Monday, August 10, 2026
29.8 C
Hyderabad

నీటి భరోసా ఏది!?|EDITORIAL

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. తాజాగా ఎల్ నినో వర్షాభావ పరిస్థితుల్లో ప్రజలకు కావాల్సింది పాదర్శక నిర్ణయాలు. రైతులకు కావాల్సింది నీటి భరోసా. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతలపై కొనసాగుతున్న రాజకీయ పంచాయితీకి ముగింపు పలికి, శాస్త్రీయ ఆధారాలు, భద్రతా ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అదే తెలంగాణ నీటి భవిష్యత్తును, రైతు భవిష్యత్తును కాపాడే అసలైన మార్గం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

తెలంగాణలో నీటి రాజకీయాలు నిప్పులు కక్కుతున్నాయి. నీళ్ళ మంటలు ఎగసిపడుతున్నాయి. దీనికి రాజకీయ నాయకులు, పార్టీలు తమ వంతుగా పరస్పర ఆరోపణల ఆజ్యం పోస్తూ, రాజేస్తున్నారు. దీంతో రాష్ట్రంలో రాజకీయ వేడే తప్ప, చుక్కు నీరుకూడా పారడం లేదు. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల్లో రాజకీయాలు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ తిరుగుతున్నాయి. కాళేశ్వరం ఎత్తిపోతలను ప్రస్తుతం వినియోగించడం సురక్షితం కాదని అధికార కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్ మాత్రం గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని వెంటనే ఎత్తిపోసి రాష్ట్ర రిజర్వాయర్లను నింపాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ కూడా ఈ అంశంపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. అయితే, ప్రస్తుతం గోదావరిలో అందుబాటులో ఉన్న నీటిని తెలంగాణ వినియోగించుకునే అవకాశం ఉందా? లేదా?

ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో దక్షిణ భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతోంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలు వేగంగా ఎండిపోతున్నాయి. కేంద్ర జల సంఘం తాజా గణాంకాల ప్రకారం తెలంగాణలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు సాధారణ స్థాయి కంటే 16% నుంచి 46% వరకు తగ్గాయి. ఎస్సారెస్పీ, నిజాంసాగర్, సింగూరు, లోయర్ మానేరు వంటి ప్రాజెక్టులు ఆందోళనకర స్థాయికి చేరుకున్నాయి. వ్యవసాయంతో పాటు తాగునీటి అవసరాలపై కూడా విపరీత ప్రభావ ప్రమాదం కనిపిస్తోంది.

రాష్ట్రంలో ఏడాది పొడవునా ప్రవహించే ప్రాణహిత నుంచి మేడిగడ్డ బరాజ్ వరకు ఇప్పటికీ వినియోగించదగిన ప్రవాహాలు వస్తున్నాయని విశ్రాంత జలవనరుల ఇంజినీర్లు పేర్కొంటున్నారు. కన్నెపల్లి పంప్‌హౌస్ ద్వారా రోజుకు రెండు టీఎంసీల వరకు నీటిని ఎత్తిపోసే సామర్థ్యం ఉందని వారు గుర్తుచేస్తున్నారు. ఆ నీటిని ఎల్లంపల్లి, మధ్య మానేరు, దిగువ మానేరు, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్ వంటి రిజర్వాయర్లకు తరలించే అవకాశం ఉందని వారి వాదన.

తెలంగాణ విశ్రాంత ఇంజినీర్ల సంఘం కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లలో కనీస నీటి మట్టాన్ని కొనసాగిస్తూ సాంకేతిక ప్రమాణాల ప్రకారం పంపింగ్ నిర్వహిస్తే ఎలాంటి భద్రతా సమస్యలు తలెత్తవని స్పష్టం చేసింది. గతంలో వరదల సమయంలో కూడా ఇదే విధానాన్ని అనుసరించినట్లు పేర్కొంది.

మరోవైపు ప్రభుత్వం మాత్రం జాతీయ డ్యామ్ భద్రతా సంస్థ నివేదికలో వ్యక్తమైన అభ్యంతరాలను ప్రధాన కారణంగా చూపుతోంది. మేడిగడ్డ బరాజ్‌లో పియర్లు కుంగిపోవడం, నిర్మాణ భద్రతపై వ్యక్తమైన సందేహాల నేపథ్యంలో ఎలాంటి ప్రమాదం జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నామని చెబుతోంది. ప్రజల ప్రాణాలు, ఆస్తుల భద్రత ముందు ప్రాధాన్యమని ప్రభుత్వం వాదిస్తోంది. ఈ వాదనను కూడా విస్మరించలేం.

