POSTS|పదవుల పందేరానికి తగవుల తందానా!?
-ఖరారైన జాబితా…విభేదాల వల్లే వాయిదా!
-హస్తినకు చేరినా…ఏకాభిప్రాయం కుదిరేనా?
-నేడు DELHI|ఢిల్లీకి CM|సీఎం, DCM|డిసిఎం, MINISTERS|మంత్రులు, PCC CHIEF|పీసీసీ చీఫ్
టీపీసీసీ పదవుల పందేరంపై ప్రతిష్టంభన ఆ పదవులు ఆశిస్తున్న వారిని అసహనానికి గురి చేస్తున్నది. ఆందోళన కలిగిస్తున్నది. పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండేండ్లు కావస్తున్నది. టీపీసీసీకి కొత్త చీఫ్ వచ్చి 9 నెలలైనా ఇంకా ఈ పురిటినొప్పులేంటి? అయితే నార్మల్, కాకపోతే సిజేరియన్, ఏదో ఒకటి చేసేయాలి కదా? రాష్ట్ర స్థాయిలో నాయకత్వం ఏకతాటిపై లేకపోవడం, పట్టుదలలు పంతాలకు పోవడం, అధినాయకత్వం నాన్చుడు ధోరణి వల్ల ఈ పదవుల పందేరం తగువుల తందానాలాగా మారిపోయింది. మరోవైపు మంత్రి వర్గ విస్తరణలా మారుతుందా?
ఢిల్లీ/హైదరాబాద్, మే 21 (అడుగు ప్రత్యేక ప్రతినిధి):
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు కావస్తున్నది. డిసెంబర్ 3న అధికారంలోకి రాగా, డిసెంబర్ 7న సీఎం ప్రమాణ స్వీకారం చేయగా, సెప్టెంబర్ 6, 2024న పీసీసీకి చీఫ్ ని నియమించిన పార్టీ, ఎట్టకేలకు సంస్థాగత నిర్మాణం వైపు ద్రుష్టి సారించింది. ఈ ప్రక్రియను సుదీర్ఘం చేయడం, దరఖాస్తులను ఆహ్వానించడం, ఫక్తు సంప్రదాయంగా పదవుల కోసం పైరవీలకే అలవాటు పడ్డ కాంగ్రెస్ కేడర్ కు అస్సలు నచ్చడం లేదు. అదో ప్రహసనంగా మారింది. మొత్తానికి ఆ ప్రక్రియ పూర్తైంది. పీసీసీ స్థాయిలో అధ్యక్షుడితోపాటు సీఎం, డిసీఎం, మంత్రులు, టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ లు మల్లగుల్లాలు పడి ఎట్టకేలకు టీపీసీసీ కొత్త కార్యవర్గ తుది జాబితాను సిద్ధం చేశారు. యథావిధిగా పార్టీ అధినాయకత్వానికి పంపించారు.|CONGRESSPOSTS|CM|DCM|MINISTERS|PCC CHIEF|
ఫైనల్ అయిన జాబితాపై మళ్ళీ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల్లోనేగాక, ఆయా పదవులకు పేర్లు ఖరారైన నేతలు కూడా నాకు అది వద్దు, ఇదే కావాలని, ఇది వద్దు, అదే కావాలనే వివాదాలు పడుతున్నారు. కాంగ్రెస్ కల్చర్ ను మరోసారి గుర్తు చేస్తూ అధిష్ఠానానికి ఫిర్యాదులు కూడా వెళ్ళాయి. దీంతో ఖరారైన జాబితాను పక్కన పెట్టేశారు. ఈ విషయమై టీపీసీసీ చీఫ్ ని ఢిల్లీకి పిలపించుకుని మరీ చర్చించారు. అయినా తేలకపోవడంతో, చివరకు ఇవ్వాళ, రేపు ఢిల్లీలోనే ఉండేటట్లు రమ్మని టీపీసీసీ వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్, చీఫ్ మహేశ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి, డీసీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి, పొంగులేటి, శ్రీధర్ బాబు తదితరులను పార్టీ ఆదేశించింది.|CONGRESS|POSTS|CM|DCM|MINISTERS|PCC CHIEF|
ఇదిలావుంటే, రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు పార్టీ పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ స్థానిక పార్టీ పదవుల కోసం ఎదురుతెన్నులు కొనసాగుతున్నాయి. చాలా ఏళ్ళ తర్వాత వచ్చిన అధికారం, అటు పార్టీ పదవులు రాక, ఇటు ప్రభుత్వ పదవులు లేక కాంగ్రెస్ నేతలు ఆకలిగొని అవురావురని ఉన్నారు. ఈ దశలో ఖరారైన జాబితా కూడా ప్రకటనకు నోచుకోకపోవడంతో ఖద్దరు లీడర్లలో అసహనం వెల్లువెత్తుతోంది. కార్యవర్గ పదవులు ఆశిస్తున్న వారికంటే వారికి పదవులు ఇప్పిస్తున్న టీపీసీసీ నాయకత్వం, మంత్రుల మధ్యే పొసగకపోవడం అత్యంతగా పార్టీని ఇరుకున పెడుతున్నది.
మరి ఇప్పటికైనా టీపీసీసీ కొత్త కార్యవర్గం ఖరారవుతుందా? రెండు రోజుల కసరత్తు ఈ కాన్పుని కానిస్తుందా? చూడాలి.|CONGRESS|POSTS|CM|DCM|MINISTERS|PCC CHIEF|

