Friday, July 17, 2026
26.4 C
Hyderabad

అన్నదాతకు అండగా నిలుద్దాం!|EDITORIAL

ప్రకృతి ప్రకోపిస్తే, వికృత విలయతాండవం చేస్తే, ఈ ప్రపంచానికి, ప్రాణులకు విస్మృతి ఉంటుందా? చేతనైతే ఎదుర్కోవడం, లేదంటే తలొగ్గడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? ఆ ప్రళయ ఫలితాల్ని అనుభవించడం తప్ప. అయితే, ప్రకృతి విధ్వంసానికి కారకులం మనమే కావడం విషాదం. ఆ ఫలితాలు మనమే అనుభవించాల్సి రావడం విచారం. ఆ ప్రభావాన్ని తగ్గించి, రక్షించి, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలుండటం ఉపశమనం. కష్టాలకు, కన్నీళ్ళకు భాష ఉండదు. రాజకీయాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు అతీతంగా కేంద్రం వెంటనే సాయమందించి అండగా నిలవాల్సిన సమయమిది.

మార్గం-అడుగు, డా.మార్గం లక్ష్మీనారాయణ ఎడిటోరియల్

ప్రకృతి ప్రకోపిస్తే, వికృత విలయతాండవం చేస్తే, ఈ ప్రపంచానికి, ప్రాణులకు విస్మృతి ఉంటుందా? చేతనైతే ఎదుర్కోవడం, లేదంటే తలొగ్గడం తప్ప చేయగలిగింది ఏముంటుంది? ఆ ప్రళయ ఫలితాల్ని అనుభవించడం తప్ప. అయితే, ప్రకృతి విధ్వంసానికి కారకులం మనమే కావడం విషాదం. ఆ ఫలితాలు మనమే అనుభవించాల్సి రావడం విచారం. ఆ ప్రభావాన్ని తగ్గించి, రక్షించి, పునరావాసం కల్పించేందుకు ప్రభుత్వాలుండటం ఉపశమనం. కష్టాలకు, కన్నీళ్ళకు భాష ఉండదు. రాజకీయాలకు, రాష్ట్రాలకు, ప్రాంతాలకు అతీతంగా కేంద్రం వెంటనే సాయమందించి అండగా నిలవాల్సిన సమయమిది.
నిన్నా, ఇవ్వాళ మొంథా తుఫాన్‌ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ఆకాశానికి చిల్లు పడిందా? అన్నట్లుగా కుండపోతగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు, ఊళ్ళకు ఊళ్ళే చెరువులయ్యాయి. వాగులు, వంకలు పొంగి పొర్లి ఏరులయ్యాయి. వేల ఎకరాల్లో పంటలు మునిగాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వరి, పత్తి, మక్కజొన్న రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్లాల్లో, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దైంది. అతివృష్టి, అనావృష్టి, తుఫాన్లు వంటివేవొచ్చినా, తొలుత నష్టపోయేది మాత్రం రైతులే. మొంథా తుఫాన్ తో ఇరు రాష్ట్రాల్లో రైతులు భారీగా నష్టపోయారు. పంటలు నీటమునిగాయి. వరిచేలు వంగి పోయాయి. కొన్నిచోట్ల ఆరపోసిన ధాన్యం కొట్టుకు పోయింది. కోతదశకు వచ్చిన పంట నేలకొరిగింది. వేల ఎకరాల వరకూ వరి పంటకు నష్టం జరిగినట్లు ప్రాథమికంగా అధికారులు గుర్తించారు. నేలకు ఒరిగిన పంటను పైకి లేపి కట్టలుగా కట్టాలని అధికారులు సూచించారు. కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో పంట నేలవాలడంతో రైతులు కన్నీరుమున్నీరవుతున్నారు. అరటి పంటలు సైతం దెబ్బతిన్నాయి. ఇప్పుడు ప్రభుత్వాలు తొలుత ఆదుకోవాల్సింది రైతన్నలనే. నీరు చేరడంతో నానిన పంటలను కొనుగోలు చేయాలి. మునిగిన పంటలకు వెంటనే పరిహారం చెల్లిచాలి. దెబ్బతిన్న రోడ్లను యుద్ధ ప్రాతిపదికన పూడ్చాలి.
అతిభారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టు సమీపంలో, పాతాళగంగ దారిలో కొండచరియలు విరిగిపడ్డాయి. వందల గ్రామాలకు రాకపోకలు స్తంభించాయి. