Thursday, August 6, 2026
28.2 C
Hyderabad

సమగ్ర పంటల విధానమే రైతుకు రక్ష!|EDITORIAL

వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో లేదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో మాత్రమే ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్‌కు అవసరమైన పంటలను పండించేలా వ్యవస్థను రూపొందించడం సాధ్యమే. అందుకే దేశవ్యాప్తంగా, తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో సమగ్ర పంటల విధానం అమలు కాలానుగుణ అవసరం.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ వ్యవసాయ రంగం ఇంకా సంక్షోభంలోనే కొట్టుమిట్టాడుతోంది. ఒకవైపు ఉత్పత్తి పెరుగుతున్నా, మరోవైపు రైతుల ఆదాయం స్థిరంగా పెరగడం లేదు. పంటలు పండించిన తర్వాత గిట్టుబాటు ధరలు దక్కక రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి ప్రధాన కారణం దేశంలో సమగ్ర పంటల విధానం లేకపోవడమే. రైతులు తమకు అనుకూలంగా భావించిన పంటలను సాగు చేస్తుండగా, ప్రభుత్వాలు కొనుగోలు చేసే స్థాయికి మాత్రమే పరిమితమవుతున్నాయి. ఫలితంగా అధిక ఉత్పత్తి, తక్కువ ధరలు, మార్కెట్ అనిశ్చితి వంటి సమస్యలు రైతాంగాన్ని వెంటాడుతున్నాయి.

దేశంలో మొత్తం సాగుభూమిలో వరి, గోధుమ, మక్కజొన్న వంటి పంటల వాటా అత్యధికంగా ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ గణాంకాల ప్రకారం భారత్‌లో ఏటా 14 కోట్ల టన్నులకు పైగా వరి ఉత్పత్తి అవుతోంది. మరోవైపు కేంద్ర నిల్వ సంస్థలు, ప్రభుత్వ గిడ్డంగుల్లో భారీ స్థాయిలో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. అయినప్పటికీ రైతులు అదే పంటలను మళ్లీ మళ్లీ సాగు చేస్తున్నారు. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటల వైవిధ్యీకరణ జరగకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతోంది.

తెలంగాణ పరిస్థితిని పరిశీలించినా ఇదే చిత్రం కనిపిస్తుంది. రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం గత దశాబ్దంలో అనూహ్యంగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ దేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేసే రాష్ట్రాల్లో ఒకటిగా నిలిచింది. అయితే ప్రతి ప్రాంతంలో ఒకే రకమైన పంటల సాగు వల్ల మార్కెట్‌పై ఒత్తిడి పెరుగుతోంది. ఇటీవల మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మార్కెట్ యార్డులో సన్న రకాల వరికి మంచి డిమాండ్ లభించింది. కొన్ని చోట్ల మద్దతు ధర కంటే ఎక్కువ ధరలు రైతులకు దక్కాయి. ఇది మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పంటలు సాగు చేస్తే రైతులకు మెరుగైన ఆదాయం లభిస్తుందని సూచిస్తోంది.

ప్రభుత్వం తాజాగా కొన్ని సన్న రకాల వరివంగడాలను ప్రోత్సహిస్తున్నప్పటికీ, రైతులను క్షేత్రస్థాయిలో చైతన్యపరిచే చర్యలు ఇంకా ఆశించిన స్థాయిలో లేవు. ఏ జిల్లాలో ఏ పంట సాగు చేయాలి? ఎంత విస్తీర్ణంలో వేయాలి? నీటి లభ్యత, మార్కెట్ డిమాండ్, ఎగుమతి అవకాశాలు ఏమిటి? వంటి అంశాలపై సమగ్ర మార్గదర్శకత్వం అవసరం. కేవలం విత్తనాలు పంపిణీ చేయడం లేదా ప్రోత్సాహకాలు ప్రకటించడం సరిపోదు.