అయితే, ఇక్కడ ప్రభుత్వం చేయాల్సింది ఒకటే. సాంకేతికంగా సాధ్యమైతే ఎందుకు పంపింగ్ చేయడం లేదో, సాధ్యం కాకపోతే అందుకు కారణాలేమిటో పూర్తి పారదర్శకతతో ప్రజలకు వివరించాలి. నిపుణుల కమిటీ నివేదికను బహిరంగపరచాలి. వాస్తవ పరిస్థితిని రైతులకు తెలియజేయాలి. అనుమానాలకు అవకాశం ఇవ్వకూడదు.

ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ అనుసరిస్తున్న విధానాన్ని కూడా పరిశీలించాలి. ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని అక్కడ ప్రభుత్వం పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాలను ముందుగానే ప్రారంభించింది. పట్టిసీమ లిఫ్ట్ స్కీమ్ ద్వారా రోజుకు 8,500 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి ఎత్తిపోసి కృష్ణా డెల్టాకు తరలించే సామర్థ్యం ఉంది. ఏడాదికి 80 టీఎంసీల నీటిని వినియోగించుకునేలా ఈ వ్యవస్థను రూపొందించారు. తాడిపూడి ఎత్తిపోతల ద్వారా మరో 1,400 క్యూసెక్కుల నీటిని తరలించే అవకాశం ఉంది. అందుబాటులో ఉన్న ప్రతి చుక్క నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేయాలనే దూరదృష్టితో ఆ రాష్ట్రం వ్యవహరిస్తోంది.

తెలంగాణకు కూడా ఇదే ఆలోచన అవసరం. రాజకీయ వివాదాలతో గోదావరి నీరు సముద్రంలో కలవడం ఎవరికీ ప్రయోజనకరం కాదు. అదే సమయంలో భద్రతను విస్మరించి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కూడా సమంజసం కాదు. అందువల్ల సాంకేతిక నిపుణులు, జలవనరుల శాస్త్రవేత్తలు, డ్యామ్ భద్రతా నిపుణులతో కూడిన స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసి అత్యవసరంగా నిర్ణయం తీసుకోవాలి.
తన పొలానికి నీరు వస్తుందా? లేదా? అన్నదే రైతుకు ముఖ్యం. తాగునీటి భరోసానే పట్టణ, నగర ప్రజలకు ముఖ్యం. అందుకే ఈ అంశాన్ని రాజకీయ పోరాటంగా కాకుండా ప్రజా ప్రయోజనాల కోణంలో చూడాలి.

ఎల్‌నినో ప్రభావం ఇంకా కొనసాగితే రాష్ట్రంలో నీటి సంక్షోభం మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ముందస్తు ప్రణాళికే ఉత్తమ పరిష్కారం. అందుబాటులో ఉన్న వరదనీటిని సురక్షితంగా నిల్వ చేయడం, సాగు-తాగునీటి అవసరాలకు ప్రాధాన్యం ఇవ్వడం, పారదర్శక నిర్ణయాలతో ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందించడం ప్రభుత్వ బాధ్యత.

ప్రజలకు కావాల్సింది పాదర్శక నిర్ణయాలు. రైతులకు కావాల్సింది నీటి భరోసా. అందుకే కాళేశ్వరం ఎత్తిపోతలపై కొనసాగుతున్న రాజకీయ పంచాయితీకి ముగింపు పలికి, శాస్త్రీయ ఆధారాలు, భద్రతా ప్రమాణాలు, ప్రజా ప్రయోజనాల ఆధారంగా ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకోవాలి. అదే తెలంగాణ నీటి భవిష్యత్తును, రైతు భవిష్యత్తును కాపాడే అసలైన మార్గం.

Latest News

ఆగస్టు 10, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి ద్వాదశి ఉదయం 06.13 వరకు ఉపరి త్రయోదశి నక్షత్రం ఆరుద్ర ఉదయం 11.53 వరకు ఉపరి పునర్వసు యోగం వజ్ర రాత్రి 11.10 వరకు ఉపరి సిద్ది కరణం తైతుల ఉదయం 06.13 వరకు ఉపరి...