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో తీరం దాటిన మొంథా తీవ్ర తుఫాన్.. అతిభారీ వర్షాలు, బలమైన గాలులతో ఉమ్మడి నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్ని ముంచేసింది. ఇటు తెలంగానలో ఖమ్మం, వరంగల్‌, సిద్దిపేట, కరీంనగర్‌ జిల్లాలను ముంచెత్తింది. ఉమ్మడి తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోనూ భారీవర్షాలతో వాగులు పొంగి ప్రవహించడంతో జనజీవనం అతలాకుతలం అయింది. సముద్రం 20 నుంచి30 మీటర్లు ముందుకొచ్చింది. వందల గ్రామాల్లో విద్యుత్తు స్తంభాలు నేలవాలడంతో సరఫరా నలిచిపోయింది. ప్రభుత్వ చర్యలతో చాలాచోట్ల పునరుద్ధరించారు. సాధారణ స్థితికి రావడానికి మరికొంత కాలం పట్టవచ్చు. తీర ప్రాంత మండలాల్లో గాలుల దెబ్బకు చెట్లు, విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. కొన్నిచోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కోల్‌కతా-చెన్నై జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచాయి. ముందే ముప్పును గుర్తించి చాలామందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. నంద్యాల పట్టణం మధ్యలో ప్రవహించే కుందూ నది, మద్దిలేరు, చామ కాలువ కూడా ఉప్పొంగడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. పలు గ్రామాల్లో విద్యుత్తు సరఫరా నిలిచిపోవడంతో అంధకారం నెలకొంది. భారీ వృక్షాలు నేలకూలి రహదారులకు అడ్డంగా పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది.
భారీ వర్షాలకు జలాశయంలో పెద్దఎత్తున నీరు చేరడంతో విజయనగరం జిల్లా పరిధిలోని తాటిపూడి రిజర్వాయరు గేట్లు ఎత్తేశారు. ఆ నీటి ఉద్ధృతికి విశాఖ జిల్లా భీమిలి మండలంలోని గోస్తనీ నది పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. గత వారం రోజుల పాటు ప్రజలను గజగజలాడించిన మొంథా తుఫాన్ ప్రభావం ఉపశమించడంతో, ప్రమాదం నుండి బయట పడ్డామని ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.
మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలోని పలు చోట్ల భారీ వర్షాలు కురిసాయి. తుఫాన్‌ ప్రభావంతో పలు జిల్లాల్లో భారీగా వర్షాలు అతలాకుతలం చేశాయి. వాగులు, వంకలు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. భారీ వరదలతో రోడ్లు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. పలు ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది. వరద నీరుతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మొంథా తుఫాన్‌ ప్రభావంతో వరంగల్‌, హన్మకొండ, జనగాం, యాదాద్రి జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాపై మొంథా తుఫాన్‌ పంజా విసిరింది. భారీ వర్షాలతో వరంగల్‌లో రహదారులు నీట మునిగాయి. ఖమ్మం జిల్లాలోని కొణిజర్ల మండలం తీగల బంజర వద్ద పగిడేరు వాగు ఉధృతంగా పారడంతో 20 గ్రామాలకు రాకపోకలు బంద్‌ అయ్యాయి.
ఇప్పుడు ప్రభుత్వాలు పునరుద్ధరణ చర్యలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. రాజకీయాలు పక్కన పెట్టి క్షేత్ర స్థాయిలో నష్టం అంచనాలు వేసి సహాయ, పునరావాస కార్యక్రమాలు ముమ్మరం చేయాలి. రోడ్లను మరమ్మత్తులు చేసి రాకపోకలు పునరుద్ధరించాలి. పంటల నష్టాలను అంచనా వేసి రైతులకు ముందుగా తాత్కాలిక ఉపశమనం కలిగించాలి. ఇళ్లు వాకిళ్లు కొట్టుకుపోయిన వారిని గుర్తించి వారికి నిత్యావసరాలతో పాటు జీవనోపాధి కింది పరిహారం అందించాలి. యుద్ధ ప్రాతిపదికన ఇవి చేపడితే తప్ప ప్రజలు కోలుకోలేరు. ప్రభుత్వాలు వెంటనే ఈ పనులకు ప్రాధాన్యం ఇవ్వాలి. కేంద్రం కూడా నివేదికల కోసం ఎదురు చూడకుండా ముందుగా తక్షణ సాయంగా కొంత డబ్బును రాష్ట్రాలకు అందించాలి. అవసరమైతే గ్రామాల వారీగా బాధితులను గుర్తించి అక్కడికక్కడే పరిహారం చెల్లించాలి. గతంలో లాగా నెలల తరబడి వేచి చూసే ధోరణికి స్వస్తి పలకాలి.

