Friday, August 21, 2026
24.7 C
Hyderabad

పార్లమెంట్ సమావేశాలపై సర్వత్రా ఆసక్తి!|EDITORIAL

ప్రజాస్వామ్యం అసలు బలం ఏకాభిప్రాయం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు రాజకీయ ప్రయోజనాలకే కాకుండా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించే వేదికగా కాకుండా, జాతీయ సమ్మతిని నిర్మించే అవకాశంగా మలచగలిగితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలపడుతుంది. ఈ వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు ఆ దిశగా సాగుతాయా? లేక మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభనకే పరిమితమవుతాయా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ప్రజలంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు.

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

ఈ నెలలో ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు దేశ రాజకీయాలకు కీలక మలుపు కావొచ్చు. ఒకవైపు మహిళా రిజర్వేషన్ బిల్లు, జనాభా లెక్కల అనంతరం చేపట్టాల్సిన నియోజకవర్గాల పునర్విభజన, మరోవైపు కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై జోరుగా సాగుతున్న చర్చలు దేశ రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. అయితే, దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఈ కీలక నిర్ణయాల్లో కేంద్ర ప్రభుత్వం అన్ని రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయం సాధించే ప్రయత్నం చేస్తుందా?

భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో పార్లమెంట్ కేవలం చట్టాలు చేసే వేదిక మాత్రమే కాదు. విభిన్న రాజకీయ అభిప్రాయాలకు వేదిక. గతంలో కీలక బిల్లులు, రాజ్యాంగ సవరణలు, జాతీయ భద్రత లేదా ఆర్థిక అంశాలపై అధికార, ప్రతిపక్షాల మధ్య విస్తృత చర్చలు జరిగేవి. అఖిలపక్ష సమావేశాలు నిర్వహించడం కూడా ఒక రాజకీయ సంప్రదాయం. గత దశాబ్దంలో అలాంటి సంప్రదాయం క్రమంగా బలహీనపడింది. అధికార పార్టీలు ప్రతిపక్ష పార్టీలను ఖాతర్ చేయడం లేదు. చర్చలకు ఆస్కారమివ్వడంలేదు. చర్చ కంటే సంఖ్యాబలాన్ని చూసి చంకలెగరేసుకుని నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజాపాలన సాగుతోంది.

మహిళా రిజర్వేషన్‌కు సంబంధించిన రాజ్యాంగ సవరణ పార్లమెంట్ ఆమోదం పొందినప్పటికీ, దాని అమలు జనాభా లెక్కలు, అనంతర డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే సాధ్యమవుతుందని చట్టంలోనే పేర్కొన్నారు. ప్రస్తుతం లోక్‌సభలో మొత్తం 543 స్థానాలు, రాజ్యసభలో 245 సభ్యులు ఉన్నారు. రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే సభలో హాజరై ఓటు వేసిన సభ్యులలో కనీసం మూడింట రెండు వంతుల మద్దతుతో పాటు మొత్తం సభ్యుల సగానికి పైగా మద్దతు కూడా అవసరం. కాబట్టి సంఖ్యాబలం మాత్రమే కాదు, విస్తృత రాజకీయ సమ్మతి కూడా కీలకం.

డీలిమిటేషన్ అంశం మరింత సున్నితమైనది. 1971 జనాభాను ఆధారంగా చేసుకుని రాష్ట్రాల మధ్య లోక్‌సభ స్థానాల పంపిణీ కొనసాగుతోంది. 2001లో ఈ గడువును 2026 వరకు పొడిగించారు. ఇప్పుడు కొత్త జనాభా లెక్కల అనంతరం జరిగే పునర్విభజన దక్షిణ, ఉత్తర రాష్ట్రాల రాజకీయ ప్రాతినిధ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించిన దక్షిణాది రాష్ట్రాలు తమ రాజకీయ ప్రాతినిధ్యం తగ్గకూడదని కోరుతున్నాయి.

