Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

పొదుపు ఎక్కడి నుండి పొడవాలి?|EDITORIAL

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు దేశహితం దృష్ట్యా సమంజసమే. అయితే ఖర్చుల తగ్గింపు ఎవరి నుంచి మొదలు కావాలి? సాధారణ ప్రజల నుంచా? లేక పాలక వర్గం, అధికార యంత్రాంగం నుంచా?

డా. మార్గం-అడుగు, ఎడిటోరియల్

దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలంటే ఖర్చులను తగ్గించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇంధన వినియోగాన్ని తగ్గించుకోవాలి. బంగారం కొనుగోళ్లను నియంత్రించాలి. దేశీయ ఉత్పత్తుల వినియోగాన్ని పెంచుకోవాలని ఆయన ఇచ్చిన పిలుపు దేశహితం దృష్ట్యా సమంజసమే. అయితే ఖర్చుల తగ్గింపు ఎవరి నుంచి మొదలు కావాలి? సాధారణ ప్రజల నుంచా? లేక పాలక వర్గం, అధికార యంత్రాంగం నుంచా?

దేశ ఆర్థిక వ్యవస్థను బలపరచాలంటే ముందు రాజకీయ వ్యవస్థలోని దుబారా ఖర్చులను నియంత్రించాల్సిన అవసరం ఉంది. ప్రధాని నుంచి ఎమ్మెల్యే వరకు ప్రజాధనంతో నడిచే వ్యవస్థలో పారదర్శకత, మితవ్యయం అత్యవసరం. దేశ ప్రజలు ఇంధన వినియోగం, బంగారం కొనుగోళ్లు, వంటనూనెల వినియోగం తగ్గించుకోవాలని కోరే ముందు ప్రభుత్వాలు తమ ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రజల కళ్లముందే జరుగుతున్న ఆడంబర రాజకీయాలు, భారీ కాన్వాయ్‌లు, విలాసవంతమైన విమాన ప్రయాణాలు, హెలికాప్టర్ టూర్లు, అట్టహాసపు సభలు ప్రజల్లో అసంతృప్తిని పెంచుతున్నాయి.

ప్రపంచంలో భారతదేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని కేంద్ర ప్రభుత్వం గర్వంగా చెబుతోంది. కానీ అదే సమయంలో దేశ ప్రజల జీవన వ్యయం అంతకంతకూ అమాంతం పెరిగింది. పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యుడి బడ్జెట్‌ను దెబ్బతీశాయి. విద్య, వైద్యం ఖరీదైన వస్తువులుగా మారాయి. ఆహార ధరలు పెరిగి మధ్యతరగతి కుటుంబాలపై భారం మోపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో ప్రజలకు “ఖర్చులు తగ్గించుకోండి” అని చెప్పడం కంటే ముందు ప్రభుత్వ వ్యయ నియంత్రణపై స్పష్టమైన చర్యలు అవసరం.

ప్రధాని మోదీ ప్రస్తావించిన బంగారం అంశం కూడా ప్రాముఖ్యత కలిగిందే. భారతీయులు ప్రతి ఏడాది సగటున 700 నుంచి 900 టన్నుల వరకు బంగారం కొనుగోలు చేస్తున్నారని అంచనాలు చెబుతున్నాయి. దీని విలువ రూ.13 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. ఇందులో 90 శాతానికి పైగా విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో బంగారం దిగుమతులు 24 శాతం పెరిగినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. దీని వల్ల భారీగా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఖర్చవుతున్నాయి. కాబట్టి బంగారం కొనుగోళ్లను నియంత్రించాలన్న సూచనలో ఆర్థిక పరమైన తర్కం ఉంది. అయితే ఇది ప్రధానంగా ఉన్నత వర్గాల వినియోగ సంస్కృతికి సంబంధించిన అంశమని గుర్తించాలి. సామాన్య ప్రజల కొనుగోళ్ల కంటే పెద్ద మొత్తంలో బంగారం కొనుగోలు చేసేది ధనిక వర్గాలే.

