తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం గులాబీ సైనికులు చేసిన అద్భుత పోరాటాన్ని ప్రస్తావిస్తూ, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నూతన సంవత్సర సందేశం ఇచ్చారు. “గత ఏడాది కాలంగా కాంగ్రెస్ నిరంకుశ పాలనపై మీరు చూపించిన పోరాట స్ఫూర్తికి ప్రతి ఒక్కరికీ శిరస్సు వంచి సలాం,” అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ శ్రేణులు నిరంతర పోరాటంతో రాష్ట్ర ప్రజల పక్షాన నిలబడ్డారని, ప్రతి క్షేత్రస్థాయిలో వారు ప్రజల సమస్యలపై గర్జించినట్లు కేటీఆర్ కొనియాడారు.
ఆయన “రైతుల పక్షాన, మహిళల సమస్యలపై, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మీరు పోరాడారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలను ప్రజాక్షేత్రంలో ఆవిష్కరించారు,” అని అన్నారు. ముఖ్యంగా “లగచర్ల లడాయి” వంటి ఉద్యమాలు దేశమంతా కాంగ్రెస్ పాలనపై ప్రశ్నలు ఎత్తినాయని చెప్పారు. గులాబీ సైనికుల ధైర్యాన్ని, పోరాటాన్ని చారిత్రాత్మకంగా, అపూర్వం అని కొనియాడారు.
“మా పార్టీకి మూలస్తంభాలు మీరు, బీఆర్ఎస్ జెండాకు వెన్నుముక మీరు.” మీరు చేసిన పోరాటం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడడంలో చరిత్ర రాశిందని కేటీఆర్ చెప్పారు