అలాంటి పరిస్థితుల్లో అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత.
ఇక మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణపై కూడా రాజకీయ వర్గాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కేంద్ర మంత్రివర్గంలో ప్రధానమంత్రితో కలిపి మొత్తం 72 మంది మంత్రులు ఉన్నారు. రాజ్యాంగం ప్రకారం మంత్రుల సంఖ్య లోక్‌సభ సభ్యుల మొత్తం సంఖ్యలో 15 శాతం మించకూడదు. అంటే గరిష్ఠంగా 81 మంది వరకు మంత్రులను నియమించే అవకాశం ఉంది. అందువల్ల అవసరమైతే పాతవారిని తొలగించి, కొందరు కొత్త వాళ్ళకు ఛాన్స్ ఇచ్చే వీలుంది. అయితే, మంత్రివర్గంలోకి ఎవరు వస్తారు? ఎవరు తప్పుకుంటారు? అనే అంశంపై ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ప్రచారంలో ఉన్న పేర్లన్నీ రాజకీయ ఊహాగానాలు మాత్రమే.

ఆంధ్రప్రదేశ్‌కు అదనపు మంత్రి పదవి దక్కే అవకాశంపై కూడా చర్చ జరుగుతోంది. ఎన్డీయేలో కీలక భాగస్వామిగా ఉన్న రాష్ట్రానికి మరింత ప్రాతినిధ్యం లభిస్తుందా? అనే ఆసక్తి సహజమే. ఒకవేళ అలాంటి అవకాశం వస్తే అది టీడీపీ, జనసేన లేదా బీజేపీకి దక్కుతుందా? అన్నది రాజకీయ సమీకరణాలపై ఆధారపడి ఉంటుంది. ఇదే సమయంలో తెలంగాణకు సంబంధించిన ప్రాతినిధ్యంపైనా చర్చ కొనసాగుతోంది. అయితే ఇవన్నీ అధికారిక ప్రకటన వెలువడే వరకు కేవలం రాజకీయ అంచనాలుగానే పరిగణించాలి.

పార్లమెంట్ సమావేశాల సక్సెస్ చర్చల నాణ్యత. చట్టాలు ఎంత వేగంగా ఆమోదం పొందాయన్న దానికంటే, వాటిపై ఎంత విస్తృత చర్చ జరిగిందన్నదే ప్రజాస్వామ్య ప్రమాణం. ప్రతిపక్షాల సూచనలు, అభిప్రాయాలను వినడం, రాష్ట్రాల ఆందోళనలను పరిగణనలోకి తీసుకోవడం, పార్లమెంటరీ కమిటీల సూచనలకు ప్రాధాన్యం ఇవ్వడం వంటి చర్యలే ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ప్రభుత్వానికి సంఖ్యాబలం ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యానికి అసలు బలం ఏకాభిప్రాయం. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్, మంత్రివర్గ విస్తరణ వంటి అంశాలు రాజకీయ ప్రయోజనాలకే పరిమితం కాకుండా దేశ భవిష్యత్తును ప్రభావితం చేసే నిర్ణయాలు. అందువల్ల పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం రాజకీయ ఆధిపత్యాన్ని ప్రదర్శించే వేదికగా కాకుండా, జాతీయ సమ్మతిని నిర్మించే అవకాశంగా మలచగలిగితే ప్రజాస్వామ్యంపై విశ్వాసం మరింత బలపడుతుంది. రాబోయే సమావేశాలు ఆ దిశగా సాగుతాయా? లేక మరోసారి అధికార-ప్రతిపక్షాల మధ్య ప్రతిష్ఠంభనకే పరిమితమవుతాయా? అని దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నది. ప్రజలంతా జాగ్రత్తగా గమనిస్తున్నారు.

Latest News

కొండా సురేఖ చుట్టూ రాజకీయ ఉచ్చు..|KONDA SUREKHA|CONGRESS|CM|REVANTH REDDY

పార్టీ నుంచి బహిష్కరించాలంటున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు|MLA|MLC తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత చేసిన...

గిదో కుక్కల కు.ని. పంచాయితీ!?|ADUGU TRENDS

గీ మద్దెల కుక్కల రోజులొచ్చినయి. మనుసుల లెక్కనే గా కుక్కల జనాభా కూడా పెరిగింది. గవి జనం మీదకు ఎగపడుడు. కరుసుడు, పీక్కతినుడు కూడా ఎక్కువై పోయింది. గ వాట్ని సంపుదామంటే, జీవ...

వంటింటిపై ధరల దాడీకి బాధ్యులెవరు!?|EDITORIAL

బియ్యం కిలో ధర ఎంతకు చేరిందన్నది కోట్ల కుటుంబాల వంటింటి సమస్య. అందుకే రాజకీయ ఎజెండాల మధ్య ప్రజల ఎజెండా కనుమరుగుకాకూడదు. ధరల పెరుగుదలను “మా పరిధిలో లేదు” అని చెప్పడం కాదు....