Latest News

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

సింధు నాగరికత|ADUGU|SPECIAL|COMPITITIVE|EXAMS

నాగరికత మరియు సంస్కృతికి తేడా నాగరికత పూర్తిగా అభివృద్ధి చెందిన మరియు ఉన్నతమైన జీవనాన్ని గడిపినట్లయితే మరియు ప్రజలు పట్టణ, శాస్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రణాళికాబద్ధంగా ఉంటే దానిని నాగరికత అంటారు. సంస్కృతి సంస్కృతి అనేది ప్రతీ ఒక్కరికీ...

‘ప్రభంజన’ పథం ప్రజ్వరిల్లాలి|ESSAY|SPECIAL

జూలై 16, 2025. సరిగ్గా ఏడాది క్రితం జర్నలిస్టు, వక్త, కవి, రచయిత, మేధావి, అభ్యుదయవాది, వివేకశీలి, చైతన్యవంతుడు, నిరంతర పోరాట శీలి అయిన ప్రొఫెసర్ యాదనాల ప్రభంజన్ కుమార్ యాదవ్ పరమపదించారు....

రోడ్లకు కూడా ఆపరేషన్లు!?|ADUGU TRENDS

గిప్పటి దాకా మనం మనుసులకు, జంతువులకు ఆపరేషన్లు సేసుడే సూసినం. కనీ, గీ యింతను ఎక్కడా సూడలే.! గా బిహార్ రాస్ట్రంల కొత్తగ, ఎక్కడా లేని లెక్కల, రోడ్లకు కూడా ఆపరేషన్లు సేత్తాండ్రు....

నదుల అనుసంధానమే జల భద్రతకు శాశ్వత మార్గం!|EDITORIAL

ఎల్‌నినో ప్రభావాన్ని ఆపడం మన చేతుల్లో లేదు. కానీ, దాని వల్ల కలిగే నష్టాన్ని శాస్త్రీయ ప్రణాళికలు, సమర్థమైన జల నిర్వహణ, నదుల అనుసంధానం, నీటి సంరక్షణ, వాతావరణ అనుకూల వ్యవసాయం ద్వారా...

జూలై 16, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం పూరి జగన్నాధ రధోత్సవం తిధి శు విదియ ఉదయం 11.40 వరకు ఉపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి 11.40 వరకు ఉపరి మఖ యోగం వజ్ర ఉదయం 08.20 వరకు ఉపరి సిద్ది కరణం కౌలవ...

ఆషాఢమాసం రహస్యాలు|ASHADAM|SECRETS

ఆచారాలు, శాస్త్రం, సంప్రదాయాల వెనుక నిజాలు ఆషాఢమాసం విశేషాలు – ఆధ్యాత్మికత, ప్రకృతి, సంప్రదాయాలు, కుటుంబ బంధాల వెనుక అసలు కథ ప్రతి ఆచారం వెనుక ఒక అర్థం... ప్రతి సంప్రదాయం వెనుక ఒక జీవన...

ఉడుతా మిడతా!?|ADUGU TRENDS

మనం మన సుట్టుముట్టు ఉడుతల్ని సూత్తనే ఉంటం. పొలాలల్ల, రోడ్ల మీద అటిటుపోతనే ఉంటయి. సిడెం సేపట్లనే కనబడ్తయి, ఆడ్తయి. ఉరుకుతయి. ఎన్కట గా రాముడికి వారధి కట్టుట్ల గీ ఉడుత సాయం...

ఓటర్ల సవరణకు శాశ్వత పరిష్కారం లేదా!?|EDITORIAL

గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీలు, పట్టణాల్లో వార్డు కార్యాలయాలు, మీ సేవ వంటి పౌర సేవా కేంద్రాలను ఈ ప్రక్రియలో భాగస్వామ్యం చేస్తే ప్రజలకు సౌలభ్యం పెరుగుతుంది. బీఎల్‌వోలపై పూర్తిగా ఆధారపడకుండా బహుళస్థాయి ధ్రువీకరణ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News