Saturday, August 1, 2026
25.5 C
Hyderabad

రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలి|KTR|REVANTH REDDY

సీఎం ఛార్జ్‌షీట్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు

TELANGANA|తెలంగాణ CM|ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు NATIONAL HERALD|నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో ఉండటం రాష్ట్ర ప్రజలకు అవమానకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వ్యాఖ్యానించారు. నైతికత, నిజాయితీ ఉంటే రేవంత్ స్వయంగా ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే కాంగ్రెస్ హైకమాండ్ ఆయన్ని పదవి నుంచి తప్పించాల్సిందిగా కేటీఆర్ పేర్కొన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో బాగ్‌మేన్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ రూట్ స్కామ్‌లో కీలకపాత్ర పోషించారని, ఇది కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఏటీఎంగా వాడుతున్న దానికి నిదర్శనమని విమర్శించారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన ఆరోపణలు ఇప్పుడు ఈడీ చార్జ్‌షీట్‌తో నిజమని రుజువైందని తెలిపారు. ఎవరెవరికి డబ్బులు ఇచ్చారో, ఏ పదవుల కోసం ఇచ్చారో, ఎన్ని మొత్తాల్లో పంపారో ఈడీ స్పష్టంగా వెల్లడించిందన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

తెలంగాణ సీఎం పదవిని కాపాడుకోవడానికి రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్‌కు ముడుపులు పంపుతున్నారని, 17 నెలల్లో 44 సార్లు ఢిల్లీకి వెళ్లడం ద్వారా అరుదైన రికార్డు నెలకొల్పారని ఎద్దేవా చేశారు. అమిత్ షా కాళ్లు పట్టుకుంటూ కేసుల నుంచి తప్పించుకోవాలని వేడుకుంటారని, బయటకి వచ్చాక పెద్ద ఫోజులు కొడతారని విమర్శించారు. లక్షా ఎనభై వేల కోట్ల అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం అమలు చేయలేదని, ఒక్క హామీ నెరవేర్చలేదని పేర్కొన్నారు. తెలంగాణ సంపదను దోచుకుని ఢిల్లీకి పంపే రాజకీయ కమిషనర్‌గా పనిచేస్తున్నారని ఆరోపించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

రాహుల్ గాంధీ రాజ్యాంగ పరిరక్షణ కోసం దేశం చుట్టేస్తున్నా, తన పార్టీ సీఎం అవినీతిపై మాట్లాడడం లేదన్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీల పేర్లను చార్జ్‌షీట్‌లో చేర్చినప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు స్పందించగా, రేవంత్ మాత్రం జపాన్ పర్యటన పేరుతో తప్పించుకోవడం అనుమానాస్పదమన్నారు. మౌనం వీడని కారణం తనపేరూ చార్జ్‌షీట్‌లో వచ్చే అవకాశం ఉందన్న భయమేనని కేటీఆర్ వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

తెలంగాణ బీజేపీ నేతలు కూడా రేవంత్ అవినీతిపై మౌనంగా ఉండటం, కాంగ్రెస్, బీజేపీల మధ్య ఉన్న కుమ్మక్కునకు నిదర్శనమన్నారు. కర్ణాటకలో డీకే శివకుమార్‌పై బీజేపీ నేతలు తీవ్రంగా విమర్శిస్తుంటే, అదే కేసులో ఉన్న రేవంత్‌పై మాత్రం తెలంగాణ బీజేపీ నేతలు మౌనం వహించడం పాక్షికతకు ఉదాహరణగా పేర్కొన్నారు. పోంగులేటి ఇంట్లో ఈడీ సోదాలు జరిగి ఏడాది అయినా ఇప్పటివరకు ఒక్క ప్రకటన కూడా బయటకు రాలేదని, 45 కోట్లు వాల్మీకి స్కామ్ ద్వారా తెలంగాణకు వచ్చాయని రిమాండ్ డైరీలోనే ఈడీ పేర్కొన్నదని గుర్తు చేశారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

