Monday, July 20, 2026
25.8 C
Hyderabad

తెలంగాణ ఆవిర్భావం-ప్రజల ఆశలు, ఆశయాలు!|EDITORIAL

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరింది. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా మారాయా? భవిష్యత్తు ఆదాయ వనరులను సృష్టించాయా? తొమ్మిదిన్నరేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు తమ తీర్పు చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవాల్సిన కీలక బాధ్యతను మోస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా అనేక హామీలు అమలు దశలోనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

https://www.instagram.com/reel/DZDc5uGy3Lk/?igsh=ZWtxaG1ka3BwOWd2

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి పుష్కరకాలం పూర్తైంది. 12 ఏళ్ళ ప్రయాణం మాములుదేమీ కాదు. ఈ దీర్ఘ కాలంలో ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమం ఆశించిన లక్ష్యాలను సాధించిందా? “నీళ్లు – నిధులు – నియామకాలు” అనే నినాదంతో సాగిన ఉద్యమ ఫలితాలు ప్రజల జీవితాల్లో ఎంత మేరకు ప్రతిఫలించాయి? ఈ అంశాలపై తెలంగాణ మేధావులు, పౌరసమాజం, రాజకీయ వర్గాలు నిష్పాక్షికంగా ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన అవసరం ఉంది.

ఎన్నో ఆశలు, ఆకాంక్షలు, ఆశయాలతో 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ప్రాంతీయ అసమానతలు తొలగిపోతాయని, స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, సాగు-తాగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని భావించారు. కొంతమేర అభివృద్ధి జరిగినా, ఉద్యమ సమయంలో ప్రజలు ఆశించిన సమగ్ర మార్పు కనిపించిందా అనే ప్రశ్న ఇప్పటికీ చర్చనీయాంశంగానే ఉంది.

మిగులు రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ అప్పుల కుప్పగా తెర్లైంది. ప్రస్తుతం రాష్ట్ర రుణభారం రూ.7 లక్షల కోట్లకు పైగా చేరిందని, రాష్ట్ర బడ్జెట్, వివిధ ఆర్థిక గణాంకాలు తేటతెల్లం చేస్తున్నాయి. అప్పులు తీసుకోవడం తప్పు కాదు. కానీ ఆ అప్పులు ఉత్పాదక ఆస్తులుగా మారాయా? భవిష్యత్తు ఆదాయ వనరులను సృష్టించాయా? అనే ప్రశ్నలకు స్పష్టమైన సమాధానాలే లేవు.

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ప్రారంభ అంచనాలు పెరుగుతూ లక్ష కోట్లకు పైగా వ్యయమైంది. అయితే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో తలెత్తిన సాంకేతిక సమస్యలు ప్రాజెక్టు నిర్మాణం, అవినీతి, మన్నిక, ప్రయోజనాలపై ప్రశ్నలు లేవనెత్తాయి. ప్రజా ధన వినియోగంపై సమగ్ర సమీక్ష అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉద్యోగాల విషయంలో కూడా ఆశించిన పురోగతి కనిపించలేదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత లక్షలాది ఉద్యోగాలు భర్తీ చేస్తామని రాజకీయ పార్టీలు హామీలతో ఊదరగొట్టాయి. కానీ ప్రభుత్వ శాఖల్లో ఇప్పటికీ వేల సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. నిరుద్యోగ యువత ఎదురుచూస్తున్న వార్షిక ఉద్యోగ క్యాలెండర్ ఇప్పటికీ పూర్తిస్థాయిలో అమలులోకి రాలేదు. ప్రభుత్వ నియామకాల ఆలస్యం యువతలో నిరాశను పెంచుతోంది.
వ్యవసాయం తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు ప్రధాన ఆధారం. అయినప్పటికీ రైతులు ఇప్పటికీ మార్కెట్, కనీస మద్దతు ధర, ధాన్యం కొనుగోలు, సాగునీటి సమస్యలతో పోరాడుతున్నారు. ప్రతి సీజన్‌లో కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురయ్యే ఇబ్బందులు రైతు సంక్షేమంపై ప్రభుత్వాల చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు భూకబ్జాలు, ఇసుక, మట్టి, గ్రానైట్ అక్రమ తవ్వకాలపై తరచూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి.

విద్య, వైద్య రంగాల పరిస్థితి కూడా ఆందోళన కలిగిస్తోంది. ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లు, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కొరతపై తరచూ నివేదికలు వెలువడుతున్నాయి. అదే సమయంలో ప్రైవేట్ విద్యా, వైద్య సంస్థల ఖర్చులు సాధారణ కుటుంబాలకు భారంగా మారుతున్నాయి. నాణ్యమైన విద్య, వైద్యం ప్రతి పౌరుడి హక్కుగా మారాల్సిన పరిస్థితుల్లో ఈ రంగాల్లో ప్రభుత్వ జోక్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉంది.