బోనాలు – చరిత్ర, సంస్కృతి, సంప్రదాయం|BONALU|HISTORY|CULTURE

చారిత్రక, పురావస్తు, శాసన, సాహిత్య ఆధారాల విశ్లేషణ ప్రకారం బోనం సమర్పించే ఆచారం ఆషాఢ మాసంలో తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలోని అనేక గ్రామాల్లో గ్రామదేవతారాధనలో అంతర్భాగంగా కొనసాగుతోంది. వర్షాకాలం ప్రారంభ దశలో...

కల్లుకు శిల్లు.. సీసీ కెమెరా!?|ADUGU TRENDS

యెన్కటికి దొంగకు శెప్పే లాభమన్నరు. దోసుకుంటోనికి శెప్పైనా, తప్పైనా ఒకటే. పడదలే సూసుకుంటడు. గట్లనే గీ మద్దెల దొంగలు తమ రూటు మార్సుకున్నరు. కంటికి కనుకు లేకుండా ఇంటికి కన్నాలేసుడు అసొంటివి మానేసిండ్రు....

రాహుల్ ముందున్న మార్గాలివే!?|EDITORIAL

రాహుల్‌ ముందున్నది ‘బొద్దింకలను బుట్టలో వేసుకోవడం’ కాదు. యువత నమ్మకాన్ని సంపాదించడం. ఆ నమ్మకం ఒక్క ఆందోళనతో రాదు. నిరంతర పోరాటం, స్పష్టమైన విధానాలు, ప్రత్యామ్నాయ పాలనా నమూనా, విశ్వసనీయ నాయకత్వం కావాలి....

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

ఆగస్టు 09 నుండి ఆగస్టు 15 వరకు రాశి ఫలాలు మేష రాశి ఈ వారం మేష రాశివారికి అనుకూలమైన మార్పులు చోటుచేసుకుంటాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు వచ్చే అవకాశం ఉంది. మీ పనితీరుకు ఉన్నతాధికారుల...

నవ్వినోల్లే నోర్లెల్లబెట్టిండ్రు!?|ADUGU TRENDS

సంకల్పించాలె కనీ, కాని పని ఉంటదా? ఉండనే ఉండదని నిరూపించిండు గీ పెద్దాయినె. నల్గురు సూసి నవ్వినా, నా పని నేను శేసుక పోతానని, శేసి సూపిండు. గీయినె పేరు హీలియో డా సల్వా....

క్యా బోల్తే… పాలక్!?|EDITORIAL

దేశ భవిష్యత్తు యువతే. ఆ యువత ప్రశ్నిస్తే వినాలి, సూచిస్తే ఆలోచించాలి, సమస్యలు చెబితే పరిష్కరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలంటే అధికారానికి సమాంతరంగా జవాబుదారీతనాన్ని పెంపొందించే స్వతంత్ర ప్రజా వేదికలు అవసరం. ప్రజల...

ఆగస్టు 08, శనివారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి దశమి ఉదయం 11.09 వరకు ఉపరి ఏకాదశి నక్షత్రం రోహిణీ మధ్యాహ్నం 03.15 వరకు ఉపరి మృగశిర యోగం ధ్రువ ఉదయం 08.20 వరకు ఉపరి వ్యాఘాత కరణం భద్ర ఉదయం 11.09 వరకు ఉపరి...

ఇగిప్పుడు ‘సావు’కొచ్చింది!?|ADUGU TRENDS

మన ఊర్లల్ల ఎవ్వలన్న కాలం శేసిండ్రంటేనే సూసొత్తం. కనికరం సూపి తలో సెయ్యేత్తం. దిక్కూమొక్కూలేనోల్లతై మనమే తలా ఇంతేసుకుని గాయింత ఇగ గా కట్టెల్లేసొత్తం. కానీ, తలకొరివి పెట్టాల్సిన కన్న బిడ్డలే కడసారి...

శ్రద్ధేది? శుద్ధ దండగ!?|EDITORIAL

2025 వర్షాకాల సమావేశాల్లో నిర్ణయించిన సమయంలో లోక్‌సభ కేవలం 29%, రాజ్యసభ 34% మాత్రమే పనిచేశాయి. ప్రశ్నోత్తరాల సమయంలో లోక్‌సభలో కేవలం 23%, రాజ్యసభలో 6% మాత్రమే పని జరిగింది. అదే సమావేశాల్లో14...

ఆగస్టు 07, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి నవమి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి దశమి నక్షత్రం కృత్తిక సాయంత్రం 04.48 వరకు ఉపరి రోహిణీ యోగం వృద్ధి ఉదయం 11.17 వరకు ఉపరి ధ్రువ కరణం గరజి మధ్యాహ్నం 01.29 వరకు ఉపరి...

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News