సివిల్ సప్లై స్కామ్‌పై తమ వద్ద ఆధారాలతో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ కట్టర్‌కు ఫిర్యాదు చేసినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం స్పందించలేదని విమర్శించారు. అమృత్ కుంభకోణంలో రేవంత్ బావమరిది శోధా కన్‌స్ట్రక్షన్ కంపెనీకి అర్హత లేకుండా రూ.1137 కోట్ల టెండర్లు అప్పగించారని పేర్కొన్నారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో కేంద్ర ఎంపవర్ కమిటీ నివేదిక ఇచ్చినా కేంద్రం చర్యలు తీసుకోలేదని, ఇది బీజేపీ, కాంగ్రెస్ మధ్య అవినీతి ఒప్పందాలకు ఉదాహరణ అన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ప్రస్తావిస్తూ ఎలాంటి అవినీతి జరగలేదని గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం మంత్రులే బహిరంగంగా 30 శాతం కమిషన్ అడుగుతున్నారన్న ఆరోపణలు వెలువడుతున్నాయని, ఇది రేవంత్ ప్రభుత్వానికి గుణపాఠమని అన్నారు. సీఎం‌కు పిల్లనిచ్చిన ఆయన మామే కాళేశ్వరంపై అవినీతి ఆరోపణలు అవాస్తవమని పేర్కొంటున్నారని చెప్పారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

మీడియా కొన్ని పత్రికలు నేషనల్ హెరాల్డ్ చార్జ్‌షీట్‌లో రేవంత్ పేరుని సైతం ప్రచురించలేదని, ఎంత తాపత్రయపడ్డా ప్రజలెప్పుడో నిజాలు తెలుసుకున్నారని పేర్కొన్నారు. ప్రజాస్వామిక స్ఫూర్తి ఉన్న పార్టీగా బీఆర్‌ఎస్‌లో ఎవరైనా అధ్యక్షుడికి సూచనలు చేయవచ్చని, గతంలోనూ అనేక మంది నేతలు లేఖలు రాశారని చెప్పారు. కోవర్టులు ఎవరో బయటపడతారని వ్యాఖ్యానించారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

కేటీఆర్ చివరగా హెచ్చరిస్తూ, ముఖ్యమంత్రిని ప్రాసిక్యూట్ చేయాలంటూ గవర్నర్‌ను కలవనున్నట్లు తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించకపోతే నెలరోజుల్లో తమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కేంద్రాన్ని, బీజేపీని ప్రజలముందు ఎండగడతామన్నారు.|KTR|REVANTH REDDY|NATIONAL HERALD|TELANGANA|CM|

Latest News

తెలంగాణ ‘పెద్ద’న్న అస్తమయం!|TELANGANA|PEDDI SUDHARSHAN REDDY

ప్రకటించిన హాస్పిటల్ వైద్యులు హనుమకొండలో గుండెపోటు మెరుగైన వైద్యానికి హైదరాబాద్ కు 5రోజులు మృత్యువుతో పోరాటం కాంగ్రెస్ తోనే రాజకీయ ప్రస్థానం ఆబాల వెంకట్ రెడ్డితో ఓనమాలు మాజీ ఎంపీ సురేందర్ రెడ్డితో పాఠాలు యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఆరంగేట్రం వైఎస్ రాజశేఖర్ రెడ్డితోనూ...

ఎలుక ఎంత పని శేసింది!?|ADUGU TRENDS

మనిసి సహా ఏ పాణి సహజ లచ్చణాలు ఆ పాణికి ఉంటయి. గట్లనే కోతి, కొండెంగ, కుక్క, ఎలుక, మనిసి అసొంటివేవీ అతీతమేమీ కావు. గయి గట్లనే మసులుకుంటయి. గందుకే ‘కనకపు సింహాసనం...

ప్రతిపక్షంగా కాంగ్రెస్ విఫలమవుతోందా!?|EDITORIAL

ప్రతిపక్షం బలహీనంగా ఉంటే ప్రజాస్వామ్యం కూడా బలహీనపడుతుంది. అధికార పక్షం తప్పులను ఎత్తిచూపే శక్తి లేకపోతే ప్రభుత్వ జవాబుదారీతనం తగ్గుతుంది. అందుకే, కాంగ్రెస్ బలపడటం కేవలం ఆ పార్టీ అవసరం మాత్రమే కాదు....