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన కోటా మేరకే కొనుగోళ్లు జరుగుతాయని ప్రకటించడం కొత్త చర్చకు దారితీసింది. వాస్తవానికి ధాన్యం కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ పాత్ర కీలకమైనది. కేంద్రం నిర్దేశించిన పరిమితులకు లోబడి రాష్ట్రాలు ధాన్యం సేకరించి ఎఫ్‌సీఐకి అందజేస్తాయి. అయితే ఉత్పత్తి అయ్యే మొత్తం ధాన్యంలో కేంద్రం కొనుగోలు చేసే పరిమాణం పరిమితంగానే ఉంటుంది. పప్పుధాన్యాలు, నూనెగింజల విషయంలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. మక్కజొన్న వంటి పంటలను కేంద్రం సాధారణంగా కొనుగోలు చేయదు. దీంతో మార్కెట్‌లో ధరలు పడిపోతే రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు కేవలం కొనుగోళ్లపై ఆధారపడకుండా పంటల ప్రణాళికపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఉచిత విద్యుత్, రైతుభరోసా, రుణమాఫీ వంటి సంక్షేమ పథకాలు రైతులకు తాత్కాలిక ఉపశమనం కలిగించినప్పటికీ, దీర్ఘకాలిక పరిష్కారం మాత్రం సమగ్ర పంటల విధానమే. రైతు ఏ పంట వేస్తే లాభం వస్తుంది, ఏ పంటకు భవిష్యత్తులో డిమాండ్ ఉంటుంది, ఎక్కడ మార్కెటింగ్ అవకాశాలు ఉన్నాయి అనే అంశాలపై ప్రభుత్వాలు స్పష్టమైన దిశానిర్దేశం చేయాలి.

ప్రపంచ వ్యాప్తంగా వ్యవసాయ రంగంలో విజయవంతమైన దేశాలు మార్కెట్ ఆధారిత పంటల ప్రణాళికను అమలు చేస్తున్నాయి. నీటి లభ్యత, వాతావరణ పరిస్థితులు, వినియోగ ధోరణులు, ఎగుమతి అవకాశాలను పరిగణనలోకి తీసుకుని పంటల ఎంపికను ప్రోత్సహిస్తున్నాయి. మన దేశంలో కూడా జిల్లాల వారీగా, మండలాల వారీగా పంటల మ్యాపింగ్ చేపట్టాల్సిన అవసరం ఉంది. ఏ ప్రాంతంలో వరి, ఎక్కడ పప్పుధాన్యాలు, ఎక్కడ నూనెగింజలు, ఎక్కడ ఉద్యాన పంటలు అనేది శాస్త్రీయంగా నిర్ణయించాలి.
అలాగే సేంద్రీయ వ్యవసాయం, విలువ ఆధారిత ఉత్పత్తులు, ప్రాసెసింగ్ పరిశ్రమలు, రైతు ఉత్పత్తిదారుల సంస్థలు బలోపేతం కావాలి. వ్యవసాయం కేవలం ఉత్పత్తి వరకే పరిమితం కాకుండా మార్కెటింగ్, నిల్వ, ప్రాసెసింగ్, ఎగుమతులతో అనుసంధానమైతేనే రైతుల ఆదాయం పెరుగుతుంది.

ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు స్పష్టమైన మార్గనిర్దేశం అత్యవసరం. ఎంత మేరకు వరి సాగు చేయాలి? ఏ రకాల వంగడాలు ఎంచుకోవాలి? ప్రత్యామ్నాయంగా ఏ పంటలు సాగు చేయాలి? అనే విషయాలను ప్రభుత్వం ముందుగానే ప్రకటించాలి. దీనికి అనుగుణంగా విత్తనాలు, ఎరువులు, సాంకేతిక సలహాలు అందించాలి.

వ్యవసాయ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం కొనుగోళ్ల విస్తరణలో కాదు. శాస్త్రీయ పంటల ప్రణాళికలో ఉంది. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం కొనుగోలు చేయడం సాధ్యంకాదు. కానీ రైతులు మార్కెట్‌కు అవసరమైన పంటలను పండించేలా వ్యవస్థను రూపొందించడం మాత్రం సాధ్యమే. అందుకే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ వంటి వ్యవసాయాధారిత రాష్ట్రాల్లో సమగ్ర పంటల విధానం అమలు కాలానుగుణ అవసరంగా మారింది.

Latest News

మౌర్య పూర్వయుగం|ADUGU SPECIAL|HISTORY|COMPITITIVE EXAMS

క్రీ.పూ.650 నుండి క్రీ.పూ.250 మధ్య ఉన్న కాలాన్ని మౌర్యుల పూర్వయుగం లేదా బుద్ధుని యుగం లేదా షోడశ మహాజనపాదాల యుగం అని అంటారు. ఈ కాలంలో గౌతమ బుద్ధుడు ముఖ్య పురుషుడు కాబట్టి...

సంయమనం కోల్పోతే రాజకీయ సంక్షోభమే!?|EDITORIAL

వ్యక్తిగత విమర్శలు తాత్కాలిక రాజకీయ ప్రచారానికి ఉపయోగపడవచ్చు. కానీ, దీర్ఘకాలంలో నాయకుడి విశ్వసనీయతను దెబ్బతీస్తాయి. రాజకీయ వారసత్వం కేవలం కుటుంబ నేపథ్యంతోనే రాదు, హుందాతనంతో కూడిన నాయకత్వంతోనే నిలుస్తుంది. మాటలతో సంపాదించేది ప్రచారం...

