Tuesday, August 25, 2026
27.2 C
Hyderabad

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది పాదర్శక నిర్ణయాలు. రైతులకు కావాల్సింది నీటి భరోసా. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతలపై కొనసాగుతున్న రాజకీయ పంచాయితీకి ముగింపు పలికి, శాస్త్రీయ ఆధారాలు, భద్రతా ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అదే తెలంగాణ నీటి భవిష్యత్తును, రైతు భవిష్యత్తును కాపాడే అసలైన మార్గం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడే తప్ప, చుక్కు నీరుకూడా పారడం లేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రస్తుతం వినియోగించడం సురక్షితం కాదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని వెంటనే ఎత్తిపోసి రాష్ట్ర రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే, ప్రస్తుతం గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉందా? లేదా?

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు వేగంగా ఎండిపోతున్నాయి. కేంద్ర జల సంఘం తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 16% నుంచి 46% వరకు తగ్గాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు వంటి ప్రాజెక్టులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలపై కూడా విపరీత ప్రభావ ప్రమాదం కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రవహించే ప్రాణహిత నుంచి మేడిగడ్డ బరాజ్ వరకు ఇప్పటికీ వినియోగించదగిన ప్రవాహాలు వస్తున్నాయని విశ్రాంత జలవనరుల ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఆ నీటిని ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్లకు తరలించే అవకాశం ఉందని వారి వాదన.

తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగిస్తూ సాంకేతిక ప్రమాణాల ప్రకారం పంపింగ్ నిర్వహిస్తే ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది. గతంలో వరదల సమయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్లు పేర్కొంది.

మరోవైపు ప్రభుత్వం మాత్రం జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నివేదికలో వ్యక్తమైన అభ్యంతరాలను ప్రధాన కారణంగా చూపుతోంది. మేడిగడ్డ బరాజ్‌లో పియర్లు కుంగిపోవడం, నిర్మాణ భద్రతపై వ్యక్తమైన సందేహాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెబుతోంది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత ముందు ప్రాధాన్యమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనను కూడా విస్మరించలేం.

అయితే, ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే. సాంకేతికంగా సాధ్యమైతే ఎందుకు పంపింగ్ చేయడం లేదో, సాధ్యం కాకపోతే అందుకు కారణాలేమిటో పూర్తి పారదర్శకతతో ప్రజలకు వివరించాలి. నిపుణుల కమిటీ నివేదికను బహిరంగపరచాలి. వాస్తవ పరిస్థితిని రైతులకు తెలియజేయాలి. అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదు.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా పరిశీలించాలి. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను ముందుగానే ప్రారంభించింది. పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు తరలించే సామర్థ్యం ఉంది. ఏడాదికి 80 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా మరో 1,400 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రతి చుక్క నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయాలనే దూరదృష్టితో ఆ రాష్ట్రం వ్యవహరిస్తోంది.

తెలంగాణకు కూడా ఇదే ఆలోచన అవసరం. రాజకీయ వివాదాలతో గోదావరి నీరు సముద్రంలో కలవడం ఎవరికీ ప్రయోజనకరం కాదు. అదే సమయంలో భద్రతను విస్మరించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా సమంజసం కాదు. అందువల్ల సాంకేతిక నిపుణులు, జలవనరుల శాస్త్రవేత్తలు, డ్యామ్ భద్రతా నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలి.
తన పొలానికి నీరు వస్తుందా? లేదా? అన్నదే రైతుకు ముఖ్యం. తాగునీటి భరోసానే పట్టణ, నగర ప్రజలకు ముఖ్యం. అందుకే ఈ అంశాన్ని రాజకీయ పోరాటంగా కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూడాలి.

ఎల్‌నినో ప్రభావం ఇంకా కొనసాగితే రాష్ట్రంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళికే ఉత్తమ పరిష్కారం. అందుబాటులో ఉన్న వరదనీటిని సురక్షితంగా నిల్వ చేయడం, సాగు-తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పారదర్శక నిర్ణయాలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత.

ప్రజలకు కావాల్సింది పాదర్శక నిర్ణయాలు. రైతులకు కావాల్సింది నీటి భరోసా. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతలపై కొనసాగుతున్న రాజకీయ పంచాయితీకి ముగింపు పలికి, శాస్త్రీయ ఆధారాలు, భద్రతా ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అదే తెలంగాణ నీటి భవిష్యత్తును, రైతు భవిష్యత్తును కాపాడే అసలైన మార్గం.

Latest News

పార్టీ పెడితే పోలా!|ADUGU EXCLUSIVE|KONDA FAMILY|NEW PARTY

అడుగు ఎక్స్ క్లూజివ్ కొండా దంపతుల కొత్త పార్టీ? పాత పార్టీల్లో పొసగడం కష్టమే! కొత్త పార్టీతో ప్రయాణం స్పష్టమే! లక్ష్యం బీసీ సామాజిక న్యాయమే! ఇప్పటికే ప్రధాన పార్టీల్లో0చి బయటకు  కాంగ్రెస్ కాదంటే బీజేపీ ఛాన్స్? సిద్ధాంత రీత్యా కమలంలోనూ కష్టమే ఇప్పటికే...

