శేసిండో మనమూ సూద్దామానుల్లా? ఒక...

విజయాలు సరే, జన జీవన ప్రమాణాలేంటి!|EDITORIAL

ఎన్నికలు కేవలం అధికార మార్పిడికి ప్రక్రియ మాత్రమే కాదు. అవి ప్రజల ఆశలు, ఆకాంక్షలు, సంతృప్తులు, అసంతృప్తుల ప్రతిబింబం. దేశంలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను విశ్లేషిస్తే, దేశవ్యాప్తంగా ఓటర్లు స్పష్టంగా...

06-05-2026 బుధవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి పూర్తిగా రోజంత నక్షత్రం మూల మధ్యాహ్నం 01.04 వరకు ఉపరి పూర్వాషాఢ యోగం సిద్ద రాత్రి 10.40 వరకు ఉపరి సాధ్య కరణం కౌలవ సాయంత్రం 05.36 వరకు ఉపరి...

మార్పు… తీర్పు!|ELECTIONS|5 STATES|RESULTS

బెంగాల్ లో కమల ప్రభజనం|WEST BENGAL తమిళనాట దళపతి సంచలనం|TAMILNADU కేరళలో యూడీఎఫ్|KERALAM అసోంలో బీజేపీ హ్యాట్రిక్|ASSAM పుదుచ్చేరిలో కమలం|PUDUCHERRY ఓడిపోయిన మమత, స్టాలిన్|MAMATHA BENARJEE|STALIN పరువునిలుపుకున్న విజయన్|VIJAYAN ‘దళపతి’తో ‘సోపతి’ ఎవరు?|THALALPATHY VIJAY నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ?|TELANGANA ఐదు రాష్టాల ఎన్నికల ఫలితాలు బిజెపికి...

తమిళనాట కొత్త చరిత|TAMILANADU|TVK PARTY

ద్రవిడ పార్టీలకు చరమగీతం అనూహ్యంగా దళపతి విజయం|THALAPATHY VIJAY స్టాలిన్ కు ఘోర పరాజయం|STALIN ప్రభావం చూపని బీజేపీ నేతలు|BJP LEADERS తమిళనాట కొత్త చరిత్ర ఆవిష్కృతమయ్యింది. అనూహ్యంగా దూసుకు వచ్చిన నటుడు విజయ్ పార్టీ తమిళనాట జెండా...

గదేం సూకిల్? గిదేం మాయ!?|ADUGU TRENDS

అవునుల్లా..! గీ సైకిల్ ను తొక్కేటోడు కంటికి కనిపించడు. కనీ, గా సైకిల్ మాత్రం రోడ్ల మీద పోతనే ఉంటది. ఇగ గిది సూసినోల్లు.. గిదేం సిత్రమని నోల్లు ఎల్లబెడతాండ్రు. గీ ముచ్చట...

మార్పుకై ప్రజల తీర్పు!|EDITORIAL

భారత రాజకీయాల్లో ప్రతి అసెంబ్లీ ఎన్నిక జాతీయ ఎన్నికలపై ప్రభావం చూపేదే. దేశ రాజకీయాలను మలుపు తిప్పేవే. సంకీర్ణ దశ నడుస్తున్న ప్రస్తుత దశలో ఇది మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నది. గత కొన్ని...

05-05-2026 మంగళవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం సంకట హరచతుర్థి తిధి బ చవితి రాత్రి తెల్ల 04.40 వరకు ఉపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 10.29 వరకు ఉపరి మూల యోగం శివ రాత్రి 10.06 వరకు ఉపరి సిద్ద కరణం...

04-05-2026 సోమవారం|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-వసంత ఋతువు వైశాఖ మాసం--కృష్ణపక్షం తిధి బ తదియ రాత్రి 02.36 వరకు ఉపరి చవితి నక్షత్రం అనూరాధ ఉదయం 07.51 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం పరిఘ రాత్రి 09.26 వరకు ఉపరి శివ కరణం వణజి మధ్యాహ్నం...

ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనం|ARYAVAISHYA MAHASABHA|ANDHRA

ఆర్యవైశ్య మహాసభ అట్టర్ ప్లాప్ తెలంగాణ నేతల బహిష్కరణ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘం నేత మిడిదుడ్డి శ్యామ్ సుందర్ తెలంగాణ ఆర్యవైశ్య మహాసభలో ఆంధ్రా పెత్తనమే కొనసాగుతోందని, తెలంగాణ వైశ్యనేతలు దూరంగా ఉండటమే ఇందుకు కారణమని రాష్ట్ర...

గా ప్లాస్టిక్ పైపులతోటి ఇంటికప్పు!?|ADUGU TRENDS

ఎవలైనా గూన పెంకలు, బెంగుళూరు పెంకలతోటో, రేకులతోటో, సిమిటి కాంక్రీటుతోటో ఇంటికి పై కప్పేత్తరు. కానీ, గీ అన్న ఏకంగా ప్లాస్టిక్ పైపులతోటే ఇంటికప్పేసిండు. గీయనకు పై కప్పుల్లో పపంచ కప్పే ఇయ్యాలె...

అప్పుల ఊబీలోకి దేశం, రాష్ట్రాలు!|EDITORIAL

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. సంక్షేమ పథకాల విస్తరణ, పెరుగుతున్న అప్పులు, ఆదాయ వనరుల పరిమితి, దుబారా ఖర్చులు, ఖర్చుల ప్రాధాన్యతా లోపాలు, ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News