ఆగస్టు 06, గురువారం 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి అష్టమి మధ్యాహ్నం 03.39 వరకు ఉపరి నవమి నక్షత్రం భరణి సాయంత్రం 06.11 వరకు ఉపరి కృత్తిక యోగం గండ మధ్యాహ్నం 02.03 వరకు ఉపరి వృద్ధి కరణం కౌలవ మధ్యాహ్నం 03.39వరకు ఉపరి తైతుల రాహుకాలం...

తింటే గీ అవ్వ శేతి గారెలే తినాలె!?|ADUGU TRENDS

ఎన్కటికి... యింటే భారతమే యినాలె... తింటే గారెలే తినాలన్నరు. కనీ, ఇగిప్పుడైతే, తింటే గింటే గీ అవ్వ శేతి గారెలే తినాల్నని తిన్నోల్లంటాండ్రు. మరి, గా గారెల ముచ్చటేందో సూద్దాం పదండ్రి. ములుగు జిల్ల...

బీజేపీ-ఆత్మపరిశీలనకు సరైన సమయం! EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రతి ఎన్నిక ఒక సందేశం! ప్రతి ఉప ఎన్నిక ఒక హెచ్చరిక!! ప్రతి ప్రజా ఉద్యమం పాలకుల పాలనకు అద్దం. ఇప్పటిదాకా అప్రతిహతంగా అధికారం చెలాయిస్తున్న బీజేపీ అనూహ్యంగా ఈ మూడింటినీ...

ఆగస్టు 05 బుధవారం 2026|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, దక్షిణాయణం, గ్రీష్మ ఋతువు , ఆషాఢ మాసము-కృష్ణపక్షం తిథి కృష్ణ-సప్తమి ఈ రోజు (05) రాత్రి 8:42 వరకు, తదుపరి కృష్ణ-అష్టమి నక్షత్రము అశ్విని ఈ రోజు (05) రాత్రి 9:18 వరకు,...

ఇగ పోను అన్ లాక్ శేసుడు అల్కన!!?|ADUGU TRENDS

ఇగో గిప్పుడు గా పోన్ల వాడుడు అందరికీ అల్కగైపోయింది. సంటి పోరగాండ్ల కానుంచి, పండు ముసలోల్ల దాకా పోను వాడుతనే ఉన్నరు. ఇగ గీ వాడుట్ల అప్పుడప్పుడు గా పోన్ల లాకుల నెంబర్ల...

ఆగస్టు 04, మంగళవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ షష్ఠి రాత్రి 07.06 వరకు ఉపరి సప్తమి నక్షత్రం రేవతి రాత్రి 08.09 వరకు ఉపరి అశ్విని యోగం ధృతి రాత్రి 06.53 వరకు ఉపరి శూల కరణం గరజి ఉదయం 07.45...

గీ అవుడియ అదిరింది!?|ADUGU TRENDS

ఒక అవుడియ జీవితాన్నే మారుస్తదంటే గిదేనేమో మరి! ఏదైనా ఆలోశన శేత్తే, ఏదో ఒకటి జర్గుతది. లేకపోతే ఊదు కాలది పిల్లి గూడ లేవది? గది సరే గనీ గా పిల్లగాడు శేసిందేంటో...

అధికారం రాగానే హామీలు హుష్ కాకీ!?

ప్రజలు ఇప్పుడు రాజకీయ పార్టీల ప్రకటనలను కాకుండా వాటి పనితీరును కొలుస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కాలపరిమితి నిర్ణయించి, వాటి అమలుపై ప్రతి ఆరు నెలలకు ఒకసారి శ్వేతపత్రం విడుదల చేయడం...

ఆగస్టు 03, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--కృష్ణపక్షం తిధి బ పంచమి రాత్రి 08.18 వరకు ఉపరి షష్ఠి నక్షత్రం ఉత్తరాభాద్ర రాత్రి 08.37 వరకు ఉపరి రేవతి యోగం సుకర్మ రాత్రి 08.54 వరకు ఉపరి ధృతి కరణం కౌలవ ఉదయం 08.40...

అవుమల్లా! కడుపుల బిడ్డ స్పందిత్తదా!?|ADUGU TRENDS

తల్లి గర్భంల ఉండంగనే బిడ్డలకి బయటియి యినబడ్తయా? గవాటికి గా పిల్లలు గూడ స్పందిత్తరా? యెన్కటికి కడుపుల ఉండంగనే అర్జునుడి కొడుకు అభిమన్యుడు పద్మవ్యూహంలకెట్ల పోవాల్నో తెలుసుకున్నడట. గిది నిజమో కాదో కనీ,...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News