పూర్వ ప్రేమికులకు.. అపూర్వ ప్రేమ రోజు!?|ADUGU TRENDS

యినడానికి గిది ఇబ్బందిగనే ఉన్నా, ఇది నిజమే మరి! కాకపోతే గిది మన దేసంల కాదు. పరాయి దేశంల. ఎవలైనా వయసొచ్చినంక పేమల పడ్తరు. అందరూ గా పేమల్ని గెలపించుకోలేరు. ఐటెంక వేరెవ్వల్నో...

వంటింట్లో మంట! తిరేదేలా తంటా?|EDITORIAL

ధరల పెరుగుదల కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు. అది సామాజిక సమస్య కూడా. నెల ఆదాయం పెరగకుండానే నెలవారీ ఖర్చు పెరిగితే మధ్యతరగతి పొదుపులు కరిగిపోతాయి. పేద కుటుంబాలు పోషకాహారం, విద్య,...

ఆగస్టు 25, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు *శ్రావణమాసం* *శుక్లపక్షం* తిధి త్రయోదశి పూర్తిగా రోజంత నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 11.03 వరకు ఉపరి శ్రవణ యోగం ఆయుష్మాన్ ఉదయం 09.04 వరకు ఉపరి సౌభాగ్య కరణం కౌలవ సాయంత్రం 06.05 వరకు ఉపరి తైతుల రాహుకాలం పగలు 03.00...

ఆగస్టు 24, సోమవారం, 2026|RASHI PHALALU 

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి ద్వాదశి రాత్రి తెల్ల 05.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం పూర్వాషాఢ రాత్రి 08.43 వరకు ఉపరి ఉత్తరాషాఢ యోగం ప్రీతి ఉదయం 08.32 వరకు ఉపరి ఆయుష్మాన్ కరణం బవ సాయంత్రం 04.17...

మౌర్యుల చరిత్ర|ADUGU DIGITAL MEDIA|SPECIAL|COMPITITIVE EXAMS|HISTORY

(క్రీ.పూ.320 నుండి క్రీ.పూ.180 వరకు) భారతదేశ చరిత్రలో మహా సామ్రాజ్యంగా తొలుత మౌర్య సామ్రాజ్యము వెలిసింది. మౌర్యులు భారత ఉపఖండం(ప్రస్తుత భారతదేశం, పాకిస్థాన్, ఆఫ్ఘానిస్తాన్, బాంగ్లాదేశ్, నేపాల్, శ్రీలంక, టిబెట్) మొత్తాన్ని ఇక చక్రాధిపత్యంగా...

నడుస్తున్న మనిషి|POETRY|PARVATHALU

నిలబడిన చోట పెళ్లున కొమ్మ విరిగి పడ్డట్లు మనుషులు కూలిపోతూ కుటుంబాలనొదిలి వెళ్ళిపోతున్నారు అనారోగ్యమిప్పుడు శత్రుదేశాల దాడిలా ప్రమాదకరమైంది వైరస్ ఎప్పుడు మాటుగాస్తుందో ఆరోరోగ్యం ఎప్పుడు మందగిస్తుందో నవ్వుతున్న మనిషి నవ్వుతున్నట్లే అయ్యో !ఇందాకనే ఫోన్ లో మాట్లాడిండని అంటూ...

మనిషి అంటే పర్వతాలే!|PARVATHALU|HUMANITY

పర్వతాలు... పేరుకు తగ్గట్లే, మేరు పర్వతం. అనేక పర్వతాల సరితూగే శక్తిగల మేరునగధీరుడు. ధీశాలి. కోరకున్నా వరాలిచ్చే అపర పరమేశ్వరుడు. ఆ భోళా శంకరుడి లాగే భోళా మనిషి. ప్రార్థించే పెదవులకన్నా, సాయం...

సీఎం సహాయ నిధికి 10 యేలిచ్చిన బిచ్చగాడు!?|ADUGU TRENDS

బిచ్చగాడే గదాని తీసి పారేయొద్దు. తక్కువ సూడొద్దు. ఒక్కొక్కటే వందలు, యేలైతయి. కానీ, గయి కూడబెట్టనీకే ఎంతో కట్ట పడాలె. బిచ్చమెత్తడం అంత అల్కనేం కాదు. అభిమానం సంపుకోవాలె. అవమానాలు భరించాలె. ఇచ్చినా,...

రూపాయి బియ్యంతో కోట్లలో దళారుల దందా!|EDITORIAL

రేషన్ బియ్యం అక్రమ రవాణా కేవలం లబ్ధిదారుల స్థాయిలోనే కాదు. కొన్నిచోట్ల డీలర్లు, దళారులు కుమ్మక్కై నిల్వలను నిలువునా మింగేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గోదాములు, హోటళ్లు, ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా జరుగుతున్నాయి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 23 నుండి ఆగస్టు 29 వరకు వార రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీకు అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. ప్రారంభించిన పనులను పట్టుదలతో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా మంచి...

ఒక్కరోజు బిచ్చగాడి సంపాదనెంతంటే..!?|ADUGU TRENDS

ఒకాయినెకు ఓ అవుడియా వచ్చింది. తానే బిచ్చమెత్తితే? గట్ల బిచ్చమెత్తి రోజుకు ఎంత సంపాయించొచ్చు? గదాంట్ల ఉండే సాదకబాదకాలు తెలుసుకుందామని. ఇగ ఆగకుండ ఐవుడియా వచ్చిందే లెక్క... యెంటనే ఆ అవతారమెత్తిండు. ఆఖరికి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News