రాజకీయంగా చూస్తే తొమ్మిదిన్నరేళ్లపాటు సాగిన బీఆర్ఎస్ పాలనపై ప్రజలు 2023 ఎన్నికల్లో తమ తీర్పు చెప్పారు. అభివృద్ధి, అవినీతి, అధికార కేంద్రీకరణ వంటి అంశాలు ఎన్నికల ప్రధాన చర్చగా మారాయి. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల అంచనాలను అందుకోవాల్సిన కీలక బాధ్యతను మోస్తోంది. అయితే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తున్నా అనేక హామీలు అమలు దశలోనే ఉండటం ప్రజల్లో అసంతృప్తికి కారణమవుతోంది.

పాలకులు, ప్రభుత్వ యంత్రాంగంలో పారదర్శకత, అవినీతి, జవాబుదారీతనం లోపం, శాఖల మధ్య సమన్వయ సమస్యలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని ప్రజాభిప్రాయం వ్యక్తమవుతోంది. ప్రజా సేవలు వేగంగా అందించేందుకు పరిపాలనా సంస్కరణలు అత్యవసరంగా మారాయి. అభివృద్ధి అంటే కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు. ఉపాధి, పెట్టుబడులు, పరిశ్రమలు, నాణ్యమైన విద్య, ఆరోగ్యం, పారదర్శక పాలనలతోనే నిజమైన అభివృద్ధి సాధ్యమవుతుంది.

ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కీలక పాత్ర పోషించిన మేధావులు, విద్యావేత్తలు, సామాజిక కార్యకర్తలు మరోసారి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ లక్ష్యాలు, ప్రజల ఆశలు, ఆశయాలపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలను ప్రశంసించడం ఎంత ముఖ్యమో, అవసరమైనప్పుడు ప్రశ్నించడం కూడా అంతే ముఖ్యం. ప్రజాస్వామ్యంలో మేధావుల మౌనం సమాజానికి మేలు అసలే చేయకపోగా, కీడు చేస్తుంది.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం చారిత్రక విజయమే. అయితే రాష్ట్ర ఆవిర్భావం ఒక్కటే అంతిమ లక్ష్యం కాదు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగుదలే అసలు లక్ష్యం. రాబోయే సంవత్సరాలు తెలంగాణ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. రాజకీయ పార్టీలు ఎన్నికల హామీలకే పరిమితం కాకుండా దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికలపై దృష్టి సారించాలి. అదే సమయంలో ప్రజలు, మేధావులు, పౌరసమాజం ప్రభుత్వాలను నిరంతరం జవాబుదారీగా నిలబెట్టాలి. అప్పుడే తెలంగాణ ఉద్యమం కలగన్న సమానత్వం, స్వాభిమానం, సమగ్ర అభివృద్ధి లక్ష్యాలు నిజంగా సాకారమవుతాయి.

Latest News

ఒక్క స్కూల్.. వేల మంది ఐఏఎస్‌లు!|SCHOOL|IAS

నేతర్‌హాట్ విద్యా మోడల్‌కు దేశమంతా ఫిదా|NETHERHAT|EDUCATIONAL MODEL ప్రకృతి రమణీయత ఉట్టిపడే కొండల నడుమ, చుట్టూ దట్టమైన అడవులు, ప్రశాంతమైన వాతావరణం. ఒక సాధారణ పాఠశాలలా కనిపించే ఆ ప్రాంగణం.. యావత్ భారతదేశ పరిపాలనా...

జూలై 20, సోమవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి షష్ఠి ఉదయం 07.00 వరకు ఉపరి సప్తమి నక్షత్రం హస్త రాత్రి 11.01 వరకు ఉపరి చిత్త యోగం శివ రాత్రి 11.07 వరకు ఉపరి సిద్ద కరణం తైతుల ఉదయం 07.00 వరకు ఉపరి...

కాళేశ్వరం కలహాలతో కాలం వెళ్ళదీయలేరు!?|EDITORIAL

ప్రజలకు కావాల్సింది రాజకీయ వాదోపవాదాలు కాదు. పరిష్కారం. లక్ష కోట్ల ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును నిరుపయోగంగా వదిలేయడం ఎంత తప్పో, భద్రతా ప్రమాణాలు పట్టించుకోకుండా వినియోగించడం కూడా అంతే ప్రమాదకరం. అందువల్ల ప్రభుత్వం...

