Tuesday, June 9, 2026
28.2 C
Hyderabad

అమ్మల మీద ఆన..! ‘తూర్పు’ లో ‘మార్పు” కేనా?

-సారయ్య సారథ్యం దేనికి సంకేతం?
-3 బస్సులు, 30 కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లపై మేడారం తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు
-ప్రస్తుత, భవిష్యత్ రాజకీయాలపై చర్చ
వరంగల్ కాంగ్రెస్ లో రచ్చ రచ్చ

వరంగల్ రాజకీయాల్లో పెను ప్రకంపనలు మొదలయ్యాయి. రాజకీయాల్లో ‘ చేయి ‘ తిరిగిన నేతల చేతలు మారుతున్నాయి. ఈ పరిణామాలు తూర్పు’ లో ‘మార్పు” కేనా? 3 బస్సులు, 30 కార్లు, ఆటోలు, మోటారు సైకిళ్లపై మేడారం తరలి వెళ్లిన కాంగ్రెస్ శ్రేణులు ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణ పై అత్యంత విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ ఆత్మీయ సమ్మేళనానికి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య సారథ్యం వహించారు. కార్పొరేటర్ గుండేటి నరేందర్, కరాటే ప్రభాకర్, గోరంట్ల రాజు, బస్వరాజు కుమారస్వామి వంటి పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు దాదాపు 300 మంది హాజరయ్యారు. అయితే సారయ్య సారథ్యం దేనికి సంకేతం? సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పార్టీ అధినాయకత్వం అనుమతి ఉందా? ఆశీస్సులు ఉన్నాయా? లోపాయికారీ గా ఆయనను ఇక్కడ పని చేసుకోమన్నారా? సారయ్య రాజకీయ జీవితమే తూర్పు నియోజకవర్గం (గతంలో వరంగల్) నుంచి పురుడు పోసుకుంది. ఇక్కడ నుంచి తన ప్రజా ప్రాతినిధ్యం కౌన్సిలర్, ఎమ్మెల్యేగా కొనసాగింది.

ఆత్మగౌరవానికి, తిరుగుబాటుకు ప్రతీకలైన మేడారం సమ్మక్క సారలక్క ల గద్దెలను తమ సమావేశ వేదికను చేసుకున్న వీళ్లంతా తిరుగుబాటుతో తిరుగుబావుటా ను ఎగురవేయనున్నారా? అసలు తూర్పు కాంగ్రెస్ రాజకీయాల్లో ఏమి జరుగుతున్నది? అన్న చర్చ, రచ్చ రచ్చ గా సాగుతున్నది.

గత కొంత కాలంగా వరంగల్ తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఆగమగంగా ఉంది. పార్టీ నేతలే బహిర్గతంగా చెప్పుకుంటున్న ప్రకారం.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ మంత్రి అయి ఏడాది కాకముందే, నియోజకవర్గ కేడర్ లో లుకలుకలు మొదలయ్యాయి. పార్టీ కోసం, సురేఖ గెలుపు కోసం కష్టపడిన నేతలు, కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేకపోగా, వేధింపులు ఎదురయ్యాయి. టగ్ ఆఫ్ వార్ గా పని చేసిన కార్యకర్తలే ఎమ్మెల్యే దంపతులకు టార్గెట్ అయ్యారు. బి ఆర్ ఎస్ నుండి కాంగ్రెస్ లోకి వచ్చిన ఓ చోటా… బడా నేతకు విశ్వసనీయంగా మారిపోవడం మరింత సంకటంగా తయారైంది. సరిగ్గా ఈ సమయంలోనే అజామ్ జాహీ మిల్లు కార్మిక భవన స్థల వివాదం రాజుకుంది. gwmc అనుమతులు తీసుకుని, ఆ స్థలంలో నిర్మించాలని తలపెట్టిన షాపింగ్ సముదాయానికి కొండా మురళి కొట్టిన కొబ్బరికాయ, అగ్గికి ఆజ్యం పోసినట్టు అయింది. ‘ చోటా’ పుట్టిన రోజు వేడుకలు, కాంగ్రెస్ కార్యకర్తలకు కంటగింపుగా మారాయి. ఈ రెండు ఘటనలు కాంగ్రెస్ పార్టీలోని కొండా దంపతుల బాధితులను, వ్యతిరేకులను ఒక్కటి చేశాయి. దీనికి తోడు వాళ్ళ మౌనం, మరింతగా వాళ్ళకి నష్టం చేసింది. చేస్తూనే ఉంది.