ఆగస్టు 21, శుక్రవారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం శ్రీ వరలక్ష్మి వ్రతం తిధి శు.నవమి రాత్రి 11.20 వరకు ఉపరి దశమి నక్షత్రం అనురాధ మధ్యాహ్నం 01.03 వరకు ఉపరి జ్యేష్ఠ యోగం ఐంద్ర ఉదయం 06.49 వరకు ఉపరి వైధృతి కరణం బాలవ ఉదయం 10.28...

అవును..గ వాల్లు మల్లా మనువాడిండ్రు!?|ADUGU TRENDS

గ వాల్లు ఇప్పటికే ఆలుమొగలు. గవాల్లకు పిల్లలు గూడా ఉన్నరు. గా పిల్లలు సదువుకుంటాండ్రు. గివీల్లు సంసారం కూడా శేసుకుంటాండ్రు. అయినా గవాల్లు కొత్తగా మల్లా మనువాడిండ్రు. మూడుమల్లేసుకున్నరు. ఏడడుగులు నడిసిండ్రు. గట్ల...

బీజేపీ ముందున్న సవాళ్ళివే!?|EDITORIAL

బీజేపీ తన రాజకీయ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలంటే ప్రచార వ్యూహాలకంటే పాలనా ఫలితాలపై దృష్టి పెట్టాలి. ధరల నియంత్రణ, ఉపాధి సృష్టి, విద్యా, వైద్య రంగాల బలోపేతం, విమాన ప్రయాణాన్ని సామాన్యులకు అందుబాటులోకి తేవడం,...

ఆగస్టు 20, గురువారం, 2026|RASHI PHALALU

శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయణం-వర్షఋతువు శ్రావణమాసం శుక్లపక్షం తిధి శు.అష్టమి రాత్రి 09.33 వరకు ఉపరి నవమి నక్షత్రం విశాఖ ఉదయం 10.50 వరకు ఉపరి అనురాధ యోగం బ్రహ్మ ఉదయం 06.33 వరకు ఉపరి ఐంద్ర కరణం భద్ర ఉదయం 08.54 వరకు ఉపరి బవ రాహుకాలం...

వరుస ఆరోపణలు.. షోకాజ్ నోటీసులు!|CONGRESS|NOTICE

తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతుంది?|TELANGANA|CM|REVANTH REDDY|KONDA FAMILY తెలంగాణ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ కుటుంబం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్గం మధ్య...

సుస్మితకు ఎమ్మెల్యేల ఘాటు కౌంటర్|KONDA FAMILY|MLAS|COUNTER

క్రమశిక్షణ చర్యలపై కాంగ్రెస్‌ ఫోకస్|MALLU RAVI|CONGRESS|FOCUS తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. వరంగల్ జిల్లా పరకాల నియోజకవర్గంలో ఇటీవల పర్యటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో...

సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా….|TELANGANA|CONGRESS|KONDA|REVANTH REDDY

సీఎం రేవంత్ వర్సెస్ కొండా కుటుంబం!|CM|KONDA SUSMITHA ఒకవైపు జెన్ జీ వాళ్లకు టిక్కెట్లు ఇవ్వాలి అంటావ్ మరోవైపు డైపర్లు వేసుకొని తిరుగుతున్న రేవూరి ప్రకాశ్ రెడ్డికి టికెట్ ఇస్తా అంటావ్ - మంత్రి కొండా సురేఖ...

స్టార్ హోటల్ల దోశ గిట్లనే తినాల్నట!?|ADUGU TRENDS

శిన్నప్పుడు మనం ఎట్ల తినాల్నో? ఎట్ల తినకూడదో మన అవ్వయ్యలు నేర్పిత్తురు. అన్నలక్కలు కూడా శెప్తరు. గట్లనే మనం తినడం నేర్సుకుంటం. పెద్దగైనంక సుత.. గట్ల తినుడే అలవాటు శేసుకుంటం. కనీ, పెద్ద పెద్ద...

ఉగ్రవాదం : అనుమానమే ఆయుధం కాకూడదు!?|EDITORIAL

దేశ భద్రతకు ‘ప్రజలు కూడా బాధ్యతాయుతమైన సమాచార భాగస్వాములుగా ఉండాలి. నిఘా సంస్థలు ఆధారాలను విశ్లేషించి, చట్టబద్ధమైన దర్యాప్తు ద్వారా నిందితులను గుర్తించాలి. ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం. అదే సమయంలో నిరపరాధ...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News