జూలై 31, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ విదియ రాత్రి 09.03 వరకు ఉపరి తదియ నక్షత్రం ధనిష్ఠ రాత్రి 07.09 వరకు ఉపరి శతభిషం యోగం సౌభాగ్య రాత్రి 12.33 వరకు ఉపరి శోభ కరణం తైతుల ఉదయం 08.40...

మా అమ్మాయిని పెండ్లి చేసుకోండి…|CJP|ABHIJITH DIPKE|MARRIAGE

CJP అధినేత అభిజీత్ దీప్కే తల్లి అనిత ఆసక్తికర వ్యాఖ్యలు|MOTHER|ANITA DIPKE ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడిగా, విద్యార్థుల హక్కుల పోరాటంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అభిజీత్ దీప్కే వివాహంపై ఆయన తల్లి...

ఆర్యుల/వైదిక నాగరికత|HISTORY|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS

సింధు నాగరికత తర్వాత భారతదేశంలో అభివృద్ధి చెందిన రెండవ నాగరికత ఆర్యుల నాగరికత. ఈ ఆర్యులు నార్దిక్ జాతికి చెందినవారు. ఈ నార్దిక్ జాతి వారు ఆర్య అనే భాషను మాట్లాడడం ద్వారా...

గుండు కొట్టించుకోండ్రి! యేలు పట్టుకుపోండ్రి!?|ADUGU TRENDS

గుండు కొట్టించుకుంటే ఎవలన్నా పైసలిత్తరా? నిజంగనే ఇత్తరాని? ఇత్తరని గవాల్లు నమ్మిండ్రు. గుండు గూడా గీయించుకుండ్రు. పున్నానికొత్తే పినాయిల్ కూడా తాగుతరన్నట్టు, ఉచితాలకు మనోల్లు ఎంత అలవాటైపోయిండ్లో శేప్పే గీ ముచ్చట మీరే...

నీట్ పరీక్షల బిల్లులో పటిష్టతేది!?|EDITORIAL

కొత్త బిల్లు ఒక్కటే సమస్యకు పరిష్కారం కాదు. ఎంత కఠినమైన శిక్షల బిల్లు తెచ్చినా, లీకేజీలకు పాల్పడేవారు శిక్షల నుంచి తప్పించుకునే మార్గాలను వెతుకుతూనే ఉంటారు. అందువల్ల శిక్షల కంటే వ్యవస్థను బలోపేతం...

జూలై 30, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పాడ్యమి రాత్రి 07.58 వరకు ఉపరి విదియ నక్షత్రం శ్రవణ సాయంత్రం 05.43 వరకు ఉపరి ధనిష్ఠ యోగం ఆయుష్మాన్ రాత్రి 01.02 నుండి ఉపరి సౌభాగ్య కరణం బాలవ ఉదయం 07.44...

సర్.. ఆ కుటుంబాన్ని కలిపింది సార్!?|ADUGU TRENDS

సర్ పక్రియ ఓట్లను తొలగించి సత్తెనాశనం శేసిందని, పతిపక్ష పార్టీలు అల్లరి శేసి ఆగమాగమైతాంటే, అధికార పార్టీ మాత్రం ఏ గిది మస్తుగుంటాందంటాంది. మొత్తానికి సర్, పార్టీలను యిడగొట్టినా, ఓ కుటుంబాన్ని కలిపింది....

హైడ్రా-పారదర్శకతే ప్రామాణికం కావాలి!|EDITORIAL

ప్రభుత్వ భూములను రక్షించడం ఎంత ముఖ్యమో, రాజ్యాంగం కల్పించిన ఆస్తి హక్కు, సహజ న్యాయ సూత్రాలను కాపాడటం కూడా అంతే ముఖ్యమైనది. ప్రభుత్వం హైడ్రా ద్వారా ప్రభుత్వ భూములను కాపాడాలనే లక్ష్యాన్ని విడిచిపెట్టాల్సిన అవసరం...

జూలై 29, బుధవారం, 2026|RASHI PHALALU

గురు పౌర్ణమి శాకాంబరీ ఉత్సవం శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి పౌర్ణమి రాత్రి 07.05 వరకు ఉపరి పాడ్యమి నక్షత్రం ఉత్తరాషాఢ మధ్యాహ్నం 03.48 వరకు ఉపరి శ్రవణ యోగం ప్రీతి రాత్రి 01.03 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం భద్ర ఉదయం...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News