ఇప్పుడు మిల్లు కార్మిక భవన స్థల వివాదం కాస్త, ప్రజా ఉద్యమంగా మారింది. అఖిలపక్షం, వామపక్షాలు, ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, మిల్లు కార్మికుల కుటుంబాలు అన్నీ కలిసి ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు కొండా దంపతులకు వ్యతిరేకంగా, కార్మిక భవన స్థల వివాదం పై ఇప్పటికే సిఎం రేవంత్ రెడ్డికి ఆధారాలు అందచేశారు. ఈ పని కూడా బస్వరాజు సారయ్య నేతృత్వంలోనే జరిగిందని ప్రచారంలో ఉంది. ఇప్పుడు కొండా దంపతులను వ్యతిరేకిస్తున్న మిగతా నాయకులు అంతా ఒక్కటి అయి, సారయ్య పంచన చేరిపోతున్నారని తెలుస్తున్నది. ఇదే నిజమైతే, ఇప్పటికే కేటీఆర్ పై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు సహా అనేక వివాదాల్లో కూరుకుపోయిన కొండా దంపతులకు సమస్యలు తప్పకపోవచ్చు. పైగా మొన్నామధ్య జరిగిన టిపిసిసి పి ఎ సి సమావేశంలో సైతం పలువురు మంత్రులకు కేసీ వేణుగోపాల్ ఇచ్చిన క్లాస్ లో మంత్రి సురేఖ కూడా ఉన్నట్లు ప్రచారం జరిగింది. తీరు మార్చుకోవాలని హెచ్చరించినట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ప్రస్తుత తూర్పు నియోజకవర్గ కాంగ్రెస్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వాళ్ళంతా సారయ్య నాయకత్వంలో మేడారంలో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఏం చేయబోతున్నారనేది ఆసక్తిగా మారింది.

వరంగల్ తూర్పు రాజకీయాల్లో ఇప్పుడు సంచలనం ఏంటంటే… కొండా దంపతులకు చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ అధిష్టానం పావులు కదుపుతోందా? రానున్న రోజుల్లో వరంగల్ తూర్పు లో రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయన్నది స్పష్టం అవుతున్నది.

Latest News

సేఫ్టీ డోర్లు!|ADUGU TRENDS

భద్రతకే భద్రత లేని రోజులియి.! మరైతే మనమెంత భద్రంగుండాలె? మనమెంత జాగర్త పడ్డా దోసేటోడు కొత్త కొత్త దారుల్ల దోస్తనే ఉన్నడు. కట్టం లేకుండా మన సొక్కం మన గాబుల్ల, జేబుల్ల నిండాలె....

దేశానికి ముప్పుగా డ్రగ్స్ దందా!|EDITORIAL

యువతను మాదక ద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడటం కేవలం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు. అది సమాజం మొత్తం నిర్వర్తించాల్సిన సామూహిక కర్తవ్యం. నేడు అప్రమత్తంగా వ్యవహరిస్తేనే రేపటి తరాన్ని ఆరోగ్యవంతమైన, సురక్షితమైన...

09-06-2026, మంగళవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-నవమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-నవమి తిథి : కృష్ణ-నవమి తె. ఝా 2:35 వరకు...

08-06-2026, సోమవారం|RASHI PHALALU

స్వస్తి శ్రీ పరాభవ సంవత్సరము, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు , అధిక జ్యేష్ఠ మాసము సూర్యోదయం ఉదయం 5:44 సూర్యాస్తమయం సాయంత్రం 6:45 సంకల్ప తిథి: కృష్ణ-అష్టమి శ్రాద్ధ తిథి: అధిక జ్యేష్ఠ కృష్ణ-అష్టమి తిథి : కృష్ణ-అష్టమి తె. ఝా 3:24 వరకు...