అదే విధంగా ఇంధన వినియోగం తగ్గించుకోవాలని ప్రజలకు సూచించే ప్రభుత్వాలు ముందుగా రాజకీయ నాయకుల కాన్వాయ్‌లను, ప్రత్యేక విమాన ప్రయాణాలను, హెలికాప్టర్ వినియోగాన్ని తగ్గించాలి. రాష్ట్రపతి, ప్రధాని నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల వరకు వారి పర్యటనకు కోట్ల రూపాయలు ఖర్చవుతున్నాయి. ప్రమాణ స్వీకార సభలు, రాజకీయ సమావేశాలు, భారీ ప్రకటనలు ప్రజాధనంతోనే జరుగుతున్నాయి. అసలు ప్రభుత్వం నడిచేదే ప్రజాధనంతో. ప్రభుత్వ యంత్రాంగాన్ని, ప్రజాధనాన్ని రాజకీయ ప్రచార వేదికగా ఉపయోగించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం.

ఉచిత పథకాల రాజకీయాలు. సంక్షేమం పేరుతో ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఎన్నికల హామీల అమలుకు ఖర్చు చేస్తున్నాయి. నిజమైన పేదల కోసం అవసరమైన పథకాలు కొనసాగాలి. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజాధనాన్ని నిర్లక్ష్యంగా వినియోగించడం ఆర్థిక వ్యవస్థపై భారంగా మారుతోంది. దేశం, రాష్ట్రాలు అప్పుల ఊబిలోకి జారిపోతున్నాయి. దేశంలో అనేక రాష్ట్రాల అప్పులు లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవడం ఆందోళన కలిగించే విషయం.

దేశ ఆర్థిక వ్యవస్థకు విదేశీ మారక నిల్వలు కీలక సూచిక. ఒక దేశం ఎంత సురక్షితంగా ఉందో చెప్పడంలో ఫారెక్స్ రిజర్వులు ముఖ్య పాత్ర పోషిస్తాయి. విదేశీ మారక నిల్వలు పెరగాలంటే దిగుమతులు తగ్గి, ఎగుమతులు పెరగాలి. ఇందుకు దేశీయ ఉత్పత్తుల వినియోగం పెరగాలి. భారత రైతులు పండిస్తున్న వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్ కల్పించాలి. “లోకల్ ఫర్ వోకల్” వంటి నినాదాలు కేవలం ప్రచారంగా కాకుండా ఆచరణలోకి రావాలి.

మోదీ ఇచ్చిన ఖర్చుల తగ్గింపు పిలుపును ప్రజలు సానుకూలంగా స్వీకరించాలంటే ముందుగా రాజకీయ నాయకులే ఆదర్శంగా నిలవాలి. ప్రజలకు మితవ్యయం చెప్పే నాయకులు తమ జీతభత్యాలు, పెన్షన్లు, వాహనాలు, భద్రతా కాన్వాయ్‌లు, విదేశీ పర్యటనలపై నియంత్రణ విధించుకోవాలి. ప్రభుత్వ ఖర్చులపై ప్రతి సంవత్సరం పారదర్శక ఆడిట్ నిర్వహించాలి. ప్రజాప్రతినిధుల విలాస జీవనశైలికి ప్రజాధనాన్ని ఉపయోగించకుండా చట్టబద్ధమైన పరిమితులు విధించాలి.

“అచ్చే దిన్” పేరుతో ప్రజలకు చూపించిన ఆశలు ఇప్పటికీ సామాన్యుడి జీవితంలో పూర్తిగా ప్రతిఫలించలేదనే భావన సమాజంలో ఉంది. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుదల వంటి నినాదాలు వినిపిస్తున్నా, గ్రామీణ భారతం ఇంకా నిరుద్యోగం, ధరల భారంతో పోరాడుతోంది. అందుకే ఖర్చుల తగ్గింపు అనే సంస్కరణ ప్రజలతో కాకుండా పాలక వర్గంతో ప్రారంభమవ్వాలి. త్యాగం ప్రజల నుంచి కోరే ముందు నాయకులు తమ జీవనశైలిలో మార్పు చూపాలి. అప్పుడు మాత్రమే దేశ ఆర్థిక సంస్కరణలపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుంది.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News