మొగోల్లను గౌరవిద్దాం!?|ADUGU TRENDS

ఎర్రబస్సుల్ల ఎన్కటేం రాసుండేదో గుర్తుందా!? ఒకపాలి గుర్తు శేసుకోండ్రి. ‘పొగ తాగరాదు!’, ‘టికెట్టుకు సరిపడా చిల్లర ఇచ్చి కండక్టర్ కు సహకరించండి.’ ఇంక..? ‘టికెట్ లేని ప్రయాణం నేరం. రూ.500 వరకు జరిమానా,...

ఈ రోజు/వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూలై 19 నుండి జూలై 25 వరకు రాశి ఫలాలు మేష రాశి: ఈ వారం మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. చేపట్టిన పనులు క్రమంగా విజయవంతమవుతాయి. ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభించవచ్చు. వ్యాపారంలో ఆదాయం...

జీవిత ఖైదీలకు జైల్లోనే లగ్గం!?|ADUGU TRENDS

మనసు ఎవ్వలి మీద ఎప్పుడు? ఎందకు? పడ్తదో తెల్వదంటరు. గదాన్నే పేమ అంటాండ్రు. గట్లనే జైల్లో జీవిత ఖైదుగా ఉన్న ఇద్దరు మనసు పడ్డరు. గా ముచ్చటను జైలు సార్లకు శేరవేసిండ్రు. గానుంచి...

వాడివేడిగా పార్లమెంట్ సమావేశాలు!?|EDITORIAL

ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షం రెండూ ప్రత్యర్థులే. కానీ, ప్రజా ప్రయోజనాల విషయంలో భాగస్వాములే. అందువల్ల పార్లమెంట్ సమావేశాలు రాజకీయ ఆరోపణలకే పరిమితం కాకుండా ప్రజల ఆశలను నెరవేర్చే విధంగా నిర్మాణాత్మక చర్చలకు వేదిక...

జూలై 18, శనివారం, 2026|RASHI P[HALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం తిధి చవితి ఉదయం 08.30 వరకు ఉపరి పంచమి నక్షత్రం పుబ్బ రాత్రి 10.28 వరకు ఉపరి ఉత్తర యోగం వరీయాన్ రాత్రి 01.45 వరకు ఉపరి పరిఘ కరణం భద్ర ఉదయం 08.30 వరకు ఉపరి...

కరువు కోరలు!|Fangs of drought

ఇప్పటికి 33శాతమే వర్షం నమోదు!! రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావం తీవ్రం అడుగంటుతున్న జలాశయాలు జీవ నదుల్లోనూ జల జీవమే లేదు రిజర్వాయర్లలోనూ ఇదే పరిస్థితి సాగుకు తొందరొద్దంటున్న నిపుణులు ప్రత్యామ్నాయ పంటలపై కార్యాచరణ 20వ తేదీ తర్వాత పత్తి విత్తనాలేయొద్దు బోరుబావుల కింద వరి...

మొక్క నాటుండ్రి.. డిస్కౌంట్లు పొందుండ్రి!?|ADUGU TRENDS

పర్యావరణానికి మూలం మొక్కే. గా మొక్కే చెట్టై, మహా మానై మనల్ని రచ్చిత్తది. గీ భూమి, వాతావరణం మొత్తం గా మొక్కల మీదనే ఆధారపడ్డది. కనీ, మనమేం చేత్తానం? ఏడికాడికి శెట్లని తెగ...

‘ఢీ’లిమిటేషన్ రాజకీయాలు!?|EDITORIAL

డీలిమిటేషన్ భారత ప్రజాస్వామ్య చరిత్రలో అత్యంత ప్రభావవంతమైన రాజకీయ సంస్కరణలలో ఒకటిగా నిలవనుంది. ఇది కేవలం సీట్ల సంఖ్య మార్చే ప్రక్రియ కాదు, భవిష్యత్ రాజకీయ ప్రాబల్య సమీకరణాలను నిర్ణయించే కీలక ఘట్టం....

జూలై 17, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షిణాయణం-గ్రీష్మఋతువు ఆషాఢ మాసం--శుక్లపక్షం దక్షిణాయణం ప్రారంభం తిధి తదియ ఉదయం 09.54 వరకు ఉపరి చవితి నక్షత్రం మఖ రాత్రి 10.51 వరకు ఉపరి పుబ్బ యోగం సిద్ది ఉదయం 05.00 వరకు ఉపరి వ్యతీపాత కరణం గరజి ఉదయం 09.54...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News