ప్రొఫెసర్ వ్యాఖ్యలు-పోస్టు మార్టం|JANASENA|PROF.NAGESHWAR|PSPK

స్థానిక బీజేపీ నాయకత్వం నుంచి కాని పనిని జాతీయ పార్టీ నెత్తికెత్తుకుందా? అందుకే జన సేనాని పవన్ ని తెలంగాణపైకి ఉసి గొల్పిందా? ఈ స్కెచ్ లో భాగంగానే జగన్ ను అరెస్ట్...

మందా? ‘మజా’కా!?|ADUGU TRENDS

ఎనకటికి ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే, సుట్టకు అగ్గి కావాలని మరొకడేడిసిండట! గీ ముచ్చట గట్లనే ఉన్నది. రోజులు మారినా, గా సామెతల అర్థాలు మారట్లేదు. గీ సామెతసొంటి ముచ్చటే గా చిత్తూరు జిల్లా...

ఆర్థిక మోసాలకు అడ్డుకట్టలే లేవా!?|EDITORIAL

చిన్న మోసగాళ్లనే కాదు, పెద్ద కార్పొరేట్ సంస్థలు, ప్రభావశీల వ్యక్తులు చేసిన అక్రమాలపై కూడా సమానంగా చర్యలు తీసుకోవాలి. చట్టం ముందు అందరూ సమానమనే నమ్మకం ఏర్పడినప్పుడే ఆర్థిక క్రమశిక్షణ బలపడుతుంది. లేకపోతే...

ఈ రోజు/ వార రాశి ఫలాలు|TODAY|WEEKLY|RASHI PHALALU

జూన్ 07 నుండి జూన్ 13 వరకు వారఫలాలు: మేషం: ఈ వారం కుటుంబ వ్యవహారాల్లో కొంత ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో సౌహార్దంగా వ్యవహరించడం మంచిది. వ్యాపారవేత్తలు తొందరపాటు నిర్ణయాలకు దూరంగా...

రెండోసారి రాజ్యసభకు సానా…|AP|TDP|RAJYASABHA|SANA SATHISH BABU

బాబుకు ధన్యవాదాలు తెలిపిన సతీష్ బాబు|CHANDRABABU|CM రాష్ట్ర రాజకీయాల్లో, సామాజిక సేవలో, క్రీడా రంగంలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ పారిశ్రామికవేత్త, తెలుగుదేశం పార్టీ నేత సానా సతీష్ బాబు రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా...

ఏపీ రాజ్యసభ అభ్యర్థుల ఖరారు|AP|RAJYASABHA|TDP|JANASENA|BJP

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ తుది ఘట్టానికి చేరుకుంది. రాష్ట్రం నుండి ఖాళీ అవుతున్న నాలుగు రాజ్యసభ స్థానాలకు గాను అధికార కూటమిలో అభ్యర్థుల ఎంపిక...

గడ్డి కావాలా, బాబూ..!|ADUGU TRENDS

పసువులకే కాదు, కాస బుద్ధి తక్కువున్నోల్లకు గడ్డి పెడతం.! గడ్డంటే గడ్డి కాదు కనీ, తిట్లన్నట్లు.!! గడ్డి మేసి ఆవు పాలిస్తుంది, పాలుతాగి మినిసి విషమవుతాడు అంటాడు ఆత్రేయ. మరి ఆవు మేసే...

పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత!|EDITORIAL

పర్యావరణ దినోత్సవం ఒక ఉత్సవం మాత్రమే కాదు. ప్రకృతిని కాపాడుకోవాలనే సామూహిక సంకల్పానికి ప్రతీక. పర్యావరణాన్ని రక్షించడం అంటే మానవజాతి భవిష్యత్తును రక్షించడమే. నేటి నిర్లక్ష్యం రేపటి విపత్తుకు దారితీయవచ్చు. అందుకే ప్రకృతి...

Stay Connected

27,258FansLike
52,875FollowersFollow
85,558SubscribersSubscribe

Latest News